-
పెళ్లిలో మెరిసిన రష్మిక.. భర్తతో సంతోషంగా ఉండాలంటూ పోస్ట్!
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది రణ్బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం.. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్పకు సీక్వెల్గా వస్తోన్న పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఎప్పుడు షూటింగ్లతో బిజీగా ఉండే రష్మిక తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది. కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులో స్నేహితురాలి వివాహానికి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పంచుకుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ గురించి ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఫ్రెండ్ వివాహానికి హాజరైన రష్మిక సంప్రదాయ పద్ధతిలో చీరను ధరించింది.రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..'నా హృదయం, నా చరిత్ర ఈ కొడగులోనే ఉంది. ఇక్కడ నేను, నా ఫ్రెండ్స్ కలిసి పెరిగాం. నీ పెళ్లిలో నువ్వు బిజీగా ఉన్నందున నీతో ఫోటో తీసుకోలేకపోతున్నాం. నువ్వు నీ భాగస్వామితో జీవితాంతం ఆనందంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా..దేవుడా! మా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నా' అంటూ పోస్ట్ చేసింది. తన స్నేహితురాళ్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.కాగా.. రష్మిక తల్లిదండ్రులు సుమన్, మదన్ మందన్న కొడగు జిల్లాలోని విరాజ్పేట పట్టణానికి చెందినవారు. రష్మిక చేతిలో ప్రస్తుతం 6 ప్రాజెక్ట్లు ఉన్నాయి. పుష్ప 2: ది రూల్లో అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల తెరెకెక్కించనున్న ద్విభాషా చిత్రం కుబేరలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్ అనే ప్రాజెక్ట్ల్లో కనిపించనుంది. బాలీవుడ్లో విక్కీ కౌశల్తో చావా, సల్మాన్ ఖాన్ సరసన సికందర్లో నటించనున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్తో గుడ్బైతో హిందీలో అడుగుపెట్టింది. చివరిసారిగా యానిమల్ చిత్రంలో మెరిసింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్ను పెళ్లి చేసుకున్నాడు.లండన్లో జూన్ 22న సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రస్టింగ్ సంగతులను షేర్ చేశాడు. ముఖ్యంగా కింగ్ఫిషర్ బీర్ ఇమేజ్ను షేర్ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్లో కింగ్ పిషర్కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్తో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను సిద్ధార్థ మాల్యా ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసి, తన ఫ్యాన్స్కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే. -
కొత్త పెళ్లికూతురు సోనాక్షి ‘ఫ్యామిలీ’ విశేషాలు, సల్మాన్తో లింకేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. చాలా సింపుల్గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి. రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్గా నిలుస్తోంది. సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎవరీ రతాన్సీ?ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు రతాన్సీ.ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం 2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు.ఇక్బాల్ రతాన్సీ కుటుంబంరతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్గా పేరొందింది.సల్మాన్ ఖాన్తో ఇక్బాల్ రతాన్సీ బంధంఇక్బాల్ , సల్మాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్ను బాలీవుడ్లో నోట్బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్ హీరోల సరసన అలరించింది. జెంటిల్మేన్ నుంచి వకీల్ సాబ్ వరకు తనదైన నటనతో మెప్పించింది. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ లాంటి టాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్లో లవ్ సింబల్ను పోస్ట్ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నివేదా థామస్కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకీ నివేదా ప్రియుడు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఏదైనా మూవీ అప్డేట్ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్కు డౌటానుమానాలు క్లియర్ అవుతాయి. It’s been a while….. but. Finally! ❤️— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024 -
