-
పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో ఎన్నికల్లో విజయం సాధించలేమని స్పష్టం కావడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ నోట్ల దందాకు తెరతీశారు. రూ.వేల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించేందుకు సన్నద్ధమయ్యారు. దశాబ్దాలుగా తన కుట్ర రాజకీయాల్లో భాగస్వాములైన ఈనాడు రామోజీరావు, పొంగూరు నారాయణలతోపాటు టీడీపీ బడా బాబుల వ్యాపార సంస్థలనే నల్లధనం డంపింగ్ యార్డులుగా మార్చేశారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు పచ్చనేతల షిప్పింగ్, ఆక్వా కంపెనీలను నల్లధనం కంటైనర్లకు గమ్యస్థానాలుగా చేసుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తరలిస్తున్న నల్లధనం బాగోతం ఇప్పటికే రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసుల సోదాల్లో బయటపడింది. కాకపోతే దొరికింది గోరంతే! గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసిన గిడ్డంగుల్లో టీడీపీ పెద్దలు గుట్టలు గుట్టలుగా అక్రమ నిధులు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. కుట్రలకు ‘మార్గదర్శి’ చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుట్రల్లో భాగస్వామి ఈనాడు రామోజీ మరోసారి నల్లధనం తరలింపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మీడియా ముసుగులో నిత్యం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఆయన మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలను టీడీపీ అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా మార్చారు. రోజూ చిట్ఫండ్స్ కార్యాలయాల ద్వారా టర్నోవర్ ముసుగులో అక్రమ నిధులను చాప కింద నీరులా టీడీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నారు. విశాఖలో ఎలాంటి పత్రాలు లేకుండా మార్గదర్శి కార్యాలయం నుంచి తరలిస్తున్న రూ.51.88 లక్షల నగదు, రూ.39.29 లక్షలు విలువ చేసే చెక్కులను తాజాగా పోలీసులు గుర్తించి జప్తు చేయడం తెలిసిందే. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ కేంద్రంగా సాగుతున్న నల్లధనం దందాలో పట్టుబడిన ఈ మొత్తం సముద్రంలో కాకి రెట్ట లాంటిదే. ఆర్థిక అక్రమాల కోసం మార్గదర్శి చిట్ఫండ్స్ మొదటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తోంది. విశాఖ బ్రాంచిలో మూడు రోజుల లావాదేవీల మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లు సోదాల సందర్భంగా మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది చెప్పారు. మూడు రోజులకే ఒక్క బ్రాంచిలో రూ.51.88 లక్షలు లావాదేవీల పేరుతో నల్లధనాన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు టీడీపీ సిద్ధపడిందో ఊహించవచ్చు. దీని ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్లే. రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు జనవరి నుంచి ఈ విధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ద్వారా అక్రమ నిధులు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా మార్గదర్శి కార్యాలయాల నుంచి రూ.వందల కోట్లను ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు స్పష్టమవుతోంది. 2022 నవంబరు నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు వేయడం లేదు. అయినా సరే ఈ స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటం వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలకు ఆదేశించి నగదు లావాదేవీల రికార్డులను తనిఖీ చేస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగ ఓట్ల బడి ‘నారాయణ’ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు ఎన్నికల అక్రమాల శిక్షణా కేంద్రాలుగా మారాయి. నారాయణ విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతారో తెలియదు కానీ ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలి? నోట్లు పంచి ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? అనేది టీడీపీ శ్రేణులకు పక్కాగా బోధిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలే ప్రధాన పాత్ర పోషించాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ హయాంలో అమరావతిలో భూదందాలో నారాయణ ‘ఎన్స్పైరా’ నుంచే అక్రమ నిధులు తరలించారన్నది సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల నెల్లూరులోని ఎన్స్పైరా కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. నారాయణ విద్యా సంస్థల నిర్వహణ వ్యయం పేరిట అక్రమ నిధులు తరలిస్తున్నట్లు బయటపడింది. ఈదఫా ఎన్నికల్లో మరింత బరి తెగించారు. ఎన్స్పైరా ముసుగులో అక్రమ నిధుల పంపిణీకి పైప్లైన్ను ఏర్పాటు చేయడం పచ్చ పన్నాగానికి పరాకాష్ట. జిల్లా కేంద్రాల్లోని నారాయణ విద్యా సంస్థలు, వాటి కార్యాలయాల నుంచే టీడీపీ అభ్యర్థులకు అక్రమ నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుల ముసుగులో చడీచప్పుడు కాకుండా కుట్రను అమలు చేసేందుకు ఉపక్రమించారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేస్తున్న మొత్తం, ఇతర వ్యయం పేరిట చూపిస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ అక్రమాల గుట్టు రట్టు కావడం ఖాయం. ఎన్నికల కమిషన్ నారాయణ విద్యా సంస్థల్లో సమగ్రంగా సోదాలు నిర్వహించి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. తీరం వెంట అక్రమ నిధుల డంపింగ్ యార్డులు రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని ఎన్నికల అక్రమాలకు చుక్కానిగా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం విశాఖ నుంచి నెల్లూరు వరకు టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా కంపెనీలను దొంగ నోట్ల కేంద్రాలుగా, అక్రమ నిధులను తరలించే కంటైనర్లుగా మార్చుకోవడం ఆయన బరి తెగింపు రాజకీయాలకు నిదర్శనం. బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో తరలిస్తున్న అక్రమ నిధులు మార్చి 28న పోలీసుల సోదాల్లో బయట పడటం గమనార్హం. విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరుల నుంచి సేకరించిన నిధులను లావాదేవీల ముసుగులో కంటైనర్ల ద్వారా మన రాష్ట్రంలోని పోర్టులకు తరలించడం ఆ పార్టీ పెద్దల లక్ష్యం. విశాఖ, కాకినాడ, నెల్లూరులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బడా బాబుల షిప్పింగ్ కంపెనీలు, ఆక్వా కంపెనీల గిడ్డంగులకు తరలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని పన్నాగం పన్నారు. ఇప్పటికే విశాఖపలోని ఓ షిప్పింగ్ కంపెనీ యజమానికి చెందిన గిడ్డంగులు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు అక్రమ నిధుల పంపిణీ కేంద్రాలుగా మారాయి. విశాఖ, భీమిలీ తీరప్రాంతంలోని టీడీపీకి బడాబాబుకు చెందిన ఓ హేచరీస్ కంపెనీ స్థావరంగా ఉత్తరాంధ్ర అంతటా అక్రమ నిధులు తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రీతిలో కాకినాడ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకరు తీరప్రాంతంలోని హేచరీలు, ఆక్వా కేంద్రాలు అడ్డాగా అక్రమ నిధులు తరలింపును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు కేంద్ర స్థానంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తెరతీసింది. రాష్ట్రమంతా పర్చూరు మోడల్ ఎన్నికల్లో రూ.వేల కోట్లను వెదజల్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే పన్నాగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో అమలు చేసిన పథకాన్ని ఈసారి మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన కుతంత్రం. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు ఇటీవల డీఆర్ఐ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. మండలాలు, పంచాయతీలవారీగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన విధానం, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, అందుకోసం నిధుల వ్యయం, ఓట్ల కొనుగోలు, దొంగ ఓట్ల పర్యవేక్షణకు వివిధ స్థాయిలో బాధ్యుల నియామకం తదితరాలతో ఓ బ్లూప్రింట్ను రూపొందించి ఎమ్మెల్యే సాంబశివరావు అమలు చేశారు. తన వ్యాపార సంస్థ నోవా అగ్రిటెక్ ఆర్థిక వ్యవహారాల ముసుగులో ఆ కుత్రంతాన్ని అమలు చేశారు. అదే రీతిలో బ్లూప్రింట్ను టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాలకు పంపి కుట్రను పక్కాగా అమలు చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. అందుకోసం మార్గదర్శి చిట్ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా, ఇతర కంపెనీలను వాడుకోవాలని కుతంత్రం రచించారు. చంద్రబాబు, లోకేశ్, రామోజీ, నారాయణ, పచ్చ కోటరీలోని ఇతర ముఖ్యులు సర్వం తామై ఈ ఎన్నికల కుతంత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం, రూ.వేల కోట్లు వెదజల్లడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అవసరమైతే భయోత్పాతం సృష్టించేందుకు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ ముఠా అక్రమ నోట్ల గిడ్డంగులపై వెంటనే దాడులు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ క్రియాశీలం కావడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బరితెగించిన రామోజీ...ఈసారి అడ్డంగా దొరికిపోయాడు
