lottery
-
సినీ నటి ఇంట్లో పనివాడు.. కట్ చేస్తే ఆ అలవాటే కోటీశ్వరుడిని చేసింది!
అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. కొంతమంది ఒక్కోసారి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి. సరిగ్గా ఈ తరహాలోనే.. ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఒక్కసారిగా ధనవంతుడిగా మారడు. ఎలాగో తెలుసుకుందాం. బంపర్ లాటరీ.. దెబ్బకు దశ తిరిగింది వివరాల్లోకి వెళితే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో పని కోసం కేరళకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్ఈ 222282 టికెట్ కొన్నాడు. అయితే ఈసారి అతని లక్ మామూలుగా లేదు. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ 'సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ' విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్కి ఏకంగా రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్లకు మొదటి, రెండు బహుమతులు లభించాయి. బంపర్ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్ ఇందుకు చేయవలసిన ప్రాసెస్ పూర్తి చేసుకుని టికెట్ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలు, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభిస్తుంది. -
రూ.100 కోట్లు.. లగ్జరీ కార్లు, విల్లా నుంచి .. బిల్లులు కట్టలేని దీనస్థితికి!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. లక్లో లాటరీ.. అంతా పోయింది ఇది జాన్ మెక్గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి. యూకేలోని సౌత్ లానార్క్షైర్లోని బోత్వెల్లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు. -
భార్యను సంతోష పెట్టడానికి లాటరీ కొన్న వ్యక్తి.. కలిసొచ్చిన అదృష్టం
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే మన ఆనందానికి అవధులుంటాయా?. లాటరీ వ్యక్తి జీవితాన్నే మార్చేస్తే?. సాధారణ వ్యక్తిని ఒక్కసారిగా కోటీశ్వరులను చేస్తే.. ఈ ప్రపంచలంలో మనకంటే అదృష్ట వంతులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతుంటాం. తాజాగా ఇలాంటి ఊహించనే ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూ సౌత్ వేల్స్కు చెందిన జంట గత మూపై ఏళ్లుగా ఒకే నెంబర్పై లాటరీ టికెట్ కొంటూ వస్తోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైతుంది. అయితే ఇటీవల భార్యను సంతోషపెట్టేందుకు అతడు ఆమె పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. ఈ ఘటన మార్చి 13న చోటుచేసుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ జంట దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు. తనకు రెండు లాటరీ టికెట్లు ఎలా వచ్చాయో చెబుతూ సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ‘గత మూప్పై ఏళ్లుగా లాటరీ టెకెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్పై లాటరీ తీసుకోవడం మర్చిపోయారు. నేను చేసిన పనికి తను బాధగా ఫీల్ అయ్యింది. కోపంలో ఉన్న ఆమె ముఖం మీద చిరునవ్వు చూసేందుకు ఈ వారం తన పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్ పరీక్షించగా మొదటి టికెట్పై మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. అప్పడే నేను తనకు రెండో టికెట్ కూడా తసుకున్నానని చెప్పాలనుకున్నా. వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసింది. కాగా తన చాలా కాలంగా ఒకే నెంబర్ కాంబినేషన్ టికెట్ కొనుగోలు చేస్తోందని.. ఏదో ఒక రోజు గెలుస్తుందని ఊహించినట్లు చెప్పాడు. అయితే తన నమ్మకం నిజం కావడానికి చాలా కాలమే పట్టిందని.. ఇది ఖచ్చితంగా విలువైనదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోనున్నట్లు తెలిపారు. కూతురికి కొత్త ఇల్లు కొనిచ్చి.. తన పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక దేశమంతా చుట్టి రావాలన్న ఆలోచన కూడా ఉందని అన్నారు. -
జాక్పాట్ అంటే ఇదే! నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు!
న్యూఢిల్లీ: అదృష్టాన్ని నమ్మొద్దు, కష్టపడి పనిచేయాలని సాధారణంగా మనం అందరమూ నమ్ముతాం. కానీ ప్రపంచంలో ఎక్కువమందిని హార్డ్ వర్క్ కంటే అదృష్టమే ఎక్కువగా పలకరిస్తుంది. అలాంటి వారిలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కూడా ఒకరు. చరిత్రలో ఏన్నడూ లేని విధంగా రికార్డ్ లాటరీ గెల్చుకుని బిలియనీర్గా అవతరించాడు. ఏకంగా వేల కోట్ల రూపాయల జాక్పాట్ తగలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అమెరికా చరిత్రలోనే విలువైన పవర్బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల (రూ.16,407 కోట్లు) ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అఅమెరికాలో ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఒక బిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. కాగా తాజా లాటరీలో పన్ను, ఇతర తగ్గింపుల తరువాత, మొత్తం రూ .8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. ఈ జాక్పాట్తో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు నివాసముండే ఏరియాలో అతి ఖరీదైన 200 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. అలా అరియానా గ్రాండే, డకోటా జాన్సన్ జిమ్మీ కిమ్మెల్ వారికి పొరుగువాడిగా చేరిపోయాడు. ఈ విషయంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ తెలిపింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపు 4 వేల కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ భవనం ప్రత్యేకతలు 13,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఐదు లగ్జరీ బెడ్ రూములు, అధునాతన సదుపాయాలతో ఏడు బాత్రూమ్లు. ఇంకా ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, అవుట్డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేటర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. -
లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..!
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించి రూ.12.13 కోట్ల(10 మిలియన్ యువాన్లు) లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో అతను ఆనందపరవశంలో మునిగిపోయాడు. అయితే భార్య మాత్రం అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు లాటరీ డబ్బుతో పాటు, ఆస్తులను చెరి సమానంగా పంచాలని కోరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆమెకే మద్దతుగా నిలుస్తారు. వీరి కథేంటో ఇప్పుడు చూద్దాం.. రూ.12 కోట్ల లాటరీ గెలుచుకున్న ఈ వ్యక్తి పేరు జోవ్. ట్యాక్స్ కట్ చేసుకోగా అతనికి రూ.10.22 కోట్లు వచ్చాయి. అయితే ఇంత డబ్బు వచ్చిన విషయం భార్యకు తెలియకుండా దాచాడు. ఈ డుబ్బులో కొంత తన సోదరికి ఇచ్చాడు. అంతే కాదు రూ.85 లక్షలు డ్రా చేసి తన మాజీ ప్రేయసి కోసం మంచి ఫ్లాట్ను కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్కు ఈ విషయాలు తెలిశాయి. ఇన్ని కోట్ల డబ్బు గెలుచుకున్నా తనకు చెప్పలేదని ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతను కొంత డబ్బును సోదరికి ఇవ్వడంతో పాటు, ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడం ఆమెకు మరింత కోపం తెప్పించాయి. దీంతో తనకు ఇంత అన్యాయం చేసిన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని లిన్ కోర్టును ఆశ్రయించింది. లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని సమానంగా పంచాలని కోరింది. కోర్టు కీలక తీర్పు.. వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. లాటరీ టికెట్ను ఇద్దరి డబ్బుతోనే కొన్నప్పటికీ.. జోవ్ రూ.12 కోట్లు గెల్చుకున్న విషయాన్ని భార్య దగ్గర దాచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అతని సోదరి, ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా లాటరీలో గెల్చుకున్నదే అని గుర్తించింది. దీంతో రూ.12.13 కోట్లలో 60 శాతం డబ్బును(రూ.7.29కోట్లు) భార్యకు చెల్లించాలని ఆదేశించింది. మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచింది. ఇందుకు సంబంధించి చైనా మీడియాలో వచ్చిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భర్త తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాలో గతేడాది కూడా ఇలాంటి ఘటన జరిగింది. లాటరీలో ఏకంగా రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా దాచాడు. ఇంత డబ్బు ఉందని తెలిస్తే వారు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, కష్టపడరనే భయంతో అతను ఇలా చేశాడు. చదవండి: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు -
18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్కు యజమాని అయింది. ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది. జూలియెట్ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఫస్ట్టైం సరదాగా లాటరీ కొంటే, వందల కోట్ల జాక్పాట్ కొట్టేసిన అమ్మడు
న్యూఢిల్లీ: జాక్ పాట్ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు ఇంతపెద్ద లాటరీ గెలుచుకున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది 18 ఏళ్ల జూలియెట్ లామర్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 287 కోట్ల రూపాయలు (48 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా 35.8 అమెరికా మిలియన్ డాలర్లు) జాక్ఫాట్ కొట్టేసింది. వివరాల్లోకి వెళితే జూలియెట్ లామర్ సాల్ట్ స్టీలోని అల్గోమా విశ్వవిద్యాలయంలో విద్యార్థి. ఏదో సరదాగా అంటారియో ఒట్టో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్కు చెందిన లాటరీని కొనుగోలు చేసింది. అదీ 18వ పుట్టిన రోజు సందర్భంతా తాత కోరిక, తండ్రి సలహా మేరకు లోట్టో 6/49 లాటరీ కొనుగోలు చేసింది. కానీ జాక్పాట్ వస్తుందని ఊహించలేదు. అసలు ఫలితాలు ప్రకటించే సమయానికి జూలియట్ లామర్ ఆ టిక్కెట్ గురించి దాదాపు మర్చిపోయింది కూడా. తీరా వచ్చాక సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనైంది. (ఇదీ చదవండి: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) తన తొలి లాటరీ టిక్కెట్పై గోల్డ్ బాల్ జాక్పాట్ ..ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లామర్ పేర్కొంది. మనీ మేనేజర్, తండ్రి సహాయంతో గెలుపొందిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడతానని పేర్కొంది. ముఖ్యంగా డాక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి గెలిచిన మొత్తంలో కొంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందట. -
