-
ఐపీఎల్లో అదరగొట్టాడు.. శ్రీలంక జట్టులో చోటు కొట్టేశాడు!
స్వదేశంలో ఆఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్లో భాగంగా ఆఫ్గాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ప్రస్తుతం తొలి రెండు వన్డేలకు మాత్రమే జట్టును శ్రీలంక సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ జట్టుకు దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇక ఈ జట్టులో ఐపీఎల్-2023లో అదరగొట్టిన పేసర్ మతీషా పతిరానాను చోటుదక్కింది. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో పతిరానాకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది క్యాష్రిచ్ లీగ్లో 12 మ్యాచ్లు ఆడిన జూనియర్ మలింగా.. 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఫ్గాన్ సిరీస్తో పతిరానా వన్డేల్లో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది ఆగస్టులో ఇదే ఆఫ్గాన్ జట్టుపై టీ20ల్లో పతిరానా డెబ్యూ చేశాడు. మరోవైపు లంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ఛానాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. దిముత్ కరుణరత్నే 2021లో చివరిసారిగా వన్డేల్లో లంక తరపున ఆడాడు. అదేవిధంగా స్టార్ పేసర్ దుష్మంత చమీర కూడా ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. చమీర గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే వరల్డ్కప్-2023 క్వాలిఫియర్స్ సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 శ్రీలంక లేకపోవడంతో క్వాలిఫియర్స్ ఆడనుంది. ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఆఫ్గాన్తో వన్డే సిరీస్కు లంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుషాన్ హేమంత, చమిక కరుణరత్నే, పతిరున హేమంత, చమిక కరుణరత్నే, చమీరా, మతీషా పతిరానా, కుమారా, రజితా చదవండి: IPL 2023: సీఎస్కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్ -
IPL 2023: నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చిన ధోని
ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువ పేసర్, జూనియర్ మలింగగా పిలువబడే శ్రీలంక చిన్నోడు మతీష పతిరణకు, అతని కుటుంబానికి జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని భరోసా ఇచ్చాడు. గురువారం (మే 25) పతిరణ, అతని కుటుంబ సభ్యులు చెన్నైలో ధోనిని కలిసిన సందర్భంగా ఈ హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని పతిరణ సోదరి, ధోనికి వీరాభిమాని అయిన విషుక పతిరణ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. మల్లి (పతిరణను కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు) సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడని ఆమె కామెంట్ చేసింది. ధోనిని కలిసిన క్షణాలు నేను కలలుగన్న దానికి మించి ఉన్నాయని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కాగా, పతిరణ అతని కుటుంబ సభ్యులు ధోనిని చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో కలిసారు. ఈ సందర్భంగా పతిరణ తన కుటుంబ సభ్యులను ధోనికి పరిచయం చేశాడు. ఐపీఎల్ కోసం పతిరణ (20) కుటుంబాన్ని వదిలి భారత్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు గమనించిన ధోని వారికి భరోసా ఇచ్చాడు. పతిరణ గురించి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనెప్పుడూ నాతోనే ఉంటాడు. నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్పాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మే 28న జరిగే ఫైనల్లో ధోని సేన.. గుజరాత్ వర్సెస్ముంబై మ్యాచ్ (క్వాలిఫయర్ 2) విజేతతో తలపడుతుంది. ఫైనల్లో సీఎస్కే గెలిస్తే ముంబైతో సమానంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్ ఫైనల్కు చేరిన ధోని అండ్ కో ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ధోనికి ఇది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతుండటంతో కోట్లాది మంది అభిమానులు ఆసారి సీఎస్కేనే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు. చదవండి: కేఎస్ భరతా.. ఇషాన్ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్కీపర్ ఎవరు..? -
ఫైనల్కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?