Vijay Mallya Son Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కొడుకు (ఫోటోలు)
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ మాల్యా కొడుకు పెళ్ళిలో లలిత్ మోదీ
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్లోని హెర్ట్ఫోర్డ్షైర్లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.Siddharth Mallya gets married in London.Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024 -
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ముంబయిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు, సినీతారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు.సోనాక్షి తన ఇన్స్టాలో రాస్తూ.. " సరిగ్గా ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ప్రేమలో పడ్డాం. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను దాటి విజయం సాధించాం. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ క్షణం. మా ఇద్దరి కుటుంబాలు, దేవుళ్ల ఆశీర్వాదంతో మేము ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం. ఇక్కడ నుంచి ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమతో పాటు అన్ని విషయాలు కలిసికట్టుగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. వీరిద్దరు 2022లో విడుదలైన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైన హీరామండి వెబ్ సిరీస్లో మెప్పించింది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
అతనితో పెళ్లి అనగానే కుటుంబంలో గొడవలు: సోనాక్షి సిన్హా తండ్రి కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయిలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లికి ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నా ఏకైక కుమార్తె సోనాక్షినే అని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరని.. వారి నిర్ణయాన్ని మాత్రమే తెలియజేస్తారని ఆయన అన్నారు.పెళ్లికి ముందు విభేదాలుసోనాక్షి తన ప్రియుడు ఇక్బాల్ను పెళ్లి చేసుకోనుందని తెలియగానే మా కుటుంబంలో విభేదాలు వచ్చాయని శతృఘ్న సిన్హా తెలిపారు. పెళ్లి అనేది అందరి ఇళ్లలో జరుగుతుందని.. వివాహనికి ముందు గొడవలు కూడా మామూలే అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని వెల్లడించారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్కు తమ కుటుంబం హాజరవుతుందని శతృఘ్న తెలిపారు. కాగా.. పెళ్లికి ముందు సోనాక్షి, జహీర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. -
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
అనంత్, రాధికల పెళ్లి అక్కడే.. 29 నుంచే సంబరాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29న అంబానీల ముంబై నివాసం యాంటిలియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ కొత్త జంట మరికొన్ని రోజుల్లోనే పెళ్లిపీటలెక్కనున్నారు.జూన్ 29న యాంటిలియాలో పూజా కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 2023 జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు అతిధులుగా హాజరుకానున్నారు. మార్చిలో మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో, రెండో సారి క్రూయిజ్ షిప్లో జరిగాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. -
