-
‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు మరికాస్త మసాల దట్టించి తమకు నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు. ఇలాంటి వార్తల బారిన పడ్డారు హీరోయిన్ పాయల్ ఘోష్. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో పాయల్కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు పుల్స్టాప్ పెట్టారు పాయల్. ‘గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. ఇది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేపించారు. వైద్య పరీక్షల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే ముగుస్తుందని బలంగా విశ్వసిస్తున్నా. అతిత్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నా నమ్మకం’అంటూ పాయల్ పేర్కొన్నారు. పాయల్ తెలుగులో మంచు మనోజ్తో ‘ప్రయాణం’ , ఎన్టీఆర్తో కలిసి ‘ఊసరవెల్లి’ సినిమాలో చిత్రగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి: సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్ గ్రీన్సిగ్నల్ మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మలేరియా విజృంభణ.. కవలలు మృతి
కొయ్యూరు(పాడేరు): కొయ్యూరు మండలంలో మలేరియా ప్రబలుతోంది. యూ.చీడిపాలెం ఆరోగ్య కేంద్రం పరిధిలో పలువురు మలేరియా బారిన పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాలసముద్రం గ్రామానికి చెందిన కొర్రా భీమరాజు(29)కు బుధవారం తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. అతనికి రక్తపరీక్షలు నిర్వహించగా మలేరియాగా తేలింది. దీంతో పాలసముద్రం నుంచి పలకజీడి వరకు భీమరాజును డోలీలో తరలించారు. అక్కడి నుంచి వై.రామవరం కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా గంగవరం సమీపంలో మృతిచెందాడు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న నీలవరం,గంగవరం,మర్రిపాకల్లో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల కిందట అదే పంచాయతీలో వేమనపాలానికి చెందిన రమేష్ అనే వ్యక్తి జ్వరంతో 25న మృతి చెందాడు. అతనికి మలేరియా లేదని వైద్యులు చెప్పినా అతని కుటుంబంలో ముగ్గురికి మలేరియా పాజిటివ్ వచ్చింది. అతను మరణించిన నాడే భార్య ప్రసవించింది.పుట్టిన మగబిడ్డకు శరీరమంతా కురుపులు రావడంతో వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. జిల్లా మలేరియా అధికారి మణి గ్రామాన్ని సందర్శించారు. గురువారం జిల్లా మలేరియా అధికారి మణి, పాడేరు అదనపు వైద్య ఆరోగ్య అధికారి లీలాప్రసాద్ పాలసముద్రం గ్రామాన్ని సందర్శించారు. కవలలు మృతి ఈనెల 27న గెమ్మెలి లక్ష్మికి వేమనపాలెంలో కవలలు జన్మించారు.కొద్ది సేపటికే మరణించారని వైఎస్సార్ సీపీ నాయకుడు దడల రమేష్ తెలిపారు.ఏడో నెలలో ప్రసవం అయినట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారని చెప్పారు. ఆమెను కూడా వైద్య సిబ్బంది వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఐటీడీఏ పీవో బాలాజీ తెలిపారు. జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంహెచ్వోలు ఆ గ్రామాలను సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకుంటారన్నారని చెప్పారు. బోయపాడులో ఇద్దరి మృతి నక్కపల్లి(పాయకరావుపేట): మండలంలో రాజయ్యపేట శివారు బోయపాడులో జ్వరాలు విజృంభించాయి. ఇద్దరు మృత్యువాత పడగా సుమారు 20 మంది అస్వస్థతకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. టీబీతో బాధపడుతున్న గ్రామానికి చెందిన బోంది లక్ష్మణ(65) తీవ్రమైన జ్వరంతో రెండు రోజుల క్రితం మరణించాడు. పిక్కి తలుపులు(32) అనే వ్యక్తి కూడా తీవ్రమైన జ్వరంతో గురువారం విశాఖలో మరణించాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గొడిచర్ల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిషోర్ బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో సాధారణ జ్వరాలేనని నిర్థారణ అయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 8 మందికి జ్వరం ఉండడంతో వారి నుంచి రక్తపూతలు సేకరించినట్టు చెప్పారు. -
కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ప్రపంచానికి పరిచయమైందంటున్నారు ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్రహీత లక్ మాంటెగ్నియర్. అక్కడి ల్యాబ్లో ఎయిడ్స్కు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ఈ వైరస్ ఉద్భవించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనాలో హెచ్ఐవీ జన్యుక్రమం ఉందని పేర్కొన్నారు. అంతేకాక మలేరియాలో ఉండే అతి సూక్ష్మజీవులు దీనిలోనూ ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇలాంటి వైరస్ల విషయంలో వూహాన్ ల్యాబ్కు ఎంతో నైపుణ్యముందని, 2000 సంవత్సరం నుంచే అది ప్రయోగాలు చేస్తుందన్నారు. ఇదిలావుంటే చైనాలోని అమెరికా ఎంబసీ అధికారులు వూహాన్ ల్యాబ్పై రెండేళ్ల కిందటే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రాణాంతక వైరస్లతో పాటు అంటు వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారని వారు గతంలోనే ప్రస్తావించినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. (అమెరికా విచారణకు చైనా నో!) ఇప్పటికే అందరి దృష్టి వూహాన్ ల్యాబ్పై పడింది. అది కావాలనే ఈ జీవాయుధాన్ని సృష్టించిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర ప్రముఖులు అది చైనాల పనే అని నిర్ధారణకు వస్తుండగా, అందుకుతగ్గ ఆధారాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాగా వైరాలజీ డాక్టర్ లక్ మాంటెగ్నియర్ హెచ్ఐవీలో పరిశోధనకుగానూ ఫ్రాంకోఇయన్ బర్రీ- సినోస్సీతో కలిసి 2008లో నోబెల్ అవార్డును అందుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి హెచ్ఐవీ వైరస్ కారణమవుతుందన్న విషయాన్ని వీరి నేతృత్వంలోని బృందం గుర్తించింది. (మీడియా మౌనం.. అసలు కిమ్కు ఏమైంది?) -
మలేరియా కారక సూక్ష్మజీవిపై సీసీఎంబీ పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్సింగ్ సిజ్వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్–రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది. పరిశోధన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమయ్యాయి. -
తగ్గని జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ.. డెంగీ, చికున్గున్యా వానాకాలం సీజన్లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చర్యలు కరువు.. దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్గున్యా, ఇతర వైరల్ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు. సాయంత్రం ఓపీకి బ్రేక్.. ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ దోమలు విజృంభించే చాన్స్ ఇప్పటికీ ఆస్పత్రులకు డెంగీ జ్వరాలతో జనం వస్తూనే ఉన్నారు. సీజన్ అయిపోయినా వర్షాల వల్ల ఈ పరిస్థితి నెల కొంది. వర్షాలు తగ్గాక మళ్లీ దోమలు విజృం భించే అవకాశముంది. కాబట్టి ఇళ్లలో పరిశు భ్రత పాటించాలి. –డాక్టర్ కృష్ణ భాస్కర్, పిజీషియన్, సిటీ న్యూరో, హైదరాబాద్ డెంగీలో ఖమ్మం రెండో స్థానం.. దగ్గు, జలుబు, తలనొప్పి తో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. డెంగీ కేసుల్లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంటే దోమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
డెంగీ డేంజర్..వణికిస్తున్నఫీవర్
విశ్వనగరం విషజ్వరాలతో వణికిపోతోంది. డెంగీ, మలేరియా, చికున్గున్యా, డిప్తీరియా,డయేరియాలు పంజా విసురుతుండడంతో విలవిల్లాడుతోంది. ఓవైపు డెంగీ దోమమృత్యుఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది డెంగీతో మరణించగా... వారిలో 40 మందికి పైగా గ్రేటర్ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో విషజ్వరాలు కేసులు నమోదవుతుండడంపై భయాందోళన వ్యక్తమవుతోంది.ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ రెట్టింపు అయింది. ఉస్మానియాలో ఓపీ 2వేల నుంచి 3వేలకు చేరుకుంది. గాంధీలో 3వేల నుంచి 5వేలకు.. ఫీవర్లో 1,200 నుంచి 2,500.. నిలోఫర్లో 1,500 నుంచి 2,500 చేరింది. సెలవు రోజుల్లో సైతం ఆయా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు దోమల నివారణ మందు స్ప్రే చేయాలని.. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజుకారోజు తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎందుకీ పరిస్థితి? 