ఐపీఎల్-2023 ఫైనల్ బెర్త్ను చెన్నైసూపర్ కింగ్స్ ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ లేదా ముంబై ఇండియన్స్తో సీఎస్కే తలపడే ఛాన్స్ ఉంది. అయితే ఫైనల్కు ముందు చెన్నైకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఒక మ్యాచ్ నిషేదం పడే ఛాన్స్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫియర్-1లో అంపైర్తో వాగ్వాదంకు దిగిన ధోని.. 4 నిమిషాల విలువైన సమయాన్ని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. ధోనిపై ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది అని ఓ ప్రముఖ క్రీడా వెబ్సైట్ వెల్లడించింది. అదేవిధంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై ఆరాతీసునట్లు సమాచారం. ఒకవేళ నిషేదం పడి కీలకమైన ఫైనల్కు ధోని దూరమైతే సీఎస్కే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపైనే ఆదారపడి ఉంటుంది. ఏం జరిగిందంటే? గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసేందుకు సీఎస్కే మతీషా పతిరాణా సిద్దమయ్యాడు. కానీ పతిరాణా బౌలింగ్ చేయడానికి ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి అంగీరించలేదు. దానికి కారణం లేకపోలేదు. ఈ ఓవర్ వేసేముందు పతిరాణా దాదాపు 9 నిమిషాలు మైదానంలో లేడు. డైరక్ట్గా డగౌట్ నుంచి బౌలింగ్ చేయడానికి సిద్దపడిన అతడిని అంపైర్లు అడ్డుకున్నారు. రూల్స్ ప్రకారం మైదానంలో లేకుండా అలా నేరుగా వచ్చి బౌలింగ్ చేయకూడదు. ఈ క్రమంలో ధోని అంపైర్లు వద్దకు వచ్చి వాగ్వాదంకు దిగాడు. ఆఖరికి ధోని అంపైర్లును ఒప్పించడంతో పతిరాణా ఆఓవర్ను కొనసాగించాడు. కాగా ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అతనిపై నిబంధనలు విధించే ఛాన్స్ అంపైర్లకు ఉంది. అది బౌలింగ్ లేదా బ్యాటింగ్లోనైనా అవ్వవచ్చు. చదవండి: CSK Vs GT: ఓడిపోయాం అంతే.. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు! మళ్లీ సీఎస్కేతోనే: హార్దిక్ Emotions in plenty 🤗 Moments of elation, pure joy and the feeling of making it to the Final of #TATAIPL 2023 💛 Watch it all here 🎥🔽 #GTvCSK | #Qualifier1 | @ChennaiIPL pic.twitter.com/4PLogH7fCg — IndianPremierLeague (@IPL) May 24, 2023 -
CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యం
మిస్టర్ కూల్ కెప్టెన్, నిజాయితీకి మారు పేరుగా చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోని.. నిన్న (మే 23) గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్స్ 1 మ్యాచ్ సందర్భంగా ఒకింత అసహనానికిలోనై, పరోక్షంగా తొండాట ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఫలితంగా మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యమైంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు మతీష పతిరణ సిద్దంగా ఉన్న సమయంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ సమయంలో గుజరాత్ ఛేదనలో చాలా వెనుకబడి ఉంది. 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. పతిరణకు తన కోటాలో ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే, పతిరణ 16వ వేసే ముందు మైదానంలో నిర్దిష్ట సమయం గడపకుండా, నేరుగా డగౌట్ నుంచి వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్దపడ్డాడు. నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ కచ్చితంగా 9 నిమిషాల పాటు మైదానంలో గడపాలి. So Dhoni Stopped the game until Pathirana became eligible to bowl again.. Bizarre 🤣 #IPL2023 #CSKvsGT pic.twitter.com/qSjSwrfYTW — MaahiWay (@Soham9907) May 23, 2023 అలా కాకుండా పతిరణ డగౌట్ నుంచి నేరుగా వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్దపడటంతో అంపైర్లు అతన్ని అనుమతించలేదు. ఆ సమయంలో పతిరణ బౌలింగ్ ప్రాధాన్యత తెలిసిన ధోని.. అంపైర్లతో వాదించి మరీ అతనితో బౌలింగ్ చేయించాడు. ధోని నుంచి ఈ తరహా బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని జనం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ధోని మ్యాచ్ అయితే గెలిచాడు కాని.. అభిమానుల మనసుల్లో వంచకుడిగా మిగిలిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Pathirana was out of the field for more than 9 minutes and came suddenly to bowl. Here the rule is that Pathirana should present atleast 9 minutes on the field to bowl his over but what Dhoni was chatting with umpires?? This isn't acceptable at all. pic.twitter.com/NML3LikBc3 — Priyansh (@priyansh_45) May 23, 2023 జట్టు గెలిపించుకోవడంలో భాగంగా ఇవన్నీ మామూలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ధోని ఇలాంటి సాహసోపేతమైన, వ్యూహాత్మకమైన చర్యలకు పాల్పడి సీఎస్కేను రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్ ఫైనల్కు చేర్చాడు. MS Dhoni Intentionally wasted time so that pathirana can bowl even though being off the field for certain period of time.. No wonder why they were banned 🚫#CSKvsGT pic.twitter.com/2pkzAnA42a — Cric8ly 🏏 (@MR_Alpha_21) May 23, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో సీఎస్కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్ను 15 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల -
పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్!