ఐసీయూలో వెంటిలేటర్పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్లాల్గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుండె కుడివైపు ఉందంటూ వివాహమైన 20 రోజులకే భార్యను పుట్టింటికి పంపించాడు భర్త. మోసం చేసి వివాహం చేశారంటూ భర్త తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భార్యకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. న్యాయస్థానం తీర్పును కూడా భర్త భేఖాతరు చేశారు. న్యాయం కోసం ఏడేళ్లుగా బాధితురాలు ఒంటరి పోరాటం చేస్తోంది.ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన అబ్బనపల్లి భవానిని పెద్దల సమక్షంలో 2018లో బోనకల్ మండలానికి చెందిన తవుడోజు భాస్కరాచారి వివాహమాడాడు. 20 రోజులు కాపురం చేసి భార్య భవానిని పుట్టింటికి పంపించాడు. గుండె కుడివైపున ఉందంటూ భార్యపై వేధింపులకు దిగాడు. భర్త భాస్కరాచారి ఇంటికి వెళ్లిన భవానిపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు.బోనకల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా భవాని మామ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం భవాని భర్త భాస్కరచారి పరారీలో ఉండగా, భర్త ఆచూకీ తెలపకుండా అత్తమామలు గోప్యంగా ఉంచుతున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
‘నాకీ ఉద్యోగం కావాలి సర్.. లేదంటే నా లవర్ను పెళ్లి చేసుకోలేను’ వైరల్ స్టోరీ
చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో పడటం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా తెలిసిందే. ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి రక రకాల ప్రయత్నాలు చేయడమూ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడు ఉద్యోగం కోసం వెరైటీగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇది వార్తల్లో నిలిచింది.hiring can be fun too 🥲 pic.twitter.com/6RnKnOWhIM— Dipalie (@dipalie_) June 13, 2024విషయం ఏమిటంటే.. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రెజ్యూమేను శ్రద్ధగా తయారు చేసుకుంటాం. ఇందులో మనకు సంబంధించిన అన్ని నైపుణ్యాలను పొందు పరుస్తాం. అలా ఉద్యోగం ఇచ్చే వ్యక్తులను, సంస్థలను ఇంప్రెస్ చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ స్టోరీలోని వ్యక్తి మాత్రం రెజ్యూమ్లో తాను సంబంధిత ఉద్యోగానికి ఎలా అర్హుడినో చెబుతూనే... తన ప్రేమ సంగతిని కూడా చెప్పుకొచ్చాడు. తనకీ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటిని స్నేహితురాల్ని పెళ్లి చేసుకోలేను అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘నాకు ఈ పొజిషన్కి కావాల్సిన అన్ని నైపుణ్యలు నాకు ఉన్నాయి. నేను దీనికి 100 శాతం పర్ఫెక్ట్ అని అనిపిస్తోంది’’ అని రాశాడు. అలాగే ‘‘ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను నా చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేకపోతే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయను అంటున్నాడు’’ అని రాసుకొచ్చాడు. అర్వా హెల్త్ ఫౌండర్, సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తు స్క్రీన్షాట్ను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. ‘ఫైరింగ్ కెన్ మీ ఫన్ టూ’ అనే క్యాప్షన్తో ఆమె దీన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అతని పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్పైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. అతని నిజాయితీని గర్తించైనా అతనికి ఉద్యోగం ఇవ్వాలంటూ మరొకరు కమెంట్ చేశారు. -
18 ఏళ్ల అందమైన అమ్మాయితో 90 ఏళ్ల తాత పెళ్లి : వీడియో మామూలుగా లేదుగా!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట... అయిదు రోజుల పెళ్లి ఇది ఒకప్పటి పెళ్లిళ్ల చరిత్ర. అంతేకాదు చిలకా గోరింకల్లా, రాధి కృష్ణుల్లా జంట భలే ముచ్చటగా ఉన్నారు అని పెద్దలు దీవించే వారు. ఇపుడు ట్రెండ్ మారింది గురూ. లేటు వయసులో ఘాటు ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూస్తున్నాం. తాజాగా 90 ఏళ్ల వృద్ధుడు, 18 ఏళ్ల అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అంతేకాదు డీజేకి తగ్గట్టుగా వరుడు, వధువుతో స్టెప్పులేశాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమేజింగ్ బిహార్ అనే ఇన్స్టాలో ‘పవర్ ఆఫ్ మనీ’ పేరుతో షేర్ అయింది. పెళ్లి అనేది వ్యక్తిగత అవసరం అభీష్టం. కానీ సోషల్ మీడియా మాత్రంలో నెటిజన్లు రక రకాల కామెంట్స్తో సందడి చేస్తున్నారు. ‘అరే..కాస్త విషంతీసుకుండిరా... ఈ వీడియో చూస్తూ..చూస్తూ చచ్చిపోతా’’ అనే కామెంట్ మాత్రం క్రేజీగా నిలిచింది. View this post on Instagram A post shared by ⚠️⃝⃜ LAKHISARAI BIHAR ⚠⃤ (@amazing__bihar) -
Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?