-
గురివింద బండారం బట్టబయలు
-
షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు
నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు. చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు. నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ -
మార్గదర్శి మోసాలను ఆధారాలతో బయటపెట్టిన బాధితులు
-
బందిపోటు దొంగల్లా మార్గదర్శి యాజమాన్యం
-
పేద, మధ్య తరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసింది
-
రామోజీ మోసాలు.. మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: చిట్ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు. మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు. -
మోసాలకు కేరాఫ్ అడ్రస్ మార్గదర్శి
-
ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే.. ఇళ్లు, కార్లు, ఫర్నీచర్, నగలు అన్నీ కొనుక్కోవచ్చు..’ ఇదీ టీవీ చానళ్లలో, హోర్డింగుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఊదరగొట్టే ప్రచారం. అది నిజమేనని నమ్మి మార్గదర్శి చిట్ఫండ్స్లో చేరిన చందాదారుల ఇళ్లల్లో ఆనందం ఆవిరవుతోందన్నది పచ్చి నిజం. కొత్త ఇళ్లు, కార్లు కొనుక్కోవడం దేవుడెరుగు.. ఉన్న ఇళ్లు, భూములు, బంగారం అమ్ముకుంటున్నా అప్పుల ఊబి నుంచి బయట పడటం లేదు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు. ఒక చిట్టీ అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా అప్పులు తీరవు.. సరికదా కాల్మనీ రాకెట్ను తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తుండటం రామోజీ ఆర్థిక అరచాకాలకు నిదర్శనం. విజయవాడకు చెందిన ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ కుటుంబానికి ఇలాంటి క్షేభే మిగిలింది. ఈ వెటర్నరీ వైద్యుడి కుటుంబ సభ్యులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఒక గ్రూపులో చందాదారుగా చేరారు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్చారు. ఆ చిట్టీ గ్రూపుల చందాలు చెల్లించడం కోసమంటూ మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తూ ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చూపించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఏకంగా 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్గా చూపించారు. అనంతరం ఆ కుటుంబం ఆస్తులను గుంజుకున్నారు. ఆ వెటర్నరీ వైద్యుడు జీపీఎఫ్ డబ్బులు రూ.35 లక్షలతోపాటు పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించినా ఇంకా అప్పులు తీరనే లేదు. కాల్మనీ రాకెట్ గుండాల మాదిరిగా మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వచ్చి అల్లరి చేసి మరీ వారి ఇంటిని వేలం వేయించారు. అంతటితో రామోజీ ఆగడాలు ఆగలేదు. విదేశాల్లో చదువుతున్న ఆ వెటర్నరీ డాక్టర్ కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. ఆ చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది.. ఎలా వేలం పాటలో పాల్గొంది.. అసలు తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే లేదు. ఆమె పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులే మోసం చేశారు. తలలు అమ్ముకున్నా తీరని అప్పులు జాతీయ బ్యాంకులుగానీ ప్రైవేటు బ్యాంకులుగానీ తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి తదనుగుణంగా రుణాలు ఇస్తాయి. రుణాలు చెల్లించే స్థోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం, ఆర్థిక స్థోమతను మించి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తోంది. దాంతో వాయిదాలు చెల్లించలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమకున్న కొద్దిపాటి ఆస్తులను తమకు ధారాదత్తం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందుకు విజయవాడకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ దీనగాధే తార్కాణం. ఇతను మార్గదర్శి చిట్ఫండ్స్లో రూ.2 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యునిగా చేరారు. తర్వాత మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేరితే ఆర్థికంగా కలసి వస్తుందని చెప్పడంతో మరో రెండు గ్రూపుల్లో సభ్యుడిగా చేరాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే ఏకంగా 20 గ్రూపుల్లో సభ్యునిగా చేర్పించేశారు. నెలకు రూ.50 వేలు వాయిదాల కిందే చెల్లించాల్సిన పరిస్థితి సృష్టించారు. చిట్టీ పాట పాడిన తర్వాత ప్రైజ్మనీ తీసుకునేందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీలను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు వేసి తిరస్కరించింది. వాయిదాల బకాయిలు చెల్లించేందుకు తమకున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్ నెలకు రూ.50 వేలు చిట్టీ వాయిదాలు ఎలా చెల్లించగలరని మార్గదర్శి చిట్ఫండ్స్ విచక్షణతో యోచించి ఉంటే ఆయనకు అంతటి దుస్థితి ఏర్పడేది కాదు. కానీ రామోజీ లక్ష్యం ఆయనకు ఉన్న ఒక్క ఇంటిని గుంజుకోవడమే. బరితెగించి రామోజీ ఆర్థిక ఆగడాలు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల్లో అత్యధికులది ఇలాంటి దుస్థితే. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు పక్కాగా తన కుట్రను అమలు చేస్తూ వారి ఆస్తులను కొల్లగొడుతున్నారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారిని మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టీ గ్రూపులో ప్రైజ్ మనీతో పాత చిట్టీ గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. మళ్లీ కొత్త చిట్టీ దగ్గరకు వచ్చేసరికి ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు చిట్టీ పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్మనీని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ.. సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్ఫండ్స్ పరం చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని.. చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్మనీ) ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీలో చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్.. తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని మాత్రం నెలల తరబడి జాప్యం చేస్తున్నా సరే ఒక్క రూపాయి వడ్డీ చెల్లించడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో 50 శాతం వరకు ఇటువంటి బాధితులే ఉండటం రామోజీ మోసాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. యథేచ్ఛగా చట్టం ఉల్లఘన ► ఎవరైనా ఓ చందాదారుడు చిట్టీ పాట పాడిన తర్వాత తగిన ష్యూరిటీలు చూపించకపోతే... ఆ చిట్టీ పాటను రద్దు చేయాలి. ఆ చిట్టీ గ్రూపునకు మళ్లీ పాట(వేలం) నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ ఆ నిబంధనను పాటించడం లేదు. ఆ చిట్టీ పాటను రద్దు చేయడం లేదు. కొత్తగా పాటను నిర్వహించడమూ లేదు. ఆ చిట్టీ పాట సక్రమంగా నిర్వహించినట్టు చూపిస్తూ ఆ ప్రైజ్మనీని వేరే ఖాతాల్లోకి మళ్లించేస్తోంది. ఆ చిట్టీ గ్రూపును యథావిథిగా కొనసాగిస్తోంది. దాంతో ఆ డిఫాల్టర్ చందాదారుడు తర్వాత నెలల వాయిదాలు కూడా చెల్లించాల్సినట్టు చూపిస్తూ అప్పుల ఊబిలోకి కురుకుపోయేలా చేస్తోంది. ► వాయిదాలు చెల్లించలేని చందాదారుడిని డిఫాల్టర్గా చూపించాలి. అంతవరకు ఆ చందాదారు చెల్లించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి కమీషన్ పోగా వెనక్కి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ అలా చేయడం లేదు. ఆ డిఫాల్టర్ చందాదారు మొత్తాన్ని మరో చిట్టీ బకాయి కింద జమ చేసినట్టు చూపిస్తూ.. ఇంకా బకాయిలు చెల్లించాలని రికార్డుల్లో ఆ చందాదరుని రుణగ్రస్తునిగా చూపిస్తోంది. ► ఎవరైనా ప్రైజ్మనీ తీసుకోని చందాదారు వాయిదాలు చెల్లించలేకపోతే డిఫాల్టర్గా ప్రకటించాలి. ఆ చందాదారునికి 14 రోజుల నోటీసు ఇచ్చి డిఫాల్టర్గా ప్రకటించినప్పటి వరకు చెల్లించిన వాయిదాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఆ మొత్తాన్ని నిర్దేశిత వడ్డీ రేటుతో కలిపి చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ ఈ నిబంధనను పాటించడం లేదు. అటువంటి చందాదారులను ఉద్దేశ పూర్వకంగా డిఫాల్టర్లుగా ప్రకటించకుండా కొనసాగిస్తూ వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ► చిట్ఫండ్ చట్టం ప్రకారం ప్రతి చిట్టీ గ్రూపు దేనికదే ప్రత్యేకం. ప్రతి చిట్టీ గ్రూపు ఒక ప్రత్యేక కంపెనీ వంటిది. ఒక చిట్టీ గ్రూపు చందాదారుగా చెల్లించిన