2018 నవంబర్ మొదలు ఈ ఆగస్టు వరకు ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికీ ఎన్నికల విధులు అప్పగించారు. దీంతో ఆ సమయంలో బస్తీల్లో ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు కాలనీల్లో కొత్త నిర్మాణాలు వెలిశాయి. సెల్లార్లు తవ్వడం, నిర్మాణాల క్యూరింగ్ కోసం నీటిని వాడడం, గదుల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ట్యాంకులపై మూతలు లేకపోవడం వల్ల అవన్నీ డెంగీ దోమలకు నిలయంగా మారాయి. కనీసం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫాగింగ్ చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దోమలువిస్తరించడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డెంగీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం మదీనాగూడకు చెందిన హేమంత్(10), అల్లాపూర్ డివిజన్ గాయిత్రినగర్కు చెందిన అభిషేక్(21), సికింద్రాబాద్కు చెందిన టిజాన్ ఎలిసా విన్స్టన్(13), నార్సింగి మున్సిపాలిటీలో పర్హీన్(15) మృతి చెందగా... బుధవారం లాలాపేటకు చెందిన రిత్విక(5) మరణించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా నగరంలోని ఏ ఆస్పత్రిని పరిశీలించినా 40–50 మంది డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండడంతో ఇప్పటికే సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్యశాఖ తాజాగా వైద్య సిబ్బంది సెలవులపై ఆంక్షలు విధించింది. పరిస్థితి కుదుటపడే వరకు అనివార్యమైతే తప్ప.. సెలవులు మంజూరు చేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు డెంగీ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జీహెచ్ఎంసీ సహా వైద్యారోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్చార్సీలో బుధవారం ఫిర్యాదు చేసింది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకుపైగా డెంగీ పాజిటీవ్ కేసులు నమోదు కాగా... వారిలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. లెక్కల్లో తకరారు... డెంగీ బాధితుల లెక్కలపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు 2,113 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,889 మంది నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంలో పరీక్షించగా వీరిలో 451 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. ఒక్క ఆగస్టులోనే 232 కేసులు నమోదయ్యాయి. ఇక ఉస్మానియాలో మే నుంచి ఇప్పటి వరకు 911 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 208 మందికి పాజిటివ్ వచ్చింది. నిలోఫర్ ఆస్పత్రిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 799 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీటిలో ఒక్క ఆగస్టులోనే 499 కేసులు నమోదు కావడం విశేషం.ఫీవర్ ఆస్పత్రిలో జులై, ఆగస్టులో 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 391 మంది హైదరాబాద్ జిల్లా వాసులు కాగా, మిగిలిన వారంతా రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన వారే. ఇక యశోద, కేర్, అపోలో, కిమ్స్, సన్షైన్, సిటిజన్, కామినేని, గ్లోబల్, తదితర ప్రైవేటు ఆస్పత్రులు డెంగీబాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. డెంగీ బాధితుడి నుంచి రెండో శాంపిల్ సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా దీన్ని పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులనే డెంగీ కేసులుగా భావిస్తోంది. డెంగీకి కారణమిదే... ఈడిన్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాజన్న,చిన్నపిల్లల వైద్యుడు అవసరం లేకపోయినా? ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య క్రమేణా తగ్గుతుంటుంది. 10వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే తిరిగి వాటిని భర్తీ చేయాలి. 20వేల లోపు ఉన్నప్పుడు... రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ఎక్కించాలి. 20వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అయినా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో జరిగే అనర్థాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతో పాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ) ఎంత ఉందనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంంగా ఉండాల్సిన దానికంటే 20శాతం, అంతకంటే ఎక్కువైతే అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రులు అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్ ఎక్కించి, రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పండ్లకు డిమాండ్.. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతుంటాయి. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కీవీ పండ్లు ప్లేట్లెట్స్ కౌంట్స్ను పెంచేందుకు దోహదపడుతుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో సాధారణ జ్వరపీడితులే కాకుండా డెంగీ బాధితులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఈ పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ఒక కీవీ పండు రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో బొప్పాయి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి పైగా పలుకుతోంది. దోమల భారీ నుంచి రక్షించుకునేందుకు తెరలను కొనుగోలు చేస్తుండడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.200లోపు దొరికిన దోమ తెర... ప్రస్తుతం రూ.1500కి పైగా ధర పలుకుతోంది. ఇదీ పరిస్థితి ♦ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో ఓపీ సంఖ్య 1,000 వరకు ఉండగా... నాలుగైదు రోజుల నుంచి దాదాపు 2,000 దాటుతోందని సూపరిటెండెంట్ గంగాధర్ తెలిపారు. ♦ ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో సాధారణ రోజుల్లో 100 వరకు ఉండే ఓపీ.. ప్రస్తుతం 200 దాటుతోందని డా.పల్లవి తెలిపారు. ఇక్కడ కనీసం ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ♦ మల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ 100 నుంచి 200లకు పెరిగింది. ♦ ఏఎస్రావునగర్ జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రెండింతలైందని డాక్టర్ తేజస్వీని తెలిపారు. ♦ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో డెంగీతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మదీనాగూడకు చెందిన హేమంత్ (10), పాపిరెడ్డి కాలనీకి చెందిన అవినాష్ (13), మాదాపూర్ చందానాయక్ తండాకు చెందిన చందర్నాయక్ (38) డెంగీతో మృతి చెందారు. ♦ మలక్పేట్ ఏరియా ఆస్పత్రి, సరూర్నగర్, మీర్పేట్, మలక్పేట్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ♦ సికింద్రాబాద్లోని ఐదు డివిజన్లలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. లాలాపేట యాదవ బస్తీకి చెందిన చిన్నారి రుత్విక బుధవారం డెంగీతో మృతి చెందడం గమనార్హం. ♦ అంబర్పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 50 నుంచి 250కి చేరింది. ♦ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. సాధారణంగా రోజుకు సగటున 700–800 మంది అవుట్పేషెంట్స్ వస్తుండగా... ఇటీవల ఈ సంఖ్య 1300లకు చేరింది. -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి. -
డెంగీ హైరిస్క్ జిల్లాలు 14
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 14 డెంగీ హైరిస్క్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే మలేరియా హైరిస్క్ జిల్లాలను ఐదింటిని నిర్ధారించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్నగర్, హైదరాబాద్, వరంగల్ రూరల్, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా డెంగీ హైరిస్క్గా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక మలేరియా హైరిస్క్ జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్ ఉన్నాయి. ఏడాదికేడాది డెంగీ కేసులు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 2012లో 962 డెంగీ కేసులు నమోదు కాగా, 2018లో ఏకంగా 6,362 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాది మే నెల వరకు సీజన్ లేని సమయంలోనే 756 కేసులు నమోదయ్యాయి. అయితే మలేరియా కేసులు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు నివేదిక తెలిపింది. 2015లో 11,880 మలేరియా కేసులు నమోదు కాగా, గతేడాది కేవలం 1,792 కేసులే నమోదయ్యాయి. చికున్గున్యా కేసులు 2012లో 94 కేసులు నమోదు కాగా, గతేడాది ఏకంగా 1,063 నమోదు కావడం గమనార్హం. రేపు కలెక్టర్లతో మంత్రి సమీక్ష... వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రబలే సీజనల్ వ్యాధులపై కేంద్రీకరించింది. ప్రధానంగా పది ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీతో పాటు సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం సీజనల్ వ్యాధులు తీవ్రంగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ముం దస్తుగా చేపట్టాల్సిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగా దోమల నివారణకు పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్యశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయ పరిచి చర్యలు తీసుకోనున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే వేక్టర్ బోర్న్ వ్యాధులైన చికెన్ గున్యా, యెల్లో ఫీవర్, డెంగీ, జికా, ఫైలేరియా లాంటి కేసుల వివరాలను కూడా ఈసారి సేకరించి, అవి ప్రబలకుండా అధికార యంత్రాంగంనివారణ చర్యలు తీసుకుంటారు. -
మలేరియా దోమలు ఇక మటాష్!
సిడ్నీ: మలేరియాను అదుపు చేయడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఓ రకం సాలీడులో ఉండే విషంలోని జన్యువులతో అభివృద్ధి చేసిన ఫంగస్ను మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఎనాఫిలిస్ దోమల సంహారంలో వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. మలేరియాను వ్యాప్తిచేసే ఆడ ఎనాఫిలిస్ దోమలకు హాని కలిగించే ‘మెటరీజియమ్ పింగ్షీన్స్’ అనే ఫంగస్ను శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కృత్రిమంగా ఓ ప్రాంతాన్ని సృష్టించి, అక్కడ ఈ ఫంగస్ పెరిగే ఏర్పాట్లు చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన ఈ ఫంగస్ చాలావేగంగా దోమల ప్రాణాలను హరించింది. కేవలం 45 రోజుల్లోనే అక్కడి 99 శాతం దోమలను నిర్మూలించగలిగారు. -
జ్వరమా... మలేరియా కావచ్చు!
జ్వరమా... అయితే మలేరియా కావచ్చు అనేది వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కొన్నేళ్లుగా ప్రజల్లోకి బాగా వెళ్లిన మాట. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు మలేరియాగా నిర్ధారించినా నివేదికలకు మాత్రం ఎక్కడం లేదు. కేసులు అధికమైతే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సిబ్బంది వ్యాధిగ్రస్తుల వివరాలను దాచి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎదురు చూసేకన్నావ్యాధికారక దోమలను నివారించుకోవడంతో మనకు మనమే మలేరియాను పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్) :జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి, 542 సబ్సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో కృష్ణానది, తుంగభద్ర, హంద్రీ, కుందు నదితో పాటు కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువ, తెలుగుగంగ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఎల్ఎల్సీ కాలువ తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, వెలుగోడు రిజర్వాయర్లు ఉండటం వల్ల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. దీంతో పాటు 18 శాతం నల్లమల అటవీప్రాంతాల్లోని 42 చెంచుగూడెల్లో మలేరియా రావడానికి అధికంగా ఆస్కారం ఉందని నిర్ధారించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, పాణ్యం, బండి ఆత్మకూరు, గడివేముల, శ్రీశైలం మండలాల్లోని 50 గ్రామాలను సమస్యత్మక (మలేరియా వ్యాప్తికి అవకాశం ఎక్కువ) గ్రామాలుగా గుర్తించారు. కేసులు తగ్గించే పనిలో వైద్యఆరోగ్య శాఖ.. ఒకప్పుడు ప్రతి ఒక్క జ్వరపీడితుడిని రక్తపరీక్ష చేసి మలేరియా నిర్ధారించిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు కేసులు తగ్గించేపనిలో పడింది. ఐదేళ్లుగా జ్వరపీడితుల సంఖ్య వాస్తవంగా తగ్గకపోయినా ఆ శాఖ అధికారులు తగ్గుతున్నట్లు నివేదికలు తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5లక్షల 20వేలకు తగ్గకుండా రక్తనమూనాలకు పరీక్షలు(మలేరియా) చేస్తున్నారు. అయితే ఇందులో అన్ని కేసుల్లోనూ దాదాపుగా మలేరియా లేనట్లు వస్తోంది. లెక్కలు మార్చి చూపడం తప్ప వాస్తవాన్ని దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలేరియా తగ్గుముఖం పడుతోంది గత నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతోందని డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్కే ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా నివారణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జూన్ ఒకటి నుంచి డీడీటీ 50 శాతం పిచికారీ చేయిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 మలేరియా సబ్యూనిట్స్లో అవసరమైన కీటక సంహారక మందులను, పనిముట్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేసిన దోమతెరలను ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా హెల్త్ సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగర పాలక సంస్థల సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఎ. నూకరాజు, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. వ్యాధిలక్షణాలు 1. చలి, వణుకుతో కూడిన జ్వరం. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుంది. 2. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల మన ప్రాంతంలో మలేరియా వస్తోంది. 3. ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధించడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో ప్రమాదస్థాయికి చేరుతుంది. 4. మన్య(గిరిజన) ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది. ఇలా వ్యాపిస్తుంది ♦ ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియా వ్యాప్తి చెందుతుంది. ♦ దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ♦ చిన్నపిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైనది. చికిత్స: మలేరియా వ్యాధిగ్రస్తులు క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుతో పూర్తి మోతాదులో రాడికల్ చికిత్స చేయించాలి. పీవీ మలేరియాకు 14 రోజులు, పీఎఫ్ మలేరియాకు మూడు రోజుల చికిత్స చేయాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెడుతుంది. మలేరియా రాకుండా జాగ్రత్తలు 1. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 2. ఇళ్లలో గోడలపై దోమల మందు చల్లించుకోవాలి. 3. కట్టడాలకు సంబంధించిన నీటి నిల్వలు లేకుండా చూడాలి. 4. అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి, లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి. 5. దోమతెరలను వాడాలి. ఆరు బయట నిద్రించరాదు. 6. ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు 7. పూర్తి మోతాదులో మాత్రలు మింగాలి. -
చిన్నజీవని వదిలేస్తే.. చిదిమేస్తుంది..!
మలేరియా.. ఒకప్పుడు సీజనల్ వ్యాధిగా ప్రచారంలో ఉన్న తీవ్ర జరం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్రామాలు సహా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోపం, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి సమస్యల కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు అర్బన్ : చూసేందుకు అది చిన్న జీవే. కానీ కుడితే కలిగే నష్టం అపారం. మనిషిని నిలువునా కుంగదీస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకే తెస్తుంది. అదే మలేరియాకారక దోమ. జిల్లాలో ఈ సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తంగా లేకుంటే చేజేతులా ప్రాణాలపైకి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం కోట్లలో నిధులు ఖర్చు చేస్తోంది. వైద్యశాఖ దీన్ని సరిగా ఉపయోగించుకోకపోవడంతో నిధుల వ్యయం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఫాగింగ్, దోమల నివారణకు చేపట్టే చర్యల్లో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ప్రైవేటు ఆసుపత్రి, నర్సింగ్ హోమ్లలో రోగుల గురించి రికార్డులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదు. దీంతో మలేరియా ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా కారక దోమలను అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి తరువాత.. ఎండాకాలం పూర్తవుతుండగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, చిన్నపాటి తుంపర్ల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతుంటాయి. మలేరియా వ్యాప్తికి ఈ సీజన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించే ఈ వ్యాధి ఇటీవల పట్టణాలు, నగరాలను సైతం విజృభిస్తోంది. గత ఏడాది జిల్లాలో 44 కేసులు నమోదయినట్లు అధికారిక లెక్కల్లో ఉంటే ఇది 200కు దాటిందనేది వాస్తవం. అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తూతూమంత్రంగా ఉండడం తదితర కారణాలు వ్యాధికి దోహదం చేస్తున్నాయి. అయితే ప్రైవే టు ఆసుపత్రులకు వస్తున్న కేసులు గురించి బయటకు తెలియడం లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులకే లెక్కల కింద చూపుతున్నారు. జిల్లాలో ఇవే అధికం.. మలేరియాకు కారణమయ్యే ఫ్లాస్మోడియం పరాన్నాజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చాలా వేగంగా ఎగురుతూ రాత్రి పూట కుడుతాయి. అవి కుట్టినప్పుడు నొప్పి, శరీరంలో దద్దుర్లు కొందరికి రావచ్చు. శరీరంలోకి ప్రవేశించిన ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. మలేరియాలో ఫ్లాస్మోడియం వైవాక్స్ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీపీ) అనేవి రెండు దశాలు. మొదటి దశలో కన్నా జిల్లాలో రెండో దశ వల్ల ఎక్కువ మంది మలేరియా బారిన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా.. ♦ మలేరియా దోమ ఆరోగ్యవంతుల్ని కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ తొలుత జ్వరం, ఒళ్లుæ నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.. అంత ప్రమాదకరం కాదు. మందులు వేస్తే తగ్గిపోతుంది. రెండో రకమైన ఫ్లాస్మోడియం పాల్సీఫారం మాత్రం ప్రమాదకరమే. ♦ రెండో దశను త్వరగా గుర్తించి చికిత్స అందజేయకపోతే కాలేయం, కిడ్నీలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ♦ రోజు విడిచి రోజు జ్వరం తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. చలిజ్వరం, చమటలు పట్టడం, కొన్నిసార్లు వాంతులవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సప్రదించి రక్త పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే.. ముందే జాగ్రత్త పడడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం ప్రధానం. ♦ బయటకు వెళ్లేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ♦ ఇంటి చుట్టు పక్కల దోమలు పెరగకుండా చూసుకోవాలి. కూలర్లు, కుండీల్లో వారానికోసారి నీరు మారుస్తుండాలి. నీటి పంపులు, ట్యాంకులపైన మూతలు తప్పనిసరి. టైర్లు, కప్పులు, కొబ్బరి చిప్పలు, పాత్రలు వంటివి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలి. ♦ సెప్టిక్ట్యాంకు నుంచి గాలివెళ్లే పైపులకు మెస్ను ఏర్పాటు చేసుకోవాలి. ♦ నిద్రించేటప్పుడు దోమ తెరలు వాడాలి. కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా తెరలు అమర్చుకోవాలి. ♦ దోమలు బాగా ఉన్న ప్రాంతంలో జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మలేరియా అవునో, కాదో తేల్చుకోవాలి. ఒకవేళ అది కాకపోతే డెంగీ అనే అనుమానుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రజలు బాధ్యతగా ఉండాలి.. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ప్రజల బాధ్యతే. పంచాయతీలు, మునిసిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను మనమే తీసేయాలి. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండే కొబ్బరి చిప్పలు, టైర్లను తీసేయండి. ప్రతీ శుక్రవారం కావాల్సిన నీళ్లను ఉంచుకుని డ్రై డేను పాటించాలి. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. – డాక్టర్ ఇ. ఉస్సేనమ్మ,జిల్లా మలేరియా అధికారి -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది. సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు. సమన్వయలోపం.. బాధితులకు శాపం వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి. కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’ దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఘోరం ♦ శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్లోనే 51మంది బలయ్యారు. ♦ విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ♦ విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా ♦ తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు. ♦ కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు. ♦ గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి. ♦ ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు. ♦ శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 88మంది మరణించారు. రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే ♦ వైఎస్సార్ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు. ♦ అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు. ♦ కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి. ♦ తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు. గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు.. ఆస్పత్రి మృతుల సంఖ్య జీజీహెచ్, గుంటూరు 293 జీజీహెచ్, కాకినాడ 277 కేజీహెచ్, విశాఖపట్నం 224 జీజీహెచ్, విజయవాడ 210 జీజీహెచ్, కర్నూలు 147 రుయా, తిరుపతి 99 జీజీహెచ్, అనంతపురం 98 జీజీహెచ్, నెల్లూరు 88 డీహెచ్, రాజమండ్రి 83 రిమ్స్, కడప 77 డీహెచ్, ఏలూరు 56 రిమ్స్, ఒంగోలు 56 డీహెచ్, మచిలీపట్నం 53 రిమ్స్, శ్రీకాకుళం 51 డీహెచ్, విజయనగరం 41 -
డెంగీ పంజా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 449 మందిలో డెంగీ లక్షణాలు కన్పించాయి. వీరిలో 322 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడగా అందులో ఐదుగురికి వ్యాధి ఉన్నట్లు ఎలీసా టెస్ట్లో బయటపడింది. ఐదులో ఒకటి గత నెల, మిగిలినవి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు, నన్నూరు, కడుమూరు, ప్రాతకోట, కొత్తబురుజు, క్రిష్ణగిరి, పుచ్చకాయలమడ, నందవరం, శిరువెళ్ల, నంద్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా, కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. కాగా డెంగీ వ్యాధి లక్షణాలతో కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం గ్రామంలో గొల్ల లీలావతి(27), నందికుంట గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారుల లెక్కల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరుఏరియా ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇవి గాక 800 దాకా ప్రైవేటు నర్సింగ్హోమ్లు, క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు ప్రస్తుతం వస్తున్న రోగుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో మలేరియా, డెంగీ కేసులూ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేసులు పక్కనున్న అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నుంచి అధికంగా కర్నూలులోని ఆసుపత్రులకు వచ్చేవి. ఈసారి ఆయా జిల్లాలతో పాటు జిల్లాలోని రోగులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోనూ మలేరియా కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత ఏడాది 91మందికి మలేరియా నిర్ధారణ అయ్యింది. ఈసారి ఇప్పటి వరకు 37 మందిలో గుర్తించారు. ఇందులో ప్రమాదకరమైన పాల్సీఫారమ్ మలేరియా తొమ్మిది మందికి ఉన్నట్లు గుర్తించారు. అధికారులు..ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పేచీ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్కు పంపితే అసలు డెంగీనో, కాదో నిర్ధారణ చేస్తామని చెబుతోంది. ఇక్కడి నివేదిక ఆధారంగా మాత్రమే డెంగీగా ప్రకటించాలని ఆసుపత్రులకు స్పష్టం చేస్తోంది. అయితే.. కేఎంసీలోని ల్యాబ్కు వెళ్లి రిపోర్ట్ రావాలంటే 15 నుంచి 30 రోజులు పడుతుందని, ఈలోగా రోగికి చికిత్స చేయకుండా ఆపాలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు డెంగీ లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వైద్యులు మాత్రం సాధారణ జ్వరానికి సైతం డెంగీ పేరు చెప్పి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. డెంగీ ఎలా సోకుతుందంటే.. ఏడిస్ ఈజిపై్ట అనే దోమకాటు వల్ల డెంగీ సోకుతుంది. ఈ దోమ ఒంటిపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. అందుకే దీనిని పులిదోమ అని కూడా అంటారు. ఇది శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదమైన రెండు గంటల వరకు, సూర్యోదయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఇది తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లకు పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక దాక్కుంటాయి. దోమల నివారణ చర్యలు చేపట్టాం జులై ఒకటి నుంచి 9 మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ల ద్వారా దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రతి క్లినిక్లో ఎంపీహెచ్ఈవో, ఎంపీహెచ్ఎస్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికి వెళ్లి పరిసరాలు పరిశీలించి నీటిలో లార్వా ఉందో..లేదో పరిశీలించి చర్యలు చేపడతారు. జ్వరపీడితులుంటే రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపిస్తారు. మలేరియాలో పాల్సిఫారమ్ నమోదైతే వ్యాధిగ్రస్తుని ఇంటి పరిసరాల్లో డీటీటీ స్ప్రే చేస్తారు. ఇప్పటి వరకు పాల్సీఫారమ్ మలేరియా నమోదైన 15 గ్రామాల్లో 50 శాతం డీటీటీ స్ప్రే చేశాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తమ జేఈవీఎం యూనిట్ సిబ్బంది వార్డులు తిరిగి డెంగీ, మలేరియా లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. – డేవిడ్రాజు, మలేరియా నియంత్రణాధికారి డెంగీ పేరుతో భయపెడితే చర్యలు ర్యాపిడ్ టెస్ట్లోనే డెంగీగా నిర్ధారించి రోగికి నేరుగా చెప్పకూడదు. ఈ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా, రోగి రక్తాన్ని కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజి ల్యాబ్కు పంపించాలి. అక్కడ ఎలీసా టెస్ట్లో వ్యాధి నిర్ధారణ అయితేనే డెంగీగా నిర్ధారించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను ధిక్కరించే ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటాం. 20వేల కంటే తక్కువగాసంఖ్య ఉంటేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. సాధారణ జ్వరంలోనూ ప్లేట్లెట్లు తగ్గుతాయని ప్రజలు గుర్తించాలి. – డాక్టర్ జేవీవీఆర్కె ప్రసాద్, డీఎంహెచ్వో, కర్నూలు వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లలో రక్తం స్రవిస్తుంది. -
జనం జీవితాలతో చెలగాటమాడుతున్నారు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మలేరియా, డెంగీ, విషజ్వరాలతో మంచాన పడుతుం టే స్పందించి సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు. ఎక్కడ చూసినా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతూ మంచం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 120మంది, విజయనగరం జిల్లాలో 60మంది విషజ్వరాల వలనే మృత్యువా త పడ్డారన్నారు. విషజ్వరాలు విజృంభించడంతో విశాఖపట్టణంలోని కేజీహెచ్, గుంటూరు జిల్లాలో జీజీహెచ్, విజయవాడ ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఒకే బెడ్పై నలుగురైదుగురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆఖరకు రోగులను రోడ్డుపైకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ను అనారోగ్యాంధ్ర ప్రదేశ్గా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా విషజ్వరాలే రాజ్యమేలుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోనిచంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని తమ్మినేని అన్నారు. మలేరియా, విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క విశాఖ కేజీహెచ్లో నే 21 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గుంటూరులో 21 మందికి, తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని దుయ్యబట్టారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ సీఎం చంద్రబాబు వద్దే ఉందని, ఈ శాఖపై చంద్రబాబు దృష్టి సారించకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇటీవలే చం ద్రబాబు జ్వరాలపై సమీక్షించి జ్వరాలపై నియంత్రణ కొరవడిందంటూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. జూలై 2016 నుంచి జూన్ 2017 మధ్యకాలంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు పట్టేందుకు రూ.60లక్షలు నిధులు ఖర్చు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్న లోకేష్ అవగాహనా రాహిత్యం వల్లనే గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దోమలబెడద అధికమైందని చెప్పారు. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేసి ఆదాయం వచ్చే మార్గాలనే అన్వేషిస్తోందన్నారు. బాబు డ్యాష్బోర్డుపైకి రాష్ట్ర ప్రజలకు అందుతున్న వైద్యసేవల నివేదిక చేరలేదా అని ప్రశ్నించారు. అందని వ్యాక్సిన్లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా వ్యా క్సిన్ అందని దుస్థితి నెలకొందని తమ్మినేని సీతా రాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 38 వేల మంది శిశువులు జన్మిస్తున్నారని, చిన్నారులకు ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా వాక్సిన్లు వేయించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్లు పీహెచ్సీలు, సీహెచ్ల్లో అందుబాటులో లేకున్నా ప్రభుత్వం చలించకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చిన్నారులు రోటావాక్, హెపటైటిస్–బి వంటి వ్యాక్సిన్లకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేత బొనిగి రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
పంజా విసిరిన డెంగీ
రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది. విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు కాగిపోతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని జిల్లాలు మంచానపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు.. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనధికారికంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. వేలాది మంది రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పలు ఆస్పత్రుల్లో పడకలు సరిపోక నేలపైనే రోగులను పడుకోపెట్టి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: విషజ్వరాలతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా బారినపడి 23 మందికిపైగా మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీటిని సహజ మరణాలుగానే రికార్డుల్లో నమోదు చేస్తూ.. తీవ్రతను కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 217 మంది మలేరియాతోనూ, 55 మంది డెంగీతోనూ బాధపడుతున్నారని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో అయితే విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, ఇతర విషజ్వరాలతో ఇప్పటివరకు 70 మందికిపైగా ప్రాణాలొదిలారు. ఒక్క డెంగీతోనే 30 మంది ప్రాణాలు విడిస్తే.. వైద్యాధికారులు మాత్రం ఇద్దరే చనిపోయారని చెబుతున్నారు. విజయనగరం అర్బన్, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గుర్లలో డెంగీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా కేసులు, 1,100 టైఫాయిడ్ కేసులు, 21,800 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 1,660 డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ మరణాల సంఖ్య వందకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రోజుకు ఇద్దరు, ముగ్గురు డెంగీతో మృతి చెందుతున్నట్లు సమాచారం. డెంగీ బాధితుల కోసం కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ప్రత్యేకంగా పది పడకలు ఏర్పాటు చేశారు. కానీ రోజుకు 20 మందికి పైగా రోగులు వస్తుండడంతో.. వారిని ఇతర వార్డుల్లో ఉంచి వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 22 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. గజగజలాడుతున్న గోదావరి జిల్లాలు.. డెంగీ ధాటికి గోదావరి జిల్లాలు కూడా గజగజలాడుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశముంది. కానీ డెంగీ మరణాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. శనివారం జగ్గంపేట మండల మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూక రత్నం(53) డెంగీతో కాకినాడ జీజీహెచ్లో మృతి చెందగా.. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. కాకినాడ రూరల్లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదవ్వగా.. కాకినాడ నగరంలో 65 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు డెంగీతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో గత 3 నెలల్లో అధికారికంగానే 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, రాఘవాపురం, పెనుగొండ, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, లంకలకోడేరు, పెనుమంట్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి బాధితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతమున్న వార్డు సరిపోక.. మరో వార్డును అదనంగా కేటాయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 169 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాజధానిలోనూ దయనీయమే.. కృష్ణా జిల్లాలోని నందిగామ, ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు జ్వరపీడితులున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సాధారణంగా రోజుకు దాదాపు 200 మంది రోగులు వస్తుండేవారు. కానీ విషజ్వరాల దెబ్బకు రోజుకు 350 మందికి పైగా రోగులు వస్తుండటంతో పడకలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేలపైనే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 డెంగీ, 100 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నందిగామ పట్టణానికి చెందిన మారం జయశ్రీ(18) అనే విద్యార్థిని, వెల్లంకికి ముండ్లపాటి నారాయణ(56) డెంగీతో మృతిచెందారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం గ్రామస్తులు 15 రోజులుగా విషజ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 87 డెంగీ, 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, నూతక్కి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లితో పాటు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారికంగా 17 డెంగీ, 44 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 132 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 56 డెంగీ, వందకుపైగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 24 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. డెంగీ నిర్ధారణపై ఆంక్షలు! డెంగీ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విశాఖ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరికరాలున్నప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల కేజీహెచ్లోని ల్యాబ్కు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ల్యాబ్ రోగులతో కిటకిటలాడుతోంది. తీరా వ్యాధి నిర్ధారణయ్యేసరికి చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేజీహెచ్లో 4,574 మందికి పరీక్షలు నిర్వహించగా 1,660 మందికి డెంగీగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి ముగ్గురు అనుమానితుల్లో ఒకరికి డెంగీ నిర్ధారణ అవుతోంది. పెళ్లయిన 13 రోజులకే ప్రాణం తీసిన విష జ్వరం మాయదారి విష జ్వరం ఓ నవ వరుడిని మింగేసింది. విజయనగరంలోని పూల్బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు(24) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 24న అతనికి పూల్బాగ్ కాలనీకి చెందిన మౌనికతో వివాహమైంది. జ్వరం రావడంతో ఈశ్వరరావును ఈ నెల 4న నెల్లిమర్ల మిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు బుధవారం అతన్ని కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లేసరికే ఈశ్వరావు మృతి చెందాడు. పెళ్లయిన 13 రోజులకే వరుడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం: సీఎం సాక్షి, అమరావతి: పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డెంగీ విజృంభణ నేపథ్యంలో బుధవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ.. విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దోమల బెడదను నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీమలోనూ విషజ్వరాల విజృంభణ.. రాయలసీమలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 66 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ నెల 1న నార్పల గ్రామానికి చెందిన అనుష్క(8) మృతి చెందింది. ఇప్పటివరకు 164 మలేరియా, 66 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం, ఎద్దులపల్లి, కురుకుంట ప్రాంతాల్లోని 30 గ్రామాల్లో డెంగీ తీవ్రత అధికంగా ఉంది. వైఎస్సార్ జిల్లాలోనూ 45 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఏడింటిని నిర్ధారించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఐదుగురికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం, నందికుంటకు చెందిన లీలావతి, లక్ష్మీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా, కర్నూలు గణేష్నగర్కు చెందిన లక్ష్మయ్య(21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి, పనుల నిమిత్తం కర్నూలుకు వచ్చిన కమలాకర్, ప్రకాష్(ఒడిశా) డెంగీతో బాధపడుతున్నారు. -
దోమ దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు తోడు ఇళ్ల మధ్య మురుగు నిల్వ, చెత్తా చెదారంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహార కాలుష్యంతో నగరవాసులు డయేరియా, విషజ్వరాల బారినపడుతున్నారు. వాంతులు, విరేచరాలతో పాటు దగ్గు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత డయేరియా కేసులతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది, ఈ సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చాపకింద నీరులా డెంగీ, మలేరియా నగరంలో మలేరియా, డెంగీ దోమలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. గత నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 417 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు 70పైగా కేసులు, ఉస్మానియాలో కేవలం వారం రోజుల్లోనే 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఫీవర్లో 14 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 179 కేసులు నమోదు కాగా, ఈ నెలలో 46 కేసులు నమోదయ్యాయి. 274 మలేరియా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ఆగస్టులోనే 31 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని వేడి చేసి, చల్లారిన తర్వాత తాగాలి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పూల కుండీలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. – డాక్టర్ సుదర్శన్రెడ్డి, జనరల్ ఫిజిషియన్ -
దోమలకు దోమలే విరుగుడు..!!
టౌన్స్విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్విల్లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్విల్లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. -
గ్రేటర్పై డెంగీ పంజా
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్పై మళ్లీ డెంగీ, మలేరియా వ్యాధులు పంజా విసురుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత మూడు మాసాల్లో 20 డెంగీ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. తాజాగా మరో 14 డెంగీ, 12 మలేరియా కేసులు నమోదయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. మురికివాడల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతుండగా, ఐటీ అనుబంధ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలు, ధనవంతులు అధికంగా నివసించే కాలనీల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షా నికి తోడు...రోజుల తరబడి ఫాగింగ్ నిర్వహించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రేటర్లో ప్లాస్మోడియం పాల్సీఫారమ్ మలేరియా: మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఈ రకం కనిపించేది. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. మూడు నెలల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. ప్లాస్మోడియం అనే పరాన్న జీవి ద్వారా మలేరియా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) అనేవి రెండు రకాలు. పీవీ వ్యాపించినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. అంత ప్రమాదకరమైనది కాదు. కానీ పీఎఫ్ మలేరియా చాలా ప్రమాదకరమైనది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. దోమ కుట్టిన పది నుంచి ప ద్నాలుగు రోజుల్లో జ్వరం వస్తుంది. డెంగీ లక్షణాలతో బాధపడే వారికి కొంతమంది స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారని, అయితే ఇవి వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయని మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు. పారాసిటమాల్ తప్పఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదన్నారు. -
మలేరియాపై పోరుకు కొత్త అస్త్రం..
మలేరియా వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం ఫాల్సీపరమ్ అనే బ్యాక్టీరియా శరీర కణంలోకి ప్రవేశించేందుకు, బయటపడేం దుకు ఉపయోగపడే కీలకమైన రెండు ఎంజైమ్లను జెనీవా, బెన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్లలో ఒకటి కణత్వచాన్ని చీల్చి లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగపడగా.. రెండోది బ్యాక్టీరియా తన దాడిని మొదలుపెట్టేందుకు ఉపకరిస్తుంది. మన రక్తం, కాలేయంతోపాటు దోమ కడుపులో కూడా ఈ బ్యాక్టీరియా ఈ రెండు ఎంజైమ్లపైనే ఆధారపడుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని నిర్వీర్యం చేసేందుకు మార్గం సుగమం చేశారు. వాటిని నిర్వీర్యం చేసే మందులు తయారైతే అటు మలేరియా వ్యాధిగ్రస్తుల్లోని బ్యాక్టీరియా నాశనం అవడమే కాకుండా.. అది దోమల్లోకి చేరి వ్యాధిని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. -
జ్వరం.. కలవరం
► జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలు ► ప్రబలుతున్న మలేరియా ► మంచంపడుతున్న పల్లెలు ► ఇప్పటి వరకు బాలుడు సహా ఏడుగురి మృతి లబ్బీపేట(విజయవాడ తూర్పు) : వాతావరణంలో మార్పులు... అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం... విజృంభిస్తున్న దోమల కారణంగా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తూర్పు, పశ్చిమ కృష్ణాలోని పలు పల్లెలు మంచంపట్టాయి. విజయవాడ నగరంలోనూ వేలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడులో వందలాది మంది జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే. అదే మండలం పాములలంకతోపాటు తిరువూరు మండలంలోనూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, కొత్త రాజరాజేశ్వరీపేట, వన్టౌన్ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలాయి. బొడ్డపాడు సహా పలు ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం, అక్కడక్కడా డెంగీ లక్షణాలు కనిపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా... జూలైలో అధికారులు 36,300 వేల మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, వారిలో 158 మందికి మలేరియా పాజిటివ్ వచ్చింది. విజయవాడలో 7,467మంది జ్వరపీడితుల నుంచి శాంపిల్స్ సేకరించగా, 114 మలేరియా ఉన్నట్లు తేలింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో 17,918 మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించగా, 50 మందికి మలేరియా పాజిటివ్ వచ్చింది. అయితే, ఇవి కేవలం ప్రభుత్వాస్పత్రులు, వైద్య శిబిరాలకు వచ్చిన వారి వివరాలు మాత్రమే. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్న వారి సంఖ్య ఇంతకు రెండింతలు రెట్టింపు ఉంటుందని అంచనా. విజయవాడ ప్రభుత్వాస్పతి మెడిసిన్ విభాగానికి నిత్యం 100 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుండగా, 20 మంది వరకు ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. పిల్లల విభాగానికి సైతం నిత్యం 50 మంది జ్వరపీడితులు వస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు రోజుకు వెయ్యి మంది వరకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఒకరితో మొదలై... విష జ్వరాలకు కారణమైన వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లో ఒకరికి విషజ్వరం వస్తే, వారి నుంచి మరొకరికి... ఇలా కుటుంబ సభ్యులు మొత్తం జ్వరాల బారినపడుతున్నారు. విష జ్వరం సోకినవారికి జలుబు, గొంతునొప్పి, మంట, తలనొప్పి, దగ్గు రావడంతోపాటు ఒక్కో సమయంలో వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఏడుగురి మృతి... జ్వరాలబారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో ఇద్దరు, విజయవాడలో ముగ్గురు, మైలవరంలో ఇద్దరు చొప్పున మరణించారు. విజయవాడలోని ఆర్ఆర్ పేటలో కొంటా యశ్వంత్(4) అనే బాలుడు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ బాలుడు డెంగీ లక్షణాలతో మరణించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జక్కంపూడిలో మలేరియా... విజయవాడలోని జక్కంపూడి కాలనీలో మలేరియా విజృంభిస్తోంది. ఈ కాలనీలో 200 మందికిపైగా మలేరియా బాధితులు ఉన్నట్లు సమాచారం. వారి నుంచి మరింత మందికి వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు. సకాలంలో మలేరియా అధికారులు స్పందించక పోవడం వల్లే కాలనీలో మలేరియా విజృంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక శిబిరాలతోపాటు, శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కాలనీలో ఏడాదిగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అవగాహన అవసరం వ్యాధి సోకిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యం. మనం పరిసరాల్లో పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాడని డబ్బాల్లో నిల్వ ఉన్న వర్షం నీటిలో వ్యాధి కారక దోమలు వృద్ధి చెందుతాయి. వాటిని పరిసరాల్లో లేకుండా చూడటం ఎంతో ముఖ్యం. తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసెట్మాల్ మందులు వేసుకోవడంతోపాటు సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం మంచిది. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన అవసరం. – డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి -
మలేరియాతో గిరిజన యువతి మృతి
రాజవొమ్మంగి (రంపచోడవరం) : రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకు చెందిన నేశం శిరీష (22) అనే గిరిజన యువతి మలేరియా జ్వరం, కామెర్లతో ఏలేశ్వరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఆమెకు ఏడాది కిందటే వివాహం జరగ్గా అమ్మగారి ఊరైన అమీనాబాద్ వచ్చి జ్వరం బారిన పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను రెండు రోజుల కిందట ఏలేశ్వరం తరలించారు. అక్కడ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష పరిస్థితి విషమించి చివరికి మరణించింది. రెండు రోజుల కిందట అమీనాబాద్కాలనీకే చెందిన రావుల రాంబాబు (40) అనే గిరిజనుడు ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొంది, చనిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే. అమీనాబాద్కాలనీకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గల జడ్డంగి పీహెచ్సీకి వెళ్ళకుండా గిరిజనులు వైద్యం కోసం ఏలేశ్వరంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించడం గమనార్హం. జడ్డంగి పీహెచ్సీలో సరైన వైద్యం అందక, క్షేత్రస్థాయి మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు పనితీరు సంతృప్తికరంగా లేకే ఇక్కడి గిరిజనులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రోగనిర్ధారణలో జాప్యంతో చేటు.. కేవలం జ్వరంతో మూడు రోజుల పాటు బాధపడుతూ గిరిజనులు చనిపోవడానికి అసలు వారికి వచ్చిన రోగం ఏమిటన్నది త్వరగా నిర్ధారణ కాకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డెంగీ వంటి రోగాల బారిన పడి సకాలంలో సరైన వైద్యం లభించకే గిరిజనుల్లో మరణాలు సంభవిస్తున్నాయా అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది. రోగంతో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్ళి ఫీజుల రూపేణా వేలకు వేలు చెల్లించలేని స్థితిలో చికిత్సకు నోచుకోక కూడా ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోతున్నారా అన్న అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. -
2030 మలేరియా ఖతం..!
నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా వేలాది మందిపై పంజా విసురుతున్న మలేరియా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. మలేరియా నిర్మూలనకు అవసరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరితగతిన వైద్య సాయం అందించడం అనే రెండు వ్యూహాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏటా సగటున 3 వేలకుపైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2017 జనవరి నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో 1,102 మలేరియా కేసులు నమోదైతే.. కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సరైన చికిత్సతోనే..: పరిసరాలు శుభ్రంగా లేక దోమలు వృద్ధి చెంది మలేరియా సంక్రమిస్తుంది. ఆరోగ్యపరమైన అవగాహన పెద్దగా లేని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా మలేరియా రెండు రకాలు. జ్వర లక్షణాలతో ఉండే మలేరియాకు 14 రోజులు చికిత్స అవసరం. జ్వరం లేకుండా ఉండే తరహా మలేరియాకు 3 రోజులు చికిత్స తీసుకోవాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం మానేస్తుంటారు. దాంతో మలేరియా క్రిమి మళ్లీ విజృంభిస్తుంది. 2030లోపు శాశ్వతంగా.. దశాబ్దాలుగా పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను 2030లోపు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుంటే.. 2030 నాటికి మలేరియా రహితంగా ప్రకటించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. స్థానిక అవసరాలకనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. ఇందుకు నిధులను కేంద్రమే మంజూరు చేస్తోంది. భవిష్యత్తు తరాల కోసం.. ఆరోగ్యకరమైన భవిష్యత్ సమాజం కోసం మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే 17 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 2.60 లక్షల దోమ తెరలు పంపిణీ చేశాం. మరో 4.89 లక్షల దోమ తెరలను పంపిణీ చేయనున్నాం.. –డా.ఎస్.ప్రభావతి, రాష్ట్ర అధికారి మలేరియా నిర్మూలన కార్యక్రమం -
మంచం పట్టిన మన్యం
► మలేరియా, జ్వరాలతో అడవి బిడ్డల ఆక్రందన ► రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య ► గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు ► 260 మలేరియా కేసుల నమోదు బుట్టాయగూడెం : ‘పశ్చిమ’ ఏజెన్సీ జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల విజృంభిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో సుమారు 260 మలేరియా కేసులు, 33,140 జ్వరాలు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన కేసులు మాత్రమే. ఏజెన్సీలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. బుట్టాయగూడెం మండలం లోని మారుమూల ప్రాంతాలైన గొట్టాలరేవులో బాలికలు గురుగుంట్ల రోజా, గురుగుంట్ల ప్రగతి, బాలుడు కెచ్చెల రాజు మలేరియాతో బాధపడుతున్నారు. కెచ్చెల లక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కెచ్చెల రాజు దొరమామిడి ఆస్పత్రిలో వైద్యం పొందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కామవరానికి చెందిన వంజం నాగేంద్ర, అంజలి జ్వరాలతో బాధపడుతుం డగా, దాడి వీర్రాజు, మంగా దుర్గారావు జ్వ రంతో బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య శిబి రాలు లేవ ని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చాపరాయి ఘటనతో.. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఘటన తర్వాత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. అయినా మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, దోమలు బెడదతో వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తోంది. రహదారులు అధ్వానం ఏజెన్సీలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఆరోగ్య ఉపకేంద్రాలు, బుట్టాయగూడెంలో మలేరియా కార్యాలయం ఉన్నాయి. ఏటా మలేరియా వ్యాప్తి చెందే సమస్యాత్మక 266 గ్రామాలను అధికారులు గుర్తించారు. పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కనీసం 108, 104 వాహనాలు కూడా వెళ్లడం లేదు. ప్రత్యేక చర్యలు ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 198 గ్రామాల్లో మొదటి విడత దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులు పూర్తి చేశాం. ఈ నెల 16నుంచి రెండో విడత పనులు చేపడతాం. ప్రతి శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నాం. ప్రతి గ్రామంలో డ్రెయిన్లు, మంచినీటి వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. – వంశీలాల్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్ పురం -
జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా ♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు ♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు. పెరుగుతున్న మలేరియా బాధితులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు. గతేడాది కంటే ఎక్కువే... కురుపాం సీహెచ్సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి. ఒకే ల్యాబ్ టెక్నీషియన్తో రోగుల అవస్థలు కురుపాం సీహెచ్సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు. కానరాని నివారణ చర్యలు మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. -
అమ్మో మలేరియా బ్యాట్మ్యాన్
డే టైమ్లో ట్రాఫిక్ నైట్ టైమ్లో దోమలు ఒణికించేస్తున్నాయి. జుయ్మని వర్షాలకు బండ్లు జారిపడడం.. గుయ్మని వచ్చి కుట్టే దోమలకు మన బండి మంచం మీద పడడం.. ఈ సీజన్లో వెరీ కామన్! సచిన్, ధోనీ, కొహ్లీ.. ఈ ముగ్గుర్నీ వేలంలో కొనుక్కుని బ్యాట్ చేతికిచ్చినా... అంతా డకౌట్ అవుతారే తప్ప... దోమలు నాటౌట్. అంతేనా?! వాటి దెబ్బకు మన టెంపరేచర్ సెంచరీ దాటుతుంది. ఎలా మరి? జాగ్రత్తగా ఉంటే సరి. దోమ సైజు చాలా చిన్నది. కానీ అది కలిగించే వ్యాధుల జాబితా మాత్రం పెద్దది. ఆ జాబితాలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న వ్యాధి మలేరియా. ఏజెన్సీ ఏరియాలోని గిరిపుత్రుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న మలేరియా... కేవలం మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో దాదాపు 110 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... సగానికి పైగా గ్లోబును ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఆ మలేరియా గురించి అవగాహన కోసం ఈ కథనం. ప్రధాన లక్షణాలు మలేరియా వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం జ్వరం. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు, నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి మృత్యువు కూడా దారితీయవచ్చు. స్థూలంగా కనిపించేవి జ్వరం ∙తలనొప్పి ∙తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరం : ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజాయిట్స్ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. చలి : మొదట చలి వస్తుంది. ఆ తర్వాత విపరీతమైన చెమటలు పడతాయి. లక్షణాల్లో తేడాలిలా... ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజాయిట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందువల్ల జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒక్కోలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవేల్లో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. అదే మలేరీ ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది. నిర్ధారణ... ఇటీవలి కాలంలో అభివృద్ధి మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్–స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా. గతంలోని పరీక్షలు రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ : మలేరియా యాంటిజెన్ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని, ప్రస్తుతం వీటిని పెద్దగా వాడటం లేదు. చికిత్సలో విప్లవాత్మకమైన పురోగతి గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. అందుకే ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది. సాధారణ చికిత్స ప్రక్రియలు తొలుత మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ వంటి మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, మంచి విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్ అయితే... ఒకవేళ అది తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహ తప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి. ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్లో వాడతారు. ఇతర శారీరక దుష్ప్రభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియాలో ఆసుపత్రిలో లభ్యమయ్యే ఈ తరహా చికిత్స రోగికి దొరకకపోతే ఒక్కోసారి అది రోగి మరణానికీ దారితీయవచ్చు. మొక్క నుంచి మందులు ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్వుడ్’ అని పిలిచే చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో గుణం చాలా మెరుగ్గానూ, వేగంగానూ కనిపిస్తుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో ఆర్టిమిసినిన్తో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు ఇలా మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు. నివారణ దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు.మన ఇంట్లోకి, గదిలోకి దోమలు రాకుండా చూసుకోడానికి రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల çపరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దీనితో పాటు కాల్వల్లో నీరు నిత్యం పారేలా కాల్వల పూడిక లేకుండా చూసుకోవడం అవసరం. దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ – పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్ (కీమో– ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవచ్చు.పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి.వాటర్ కూలర్స్లో కొంతమంది కొన్ని నీటిని ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలుపడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, కూలర్లను మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను వాడకండి. ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడండి. మలేరియా అర్థమేమిటంటే? క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. ప్రపంచమంతా ఉన్న ఈ వ్యాధి గురించి, దాని చరిత్రను గురించి సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు ‘సికింద్రాబాద్’లోనే కనుక్కున్నారు. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం. వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ... ►వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో ►జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో ►పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ►మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. డాక్టర్ జె. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హెల్త్ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్