కువైట్లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది."ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా కేరళ - 23 తమిళనాడు -7ఉత్తరప్రదేశ్ -3ఆంధ్రప్రదేశ్ -3ఒడిశా- 2బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రూ. 2 లక్షల పరిహారంకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. -
పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్గా పని చేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సమంతను పెళ్లికి ఆహ్వానించిన హనుమాన్ నటి..!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన థాయ్లాండ్లో గ్రాండ్ వెడ్డింగ్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన పెళ్లికి అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ను తన పెళ్లికి ఆహ్వానించింది. వ్యక్తిగతంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. కాగా... టాలీవుడ్లో ఇప్పటికే రవితేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కలిసి పెళ్లికి రావాలని కోరింది. ఇటీవల తన తండ్రి శరత్కుమార్, రాధికాతో పాటు కోలీవుడ్ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ల నిశ్చితార్థం జరిగింది. నికోలయ్ సచ్దేవ్తో దాదాపుగా 14 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వరలక్ష్మి తెలిపింది. మరోవైపు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో వరలక్ష్మి కనిపించనుంది. -
హనుమాన్ నటి పెళ్లి.. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్దేవ్ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇటీవల కోలీవుడ్ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేస్తోంది. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.వరలక్ష్మి, నికోలాయ్ సచ్దేవ్ వివాహం థాయ్లాండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలై 2న ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థాయ్లాండ్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ను చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది. -
గర్ల్ ఫ్రెండ్ను పెళ్లాడిన ప్రముఖ యూట్యూబర్, భావోద్వేగ క్షణాలు
ప్రముఖ యూట్యూబర్ అరుణ్ మైని తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్ద్రిషను పెళ్లాడాడు. ఈశుభవార్తను సోషల్ మీడియాద్వారా పంచుకున్నాడు.ఈ వివాహానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ ఫోటోలను షేర్ చేశాడు."8 జూన్ 2024 నేను నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రేరణ, నా దేవత, నా సర్వస్వాన్ని పెళ్లి చేసుకున్నాను. మా జీవితాల్లోని ఆ మూడు రోజుల ఆనంద క్షణాలను హాయిగా గడిపాం. సంపూర్ణంగా ఎంజాయ్ చేశాం. ఇక భవిష్యత్లుగా జంటగా జీవించే లైఫ్ గురించి ఉత్సాహంగా ఉన్నాం’ అంటూ తమ పెళ్లి కబురు గురించి ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఎక్స్లో అరుణ్ చేసిన పోస్ట్కు సుమారు 30 లక్షల లైక్స్ వచ్చాయంటేనే అతని క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో రాయల్ లుక్లో ఈ లవ్బర్డ్స్ అరుణ్, ద్రిష అందంగా మెరిసిపోయారు.‘మిస్టర్ హూఈజ్ ది బాస్’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా అరుణ్ మైనీ ఆధునిక టెక్ కంటెంట్, డిజిటల్ టెక్నాలజీ ఇలా అనేక విషయాల గురించి తన ఛానల్లో మాట్లాడుతాడు. అతని యూట్యూబ్ ఛానెల్లో1. 8 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. ఇన్స్టాగ్రాంలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.I just married my best friend pic.twitter.com/lW2oICMV1I— Arun Maini (@Mrwhosetheboss) June 11, 2024అరుణ్ దంతపు రంగు షేర్వానీని , తలపాగా ,దుపట్టాలో కొత్త పెళ్లికొడుకుగా మారిపోయాడు. ఇక ధృషా అయితే భారీగా ఎంబ్రాయిడరీ చేసిన రెడ్ రంగు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. ఆకుపచ్చ రత్నాలతో బంగారు చోకర్, ఆకుపచ్చ రత్నంతో రాయితో పొదిగిన చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
అపుడేమో కోపంతో విడాకులు : పుష్కర కాలానికి మళ్లీ ప్రేమ,కన్నీళ్లు.. కట్ చేస్తే!