IPL 2023- Matheesa Pathirana- CSK: మతీశ పతిరణ.. ‘బేబీ మలింగ’గా పేరొందిన ఈ శ్రీలంక బౌలర్.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనడంలో సందేహం లేదు. తన వైవిధ్యమైన టెక్నిక్తో బ్యాటర్లను తిప్పలు పెట్టే 20 ఏళ్ల పతిరణ.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలు ఇచ్చిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలను.. లంక మాజీ స్టార్ లసిత్ మలింగ ఖండించగా.. మరో లంక పేసర్ చమిందా వాస్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టెస్టులు ఆడొద్దు బేబీ మలింగ గురించి ధోని మాట్లాడుతూ.. పతిరణ పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితం కావాలని.. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని సూచించాడు. వన్డేలు, టీ20లకు మాత్రమే లంక అతడి సేవలను ఉపయోగించుకోవాలని సూచన చేశాడు. గాయాల బారిన పడితే కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ధోని వ్యాఖ్యలు ఖండించిన మలింగ అయితే, మలింగ మాత్రం ఈ విషయంలో ధోనిని వ్యతిరేకించాడు. గాయాలకు భయపడి టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. సంప్రదాయ క్రికెట్ ఆడితేనే టెక్నిక్ మెరుగుపడుతుందని పేర్కొన్నాడు. తాను కూడా టెస్టులు ఆడిన వాడినేనని.. ధోని గనుక సీరియస్గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి ఆమోదనీయం కాదంటూ ఖండించాడు. కానీ, చమింద వాస్ మాత్రం ధోని వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. ‘‘పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అతడి లాంటి వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్ కలిగిన బౌలర్ ఒకవేళ అన్ని ఫార్మాట్లలో ఆడితే ఫిట్నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే పెద్దగా భారం పడదు. అంతకంటే ఎక్కువసేపు రోజుల తరబడి బౌల్ చేయాలంటే సమస్యలు తప్పవు. ధోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..! -
ఆ ఒక్క మాట.. మరోసారి అభిమానుల మనసు గెలిచాడు! విజయ రహస్యం?
IPL 2023- CSK- MS Dhoni: అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం.. సరైన సమయంలో వాళ్లకు ఆడే అవకాశమివ్వడమే విజయ రహస్యమని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. మేనేజ్మెంట్ జట్టుకు అన్ని విధాలా అండగా ఉందని.. సీఎస్కే సక్సెస్ క్రెడిట్ వాళ్లకు కూడా దక్కుతుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది చెన్నై. ఇప్పటి వరకు ధోని సారథ్యంలో నాలుగుసార్లు చాంపియన్గా నిలిచిన సీఎస్కే.. ఐపీఎల్-2023లోనూ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో 77 పరుగుల భారీ తేడాతో గెలుపొంది బెర్తు ఖరారు చేసుకుంది. కాగా సీఎస్కే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించడం ఇది 12వసారి. విజయ రహస్యం ఏంటి? ఈ క్రమంలో అత్యధికసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన జట్టుగా ధోని సేన చరిత్ర సృష్టించింది. దీంతో ధోని కెప్టెన్సీపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో విజయానంతరం ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ‘‘ప్రత్యేకంగా విజయసూత్రాలు అంటూ ఏమీ ఉండవు. మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకోవడం.. వారి సేవలను వినియోగించుకునే తీరుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్లే అత్యంత ముఖ్యం యాజమాన్యం కూడా అన్ని విధాలా ఆటగాళ్లకు అండగా నిలిచింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. అయితే, అదే సమయంలో ప్లేయర్లు కూడా ముఖ్యమే. ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వకపోతే కెప్టెన్, మేనేజ్మెంట్ ఎవరూ ఏం చేయలేరు కదా!’’ అంటూ ధోని అభిమానుల మనసు గెలుచుకున్నాడు. యువ బౌలర్లలో ఆత్మవిశ్వాసం ఇక యువ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. తుషార్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. రానురాను తన బౌలింగ్ మెరుగుపడుతోంది. అందుకే అతడికి వరుస అవకాశాలు ఇచ్చాం. పతిరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒత్తిడిని జయించి డెత్ ఓవర్లలో రాణించడం అతడిలో ఉన్న సానుకూలాంశం. ఏ ఆటగాడికైనా గడ్డు పరిస్థితులు సహజం. అలాంటి సమయంలో వాళ్లు 10% ఇచ్చినా.. మేము 50% అడ్జస్ట్ చేసుకుని వాళ్లు జట్టులో నిలదొక్కుకునేలా చేస్తాం’’అని ధోని చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో తుషార్ దేశ్పాండే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. పతిరణ 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో డేవిడ్ వార్నర్(86)ను అవుట్ చేయడం కేవలం 3 పరుగులే ఇవ్వడం ముచ్చటగొలిపింది. చదవండి: Virat Kohli: ఫ్యాన్స్తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్కు తెలిసొచ్చింది! చెత్తగా.. #RinkuSingh: ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం! Location: Delhi 📍 Emotion: MS Dhoni 😊 Special Saturday Moments 💛 This is heartwarming! ☺️#TATAIPL | #DCvCSK | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/s217v3HZ4k — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
అతడొక అద్భుతం.. సీఎస్కేకు డెత్ ఓవర్ల స్పెషలిస్టు దొరికేశాడు!