మొత్తాన్ని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు చూపించకూడదు. ఈ నిబంధనను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉల్లంఘిస్తూ చందాదారులను ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యునిగా చూపిస్తూ... అన్ని చిట్టీ గ్రూపుల మొత్తాన్ని ఒకదానికి ఒకటి అనుసంధినిస్తూ చందాదారులను ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. బాధితులకు అండగా చట్టం, ప్రభుత్వం చిట్ఫండ్ కంపెనీల మోసాలు, ఆగడాల నుంచి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు కేంద్ర చిట్ఫండ్స్ చట్టం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. చిట్టీ గ్రూపుల డిఫాల్టర్ సభ్యుల విషయంలో అనుసరించాలిన నిబంధనలను కేంద్ర చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 22లో విస్పష్టంగా పేర్కొంది. అయితే దశబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ చట్టాన్ని వైఎస్సార్సీపీ పటిష్టంగా అమలు చేస్తోంది. చిట్ రిజిస్ట్రార్లతోపాటు ప్రభుత్వం వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్గదర్శి అక్రమాలు, వేధింపులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్తోపాటు ఇతర చిట్ఫండ్ కంపెనీల బాధితులు తమ సమస్యను తెలియజేసి న్యాయం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కేంద్ర చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 64 నుంచి 68 వరకు జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్కు విస్తృత అధికారాలున్నాయి. ఆయనకు జ్యుడీషియరీ అధికారాలను చట్టం కల్పించింది. చందాదారులు తమకు చిట్ఫండ్ కంపెనీ మోసం చేసిందీ.. వేధిస్తోంది.. అని భావిస్తే తగిన ఆధారాలతో జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయవచ్చు. తాము సరైన ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదని, తమను డిఫాల్టర్గా ప్రకటించి అప్పటి వరకు చెల్లించిన వాయిదాలను వెనక్కి ఇవ్వాలని.. తమ సమ్మతి లేకుండానే ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారని.. ఇలా ఎటువంటి సమస్యలపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆమేరకు ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే బాధితులు రాష్ట్ర స్థాయిలో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్లు 69, 70 ప్రకారం రాష్ట్ర చిట్స్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి తగిన న్యాయం పొందవచ్చు. -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
-
"మార్గదర్శి షట్టర్ క్లోజ్"..రామోజీ దుకాణం బంద్..
-
‘మార్గదర్శి’ మోసాలపై సంఘటిత పోరు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మార్గదర్శి బాధితుల సమస్యలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని.. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు. వివరాలకు 99481 14455 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమ ఆర్థిక సామ్రాజ్యం.. ఆధారాలతో సహా బట్టబయలు కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు..? ►ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు ►మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు ►ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు ►బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు ►చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) ►ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు ఇదీ చదవండి: ‘బ్లాక్’ కోబ్రా -
‘బ్లాక్’ కోబ్రా
మార్గదర్శి చిట్ ఫండ్స్ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్దారుల పాన్ నంబరు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. – సాక్షి, అమరావతి ఘోస్ట్ చందాదారులతో నల్ల దందా బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్’ మ్యాజిక్ మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో బ్యాలన్స్ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్ షీట్తో సరిపోవాలి. అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్ షీట్ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్క్యాష్ కావు. కేవలం చిట్స్ రిజి్రస్టార్, రిజర్వ్ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం. ‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే..
-
ఆర్బీఐ హెచ్చరిక..బద్దలవుతున్న రామోజీ బాగోతం
-
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గట్టిగా మొట్టికాయ వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్కు విరుద్ధమని నివేదించింది. ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని, ఆర్బీఐ తరఫు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్లోని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పూర్తి వివరాలతో ఓ నోట్ను తమ ముందుంచాలని ఆర్బీఐని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభుత్వంతోపాటు పిటిషనర్ ఉండవల్లి అరుణ్కుమార్ను సైతం మార్గదర్శి చిట్ఫండ్ డిపాజిట్ల సేకరణ విషయంలో నోట్ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా.. విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు... ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు గాను చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (2018 డిసెంబర్ 31) అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని (ప్రస్తుతం ఎన్సీఎల్టీ సభ్యురాలు, అమరావతి బెంచ్) తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2019లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కోర్టు పరిధిలో ఉన్నా కూడా రూ.2వేల కోట్లు సేకరణ ఈ సందర్భంగా మార్గదర్శి, రామోజీరావుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు వెనక్కు ఇచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సీఐడీ నమోదు చేసిన ఫిర్యాదును కొట్టేసిందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ, మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసిందని, ఇందుకు సుప్రీంకోర్టు గతంలోనే అనుమతి మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో రూ.2 వేల కోట్లు సేకరించిందని వివరించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ ఇన్ పర్సన్ (కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలను తానే వినిపించడం)గా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడినని తెలిపారు. తీసుకున్న డబ్బు వెనక్కు ఇచ్చేశారా? ఎవరు ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారు..? అన్న విషయాలు ముఖ్యం కాదన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అన్నదే ఇక్కడ చూడాల్సిన అంశమని తెలిపారు. హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది నిజమో కాదో తేల్చాలని ఆయన కోర్టును కోరారు. ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా ఇక్కడే ఉన్నారని, ఆయన్ను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దీంతో ఆర్బీఐ తరఫు న్యాయవాది ఎంఆర్ రమేష్ బాబు స్పందిస్తూ, హెచ్యూఎఫ్గా సెక్షన్ 45ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో కూడా ఇలాగే డిపాజిట్ల సేకరణ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇలా 45ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని హైకోర్టుకు చెప్పారా? అని ప్రశ్నించింది. హైకోర్టులో మార్గదర్శి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో తాము ప్రతివాది కానందున ఈ విషయాలను హైకోర్టు ముందుంచలేదన్నారు. సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న విస్తృత ధర్మాసనం, అన్నీ వివరాలను నాలుగు పేజీల నోట్ ద్వారా తమ ముందుంచాలని ఇరుపక్షాలను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. వాదనలు వినిపించేందుకు అందరికీ అవకాశం ఇస్తామంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఈ విచారణకు మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూత్రా, ఉండవల్లి తరఫున న్యాయవాదులు అల్లంకి రమేష్, అరుణా గుప్తాలు హాజరయ్యారు. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి ఫిర్యాదు మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతించింది. ఆ తర్వాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు సానుకూల స్టే ఉత్తర్వులిచ్చింది. ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు 2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అందువల్ల క్రిమినల్ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో, హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు 2018 డిసెంబర్ 31న మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. అందరూ హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. తీర్పు వెలువడిన కొంత కాలం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రజనీ 2021 సెప్టెంబర్లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అమరావతి బెంచ్ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్సీఎల్టీ పోస్టు ఖరారైంది. ఆర్బీఐ తొలిసారి వచ్చింది ఏళ్ల తరబడి మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంలో కీలక విషయాన్ని తెలపడానికి ఆర్బీఐ తొలిసారిగా కోర్టుకు వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. కోర్టు విచారణ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి తరఫున పేరు మోసిన సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరణ చట్ట విరుద్ధమని న్యాయవాది రమేష్బాబు తెలిపారన్నారు. మార్గదర్శి, రామోజీరావు వంటి వారిపై కఠిన చర్యలు ఉంటేనే చిన్న చిన్న చిట్ఫండ్ మోసాలు కూడా అరికట్టవచ్చన్నారు. రామోజీరావు అరెస్టు కావాలనేది తన ఉద్దేశం కాదని, ఈ తరహా మోసాలు అరికట్టడమే తన అభిమతమని స్పష్టం చేశారు. తన సొంత జిల్లాలో ఇటీవలే రెండు చిట్ ఫండ్ కంపెనీల మోసాలు వెలుగు చూశాయన్నారు. ఏపీలో ఫైనాన్స్ పేరుతో వసూళ్లు తగ్గుముఖం పట్టాలంటే కోర్టు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 9 నాటి విచారణతో స్పష్టత వస్తుందని, చట్టవిరుద్ధంగా వసూళ్లకు పాల్పడే వారి ముక్కుకు తాడు పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. -
సుప్రీంకోర్టు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
మార్గదర్శి చిట్ ఫండ్ స్కాంలపై నా దగ్గర కీలక ఆధారాలున్నాయి: మాజీ ఎంపీ ఉండవల్లి
-
మార్గదర్శి స్కాం..సుప్రీంకోర్టులో రామోజీ రావుకు బిగ్ షాక్
-
మార్గదర్శి స్కాం కేసులో రామోజీ రావుకు సుప్రీం కోర్ట్ షాక్
-
సుప్రీం కోర్టులో మార్గదర్శికి ఝలక్