సాధారణంగా ఇక కలిసి జీవించడం అసాధ్యం అనుకున్నపుడు మాత్రమే భార్యభర్తలు విడిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఎపుడైనా, ఎక్కడైనా తారసపడినా కూడా ఒకర్నొకరు పట్టించుకోరు. అంటీ ముట్టనట్టే ఉంటారు. కనీసం పలకరించు కోరు కూడా (అయితే భార్యభర్తలుగా విడిపోయిన తరువాత కూడా, హుందాగా, స్నేహంగా ఉంటున్నజంటలు కూడా చాలానే ఉన్నాయి). కానీ విడాకులు తీసుకున్న పుష్కరకాలం తరువాత కలిసి మళ్లీ ఒక్కటయ్యారు. యూపీలోని రాంపూర్లో ఈ ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది.యూపీలోని ఇమ్రతా గ్రామానికి చెందిన అధికారి అలీకి రాంపూర్కు చెందిన అమ్మాయితో 2004లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు పుట్టారు. అయితే వీరి మధ్య తలెత్తిన విబేధాలు తారా స్థాయికి చేరడంతో పెళ్లయిన 8 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. అమ్మాయి తల్లి వద్ద, కొడుకులిద్దరూ తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇద్దరూ మరో పెళ్లి చేసుకోకుండా, పిల్లలే ప్రాణంగా జీవితాన్ని సాగిస్తున్నారు.అయితే దాదాపు 12 ఏళ్ల తరువాత, ఒక పెళ్లి వేడుక వారి జీవితాన్నే మార్చేసింది. ఈ పెళ్లిలో అనుకోకుండా ఒకరినొకరు ముఖాముఖి కలుసు కున్నారు. అలీ, అతని భార్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారు. భర్త కళ్లలో నుంచి నీళ్లు కారడం చూసిన భార్య కూడా చలించిపోయింది. తర్వాత ఇద్దరూ మాట కలిపారు. ఒకరి నంబర్లు మరొకరు తీసుకుని ఫోన్లో మాట్లాడుకోవడంమొదలెట్టారు. ఒకరి బాధల్ని మరొకరు మనస్ఫూర్తిగా పంచుకున్నారు.తమ మధ్య ప్రేమ పదిలంగాగానే ఉందని, క్షణికావేశంతో వేసిన అడుగు తప్పని తొందర పడ్డామని పశ్చాత్తాపపడి మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఒక శుభముహూర్తాన ఇద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు. అంతే కాదు ‘స్వీట్ ఫ్యామిలీ’ అనుకుంటూ ఉత్తరాఖండ్ పర్యటనకు చెక్కేసారు. -
‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్, వీడని సస్పెన్స్!
సినీ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పుకారు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలిచింది. బాయ్ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ను పెళ్లాడ బోతోందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 23న దక్షిణ ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోనాక్షి- జహీర్ పెళ్లాడబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై సోనాక్షి ఘాటుగా సమాధాన మిచ్చింది. ‘ ..ఇది నా పెళ్లి.. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇక రెండోది నా పెళ్, నా ఇష్టం. జనాలకు ఎందుకింత ఆందోళన అంటూ మండిపడింది. అలాగే తన పెళ్లి గురించి అడగాల్సింది తనను గానీ, తన తల్లిదండ్రులను కాదంటూ చురకలేసింది. ఎపుడూ తన పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించింది.అటు సోనాక్షి తండ్రి, బాలీవుడ్ హీరో, నేత శత్రుఘ్న సిన్హా కూడా స్పందించారు. తన కుమార్తె పెళ్లి గురించి తనకు తెలియదని సోనాక్షి పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియాతో చెప్పారు. ‘‘ ఎన్నికల ఫలితాలు తరువాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సోనాక్షి వెడ్డింగ్ ప్లాన్స్ గురించి నాకేమీ తెలియదు. నాకేమీచెప్పలేదు నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.అంతేకాదు ఈ విషయంలో ప్రధానమీడియాకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసుననీ, ఈ రోజుల్లో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు.. జస్ట్ వారు సమాచారం ఇస్తున్నారు.. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ముగించారు. దీంతో సోనాక్షి-జహార్ పెళ్లి సందడిపై సస్పెన్స్ మరింత ముదిరింది.కాగా సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో జూన్ 23న సోనాక్షి, జహీర్ వివాహం జరుగు తుందని, ఆ తర్వాత రాత్రి రిసెప్షన్ కూడా ఉంటుందనేది మీడియా నివేదికల సారాంశం వీరిద్దరూ చాలా కాలంగా తమ పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇప్పటిదాకా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. -
నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు. -
పెళ్ళి.. ఎందుకోసం?