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీషా పతిరాన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లతో పతిరాన చెలరేగాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన ఈ యవ పేసర్.. 7.81 ఏకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో పతిరానపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎస్కేకు అద్భుతమైన డెత్ ఓవర్లు స్పెషలిస్టు దొరికాడని శ్రీశాంత్ కొనియాడాడు. "సీఎస్కేకు పతిరాన రూపంలో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ దొరికాడు. అతడు బ్యాటింగ్ కూడా చేయగలిగితే బ్రావోకు ప్రత్యామ్నాయం అవుతాడు. డెత్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా పతిరానకు ఉంది. అతడు యార్కర్లు మాత్రమే కాదు అద్భుతమైన స్లోయర్ బాల్స్ కూడా వేస్తున్నాడు. చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్గా! అతడి బౌలింగ్ను ఎదుర్కొవడం చాలా కష్టం. ఒక్క మ్యాచ్లోనే కాకుండా ప్రతీ మ్యాచ్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ధోని సపోర్ట్ అతడికి ఉంది. ధోని ఇటువంటి ఎంతో మంది యువ బౌలర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు" అంటూ స్టార్స్పోర్ట్స్ క్రికెట్ లైవ్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని -
IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్గా!
ఐపీఎల్-2023లో శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ మతీష పతిరన అదరగొడుతున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పతిరన అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పతిరన తన నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో "బేబీ మలింగా" ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్లలో(16-20) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా పతిరన నిలిచాడు. ఇప్పటివరకు డెత్ఓవర్లలో అతడు 12 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ ఘనత మరో సీఎస్కే పేసర్ తుషార్ దేశ్పాండే(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన ఈ శ్రీలంక పేసర్ దేశ్పాండే రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్పై 27 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. Super show with the ball from @ChennaiIPL! 👏 👏 The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌 Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4 — IndianPremierLeague (@IPL) May 10, 2023 చదవండి: IPL 2023: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని -
అందుకే అలా చేశా.. అతడు మా జట్టుకు దొరికిన నిజమైన ఆస్తి! అద్భుతాలు సృష్టిస్తాడు: ధోని
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యచ్లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ధోని సేన.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. రుత్రాజ్, కాన్వే చెలరేగడంతో 17.4 ఓవర్లలో ఛేదించింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని స్పందించాడు. కీలకమైన మ్యాచ్లో గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది తలైవా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో మూడు వికెట్లతో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరానాపై కూడా మిస్టర్ కూల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ విజయం చాలా కీలకం. గత కొన్ని మ్యాచ్ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా లేవు. కాబట్టి పాయింట్ల పట్టికలో మేము కాస్త వెనుకబడ్డాం. ఇప్పుడు మళ్లీ ఈ విజయంతో ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించాను. కానీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో నా నిర్ణయాన్ని ఆఖరి నిమిషంలో మార్చుకున్నాను. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాను. అదేవిధంగా వికెట్ కూడా చాలా నెమ్మదిగా ఉంది. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మా బౌలర్లు కూడా నిరూపించారు. మా పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరానా మా జట్టుకు, శ్రీలంకకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు రెడ్ బాల్ క్రికెట్ కాకుండా వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడేటట్లు శ్రీలంక క్రికెట్ చూసుకోవాలి. అతడికి అద్భుతాలు సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా అతడు గత సీజన్ కంటే ఈ సీజన్లో కాస్త దృఢంగా ఉన్నాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధోని పేర్కొన్నాడు. చదవండి: Kris Srikkanth: రోహిత్ శర్మ కాదు 'నో హిట్ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..! -
IPL 2023: చెన్నై ‘డబుల్’ ధమాకా
ఐపీఎల్ తాజా సీజన్లో ఇంటాబయటా ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్కింగ్సే ఆధిపత్యం కొనసాగించింది. నెల రోజుల క్రితం ముంబైని మరాఠా వేదికపై ఓడించిన ధోని సేన, ఇప్పుడు దాదాపు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. పైగా వరుసగా గత ఆరు సార్లు చెపాక్ మైదానంలో ముంబై చేతిలో ఎదురైన పరాజయాలకు ఈ గెలుపుతో బ్రేక్ వేసింది. చెన్నై: ఐపీఎల్లో హేమాహేమీ జట్లు ముంబై, చెన్నై మధ్య వరుసగా మరో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. శనివారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. మొదట రోహిత్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. నేహల్ వధేరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశ పతిరణ (3/15) దెబ్బ తీశాడు. çసూపర్కింగ్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 140 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (42 బంతుల్లో 44; 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రోహిత్ మళ్లీ విఫలం ముంబై బ్యాటింగ్కు దిగడంతోనే కష్టాల్లో కూరుకుపోయింది. గ్రీన్ (6), ఇషాన్ (7), రోహిత్ (0)లు 14 పరుగుల స్కోరుకే పెవిలియన్లో కూర్చున్నారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్వర్మ స్వల్ప గాయంతో బరిలోకి దిగలేకపోవడంతో మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మళ్లీ డకౌటయ్యాడు. సూర్యకుమార్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు) తర్వాత స్టబ్స్ (21 బంతుల్లో 20; 2 ఫోర్లు)తో నేహల్ వధేరా ఇన్నింగ్స్ను కుదుటపరిచాడు. 123/4 స్కోరు దాకా బాగానే ఉన్నా... 14 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. చెన్నై సులువుగా... చెన్నై ముందున్న లక్ష్యం 140 పరుగులు. ఇందులో సగంకంటే ఎక్కువ పరుగుల్ని ఓపెనర్లు రుతురాజ్, కాన్వే చేసేయడంతో ఛేదనలో సూపర్కింగ్స్ సాఫీగా సాగిపోయింది. కాన్వే నింపాదిగా ఆడుకుంటే... రుతురాజ్ ధాటిని ప్రదర్శించాడు. తర్వాత రహానె (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (12) తక్కువ స్కోర్లే చేసినా చెన్నైపై ఇదేమంత ప్రభావం చూపలేదు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గ్రీన్ (బి) తుషార్ 6; (బి) ఇషాన్ (సి) తీక్షణ (బి) చహర్ 7; రోహిత్ (సి) జడేజా (బి) చహర్ 0; నేహల్ (బి) పతిరణ 64; సూర్యకుమార్ (బి) జడేజా 26; స్టబ్స్ (సి) జడేజా (బి) పతిరణ 20; డేవిడ్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 2; అర్షద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 1; ఆర్చర్ నాటౌట్ 3; చావ్లా నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–69, 5–123, 6–127, 7–134, 8–137. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–18–2, తుషార్ 4–0–26–2, జడేజా 4–0–37–1, అలీ 1–0–10–0, తీక్షణ 4–0–28–0, పతిరణ 4–0–15–3. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) ఇషాన్ (బి) చావ్లా 30; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్ 44; రహానె (ఎల్బీ) (బి) చావ్లా 21; రాయుడు (సి) గోయల్ (బి) స్టబ్స్ 12; దూబే నాటౌట్ 26; ధోని నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–105, 4–130. బౌలింగ్: గ్రీన్ 1–0–10–0, ఆర్చర్ 4–0–24–0, అర్షద్ 1.4–0–28–0, చావ్లా 4–0–25–2, రాఘవ్ 4–0–33–0, స్టబ్స్ 2–0–14–1, ఆకాశ్ 1–0–4–1. 16: ఐపీఎల్లో రోహిత్ డకౌట్లు. ఎక్కువ సార్లు ‘సున్నా’ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. -
ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు
ముంబై ఇండియన్స్తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే పేసర్ మతీష పతిరణ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన పతిరణ.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగింగ్ యార్కర్లతో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించి, 3 వికెట్లు కీలక పడగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన పతిరణ.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ video తన కోటా ఓవర్లలో పతిరణ ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. ఈ మ్యాచ్లో స్పెల్తో పతిరణ మరోసారి తాను మలింగకు అసలుసిసలు వారసుడని నిరూపించుకున్నాడు. పతిరణతో పాటు దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్పాండే (4-0-26-2) విజృంభించడంతో ముంబై ఇండియన్స్ కేవలం 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (25 నాటౌట్), రుతురాజ్ (30) మెరుపు ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్లో వచ్చిన రహానే (21) సైతం ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. దీంతో సీఎస్కే 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్మైండ్!video -
Viral: మిస్టర్ కూల్కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి!
IPL 2023 CSK Vs PBKS- MS Dhoni Loses Cool: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరణ. ఐపీఎల్-2023లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్లలోనూ తుది జట్టులో వీరు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్నారు. మిస్టర్ కూల్కు కోపం ఎందుకొచ్చింది? ఈ సీజన్లో ఇప్పటి వరకు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ధోని కూడా వీరికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కీలక సమయంలో తీక్షణ చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనికి కూడా కోపం తెప్పించింది. నరాలు తెగే ఉత్కంఠ చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే ఆదివారం పంజాబ్ కింగ్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఎట్టకేలకు విజయం సాధించింది. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాటర్లు సికిందర్ రజా, షారుక్ ఖాన్ మూడు పరుగులు పూర్తి చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చెత్త ఫీల్డింగ్ కాగా తీక్షణపై ధోని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. పంజాబ్ ఇన్నింగ్స్లో 16వ ఓవర్లో బంతిని ధోని.. తుషార్ దేశ్పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత షార్ట్ బాల్ను సంధించాడు ఫాస్ట్బౌలర్ తుషార్. దానిని పుల్షాట్ ఆడబోయిన లివింగ్స్టోన్ లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా పయనించింది. ఈ క్రమంలో థర్డ్మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బాల్ మిస్ చేశాడు.. ఏకంగా 4 పరుగులు క్యాచ్ అందుకోవడానికి విఫలయత్నం చేశాడు. అనవసరంగా ముందుకు డైవ్ చేసి బాల్ను మిస్ చేశాడు. బంతి బౌండరీని తాకడంతో పంజాబ్కు నాలుగు పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన ధోని.. మిస్ ఫీల్డింగ్ చేసిన మహీశ్ తీక్షణపై ఫైర్ అయ్యాడు. జట్టు నుంచి తీసిపారేయండి అసలేం ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? అన్నట్లు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. డగౌట్లో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం తీక్షణ చేసిన పనికి గుస్సా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘నీకసలు బుద్ధుందా? బౌలింగ్ అంతంత మాత్రమే. చెత్త ఫీల్డింగ్. జట్టులో నుంచి తీసిపారేయండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! ఆసియా కప్ రద్దు? పాక్కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? pic.twitter.com/iAB4MTdg4p — CricDekho (@Hanji_CricDekho) April 30, 2023 𝙎𝙈𝙊𝙊𝙏𝙃 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧 😎@imjadeja & @msdhoni combine to get Prabhsimran Singh OUT! Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1qS9t5DJ8k — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రనౌట్ చాన్స్ మిస్.. ధోని అసహనం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. తాను వేసిన త్రోకు అడ్డుగా వచ్చిన బౌలర్ మతీషా పతీరానా వైపు కోపంగా చూడడం వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ పతీరానా వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని హెట్మైర్ ఆడే ప్రయత్నంలో అతని కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్ లెగ్బై ఇవ్వగా హెట్మైర్ పరుగుకు యత్నించాడు. బంతిని అందుకున్న ధోని నేరుగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు డైరెక్ట్ త్రో వేశాడు. కానీ పతీరానా బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా త్రోకు అడ్డు వచ్చాడు. అప్పటికి హెట్మైర్ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ ధోని వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్మైర్ రనౌట్ అయ్యేవాడే. రనౌట్ చాన్స్ మిచ్ అవడంతో ధోని.. పతీరానాను చూస్తూ ''వాట్ యార్(What Yar)..'' అంటూ పేర్కొన్నాడు. అయితే హెట్మైర్ మరుసటి ఓవర్లోనే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతను తీక్షణ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. One of the rare scenes in cricket. Angry Ms Dhoni. 🥵 #RRvCSK pic.twitter.com/kpPFnZmD8h — Sexy Cricket Shots (@sexycricketshot) April 27, 2023 చదవండి: #MSDhoni: హెట్మైర్ మిస్సయ్యాడు.. జురేల్ చిక్కాడు; లెక్క సరిపోయింది