-
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు.. చందాదారుల చాటున పిటిషన్లు!
సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొన్ని చిట్ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది. పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం. ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధారణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చిట్ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రోజుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణంతో చిట్ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టును ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
విచారించాలి.. ఏపీకి రండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్ను ఆంధ్ర ప్రదేశ్లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్లతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్ను రెండుసార్లు హైదరాబాద్లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది. న్యాయ సూత్రాల ప్రకారం.. రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ల ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆంధ్రప్రదేశ్లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన చందాదారుల సొమ్మును చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్లోనే విచారించాల్సి ఉంది. రామోజీరావు, శైలజా కిరణ్ను హైదరాబాద్లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. హాజరు కావడం ఆనవాయితీ నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్లో శైలజా కిరణ్ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు. -
23 మార్గదర్శి చిట్ గ్రూపులు రద్దు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది. అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. తాజా అక్రమాలివే గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది. అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి. కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్షీట్లు, వెబ్సైట్లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చదవండి: Margadarsi: 1982 చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు -
మార్గదర్శికి మరో భారీ షాక్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. ఇదీ చదవండి: సూర్య నారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు -
దుష్ప్రచారంపై ‘సీఐడీ’ సీరియస్.. త్వరలో రామోజీ, శైలజకు నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంసీఎఫ్ఎల్)పై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సన్నద్ధమవుతోంది. ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సీఐడీ చర్యలను వక్రీకరిస్తూ, దాని ప్రతిష్టకు భంగకరంగా మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యవహరిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సంస్థతోపాటు అధికారుల గౌరవానికి భంగం కలిగిస్తూ మార్గదర్శి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. తమ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని సీఐడీ గుర్తించింది. తద్వారా కేసు దర్యాప్తును ప్రభావితం చేయాలన్నది మార్గదర్శి చిట్ఫండ్స్ లక్ష్యమన్నది కూడా స్పష్టమైంది. అందుకే సీఐడీపై దుష్ప్రచారం చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజ కిరణ్లపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే వారికి సీఐడీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. చదవండి: ‘థ్యాంక్యూ సీఎం సార్’.. సీపీఎస్కు బదులు మెరుగైన జీపీఎస్ -
సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?
సాక్షి, అమరావతి: తనకు నచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటూ.. నచ్చనివారిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల నిధులను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ, రామోజీ కోడలు శైలజా కిరణ్ను హైదరాబాద్లో రెండోసారి మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తమకు చట్టాలు, నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా ‘తెలియదు’ అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తాను విదేశాల నుంచి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. విచారణకు అడుగడుగునా అడ్డుపడుతూ.. మంగళవారం దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ప్రక్రియలో సీఐడీ అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిలో కనీసం 25శాతం ప్రశ్నలను కూడా శైలజను అడగలేకపోయారు. దీన్ని బట్టి ఆమె అడుగడుగునా విచారణకు అడ్డుపడుతూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని స్పష్టమవుతోంది. ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించేందుకు సీఐడీ అధికారులు అవకాశం ఇచ్చారు. భోజనానికి, మందులు వేసుకోవడానికి కూడా విరామం ఇచ్చారు. అయినప్పటికీ శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం గమనార్హం. అంతే కాకుండా విచారణకు సీఐడీ అధికారులతోపాటు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్థిక వ్యవహారాల నిపుణులను ఇంటిలోకి రానీయకుండా అడ్డుకునేందుకు యత్నించడం రామోజీ కుటుంబం బరితెగింపునకు నిదర్శనం. అసలు వాస్తవం ఇది.. కాగా అసలు వాస్తవం ఏమిటంటే.. తమ విచారణకు శైలజా కిరణ్ ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన విష పత్రికలో అబద్ధపు రాతలు రాయించారు. ఇక మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు. శైలజా కిరణ్ విచారణ ప్రక్రియకు సబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు. వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర చానళ్లు కూడా శైలజా కిరణ్ను సీఐడీ విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి. ఓ సంచలనాత్మకమైన కేసులో.. అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ, తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతాం.. ఇంకెవరూ తమపై మాత్రం వాస్తవాలను కూడా రాయకూడదనే తీరులో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది. దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నీతులు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన ‘మార్గదర్శి’ కుప్పకూలుతుండటంతో సీఐడీ దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది. ‘ఈనాడు’లో అబద్ధపురాతలు షురూ.. విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం తమ పత్రిక ‘ఈనాడు’లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శైలజా కిరణ్ విచారణకు పూర్తిగా సహకరించారని సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ తెలిపినట్టుగా ‘ఈనాడు’ తనకలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది. అంతేకాదు.. ఇక శైలజా కిరణ్ విచారణ పూర్తయిపోయిందని.. ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది. -
ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ల్లో సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో కీలక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో చందాదారుల ఫిర్యాదులతో కార్యాచరణ చేపట్టింది. ఫేక్ డిపాజిట్దారుల పేరిట మార్గదర్శి చిట్ఫండ్స్లో భారీగా నల్లధనాన్ని చేతులు మారుస్తుండటంపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసానికి పాల్పడటంపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టడంతో సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన తరువాత సీఐడీ విభాగం ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏడు బ్రాంచి కార్యాలయాలు, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజలను విచారించింది. సహాయ నిరాకరణతో.. చిట్ఫండ్ చట్టం 1982కి విరుద్ధంగా రామోజీరావు యథేచ్ఛగా పాల్పడిన ఆర్థిక అక్రమాలపై సీఐడీ ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్లు, అక్రమ పెట్టుబడులపై ఆధారాలను ప్రదర్శిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులను ప్రశ్నించింది. చట్ట ప్రకారం బ్రాంచి మేనేజర్లకు చెక్ పవర్ ఉండాలి. చందాదారులు చెల్లించిన సొమ్మును సంబంధిత బ్రాంచి కార్యాలయాలున్న నగరాలు / పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి తరలించి అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ నిధుల మళ్లింపులో చెరుకూరి శైలజా కిరణ్తోపాటు 11 మంది మార్గదర్శి ఉన్నతాధికారులు కీలక భూమిక పోషించారు. వారిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్లోని బ్రాంచిలకు సంబంధించి వ్యవహారాలు నిర్వర్తించారు. కీలక ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్రాంచి మేనేజర్లకు వివరించారు. దీనిపై ఆ ఏడుగురు ఉన్నతాధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అయితే రామోజీ ఆదేశాలతో వారు సీఐడీ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఈ కేసులో దూకుడు మరింత పెంచాలని నిర్ణయించిన సీఐడీ ఏకకాలంలో రాష్ట్రంలోని 37 బ్రాంచి కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. ఉదయం ప్రారంభించిన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజులపాటు సోదాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫేక్ చందాదారులు.. జాడలేని కీలక రికార్డులు ఏకకాలంలో బ్రాంచి కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు మార్గదర్శి అక్రమాలను గుర్తించి విస్తుపోయారు. చిట్ఫండ్ చట్టం ప్రకారం నిర్వహించాల్సిన రికార్డులు ఏవీ బ్రాంచి కార్యాలయాల్లో లేవు. చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో జమ చేసినట్లు రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. నిధుల మళ్లింపునకు సంబంధించిన కనెక్టింగ్ రికార్డులు, లెడ్జర్ పుస్తకాలు లేకపోవడంతోపాటు బ్రాంచి కార్యాలయాల వార్షిక నివేదికల్లో వాటి ప్రస్తావనే లేదు. ఒక్కో బ్రాంచి కార్యాలయంలో నిర్వహిస్తున్న చిట్లు ఎన్ని? ఎంతమంది చందాదారులున్నారు? ప్రతి నెలా చందా మొత్తం ఎంత వస్తోంది? ఆ నిధులను ఏం చేస్తున్నారు? అనే రికార్డులేవీ మార్గదర్శి చిట్ఫండ్స్ సక్రమంగా నిర్వహించడం లేదని వెల్లడవుతోంది. పలువురు చందాదారులకు సంబంధించి సరైన చిరునామాలు కూడా లేవు. చందాదారుల ముసుగులో భారీ ఎత్తున నల్లధనాన్ని బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్ఫండ్స్( కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్ఫండ్స్(తమిళనాడు)– చెన్నైలలో పెట్టుబడిగా చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలోనే ఉంది. అంటే భారీ ఎత్తున నల్లధనాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుబడి పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఫిర్యాదులపై కార్యాచరణ మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు సీఐడీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. తాము ష్యూరిటీ సమర్పించినా చిట్టీ మొత్తాన్ని ఇవ్వడం లేదని, చిట్టీ మొత్తంలో కొంత భాగం డిపాజిట్లుగా ఉంచారని, తమను వేధిస్తూ ఆస్తులు అటాచ్ చేశారని... పలు ఫిర్యాదులు సీఐడీ దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించి బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు, ష్యూరిటీలు ఇచ్చినా చిట్టీ మొత్తాన్ని చెల్లించకుండా వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. మరోవైపు ష్యూరిటీకి సంబంధించి మార్గదర్శి విధించిన షరతులు కేంద్ర చిట్ఫండ్స్ చట్టంలోని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. వీటిపై కీలక రికార్డులను సీఐడీ అధికారులు జప్తు చేశారు. విచారించి వాంగ్మూలాలు నమోదు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజుల పాటు క్షుణ్నంగా సోదాలు కొనసాగించాలని సీఐడీ భావిస్తోంది. ప్రతి బ్రాంచి కార్యాలయం పరిధిలోని చందాదారుల్లో కనీసం 25 శాతం మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డిపాజిట్లు పెట్టిన చందాదారులపై దృష్టి సారించనున్నారు. వారు చేసిన డిపాజిట్లకు ఎక్కడ నుంచి నిధులు తెచ్చారు? సంబంధించిన పత్రాలున్నాయా? ఆదాయపన్ను రిటర్న్లలో వాటిని చూపిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఫేక్ డిపాజిట్దారుల పేర్లతో మార్గదర్శి చిట్ఫండ్స్లో భారీ ఎత్తున డిపాజిట్లు చూపుతున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పక్కాగా నిర్ధారించేందుకు చందాదారులు, డిపాజిట్దారుల ఇళ్లకు వెళ్లి ఆరా తీయనున్నారు. ఆధారాల ధ్వంసంపై ఫోరెన్సిక్ ఆడిట్ మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు మరిన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏడు బ్రాంచి కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతోపాటు కంప్యూటర్లలో కీలక రికార్డులను డిలీట్ చేసినట్లు సీఐడీ విభాగం గుర్తించింది. బ్రాంచి మేనేజర్లతో మార్గదర్శి యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ఆధారాల ధ్వంసానికి పాల్పడినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తులో ఉండగా ఆధారాలను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరం. సీఐడీ అధికారులు దీన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రక్రియను చేపట్టారు. నిపుణుల బృందాలను నియమించి మొత్తం రికార్డులను విశ్లేషిస్తున్నారు. వారం పది రోజుల క్రితం ఏడు బ్రాంచి కార్యాలయాల్లో డిలీట్ చేసిన రికార్డులను రిట్రీవ్ చేసి వెలికి తీశారు. ప్రస్తుతం మొత్తం 37 బ్రాంచి కార్యాలయాల్లోనూ ధ్వంసం చేసిన రికార్డులను వెలికి తీయడంతోపాటు రికార్డులను ధ్వంసం చేసినట్టు శాస్త్రీయంగా రికార్డు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే కీలక రికార్డులను ధ్వంసం చేసినట్లు బ్రాంచి కార్యాలయాల సిబ్బంది సీఐడీ ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా నిరూపించడం ద్వారా న్యాయస్థానంలో సమర్పించేందుకు కీలక సాక్ష్యా«దారాలను సేకరించే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేసింది. చదవండి: ‘చంద్రబాబుతో అంటకాగితే జనసేన అడ్రస్ గల్లంతే’ -
సామాన్యుడు కాడు.. వీడు అసామాన్యుడు.. ఇది కదా ఉండవల్లి అంటే..
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. వెండితెరపై హీరో గొప్పదనం చూసి చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో అలాంటి హీరోలు కనిపించినప్పుడు, వారి గురించి తెలిసినప్పుడు పెద్దగా పట్టించుకోం. రీల్ హీరోలు ఎక్కడైనా కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం నానాయాతన పడతాం. అదే రియల్ హీరోలను చూసినప్పుడు, వారి పోరాట పటిమ తెలిసినా సరే ఎక్కడో ఏవో అనుమానాల కారణంగా శెభాష్ అనడానికి మొహమాటపడతాం. ఒక్కోసారి వారు చనిపోయిన తర్వాత వారి గొప్పదనం గురించి తెలిసి, వారు వీరు చెబుతుంటే విని, వావ్ అనిపిస్తుంది. అంతటితో రియల్ హీరోల కథ సమాప్తం. కానీ రియల్ హీరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూస్తే అలా అనిపించడం లేదు. ఆయన స్పెషల్ రియల్ ఫైటర్. ఆయన నిజమైన అసాధారణ పోరాట యోధుడు. Created history with great fighting spirit. మార్గదర్శి అవకతవకల్ని వెలికితీయడంద్వారా ఆర్ధికరంగ నేరాలపై తనదైన శైలిలో సామాన్యులకు సైతం చక్కటి అవగాహన కల్పించిన సామాన్యుడు. ఆయన చెప్పే పాయింట్లలో ఒక్క మాట కూడా తప్పు పట్టేలా లేదు. సామాన్యుల్లో అసామాన్యుడు. ప్రజాప్రతినిధిగా పదికాలాలపాటు నిలిచిపోయే పని చేశారు. ఆర్ధిక రంగ నేరాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించిన ధన్యజీవిగా కీర్తి సంపాదించారు. కేవలం చట్టాలను నమ్ముకొని, న్యాయవ్యవస్థమీద నమ్మకంతో ప్రజాప్రతినిధిగానే కాదు లాయర్ గా కూడా మార్గదర్శిపై పట్టుదలగా పోరాటం చేసి చరిత్రలో తనకంటూ మంచి పేరు ఆర్జించారు. నాకు రాజ్యాంగం పట్టదు, నేను చెప్పిందే చట్టం, నేను సంకల్పించిందే సక్రమం అనుకునే మోనార్క్లలో కనీసం ఒక్కరినైనా నేలమీదకు ఈడ్చుకొచ్చిన మహర్షి ఉండవల్లి. మార్గదర్శి సక్రమంగా పని చేస్తోంది కదా! ఎలాంటి ఫిర్యాదులు లేవు కదా!! ఏంటీ ఈ ఉండవల్లికి వచ్చిన నొప్పి అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సమస్య లోతుపాతులు తెలిసిన తర్వాత ఇంతకాలం జరిగిన మోసం తెలిస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అంతిమంగా దెబ్బతినేది ప్రజలు. లాభపడేది ఆ మోసాలు చేసినవారు, అంతో ఇంతో లబ్ధి పొందేది వారికి చప్పట్లుకొట్టేవారు. ఆ స్పృహతో చూసినప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన పోరాటం అసాధారణం, అమోఘం, అద్వితీయం. మాటలతో చెప్పలేనిది. సెల్యూట్ టు ఉండవల్లి అరుణ్కుమార్ సార్. undavalli arun kumar on margadarshi, on ramoji, on chit funds, on chits, on margadarshi financiers ..అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.. మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత సమాచారం వాటిలో లభ్యమవుతుంది. అయినా సరే మీడియా మొఘల్ రామోజీయే కరెక్ట్ అని ఎవరైనా అంటే ఎవరైనా చేయగలిగిందేమీలేదు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవడమే. -చెమికెల రాజశేఖరరెడ్డి, హైదరాబాద్ -
మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్కు తాను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గదర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గదర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్ విసురుతున్నారని చెప్పారు. తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫర్వాలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు. జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. -
‘రామోజీరావు మార్గదర్శిలో అక్రమాలు’.. స్వర్ణాంధ్ర సదస్సు
సాక్షి, విజయవాడ: స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ‘రామోజీరావు మార్గదర్శిలో అక్రమాలు’ అంశంపై సదస్సు జరిగింది. కాగా, ఈ సదస్సుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్. సత్యనారాయణ ప్రసాద్, స్వర్ణాంధ్ర దినపత్రిక ఎడిటర్ కె.బి.జి. తిలక్, పలువురు మేధావులు, విద్యావంతులు, పౌరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్. సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ.. రామోజీరావు నిందితుడు.. నేరం చేశానని ఒప్పుకుంటున్నారు. గతంలో డిపాజిట్లు సేకరించాం.. ఇప్పుడు సేకరించడం లేదంటున్నారు. నిబంధనల ప్రకారం డిపాజిట్ల సేకరణ చేయకూడదు. చందదారుల డబ్బు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చందాదారుల భద్రత కోసం బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చందాదారుల డబ్బును రామోజీ తన సొంత అవసరాలకు వాడుకున్నారు. చిట్ఫండ్ డబ్బును రామోజీరావు దారి మళ్లించారు. సీనియర్ జర్నలిస్ట్ తిలక్ మాట్లాడుతూ.. మార్గదర్శిపై పోరాటంలో ఉండవల్లి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఉండవల్లి పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతుంది. ఉండవల్లి పోరాటానికి మనమంతా మద్దతివ్వాలి. రామోజీ పొరపాట్లను ప్రశ్నిస్తే వ్యక్తిగత హననానికి పాల్పడతారు. పత్రికలను అడ్డం పెట్టుకొని రామోజీరావు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పత్రికలు వాడుకోవడం సరికాదు. చట్టాలు తమకు వర్తించవన్న ధోరణి మంచిది కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించడంలో రామోజీది ప్రముఖ పాత్ర. చందాదారుల డబ్బు చెల్లిస్తే పేర్లు వెల్లడించడానికి సమస్య ఏంటి?. చందాదారుల డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలని చట్టంలో ఉంది. ఈ చట్టం తనకు వర్తించదని రామోజీరావు అంటున్నారు. డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధం అన్నందుకు నాపై రూ.50 లక్షలకు దావా వేశారు. తప్పు చేసినా అది తప్పుకాదని వాదిస్తారు. ఇదే కొనసాగితే మాఫియా తయారవుతుంది. చంద్రబాబు చేసిన నేరాలు ఈనాడుకు కనపడవా?. ఏపీ విభజన చట్ట విరుద్ధమని చంద్రబాబుకు చెప్పినా వినలేదు. తెలంగాణలో కేసీఆర్ను పొగుడ్తూ ఈనాడులో వార్తలు రాస్తారు’ అని స్పష్టం చేశారు. -
ఆడిటర్ను నియమించే అధికారం ఉంది.. టీఎస్ హైకోర్టులో ఏపీ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: ‘చిట్ఫండ్స్కు సంబంధించిన అవకతవకలపై ప్రాథమిక ఆధారాలున్నప్పుడు నిశితంగా పరిశీలించి నిగ్గు తేల్చేందుకు ప్రైవేట్ ఆడిటర్ను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అసలు ఈ పిటిషన్పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదు’ అని తెలంగాణ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించింది. మార్చి 13, 15, 18న ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్–ఐజీ ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేయడంతోపాటు ఆడిటర్ వేములపాటి శ్రీధర్ నియామకాన్ని, తమ సంస్థలో ఆయన ద్వారా ఆడిటింగ్ చేపట్టడాన్ని రద్దు చేయాలంటూ మార్గదర్శి చిట్ఫండ్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్ సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవింద్రెడ్డి, ఆడిటర్ శ్రీధర్ తరఫున సీనియర్ న్యాయవాది పట్టాభి, పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. హైకోర్టుల పరిధిని సుప్రీం స్పష్టంగా చెప్పింది.. ‘తనిఖీలు నిర్వహించిన 37 బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. కేసులు అక్కడే నమోదయ్యాయి. విచారణ అధికారులు కూడా అక్కడివారే. అలాంటప్పుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం సరికాదు. పరిధి కాకున్నా మార్గదర్శి ప్రతిసారి తెలంగాణ హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేస్తోంది. వీటిపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదు. మార్గదర్శి నుంచి స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రిజిస్టర్లను పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగులోకొచ్చాయి. దీంతో వీటిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపేందుకు ఆడిటర్ను నియమించాం. చిట్ఫండ్స్ చట్టం సెక్షన్ 61 సబ్ సెక్షన్ 2 ప్రకారం ప్రైవేట్ ఆడిటర్ను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సబ్ సెక్షన్ 4 ప్రకారం డాక్యుమెంట్లను ఆడిట్ చేసే అధికారం కూడా ఉంది. ఒకటి రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని అంశాల్లో తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఏపీకి హైకోర్టు ఏర్పడ్డాక తెలంగాణ హైకోర్టుకు అక్కడి అంశాలపై పరిధి ఉండదని చట్టం చెబుతోంది. డెట్ రిలీఫ్ ట్రిబ్యునల్(డీఆర్టీ)కి సంబంధించి డీఆర్టీ–2 రాయలసీమ పరిధి వరకే జోక్యం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఇందులో కూడా కలుగచేసుకోరాదని తెలంగాణ హైకోర్టు గతంలో పేర్కొంది. హైకోర్టుల పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా నిర్వచించింది. ద స్టేట్ ఆఫ్ గోవా వర్సెస్ సమ్మిట్ ఆన్లైన్ ట్రేడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు దీనిపై కీలక తీర్పు వెలువరించింది. ఒక హైకోర్టు పరిధిలో మరో హైకోర్టు పరిధి దాటి కలుగజేసుకోరాదని ఆదేశించింది. ‘కాజ్ ఆఫ్ యాక్షన్’ ఏ రాష్ట్రంలో జరిగితే విచారణ కూడా అదే హైకోర్టు పరిధిలో జరగాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు పలు తీర్పులు కూడా ఇచి్చంది. మారుతి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ అండ్ అదర్స్ వర్సెస్ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్–2, హైదరాబాద్ అండ్ అదర్స్కు సంబంధించిన కేసులో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది’ అని గోవింద్రెడ్డి నివేదించారు. 60 దశాబ్దాలైనా తప్పు తప్పే అవుతుంది ‘సేకరించిన నగదును అక్రమ మార్గాల్లో సొంత కంపెనీలకు, షేర్ మార్కెట్లకు, మ్యూచువల్ ఫండ్స్కు మార్గదర్శి మళ్లిస్తోంది. దాదాపు 46 రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించడం సమర్థనీయంకాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిట్ఫండ్ ఎక్కువ.. మరో చిట్ ఫండ్ తక్కువ కాదు.. అన్నీ సమానమే. అన్ని చిట్ఫండ్స్లోనూ తనిఖీలు చేస్తున్నాం. అవకతవకలు ఎక్కడ జరిగినా వదిలే ప్రసక్తే లేదు. దాదాపు 6 దశాబ్దాలుగా చిట్ఫండ్స్ నడుపుతున్నామని పిటిషనర్ చెబుతున్నారు. 60 దశాబ్దాలుగా నడుపుతున్నా.. తప్పు తప్పే అవుతుంది కానీ ఒప్పు కాదన్న విషయం గ్రహించాలి. చిట్ ఫండ్స్ చట్టం 1982 ప్రకారమే ఆడిటింగ్ జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయడం లేదు. లాభ నష్టాలకు సంబంధించి దీన్ని ఏటా ప్రభుత్వానికి తప్పకుండా సమర్పించాలి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ వద్ద ఫైల్ చేస్తున్నామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది చట్టాలను ఉల్లంఘించడమే. పత్రికల్లో ఇచి్చన ప్రకటనలు చట్టబద్ధం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం దురుద్దేశంతో ఇదంతా చేస్తోందని ఆరోపించడం సరికాదు. అక్రమాలు తేలితే అన్ని చిట్ఫండ్స్పై చర్యలు తీసుకుంటాం. వీటిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్ను కొట్టివేయాలి’ అని స్పెషల్ జీపీ గోవింద్రెడ్డి కోరారు. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? మా వాదనలు వినకుండా ఉత్తర్వులివ్వొద్దు.. ‘ఈ కేసులో ప్రభుత్వం నియమించిన ఆడిటర్ కౌంటర్ దాఖలు చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దు. ఆడిటర్ ఎవరికీ అనుకూలం కాదు.. ఎవరికీ వ్యతిరేకం కూడా కాదు. రికార్డుల పరిశీలనకు ప్రభుత్వం నియమించడంతో విధి నిర్వహణలో భాగంగా పరిశీలన చేస్తున్నాం’ అని ఆడిటర్ తరపు న్యాయవాది పట్టాభి పేర్కొన్నారు. ‘ప్రభుత్వం దురుద్దేశంతోనే ఆడిటింగ్ చేపడుతోంది. దీనివల్ల సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆడిటర్ను నియమిస్తూ ఇచి్చన ఆదేశాలను రద్దు చేయాలి’ అని రోహత్గీ అభ్యర్థించారు. -
రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: రామోజీరావు ఓ విషసర్పమని ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడును అడ్డుపెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా అమరావతిలో కొన్న భూముల కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు పత్రిక చంద్రబాబు కరపత్రికగా మారిపోయిందన్నారు. గతంలో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినట్టే ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ జగన్ను కూడా గద్దె దించాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును అధికారంలోకి తేవడమే రామోజీరావు అంతిమ లక్ష్యమన్నారు. మొదట్లో మార్గదర్శి చిట్ఫండ్స్ మంచిగానే నడిచిందని.. అయితే డిపాజిట్లు మళ్లించడం ప్రారంభించినప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల కేసులో సీఐడీ అధికారులు ఏ–1గా ఉన్న రామోజీరావును, ఏ–2గా శైలజా కిరణ్ను విచారిస్తున్న నేపథ్యంలో సంస్థలో లోపాలు, నిధుల మళ్లింపులను మార్గదర్శిలో చాలా కీలకంగా వ్యవహరించిన రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వివరించారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఈగో ఫీలింగ్తో ఈనాడు ప్రారంభమైంది.. ఒకసారి కేఎల్ఎన్ ప్రసాద్తో రామోజీరావు మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగింది. పేపర్ ప్రారంభించడమంటే సులభం కాదన్న మాటలతో రామోజీలో ఈగో ఫీలింగ్ తలెత్తింది. ఎందుకు సులభం కాదో చూద్దామని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఎంటీ రాజుకు చెందిన బిల్డింగ్ చూశాం. 1974 ఆగస్టు 10న ఫౌండర్ ఎండీగా నేను వ్యవహరిస్తూ ఈనాడు ప్రారంభించాం. నంబర్వన్ పేపర్గా వచ్చేంత వరకూ నేను కృషి చేశాను. మార్గదర్శి చిట్ఫండ్స్ మొదలు పెట్టినప్పుడు భానోజీరావు, మాజీ మంత్రి వెంగళరావుతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే భానోజీరావుకు చెందిన స్థలంలో డాల్ఫిన్ హోటల్ పెట్టేందుకు వెంగళరావుతో సిఫారసు చేయించారు. అయితే డాల్ఫిన్ హోటల్లో అనుకున్నంతగా డబ్బులు రాలేదు. రామోజీ దీన్ని ఓర్వలేకపోయారు.. మార్గదర్శి చిట్ఫండ్స్ చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత రామోజీకి బ్రాంచ్లు విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు నన్ను పిలిచి మార్గదర్శి చిట్ఫండ్స్ విస్తరిస్తామని చెప్పారు. విజయవాడలో మొదటి బ్రాంచ్ ఏర్పాటు పనుల్ని రెండు మూడు నెలల్లోనే ప్రారంభించాం. ఆ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సహా 8 బ్రాంచ్లను వెంటనే మొదలుపెట్టాం. క్రమంగా చిట్స్ పెరిగాయి. అప్పట్లో ఆ నగదును ఎటూ మళ్లించకపోవడంతో మార్గదర్శి బాగానే ఉంది. ఇంతలో ఈనాడు క్రమంగా విస్తరించి నంబర్వన్గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్పై దృష్టిసారించాం. ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకొని.. అద్భుతంగా తీర్చిదిద్దాను. ఈనాడు, డాల్ఫిన్.. ఇలా అన్నింటిని లీజుకు తీసుకున్న స్థలాల్లోనే నడిపాం. అందుకే మాకు లీజు మాస్టర్లు అని పేరొచ్చింది. నన్ను చూసే ఆ స్థల యజమానులు లీజులకు ఇచ్చారు. దీన్ని కూడా రామోజీ ఓర్వలేకపోయారు. నేను ఎదిగిపోతానేమోననే భయం రామోజీని వెంటాడింది. అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు.. ఒక స్థాయి వరకూ డిపాజిట్లు తీసుకునేంత వరకూ మార్గదర్శి చిట్ఫండ్స్ బాగానే ఉంది. ఈ డిపాజిట్లను మొదట ఈనాడు, డాల్ఫిన్ విస్తరణకు తరలించాం. ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. లాభాలు రాగానే తిరిగి మళ్లీ మార్గదర్శిలోకి మళ్లించేవాళ్లం. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనలను కఠినతరం చేసింది. ఆ సమయంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి అభిప్రాయాల్ని తీసుకున్నాం. దాని లూప్హోల్ని పసిగట్టిన రామోజీరావు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించడం మళ్లీ మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించడంతో నిధుల మళ్లింపును నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు. ఈనాడు అప్పటికే అగ్రస్థానానికి చేరుకోవడంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై పోరాటం మొదలుపెట్టారు. వైఎస్సార్ చొరవతో కొంతమందికి చెల్లింపు 2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్ని పట్టుకున్నారు. రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు. మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు.. మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు. వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు. అక్రమాలకు వజ్రాయుధంగా ఈనాడు.. అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఈనాడుని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గతంలో అలానే ఉపయోగపడింది. కానీ.. రానురానూ ఈనాడుని స్వార్థానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. తమ అక్రమాలకు పత్రికని వజ్రాయుధంగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఈనాడు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఈనాడు రిపోర్టర్ల ద్వారా అభ్యర్థుల పేర్లుని ఎంపిక చేసి నేనే ఉత్తరాంధ్ర నుంచి 37 పేర్లు పంపించాను. దాన్నే ఎన్టీఆర్ పరిగణనలోకి తీసుకోవడం.. వారంతా విజయం సాధించడంతో నాపై ఆయనకు నమ్మకం కలిగింది. ఆ సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించారు. ఆ పేర్ల జాబితాని రామోజీరావుకు ఎన్టీఆర్ వినిపించడంతో.. రామోజీ నన్ను ఫోన్ చేసి అడిగారు. నాకు తెలీదని చెప్పాను. ఎక్కడ రాజకీయాల్లో ఎదిగిపోతానో అనే భయంతో రాజకీయాల్లోకి వద్దని అడ్డుకున్నారు. రామోజీ భయపడ్డారు.. మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది. గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు. లెక్కలన్నీ పక్కాగా ఉంటే భయమెందుకు? వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? టీడీపీకి కరపత్రంగా ఈనాడు మారిపోయింది ప్రస్తుతం మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న విషయాన్ని రామోజీ గ్రహించారు. వాటిని ప్రజల్లోకి వెళ్లకూడదని భావించారు. అందుకే... టీడీపీ నేతలు, తెలిసినవారితో పత్రికపై దాడి చేస్తున్నారంటూ మాట్లాడిస్తున్నారు. డిపాజిట్లు అంటే ఏమిటో, చిట్స్ అంటే ఏమిటో తెలియనివారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈనాడుపై దాడి, మార్గదర్శిపై దాడి అని మాట్లాడుతున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉంది. కాబట్టి.. వారు దీన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది కరెక్టో, కాదో.. డిపాజిటర్లని విచారించాలి. ప్రతివాదుల్ని పిలవకుండా.. గతంలో కేసు కొట్టించేశారు. ఇప్పుడు మళ్లీ పోరాటం జరుగుతోంది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇప్పుడు మార్గదర్శికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి రామోజీరావే ప్రధాన కారణం. రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది.. ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది. -
మార్గదర్శి కేసు: విచారణకు సహకరించాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సీఐడీ అధికారుల విచారణకు మార్గదర్శి ఉద్యోగులు సహకరించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేంద్ర కార్యాలయ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారించిన న్యాయస్థానం.. తనిఖీలు, విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మీడియాకు అధికారులు వివరాలు వెల్లడించకుండా కూడా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మార్గదర్శి కేంద్ర కార్యాలయ ఉద్యోగులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తనిఖీలు ముగిశాక పిటిషనా? మార్గదర్శి ఉద్యోగులు గురువారం లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోకుండా నిరోధించాలని, తనిఖీలు నిలిపివేసేలా ఏపీ సర్కార్ను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు. అయితే బుధవారం ప్రారంభమైన తనిఖీలు గురువారం ఉదయం 9 గంటలకే ముగిశాయని, అలాంటప్పుడు తనిఖీలు ఆపాలని పిటిషన్ దాఖలు చేయడంలో అర్థం లేదని ఏపీ స్పెషల్ జీపీ గోవింద్రెడ్డి పేర్కొన్నారు. ‘సీఐడీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఏ ఉద్యోగిపైనా చర్యలు తీసుకోలేదు. ఎవరినీ బలవంతపెట్టలేదు.. భయపెట్టలేదు. అరెస్టులు చేయలేదు. చట్టప్రకారమే తనిఖీలు జరిగాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు. పలువురు బ్రాంచ్ మేనేజర్లకు, బ్రాంచ్ ఉద్యోగులకు నోటీసులిచ్చాం. కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు’ అని హైకోర్టుకు నివేదించారు. విచారణలో జోక్యం వద్దన్న ‘సుప్రీం’.. ‘ఏ–1 రామోజీరావు, ఏ–2 శైలజ సహా పలువురు మేనేజర్లు ముందస్తు బెయిల్ పొందారు. వారిని కనీసం కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చట్టబద్ధమైన సంస్థలు కేసును విచారించే సమయంలో పూర్తి వివరాలను పరిశీలించకుండా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశాలిచ్చింది. నిహారికా ఇన్ఫ్రా. వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 438 సీఆర్పీసీ కింద ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వకూడదని పేర్కొంది. పిటిషనర్కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ‘వెకేట్’ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రతివాదులను ఆదేశించడం సమర్థనీయం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ఎలాంటి రిలీఫ్ ఉత్తర్వులు ఇవ్వవద్దు’ అని గోవింద్రెడ్డి అభ్యర్థించారు. -
చందాదారుల డబ్బును అక్రమంగా దారి మళ్లించారు: సిఐడీ ఏడీజీ
-
మార్గదర్శి కేసు.. విచారణపై స్టే ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి విషయంలో ఏపీ సీఐడీ విచారణపై స్టే ఇవ్వలేమని, దర్యాప్తు కొనసా గించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు 30 మంది మేనేజర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఈ మే రకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నిధులను చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాలకు మళ్లిస్తున్నారని పే ర్కొంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుల్లో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ మార్గదర్శి చైర్మ న్ రామోజీరావు (ఏ1), ఎండీ శైలజ (ఏ2) ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. దర్యాప్తులో భాగంగా విచారణకు రావా లని 30 మంది మార్గదర్శి మేనేజర్లకు సీఐడీ తాజా గా నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ రామోజీరావు, శైలజ మంగళవారం ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ను లంచ్ మోషన్గా దాఖలు చేశా రు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సు ప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వా దనలు వినిపిస్తూ.. ఉద్యోగులకు జారీచేసిన నోటీ సులను కొట్టేయాలన్నారు. మార్గదర్శి కేసు దర్యాప్తు ను మరో రాష్ట్రానికి బదిలీచేసి.. స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు.. ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవింద్రెడ్డి వాదనలు వినిపించారు. ‘గత విచారణ సందర్భంగా హైకోర్టు కేవలం రామోజీ, శైలజకు మాత్ర మే ఉపశమనం కలిగించింది. ఇతరులకు ఈ ఇది వ ర్తించదు. దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి పిటి షన ర్లు పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్ర భుత్వానికి సమయం ఇవ్వకుండానే పిటిషనర్లకు అ నుకూలంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఈ కే సు లో ఏపీ అడ్వొకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారు. ఏపీ వాదన విన్న తర్వాతే మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ సీఐడీ నుంచి నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఎవరో, ఎప్పు డు నోటీసులు అందుకున్నారో.. లాంటి వివరాలు ఏమీలేకుండానే పిటిషన్ వేశారు. వివరా లు తెలీకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. మార్గదర్శి నిధులను మ్యూచ్వల్ ఫండ్స్, షేర్స్ల్లోకి మళ్లించడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడింది. కౌంటర్ దాఖలు చేసే వరకైనా మాకు సమయం ఇవ్వాలి’ అని గోవింద్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తును అడ్డుకోవడం లేదుకదా.. ‘మీకు (ఏపీ సర్కార్) అభ్యంతరం ఉంటే రేపే వెకేట్ స్టే పిటిషన్ వేయండి. హౌస్మోషన్ మూవ్ చేయండి.. మా ఆదేశాల సవరణకు పిటిషన్ వేయండి.. విచారణ చేపట్టడానికి మాకెలాంటి అభ్యంతరంలేదు. మేం దర్యాప్తును అడ్డుకోవడంలేదు కదా. మా ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేయడం సరికాదు’.. అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. -
రామోజీరావు, శైలజా కిరణ్ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజాకిరణ్ను హైదరాబాద్లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణలో కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. స్థానిక రెవిన్యూ అధికారులను పిలిచిన సీఐడీ బృందం.. రెవిన్యూ అధికారుల పంచ్ విట్నెస్ తో సీజింగ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో.. సీఐడీ లీగల్ అడ్వైజర్ సమక్షంలో రామోజీ, శైలజ విచారణ జరిగింది. ఇప్పటికే నలుగురు అరెస్ట్ కాగా, దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సీఐడీ. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్ సోదాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమేనని తేల్చిన సీఐడీ.. ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో పాటు చిట్ గ్రూప్లకు చెందిన ఫామ్ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సీఐడీ అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజాకిరణ్లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్లకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. నేడు విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. చదవండి: ‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్ -
‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్, అనుబంధ సంస్థల డేటా మినహా మరే ఇతర సంస్థలకు చెందిన డేటా తాము సీజ్ చేసిన డాక్యుమెంట్లలో లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీజ్ చేసిన డాక్యుమెంట్ల జాబితాపై నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంతకం చేశారని, ఆ కాపీని కోర్టుకు కూడా సమర్పించామని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణను జాప్యం చేసేందుకే పిటిషనర్ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థలో తనిఖీలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రహ్మయ్య అండ్ కో, పెద్ది చంద్రమౌళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ పి.గోవింద్రెడ్డి వాదనలు వినిపించారు. తనిఖీలు ఆపాలని మాత్రమే కోరారు.. ‘మార్గదర్శిపై పలు ఆరోపణలున్నాయి. చిట్స్ ద్వారా వచ్చిన నగదును షేర్మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్కు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ప్రధాన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇది బడా వైట్ కాలర్ నేరం. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మయ్య అండ్ కో కార్యాలయ తనిఖీల్లో మాత్రం పోలీసులు పాల్గొన్నారు. ప్రధాన కేసు విచారణ సందర్భంగా పలు డాక్యుమెంట్లను అధికారులు అడిగారు. మార్గదర్శి చార్టర్డ్ అకౌంటెంట్గా వ్యవహరిస్తున్న బ్రహ్మం అండ్ కో వాటిని ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనిఖీలు ఆపాలని మాత్రమే పిటిషనర్ కోరారు. అవి ఎప్పుడో ముగిశాయి కనుక పిటిషన్ను కొట్టివేయాలి’ అని గోవిందరెడ్డి కోర్టుకు నివేదించారు. ప్రత్యేకంగా విచారణ ఎందుకు? ‘మార్గదర్శి చిట్స్కు సంబంధించి కోర్టు విధుల సమయం ముగిసిన తర్వాత కూడా ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? సామాన్యుడికి ఏదైనా ప్రాణం మీదకు వస్తే కోర్టు ఇలాగే వ్యవహరిస్తుందా..? ఇది ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. లంచ్మోషన్ పిటిషన్లు వేయడం, కోర్టు విధులు ముగిసిన తర్వాత అత్యవసరంగా విచారణ జరిపి ఉత్తర్వులు పొందడం ద్వారా మార్గదర్శికో నీతి – సామాన్యుడికో నీతి అనే అభిప్రాయం నెలకొనే అవకాశం ఉంది’ అని విచారణ సందర్భంగా స్పెషల్ కౌన్సిల్ పి.గోవింద్రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను న్యాయమూర్తి ఏప్రిల్ 13వతేదీకి వాయిదా వేశారు. తనిఖీలు ముగిశాక విచారణా? తనిఖీలు ముగిసిన తర్వాత వాటిని ఆపాలన్న విజ్ఞప్తిపై ఇక విచారణ ఎలా కొనసాగిస్తామని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నళిన్కుమార్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ పిటిషన్లో ఇంటర్ లొక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశామని నళిన్కుమార్ నివేదించారు. -
మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదిలి ప్రధాన ముద్దాయిగా నిరూపణ అయ్యే పరిస్థితి రావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నాడని, అందుకే ‘దళితులపై దమనకాండ’ అంటూ ‘ఈనాడు’లో అడ్డగోలు రాతలు రాస్తున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘దొంగ బాబుకు మద్దతుగా గజదొంగ రామోజీ తన రాతలతో వెర్రి కూతలు కూస్తున్నాడు. ముసుగు దొంగలైన వీరిద్దరికీ ఇబ్బంది వస్తే దళితులు గుర్తొస్తారు. గతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ను పక్కదారి పట్టించేందుకు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటును చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు మార్గదర్శి కేసును మళ్లించేందుకు దళితులపై దమనకాండ అంటూ రామోజీ రాస్తున్నారు. రామోజీకి ఈనాడు పేపర్ పెట్టుకున్న ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా? చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వెలివేతలు జరిగితే ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా? జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసినా ఎందుకు రాయలేదు? అచ్చెన్నాయుడు మహిళను కాలితో తంతే ఏం చేశారు? గరగపర్రులో దళితుల వెలివేత, కారంచేడులో దళితులపై మారణహోమం జరిగినప్పుడు ఎందుకు రాయలేదు? నాడు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన నీ సొంత సామాజికవర్గం గురించి ఇప్పుడు రాయొచ్చు కదా రామోజీ’ అంటూ ప్రశ్నించారు. ‘ఫిల్మ్ సిటీ కోసం దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దళితులను మోసం చేసిన రామోజీ ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయ పట్టం కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. బాబు హయాంలో ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే దానిలో దేనికోసం ఖర్చుచేశారో? అవినీతి ఎంత జరిగిందో రాసే దమ్ము రామోజీకి ఉందా? అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చు చేసింది. డీబీటీ ద్వారా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. ఈ మంచిపై రాయడానికి రామోజీకి చేతులు కదలడంలేదు. బాబు హయాంలో దళితులకు జరిగిన అన్యాయం, సీఎం జగన్ పాలనలో జరుగుతున్న న్యాయంపై చర్చకు మేము సిద్ధం’ అని మంత్రి సవాల్ విసిరారు. తప్పు చేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం రాజకీయాల్లో అవకాశం కల్పిం చిన సీఎం జగన్ను, వైఎస్సార్సీపీని మోసం చేసింది కాబట్టే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భయపడుతోందని మంత్రి అన్నారు. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న ఆమె హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబు స్క్రిప్టు చదువుతోందన్నారు. -
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తున్నట్టే. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ.459.98 కోట్ల సొమ్మును చట్టవిరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, తదితరాల్లోకి మళ్లించినట్లు ఆడిటింగ్లో అధికారులు నిర్ధారించారు. తద్వారా చందాదారుల సొమ్మును తమ వ్యక్తిగత లబ్ధి కోసం రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజ వినియోగించుకున్నట్లు స్పష్టమైంది. తాజాగా ప్రతి చిట్ గ్రూపులో ఖాళీ చిట్లు, కంపెనీ పాడుకునే రెండో నెల చిట్ల లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. మార్గదర్శి మేనేజర్లు సమర్పించిన మినిట్స్ను విశ్లేషించిన ఆడిట్ అధికారులు ఈ మోసాలను గుర్తించారు. ఖాళీ చిట్లకు గానీ, ప్రతి చిట్ గ్రూపులో కంపెనీ పాడుకునే రెండో నెల చిట్కు సంబంధించి గానీ ఎటువంటి సొమ్ము (నెల వారీ చందా) చెల్లించలేదని వెల్లడైంది. ప్రతి చిట్ గ్రూపులో రెండో నెల చిట్ పాటను కంపెనీయే పాడుకునే అవకాశం ఉంది. అందుకోసం అందరి చందాదారుల మాదిరిగానే కంపెనీ కూడా చందా కట్టాలి. కానీ చందా కట్టకుండానే ఆ రెండో నెల చిట్ను పాడుకుని కంపెనీ జమ చేసుకుంటోంది. కంపెనీ తరఫున కట్టా ల్సి న ఎటువంటి చందాలు కట్టకుండానే ప్రతి నెలా ప్రతి గ్రూపు నుంచి 5 శాతం కమీషన్ను తీసుకుంటోంది. ఆధారాలతో సహా వెలుగుచూసిన అక్రమాలు.. గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మార్గదర్శి యూనిట్లలో ఈ మోసాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఐదు చిట్ గ్రూపులను విశ్లేషించగా వాటి ద్వారా రూ.1.18 కోట్లను చిట్ కమీషన్గా, రూ.1.73 కోట్లను రెండో నెల పాడుకున్న చిట్ సొమ్ముగా కంపెనీ జమ చేసుకుంది. కానీ పాడుకున్న రెండో నెల చిట్ చందా.. అలాగే ఆ గ్రూపులో తన పేరు (ఫోర్మెన్) మీద ఉంచుకున్న ఖాళీ చిట్లకు చెల్లించా ల్సి న చందా సొమ్ము రూ.6.98 కోట్లు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 12 చిట్ గ్రూపులను విశ్లేషించినప్పుడు ఫోర్మెన్ కమీషన్ రూ.60.50 లక్షలు, రెండో నెల పాడుకున్న చిట్ మొత్తం రూ.1.05 కోట్లను కంపెనీ ఖాతాలో వేసుకున్నారు. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రెండో నెల చిట్ చందాలు, కంపెనీ పేరు మీద ఉన్న ఖాళీ చిట్ల చందాల మొత్తం రూ.54.85 లక్షలు కట్టలేదని తేలింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 28 చిట్ గ్రూపులను పరిశీలించినప్పుడు వాటికి ఫోర్మెన్ కమీషన్ రూ.3.47 కోట్లు, రెండో నెల పాడుకున్న చిట్ల మొత్తం రూ.2.73 కోట్లను కంపెనీ తీసుకుంది. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రూ.2.88 కోట్ల చందా సొమ్మును కట్టలేదు. భారీగా ఉల్లంఘనలు.. నెల వారీగా చందాదారులతోపాటు కట్టా ల్సి న సొమ్మును కట్టకుండానే కమీషన్ తీసుకోవడం, ప్రతి గ్రూపులోనూ చందా కట్టకుండానే రెండో నెల చిట్ను పాడుకుని ఆ సొమ్మును తీసుకోవడం ద్వారా మార్గదర్శిలో చిట్లు వేసిన వారిని రామోజీరావు, ఆయన కోడలు శైలజ మోసం చేసినట్లు స్పష్టమైంది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును పణంగా పెట్టి భారీగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఖాళీగా ఉన్న చిట్లకు సంబంధించి ఎటువంటి చందా చెల్లించకుండా మిగిలిన చందాదారులను మభ్యపెట్టినట్లు తేలింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సంబంధిత మార్గదర్శి బ్రాంచ్లను ఆదేశించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. -
సొంత సంస్థల్లోకి మళ్లిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ తన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సొంత సంస్థల్లోకి మళ్లిస్తోందని, అవి నష్టాల్లోకి వెళ్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి మరో అగ్రిగోల్డ్, సహారా మాదిరిగా కాకముందే జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందున పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థకు చెందిన పలు బ్రాంచ్లపై నమోదైన కేసులను కొట్టివేయాలని / దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను ఏపీలో కాకుండా మరో రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని, అప్పటివరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ వాదనలు విన్నారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. విచారణ ‘పరిధి’, కేసు మెరిట్ అంశాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. పునర్విభజన చట్టానికి విరుద్ధం ‘మార్గదర్శి అక్రమాలపై 409, 477(ఏ), 420 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ పదేళ్లకు పైగా శిక్ష పడే కేసులే. ఏపీలో నమోదైన కేసులపై ఇక్కడ రిలీఫ్ కోరలేరు. ఒకట్రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని అంశాలపై తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. కేసులు నమోదైన నేరాలన్నీ ఏపీలోనే జరిగాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులూ అక్కడి వారే. అలాంటప్పుడు ఇక్కడ అరెస్టులు చేయవద్దని కోరడం చట్ట విరుద్ధం. ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు కూడా పలు తీర్పులను ఇచ్చింది’ అని ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి నివేదించారు. ‘పరిధి’ అంశం తేలకుండానే మళ్లీ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందన్నారు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి అక్రమంగా మళ్లిస్తున్నారని చెప్పారు. చిట్స్ పేర డబ్బులు సేకరించి ఉషాకిరణ్ లాంటి సంస్థల్లోకి మళ్లిస్తున్నారని తెలిపారు. మరో రాష్ట్రానికి మార్చండి.. ‘మార్గదర్శి కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇక్కడి నుంచే బ్రాంచ్ల పర్యవేక్షణ జరుగుతుంది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడే ఉంటారు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాం. దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా తనిఖీలు చేస్తున్నారు’ అని సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు. -
‘మార్గదర్శి’పై ఈడీ విచారణ చేపట్టాలి
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి చిట్స్కు సంబంధించి గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తనకిచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని.. ఆ వివరాలను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)కు పంపి విచారణ చేపట్టాలని తాను కోరుతున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ చిట్ఫండ్ 14(2) యాక్ట్ ప్రకారం చిట్ఫండ్స్ ద్వారా సేకరించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉన్నా.. మార్గదర్శిలో అలా జరగడంలేదని.. మ్యూచువల్ ఫండ్స్లో పెటు్టబడులు పెట్టారని, ఇతర వ్యాపారాలకూ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనాడు పత్రిక సైతం చిట్ఫండ్స్ డబ్బుతోనే నడుస్తోందన్నారు. ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా? ఇక మార్గదర్శి చిట్ఫండ్స్కు, రామోజీరావుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ తనపై వేసిన రూ.50 లక్షల పరువునష్టం దావాకు సంబంధించిన అఫిడవిట్లో సంతకం చేసిన రాజాజీ.. ఇప్పుడు అదే చిట్ఫండ్స్కు చైర్మన్ రామోజీయేనని తెలంగాణ హైకోర్టులో తాజాగా వేసిన అఫిడవిట్లో పేర్కొన్నారని.. ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా? అని ఉండవల్లి ప్రశ్నించారు. రామోజీరావు తప్పుచేశాడని తాను నిరూపిస్తానని.. ఆధారాలతో సహా చర్చకు వస్తా, చేసిన తప్పు ఒప్పుకునే ధైర్యం రామోజీకి ఉందా? అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న తాను 17 ఏళ్లుగా అడుగుతున్నా ఇప్పటిదాకా స్పందించలేదని ఉండవల్లి ఎద్దేవాచేశారు. నిజానికి.. మార్గదర్శి ఫైనాన్స్ షేర్పై తాను కేసు పెట్టే సమయానికి కంపెనీ రూ.1,360 కోట్ల నష్టాల్లో ఉందని, రామోజీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఇప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు రామోజీది.. బాధ్యులు ఫోర్మెన్లా? మార్గదర్శి చిట్ఫండ్స్లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని.. అధికారులకు సంస్థ ఎలాంటి పత్రాలూ ఇవ్వడంలేదని ఉండవల్లి ఆరోపించారు. చిట్ఫండ్స్లో రామోజీరావు తప్పులు చేస్తే.. వాటికి మార్గదర్శి బ్రాంచుల్లో పనిచేసే ఫోర్మన్లను బాధ్యుల్ని చేసి ఆయన తప్పించుకుంటున్నారన్నారు. తాను తప్పుచేశానని ఏనాడు రామోజీ ఒప్పుకోలేదని, ఎన్ని కేసులు వేసినా తాను ట్రయల్ కోర్టుకు వచ్చిన దాఖలాల్లేవన్నారు. రామోజీ ఏమైనా చట్టానికి అతీతుడా? అని ఉండవల్లి ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్పై ఎవరు ఫిర్యాదు చేశారని కొందరు విలేకరులు సీఐడీ అధికారులను ప్రశ్నిస్తున్నారని.. అలాగే, రామోజీరావును ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం మార్గదర్శి వ్యవహారాన్ని రచ్చచేస్తోందని ఆరోపిస్తున్నారని.. అలా అనుకుంటే తాము తప్పుచేయలేదని రామోజీ ఎందుకు చెప్పడంలేదని ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు. -
రామోజీ రావు మరో విజయ్ మాల్యా ..?
-
వెలుగులోకి ‘చీట్’ ఫండ్స్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది. ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉల్లంఘనలెన్నో! పలు చిట్ కంపెనీలు 1982 చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మార్గదర్శిలోనూ సోదాలు విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు. -
మార్గదర్శి-మణిపూస
జీవన కాలమ్ సరిగ్గా 19 సంవత్సరాల కిం దట దత్తా సోదరులు-అంటే పెద్దాయన శివ శక్తిదత్తా, విజ యేంద్ర ప్రసాద్ దర్శకత్వం వ హించిన చిత్రం ‘అర్థాంగి’లో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రానికి కో డెరైక్టర్ రాజ మౌళి. వారిద్దరి మధ్య ఆయన కాశీవిశ్వేశ్వరరావు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. చివరి రోజుల్లో ఒక రోజంతా మా ఇంట్లో ఉండినా ‘సాయంకాలమైంది’ నవల చదివారు. శివశక్తిదత్తా గొప్ప కవి. విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయిత. ఇది నేపథ్యం. ఇప్పటి ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఒక మణి పూస- ఏ విధంగా చూసినా. హీరోని ధీరోదాత్తుడిగా, సర్వ శక్తిసంపన్నుడిగా చూసి చూసి విసిగిపోయిన ప్రేక్ష కులకి - ఎక్కువ చేతకాని, చాలా విషయాలు తెలియని, అబద్ధం చెప్పకూడదని నేర్చుకున్న ఓ నేలబారు పాత్ర గొప్ప రిలీఫ్. అతను ఆంజనేయభక్తుడు. రామభక్తుడు కావచ్చు కదా! సాయిభక్తుడు కావచ్చు కదా! ముందు సీనుల్లో తాలింఖానాలో కుస్తీలు చూసి మురిసిపోయే (పాల్గొనే కాదు) హీరోని పరిచయం చేశారు. ఓ మూగ పిల్ల కనబడింది. విచిత్రంగా అతనికి ముడిపడింది. వదిలించుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. ఆమెను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. ఎలాగో తెలియని అమాయకుడు. కానీ రాజీలేని నిజాయితీపరుడు. ఆ పిల్ల తల్లిదండ్రులు పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది. పాకి స్తాన్ ఎలా వెళ్లాలో తెలీదు. డబ్బు పుచ్చుకున్న ఏజెంటు ఆ పిల్లని వ్యభిచార గృహానికి అమ్మి చేతులు కడుక్కో వాలనుకున్నాడు. ఒక్కసారి- ఒకే ఒక్కసారి (కనీసం మొదటిభాగంలో) హీరో చెయ్యి చేసుకున్నాడు. తాలిం ఖానా అనుభవాన్ని, ఆంజనేయభక్తుడిని ఇక్కడ వాడా రు రచయిత. తన శక్తి చూపడానికి కాదు. కేవలం తన కోపాన్ని ప్రదర్శించడానికి. హీరో మాటలు రాని పసి పిల్లని పక్క దేశానికి తీసుకువెళ్లడానికి ప్రేక్షకులంతా ఒకటై నిలిస్తే అతని అశక్తతలోంచి క్షణక్షణం బయటపడు తున్న కొద్దీ ఆనందంతో తన్మయులయ్యారు. ఒక గొప్ప ఆదర్శం అసమర్థతని జయించడం ప్రేక్షకులకి ఆకర్షణ, ఈ చిత్రం విజయ రహస్యం. క్లైమాక్స్లో హీరో గారు ధీరోదాత్తులై దుర్మార్గుల్ని చావగొట్టడం ఫార్ములా. కాని ఇక్కడ పోలీసుల చేతుల్లో హీరో చిత్తుగా దెబ్బలు తిన్నా డు. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తృప్తి అత నిది. అంటే ప్రేక్షకులది. పాత్రీకరణా, నటుడూ ఏకమై లక్ష్యాన్ని సాధించిన పాత్ర. మూగపిల్ల నిస్సహాయత, అతి పవిత్రంగా, వికసించిన పువ్వులాగా మెరిసిన హర్షా లీ మల్హోత్రా హీరోకి దీటుగా కథని అలంకరించింది. పొరుగు దేశానికి అన్ని రంగాలలోను చుక్కెదురవు తున్నా- పాక్ నాయకులు పదవిలోకి వచ్చాక ప్రజల్ని మెప్పించే నినాదం, పోరాటం - కశ్మీర్. ఇది అక్కడి రాజ కీయ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చే మలామా. కాని ప్రజల స్థాయిలో, వారి మనస్సులలో, వారి జీవన విధానంలో - మానవీయ విలువల పతనం లేదని నిరూ పించిన చక్కటి కథ ఇది. ఈ కారణానికే ఈ కథ రెండు దేశాలనూ ఆకర్షించింది. దౌత్యవర్గాలు, రాజకీయ నాయకులు, తుపాకులు, హింసాకాండ, మతం సాధించలేని అతి పెద్ద సమస్యని కేవలం మానవత్వం జయించగలదని, జయించి చూపించిన చిత్రం ‘భజరంగీ భాయిజాన్’. హ్యాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్. స్క్రీన్ప్లే, దర్శకుడు కబీర్ ఖాన్. మతాలకు అతీతంగా మానవత్వ విలువలకు అద్దం పట్టే ఈ చిత్రంలో మరిచిపోవాలన్నా మరిచి పోలేని గొప్ప ఆకర్షణ - హనుమంతుడి భక్తుడిగా చేసిన హీరో ముస్లిం. ముస్లిం అమ్మాయిగా చేసిన నటి- హిందువు. ఖీజిజీట జీట ్చ జట్ఛ్చ్ట ట్ట్చ్ట్ఛఝ్ఛ్ట. ఈ కథకి కొసమెరుపు- ఇలాంటి పరిస్థితులలోనే 15 సంవత్సరాల కిందట పాకిస్తాన్లో ఉండి పోయిన మరో మూగ, చెవిటి పిల్ల కథ బయటికి రావడం. ఆ అమ్మాయి రెండు దశాబ్దాలుగా మాతృదేశాన్ని గురించి కలలు కంటూ మరో భజరంగీ కోసం ఎదురుచూడడం. అయితే ఈసారి భజరంగీ అక్కరలేదు. ప్రభుత్వమే మేలుకుంది. విదేశాంగ మంత్రి స్పందించారు. మంచి సినీమా మార్గదర్శి, సూచన. ఇందులో వినో దం ఉంది. హాస్యం ఉంది. తగు మాత్రపు రొమాన్స్ ఉం ది. ఫైట్స్ ఉన్నాయి. గేలరీస్ని లొంగదీసుకోవాలన్న ప్రలోభం లేదు. అన్నిటికన్నా ముఖ్యం- ఒక గొప్ప దృశ్య ప్రక్రియ చేయవలసిన, చేయగలిగిన గొప్ప సామా జిక స్పృహ ఉంది. సినీమా సుమతీ శతకం కానక్కర లేదు. కేవలం ఊసుపోయే వినోదమూ కానక్కరలేదు. ప్రయోజనం ప్రక్రియకి రేంజ్నిస్తుంది. పెద్దరికాన్ని ఇ స్తుంది. బాధ్యతని ఇస్తుంది. జాతికి ఉపకారం చేస్తుంది. ఇంత గొప్ప ప్రయోజనాన్ని సినీమా మరిచిపోయి ఎన్నాళ్లయింది!! - గొల్లపూడి మారుతీరావు