గృహప్రవేశం చేయాలి. అప్పుడు యజుర్వేదం అంతా మనకు వచ్చా, రాదా అన్న దానితో సంబంధం లేదు. గృహప్రవేశ సందర్భంలో రాముడేం చేసాడో ఆ ఘట్టం చదువుకుంటే చాలు... ఓహ్, గృహప్రవేశం ఇలా చేయాలన్న మాట.. అన్నది తెలుస్తుంది. తండ్రిగారికి తద్దినం పెట్టాల్సి వస్తే రాముడేం చేశాడో చదువుకుంటే సరిపోతుంది. అది పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టాలని అర్థమవుతుంది. అందుకే వేదం రామాయణంగా ప్రవర్తించింది. చంద్రవంశాన్ని అంతటినీ వ్యాసుడు రచించాడు. సూర్యవంశాన్ని అంతటినీ కూడా వాల్మీకి వర్ణించాడు. సూర్యుడు, చంద్రుడు పగలూ రాత్రి ప్రకాశిస్తారు. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక రోజు పూర్తవుతుంది. వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందించారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్ఠాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసామాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం చేసారు.వివాహం ఎంత గొప్పది! వివాహం అంటేనే విశిష్టమైనది–అని. దానిని మనకు సం్ర పాప్తింప చేయడానికి జరిపే సంస్కారమే వివాహం. అది ఏదో సరదాకోసం కాదురా నాయనా, వివాహం చేసుకుంటా నంటున్నావు కదా, ముందు దానిగురించి, దానిలోని ధర్మసూక్ష్మాలను గురించి తెలుసుకో. వివాహం అంటే విశిష్టమైనదానిని ΄పోందుట. మరి ఆ విశిష్టమైనదేది? అదే మోక్షం. దీనిని ΄÷ందడానికి యోగ్యమైనది ధర్మానుష్ఠానం. అది సక్రమంగా జరగకుండా దానికి అడ్డుపడుతున్నవి ఏవి? అర్థకామాలు రాగద్వేషాలయి ΄ాపపుణ్యాలకు, పునర్జన్మలకు కారణమవుతాయి. అలాకాకుండా దానిని ధర్మబద్ధం చేసి పాశాలు విడిపోవడానికి సంసార ప్రవేశం జరగాలి. అటువంటి గృహస్థాశ్రమంలోకి నీవు ప్రవేశిస్తున్నావు. అలా ప్రవేశించి రాముడేం చేసాడో తెలుసా? సీతారామకళ్యాణ ఘట్టం చూడు. అక్కడ సీతమ్మ ఏం చేసింది ? అసలు పెద్దవాళ్ళనే వాళ్ళు పెళ్ళికూతురిని, పెళ్లికొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడారో పరిశీలించు. పెద్దరికం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే సంసారంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో రుషులు దేశకాలాలతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో సర్వజనులకు ఉపయోగపడే విధంగా వాటిని అందించారు. అటువంటి రుషుల రుణం మనకు జన్మతః ఉంది.మీరు ఎంతో చదువుకున్నారు... సరే. మంచిదే. నేను చదువును తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ చదువుతో ΄ాటుగా నిత్యజీవితంలో మనిషి మనిషిగా ఉండడానికి కావలసిన మానవత్వాన్ని నిలబెట్టడం చాలా అవసరం. అలా అది నిలబడాలంటే... రామాయణం, భారతం తదితర గ్రంథాలను బాగా పరిశీలించాలి. అవి నిత్యపారాయణకు యోగ్యత ఉన్న గ్రంథాలు. వాటిని కనీసం రోజుకో అధ్యాయం చొప్పున అయినా చదువుకుంటూ ఉండాలి. ఇంటిపట్టున పెద్దవాళ్ళు పిల్లలతో వాటిగురించి తరచూ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల ధార్మిక జీవనం అలవడడమేగాక, మనుషుల్లో మానవత్వం మిగులుతుంది. అది లేనప్పుడు మీరు సమకూర్చుకున్న జ్ఞానం, ప్రతిభా΄ాటవాలు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు. -
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero)