-
మదనపల్లెలో గ్యాంగ్ వార్
భార్య, కుమార్తె చంపవద్దంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. కనికరం లేని కిరాతకులు వారి కళ్లెదుటే హతమార్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వర్గాల ఆధిపత్య పోరుకు ప్రత్యర్థులు కలబడి బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.మదనపల్లె : ఆధిపత్య పోరులో ప్రత్యర్థుల చేతిలో ఒకరు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని 2వ వార్డు మంజునాథ కాలనీ జగనన్న లే అవుట్లో బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రి(35) నివసిస్తున్నాడు. శేషాద్రి లారీడ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో కలకత్తాకు చెందిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రెడ్డి మహేశ్వరి ఉంది. కమలకు తెలుగు సరిగా రాదు. రాత్రి 11 గంటల సమయంలో గొల్లపల్లె దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతడి అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డి, కొందరు లావాదేవీల విషయమై చర్చించాలని మిద్దె పైకి తీసుకెళ్లారు. మాటా మాటా పెరిగి వివాదం తలెత్తడంతో శేషాద్రిపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చేతి వేళ్లు అడ్డుగా పెట్టడంతో తెగి కిందపడ్డాయి. ప్రాణ భయంతో శేషాద్రి వారి నుంచి తప్పించుకుని మిద్దైపెనుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దుండగులు తలుపులు పగల గొట్టి బెడ్ రూమ్లో దాక్కున్న శేషాద్రిని హాల్ లోకి లాక్కొచ్చారు. తన భర్తను చంపవద్దని శేషాద్రి భార్య కమల, కూతురు రెడ్డిమహేశ్వరి వేడుకుంటున్నా.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారి కళ్లెదుటే శేషాద్రిని విచక్షణా రహితంగా నరికి చంపారు. భర్తను కళ్లముందే చంపేయడంతో కమల షాక్కు గురైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రోదిస్తూ పోలీసులకు హిందీలో వివరించడం కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐలు వలీబాషా, యువరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కొండుపల్లె ఆనంద్, చరణ్, మణికంఠ, చెన్నారెడ్డిలతో పాటు ఆరుగురిపై ప్రాథమికంగా హత్యకేసు నమోదుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగానే శేషాద్రి హత్య జరిగిందని, ఇందులో రాజకీయకోణం లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల అదుపులో నలుగురు?హత్యకు కుట్రదారుగా భావిస్తున్న కొండుపల్లె ఆనంద్ 2014, 2020లో జరిగిన రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. శేషాద్రి హత్యకేసులో దోషులు ఎంతమంది పాల్గొన్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం శేషాద్రి ఇంటికి డాగ్స్క్వాడ్, క్లూస్టీం వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే హత్యచేసిన తర్వాత నలుగురు నిందితులు నేరుగా టూటౌన్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో వినియోగించిన ఏపీ–04ఏఎఫ్–5733 నెంబర్ ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు.ఆధిపత్యం కోసమే హత్యపుంగనూరు శేషాద్రి, కొండుపల్లె ఆనంద్ ప్రజా సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. కొండుపల్లె ఆనంద్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషాద్రి చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శేషాద్రి మదనపల్లె ఎమ్మెల్యేకు పీఏ తానేనని చెబుతూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై 420 కేసు నమోదైంది. అనంతరం శేషాద్రి తన మకాం మంజునాథ కాలనీకి మార్చాడు. ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆనంద్కు పోటీగా బహుజన భీమ్ సేనను స్థాపించి కాలనీలో పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామారావు కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో ఆనంద్, శేషాద్రి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు చంపేస్తామని బెదిరించుకోవడం, గొడవలు పడడం, సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకోవడం, పోలీస్ స్టేషన్లో రాజీప్రయత్నాలు జరగడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో శేషాద్రిని ముట్టుబెట్టేందుకు ఆనంద్ వర్గం పథకం వేసింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని, శుక్రవారం రాత్రి శేషాద్రి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆనంద్ వర్గీయుల చేతిలో అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. -
డబుల్ సెంచరీ గ్యారంటీ..జగన్ పిలుపు..
-
ఆంధ్రప్రదేశ్లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్ మాస్ ర్యాగింగ్...దద్దరిల్లిన మదనపల్లె
-
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్న్పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మేమంతా సిద్ధం: సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన మదనపల్లె సభ (ఫొటోలు)
-
పేదల రక్తం పీల్చే పసుపుపతిని ఎవరూ నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా : అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని మండిపడ్డారు. పసుపుపతి అయిదేళ్ల తరువాత వచ్చి వదల బొమ్మాళి అంటున్నారని దుయ్యబట్టారు. కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్ను జనం నీరాజనాలు పలికారు. మంగళవారం మదనపల్లె బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని ప్రస్తావించారు. ముగ్గురి ఫొటోలతో ఉన్న హామీల పత్రాలను ఇంటింటికి పంపించారని, ఆ హామీలను ఒక్కటేనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి ఇదే డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. 2014 కంటే ఎక్కువ హామీలంటూ మరో డ్రామాకు తెరతీస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పసుపుపతిని ఎవరైనా నమ్ముతారా అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోక కత్తిరించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక.. కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. పేదలకు, పెత్తందారులకు కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు. జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. మోసాలే అలవాట్లుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నాం. గత హామీలు నెరవేర్చారా? గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కిందరూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే.. నిరుగ్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు. నిర్మించాడా? 10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రజలంతా కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించాలి జగన్ పేరు చెప్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయి జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2లక్షల 70 వేల కోట్ల పేదల ఖాతాల్లో జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. లంచాలు, వివక్షలేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన. రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ పాలన. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 31 లక్షలపైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేంది.. మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తు కొచ్చేది.. మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు పేదలంటే చంద్రబాబుకు కక్ష తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్రాకుండా చేయించాడు. పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని తన మనుషులతో పిటిషన్ వేయించాడు. నిమ్మగడ్డ రమేష్తో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పేదలకు అన్యాయం చేశారు. బాబుకు ఓటు వేస్తే పెన్షన్, పథకాలను అందించిన వలంటీర్ల రద్దకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థను రద్దు చేస్తాడు. మీ పెన్షన్ మీ ఇంటికి రావాలంటే బాబులాంటి సైంధవులు రాకూడదు. వృద్ధులకు, వికలాంగులకు మంచి చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు రద్దుచేయాలన్నారు. -
ఈ సారి డబుల్ సెంచరీకి మీరు సిద్ధమా: వైఎస్ జగన్
-
99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అంటూ మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు మదనపల్లెలో కనిపిస్తున్న ప్రజాభిమానం.. జనసముద్రంలా తలపిస్తోందన్నారు సీఎం జగన్. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సముద్రంలా కనిపిస్తుందని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లో జరగబోయే కురుసంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో గొప్ప విజయం కళ్ల ఎదుటే కనిపిస్తుందన్నారు. మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరోరోజు దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్కు జనం నీరాజనాలు పలికారు. ‘మేమంతా సిద్ధం’లో భాగంగా మదనపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని.. 99 శాతం వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు వారికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతన్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారని ప్రతిపక్ష కూటమిని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని దుయ్యబట్టారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడాలని అన్నారు. 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా? ‘ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?. అటు వైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ దద్దరిల్లిన మదనపల్లె సభ
-
సీఎం జగన్ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు..!
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనగర్జన
-
Watch Live: మదనపల్లె మేమంతా సిద్ధం సభ
-
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
బిల్డప్ బాబాయ్ అసలు గుట్టు బట్టబయలు
మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్టౌన్లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్మెన్లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు. పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు. అయితే రాయల్గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..! -
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
Madanapalle: పోలీస్స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఏడాది కాలంగా తనకు న్యాయం జరగలేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆదివారం పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బేతమంగళానికి చెందిన సుధా(34) మదనపల్లె మండలం కొత్తిండ్లుకు చెందిన బాలప్రసాద్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాలాజీ(8) అనే కుమారుడు ఉన్నారు. అయితే భర్త, అత్త తనను వరకట్న వేధింపులకు గురి చేస్తూ చిత్ర హింసలు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సుధా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాలప్రసాద్పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి తాలూకా పోలీసులు రిమాండ్కు పంపారు. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆదివారం సుధా మదనపల్లె తాలూకా పోలీసుస్టేషన్కు వచ్చింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని న్యాయం చేయాల్సిందిగా కోరింది. అయితే ఎస్ఐ, సీఐలు లేరని వారు వచ్చాక రావాలని స్టేషన్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె స్టేషన్ బయటకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తన భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఏడాదిగా తనకు న్యాయం జరగలేదని ఆరోపించింది. బాధితురాలిని వెంటనే పోలీసులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా... అక్షరాల ఇది వాస్తవం. కుంకుమ పువ్వు సాగు చేయాలంటే కశ్మీర్కు వెళ్లాల్సినవసరం లేదు. పండించాలన్న ఆసక్తి ఉంటే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా ఇక్కడ సృష్టించి సాగు చేయవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు. అలా ఎవరూ ఊహించని కశ్మీరీ కుంకుమపువ్వు సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధి. కశ్మీర్ నుంచి విత్తనాలు తెచ్చి.. కుంకుమపువ్వు సాగు కోసం శ్రీనిధి కశ్మీర్కు వెళ్లి 300 కిలోల నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేశారు. అందులో 225 కిలోలను సాగుకు వినియోగించారు. ఏరోఫోనిక్ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను ఉంచి ఇంట్లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న కశ్మీర్ తరహా వాతావరణం కలిగిన గదిలో వాటిని ఉంచారు. 2022, ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన కుంకుమపువ్వు సాగు... నవంబర్ 20కి సరిగ్గా మూడు నెలలకు తుదిదశకు చేరుకుంది. 30,000 మొక్కల్లో దాదాపుగా 20,000 మొక్కలు అంటే ఏడు గ్రాములకు పైన ఉన్న విత్తనాలు మాత్రమే పువ్వు దశకు చేరుకున్నాయి. సాధారణంగా 150 పువ్వుల నుంచి ఒక గ్రాము కుంకుమపువ్వు దిగుబడి ఉంటుంది. మదనపల్లెలో శ్రీనిధి ప్రయోగాత్మకంగా చేసిన సాగులో కశ్మీర్లో సంప్రదాయక సాగు పద్ధతిలో వచ్చే దిగుబడితో సమానంగా తొలి ప్రయత్నంలోనే 200 గ్రాముల కల్తీలేని, నాణ్యమైన ఏ గ్రేడ్ కుంకుమపువ్వును పండించింది. పునరుత్పత్తి ప్రక్రియ నవంబర్ 20 తొలి పంట తుది దశకు చేరుకునే క్రమంలోనే మలి పంటకు సన్నాహాలను ప్రారంభించారు. కుంకుమపువ్వు తీసేసిన తర్వాత మొక్కలను అలాగే పునరుత్పత్తి ప్రక్రియకు వినియోగించి వాటి నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నారు. ఒక విత్తనం నుంచి 3–5 పిలకలు ఉత్పత్తి అయ్యాయి. ఈ సారి వర్టికల్ ఫాంలో ప్రత్యేకగదిలో సాయిల్ బెడ్స్(మురిగిన నల్లమట్టి, నున్నటి ఇసుక, కోకోపిట్, వర్మీకంపోస్టు, వరిపొట్టు) రూపంలో తయారు చేసుకుని మొక్కలను నాటారు. వీటితో పాటుగా ట్రయల్ రన్లో భాగంగా ఓపెన్ ఎయిర్లో కొన్ని మొక్కలు నాటి చూశారు. ప్రత్యేకగదిలో ఏర్పాటు చేసిన మొక్కలు ఆశించిన స్థాయిలో పెరుగుతుండగా, బయట వేసిన మొక్కలు తొందరగా వాడిపోయాయి. ప్రస్తుతం వేసిన రెండో పంట ఏప్రిల్కు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది నవంబర్కు ఒక టన్ను విత్తనం నుంచి రెండు కిలోల కుంకుమపువ్వు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 5,000 చదరపు అడుగుల స్థలంలో గదిని ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెకి ఉన్నతాధికారులు క్యూ హార్టికల్చర్, టూరిజం, ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం, టీటీడీ తదితర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మదనపల్లెకు వచ్చి ప్రయోగాత్మక సాగును పరిశీలించారు. భవిష్యత్ పరిశోధనలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల బాపట్లలో జనవరి 6, 7 తేదీల్లో జరిగిన 52వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని కుంకుమపువ్వు సాగుపై వ్యవసాయ పరిశోధక విద్యార్థులకు శ్రీనిధి విశదీకరించింది. ఆన్లైన్లో అమ్మకాలు.. కుంకుమపువ్వును అమ్మేందుకు వినూత్న పద్ధతిని అనుసరించింది. పర్పుల్ స్ప్రింగ్స్ పేరుతో బ్రాండ్ పేరును రిజిస్టర్ చేయించి ఆన్లైన్ వేదికగా అమ్మకాలను ప్రారంభించింది. గ్రాము రూ.600 చొప్పున విక్రయించి రూ.1,20,000 వరకు మొదటి ఆదాయాన్ని ఆర్జించింది. సామాజిక మాధ్యమాల వేదికగా యూట్యూబ్లో ఆమె ప్రారంభించిన పర్పుల్ స్ప్రింగ్స్ వెబ్సైట్కు మంచి ఆదరణ లభిస్తోంది. -
Annamayya District: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు
మదనపల్లె సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకులు తప్పకుండా సాధించాలి. ఇందుకు జాతీయ స్థాయి విద్యా విధానం (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలకంగా మారింది. ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితౖమైన సీబీఎస్ఈ సిలబస్ ఇక మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యంగా మరింత నాణ్యమైన, ఖరీదైన విద్య చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ సిలబస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా బడుల్లో ప్రధానోపాధ్యాయులు, సహాయ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీబీఎస్ఈ సిలబస్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ను సీబీఎస్ఈ సిలబస్లో పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే +2 (ఇంటర్) విద్య వరకు విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. పది అంశాలపై నివేదిక సీబీఎస్ఈను అమలు చేయనున్న పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా పది అంశాలపై కేంద్ర విద్యామండలికి నివేదిక అందజేసింది. పాఠశాలల గుర్తింపు, ఫైర్సేఫ్టీ, ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్ గుర్తింపు సంఖ్య, ఏకో ఫ్రెండ్లీ వాతావరణం, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విద్యార్హతలు, వెబ్సైట్ తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల పరిధిలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అమలు కానుంది. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ విధాననం ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనుంది. పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ విధానం విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు కార్పొరేట్, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావడం శుభపరిణామం. కేంద్ర విద్యా మండలి నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న పాఠశాలల ఎంపిక వెబ్సైట్ ద్వారా జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 9 వ తరగతి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు ఇప్పటి నుంచే 8వ తరగతి విద్యార్థులను సన్నద్దం చేస్తున్నాం. – క్రిష్ణప్ప, డివైఈఓ, మదనపల్లె మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది. – పి.మహమ్మద్ఖాన్, టీచర్, జెడ్పీహెచ్ఎస్,మదనపల్లె -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్మోహన్రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి
సాక్షి, మదనపల్లె సిటీ: నీటి కుంటలో మునిగిపోతున్న పాపను కాపాడబోయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, బీటీ కాలేజీ పూర్వపు ఫిజికల్ డైరెక్టర్ లెక్కల గోవర్థన గిరిరావు(53) గురువారం మృతి చెందాడు. దీంతో క్రీడాకారుల్లో విషాదం నెలకొంది. మదనపల్లె పట్టణం కృష్ణానగర్కు చెందిన గోవర్థన గిరిరావు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. భార్య జలజ తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సెలవులు కావడంతో తనతో పాటు పాఠశాలలో పని చేసే హిందీ టీచర్ దీప, ఫిజికల్ సైన్సు టీచర్ ఇంద్రాణి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లె– చౌడేపల్లె మార్గంలోని ఓ ఫామ్హౌస్ వద్ద వంటలు చేసుకునేందుకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన పిల్లలు సరదాగా ఫామ్ హౌస్లో ఆడుకుంటుండగా హిందీ టీచర్ కుమార్తె లాస్య ప్రమాదవశాత్తు నీటికుంటలో పడటంతో కేకలు వేసింది. గమనించిన గిరిరావు వెంటనే లాస్యను కాపాడేందుకు నీటికుంటలో దూకాడు. నీటి కుంట బురదమయమై ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నీటి కుంటలో గిరిరావు ఇరుక్కపోవడాన్ని గమనించిన పిల్లలు కేకలు వేయడంతో, పరిసర ప్రాంతాలవారు అక్కడికి చేరుకుని ఆయన్ను వెలికితీశారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, ప్రాథమిక చికిత్స చేసినప్పటికి గిరిరావు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, భార్య జలజ, కుమారుడు జస్వంత్లు ఆయన మృతిని తట్టుకోలేక బోరున విలపించారు. శుక్రవారం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ గిరిరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నవాజ్బాషా గిరిరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ,బీటీ కాలేజీ కరస్పాండెంట్ వై.ఎస్.మునిరత్నం, దివ్యభారతి ప్రసాద్రెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ కరస్పాడెంట్ రాటకొండ గురుప్రసాద్, సాయిశేఖర్రెడ్డి, పీడీలు భౌతికకాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. -
రేనాటి చోళులు ఏలారిక్కడ!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కొత్తరెడ్డివారిపల్లె వద్ద వ్యవసాయ భూముల్లో రేనాటి చోళుల కాలం నాటి శాసనం వెలుగుచూసింది. ఇది 7వ శతాబ్దానికి చెందిన రేనాటి చోళరాజు పుణ్యకుమారుడి శాసనంగా పరిశోధక విద్యార్థులు తేల్చారు. రాష్ట్రంలో క్రీ.పూ. 3–4 శతాబ్దాల్లోని శాసనాలు ప్రాకృత భాషలోను, 5వ శతాబ్దంలో సంస్కృతంలో ఉండగా.. 6వ శతాబ్దం నుంచి తెలుగులో ఉన్నట్టు చెబుతున్నారు. తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కిందని చరిత్ర చెబుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు ప్రాచీన ఆంధ్రదేశంలో రేనాడు ప్రాంతంగా గుర్తింపు పొందాయి. తెలుగును అధికార భాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేసినట్టు తెలుస్తోంది. నాలుగు తామ్ర శాసనాలు, 50 శిలా శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. చిప్పిలి రాజధానిగా.. రేనాటి రాజుల్లో ముఖ్యుడైన పుణ్యకుమారుడు ‘చెప్పలియ పట్టు’ రాజధానిగా పాలించినట్టు తిప్పలూరు శాసనం ద్వారా తెలుస్తోంది. దీనిని అప్పట్లో కొంతమంది మదనపల్లె తాలూకాలోని చిప్పిలి గ్రామంగా గుర్తించినా.. తర్వాత కాలంలో పరిశోధకులు తిప్పలూరు గ్రామ సమీపంలోని కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి గ్రామ పరిసర ప్రాంతాల్లో రేనాటి చోళుల తామ్ర శాసనాలు, శిలాశాసనాలు అనేకం లభించడంతో దానిని రేనాటి చోళుల రాజధానిగా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం మదనపల్లె తాలూకా కొత్తరెడ్డివారిపల్లెలోని పొలంలో వెలుగు చూసిన పుణ్యకుమార శాసనం చిప్పిలి గ్రామానికి సమీపంలోనే ఉంది. ఈ శాసనం పుణ్యకుమారుడిదే కావడం, ఇలాంటివి అక్కడే కాకుండా వేంపల్లె, చిప్పిలి పరిసర ప్రాంతాల్లో గతంలో అనేకం ఉండేవని చెబుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంక్ తవ్వకాల్లోనూ ఒకటి రెండు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రాహ్మణుడికి దానమిచ్చిన భూమి అని.. కొత్తరెడ్డిగారిపల్లెలోని ఒక పొలంలో రాయిపై శాసనం, మరోచోట బండపై చేతిలో కత్తి పట్టుకున్నట్టుగా, వాటి మీద మూడు బొమ్మలు, చుట్టూ కొన్ని శాసన అక్షరాలు, ఇంకొంత దూరంలో మరో బండమీద కత్తి పట్టుకున్న వీరుడు, అందులో రెండు గుర్రాలు, పైన ప్రాచీన తెలుగు లిపిలో కొన్ని అక్షరాలు (వైదుంబుల వీరగల్లులు) కనిపిస్తున్నాయి. వీటిని ఆ కాలంలో వీరగల్లులుగా పేర్కొనే వారని చెబుతున్నారు. రేనాటి చోళుల్లో మూడో తరానికి చెందిన పుణ్యకుమారుడు సూర అనే బ్రాహ్మణుడికి భూమిని దానంగా ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉందని వాటిని పరిశీలించేందుకు వచ్చిన పరిశోధక విద్యార్థి చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ శిలాశాసనాలు తమ తండ్రుల కాలం నుంచీ అక్కడే ఉన్నాయని, వీటి గురించి తామెవరూ పట్టించుకోలేదని చెప్పారు. -
పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..
మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి వరకు ఘుమఘుమలే అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది. అబ్బా దాని రుచే వేరు అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు. పొరుగు రాష్ట్రాలకు.. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు. వర్షాలకు పంట దెబ్బతినింది అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – మణి, రైతు, ఒంటిమిట్ట వారానికి రెండు, మూడు సార్లు వండుతా ఇది సీజన్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు. – మంజుల, గృహిణి, సిటిఎం పోషకాలు మెండు ఈ సీజన్లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి. క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. – డాక్టర్ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
చెరువు పోరంబోకులో టీడీపీ ఆఫీసు
మదనపల్లె: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో అక్రమంగా ఆక్రమించుకున్న చెరువు పోరంబోకు స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేయడమే కాక అనుమతిలేకుండా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం అధికారుల తనిఖీలో బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అవినీతి, ఆక్రమణ, అక్రమ నిర్మాణాల బాగోతం అధికారుల హెచ్చరిక బోర్డు ఏర్పాటుతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు హైకోర్టులో కేసు ఉందని, లోనికి ఎవరూ ప్రవేశించరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన ఆయన.. లోపల మాత్రం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని దర్జాగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక.. పెద్ద షెడ్లు ఏర్పాటుచేసి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేయడంపై పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పట్టణంలోని బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్–8 పార్టు, విస్తీర్ణం.3.09 ఎకరాల్లో ప్రభుత్వ స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నందున భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని జిల్లా కలెక్టర్ గిరీషా ఉత్తర్వులతో మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలంలో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక బోర్డు పెట్టారు. అంతేకాక.. మున్సిపల్, రెవెన్యూ అధికారులు భూమి మొత్తం కలియతిరిగి అందులోని చెట్లను, టీడీపీ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన భవనాన్ని, అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన రెండు షెడ్ల కొలతలు తీశారు. ఈ సమయంలో.. తాను మాజీ ఎమ్మెల్యేనని, కావాలంటే గూగుల్ మ్యాప్స్ తీసుకోవాలని దొమ్మలపాటి రమేష్ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో దురాక్రమణ ఇలా.. బండమీద కమ్మపల్లె పంచాయతీలో సర్వే నంబర్–8లో ఐదెకరాలు పూర్తిగా చెరువు పోరంబోకు స్థలం. అందులో తప్పుడు రికార్డులతో దొంగపట్టాలు పుట్టించి సర్వే నెం.8/1 పేరుతో ఇంద్రసేనరాజు పేరుతో 1984లో ఇచ్చినట్లుగా డీకేటీ పట్టా సృష్టించారు. అయితే, అదే సంవత్సరం అదే నంబర్తో వేరే వారికి పట్టా ఇచ్చినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే దొంగ డీకేటీ పట్టాను ఆన్లైన్లో ఎక్కించేందుకు కుదరకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారు. 2016లో తహసీల్దార్ శివరామిరెడ్డి హయాంలో అన్లైన్లోకి ఎక్కించి ఇంద్రసేనరాజు నుంచి దొమ్మలపాటి రమేష్ భార్య దొమ్మలపాటి సరళ పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయమై అప్పట్లో పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసు పంపగా దానిమీద హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు కేసు నంబర్లను ప్రహరీగోడ మీద ప్రత్యేకంగా పేర్కొంటూ అనుమతిలేకుండా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయించారు. లోపలమాత్రం అనుమానం రాకుండా పెద్ద భవనాలు, షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మరోవైపు.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తుంటే టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శీను, మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ వెంకటేష్, ఇతర టీడీపీ నాయకులు అధికారుల విధులకు భంగం కలిగిస్తూ వారిని వీడియోలు, ఫొటోలు తీశారు. తాము విధి నిర్వహణలో ఉన్నామని అధికారులు వారిని వారిస్తున్నా మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటామని వ్యాఖ్యానించడం కనిపించింది.