లేటు వయసులో జాక్పాట్.. రూ.5కోట్లు గెలుచుకున్న వృద్ధుడు
చండీగఢ్: అదృష్టం తలుపుతడితే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి అంటారు. పంజాబ్ డేరాబస్సికి చెందిన ఓ వృద్ధుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 88 ఏళ్ల వయసులో అతనికి జాక్పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి పూలమాలలు వేసి అభినందించారు. లాటరీ గెలుచుకున్న ఇతని పేరు మహంత్ ద్వారకా దాస్. డేరాబస్సిలోని త్రివేది క్యాంప్లో నివాసముంటున్నాడు. 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అయితే ఇతనికి ఓ అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒకరోజు అదృష్టం తన తలుపుతట్టి కుటుంబం తలరాత మారుతుందని ఆశించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత అదే నంబర్కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. లాటరీ గెలుచుకున్న వృద్ధుడు.. ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు రానుంది. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని మహంత్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన లాటరీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: హిమగర్భంలో భారీ ఉల్క -
లాటరీలో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
-
లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...థాయ్లాండ్కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్కన్రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది. ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే మణిత్, అంగన్రాత్లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు. (చదవండి: బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....) -
Hyderabad: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!
సాక్షి, హైదరాబాద్: సార్, మీరు చాలా అదృష్టవంతులు మీ ఫోన్ నంబర్ రూ. 25 లక్షల లాటరీ మనీ గెలుచుకుంది. వెంటనే మేం అడిగిన డాక్యుమెంట్స్ను అందించండి.. మీ రూ. 25 లక్షల చెక్కును సొంతం చేసుకోండి.. అంటూ నాలుగేళ్ల క్రితం ఓ అనామకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్కు స్పందించాడు చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు. డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు పంపగా.. రూ. 25 లక్షలు.. ఇపుడు కోట్లకు చేరుకుందని ఆశపెట్టి ఇప్పుడు అప్పులబారిన పడేలా చేశారు సైబర్ కేటుగాళ్లు. చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు వృత్తి రీత్యా ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో రూ. 25 లక్షల లాటరీ గెలిచాననే ఆనందంలో ఇదంతా ఫేక్ అనేది గ్రహించలేకపోయాడు. రూ. 25 లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేస్తే పోయేదేముందనుకుని సైబర్ కేటుగాళ్లు అడిగినప్పుడల్లా వేలకు వేలు పంపాడు. ఇతను పంపుతున్న కొద్దీ అక్కడ లాటరీ మనీ పెరుగుతుందని నమ్మించారు. రూ. 25 లక్షల నుంచి రూ. 14 కోట్లు గెలుచుకున్నావంటూ ఊహల్లో కోటీశ్వరుడిని చేసేశారు. ఆ రూ.14 కోట్ల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వారికి చెప్పిన అకౌంట్లకు పంపాడు. ఈ నాలుగేళల్లో తన సొంత డబ్బు, కుటుంబీకుల దగ్గర తీసుకున్నవి, స్నేహితుల దగ్గర అప్పుల చేసి మరీ వెచ్చించాడు. వారు లాటరీ డబ్బు పెంచుతూ ఇతని వద్ద డబ్బు కాజేస్తున్నారే తప్ప.. ఇతనికి వచ్చిన లాటరీ డబ్బు మాత్రం ఇవ్వట్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు ఇదంతా ఫేక్ అని గ్రహించి సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎ ప్రసాద్ తెలిపారు. లాభాలంటూ రూ. 16 లక్షలు లూటీ అంబర్పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. కోటీశ్వరుడివి అవుతావంటూ ఆశ పెట్టడంతో క్యాట్ డీడీ డాట్కామ్, క్యాట్ జీఎస్టీ డాట్కామ్లలో ఇప్పటి వరకు రూ. 16.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవడంతో బాధితుడు సిటీ సైబర్క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు ...కానీ భార్య, పిల్లలకు చెప్పకుండా..
ఒక వ్యక్తికి ఏకంగా రూ. 248 కోట్లు ఫ్రైజ్మనీ గెలుచుకున్నాడు. కానీ ఈ విషయం తన భార్యకు పిల్లలకు చెప్పలేదట. పైగా చెబితే వారుకి ఎక్కడ అహంకారం నెత్తికెక్కి సోమరులుగా మారతారని చెప్పలేదంటున్నాడు. వివరాల్లోకెళ్తే...చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ. 248 కోట్ల ఫ్రైజ్మనీ గెలుచుకున్నాడు. అతను అక్టోబర్ 24న ఫ్రైజ్మనీని కలెక్ట్ చేసుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. అతను ఈ డబ్బును తీసుకునేటప్పుడూ కూడా కార్టూన్ వేషంలో వచ్చి తీసుకున్నాడు. అత్యంత గోప్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత అధికారులు సదరు వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతానికి లీగా గుర్తించారు. తాను ఇంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లుతన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేదన్నాడు. ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే గాక పిల్లలు సరిగా చదువుకోవడం మానేస్తారని చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం సుమారు రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా దాదాపు రూ. 147 కోట్లు ఇంటికి తీసుకువెళ్లనున్నాడు. తాను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఈ సారి మ్రాతం ఈ నెంబర్కి భారీ మొత్తంలో లాటరీ తగిలిందని లీ ఆనందంగా చెప్పుకొచ్చాడు. (చదవండి: గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా) -
ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....
యూఎస్లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు. ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది. అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్లలోనూ, గ్యాస్స్టేషన్లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
అమ్మ మాట విని కోటీశ్వరురాలైన కూతురు
వాషింగ్టన్: అమ్మ చెప్పిన సలహాను పాటించి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో రూ.2 కోట్లు తగిలి ఆనందంలో తేలిపోయింది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. ఈ సంతోషంలో రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతోంది. లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల ఈ మహిళ పేరు గినా డిల్లార్డ్. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముంటోంది. తల్లితో కలిసి గ్రాసరీ షాప్కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని డిల్లార్డ్కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృష్టవశాత్తు ఆమే గెలిచింది. 2,54,926 డాలర్ల జాక్పాట్ కొట్టింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2కోట్లకు పైమాటే. తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది. చదవండి: శ్రీలంకకు జిన్పింగ్ ఆఫర్.. -
England: లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
-
అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
లండన్: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని లండన్లోని గ్లూసెస్టర్కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్లో జో(49), జెస్థ్వైట్(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో.. కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు. చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట! -
ఏమా అదృష్టం.. పెయింటర్ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
అదృష్టం అంటే ఇదే.. కోట్లలో లాటరీ!
లాటరీ తగిలితే.. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుంది. ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లాటరీ గెలిస్తే.. సంతోషానికి హద్దు ఉండదు. అచ్చం ఇటువంటి ఓ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో చోటు చేసుకుంది. మసాచుసెట్స్లోని అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన గెట్వెల్ కార్డులో వన్ మిలియన్(రూ.7.5 కోట్లు) డాలర్ల లాటరీ తగిలింది. మసాచుసెట్స్ రాష్ట్ర లాటరీ కమిషన్ తెలిపిన వివారాల ప్రకారం.. మెక్లీష్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టిక్కెట్లను తిసుకున్నాడు. అయితే సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేయగా.. వన్ మిలియన్ భారీ లాటరీ గెలుచుకున్నాడు. అన్ని టాక్స్లు పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 20 డాలర్లు (రూ.1500) పెట్టి కొన్న లాటరికీ 6,50,000 డాలర్లు (రూ. 4.8 కోట్లు) పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం
లండన్ : అదృష్టం మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం ద్వారా చేతికి దక్కిన దాన్ని అనుభవించే రాత కూడా ఉండాలి. ఆ రాత లేనప్పుడు మనం కోట్లు సంపాదించినా వృధానే.. విషాదం వెంటాడితే మనం సంపాదించినవేవీ దాన్ని అడ్డుకోలేవు. ఇంగ్లాండ్కు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడి జీవితమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 16 ఏళ్లకు కోట్లు గెలుచుకుని, సరిగ్గా ఏడేళ్లకు.. 23 ఏళ్ల వయసులో మృత్యువాతపడ్డాడు. వివరాలు.. ఇంగ్లాండ్, బ్యాలీమార్టిన్కు చెందిన కాలమ్ ఫిట్జ్ పాట్రిక్కు 2014లో నేషనల్ లాటరీ ‘‘లాటో’’లో 4 కోట్ల రూపాయలు తగిలింది. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఇంగ్లాండ్లోనే లాటో లాటరీ తగిలిన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. తండ్రి కోలిన్, తల్లి షైలా, ముగ్గురు చెల్లెల్లతో ఉంటున్న అతడు వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా తన కోర్కెల్ని తీర్చుకుంటూ వస్తున్నాడు. 2017లో ఓ కారు కొనుక్కున్నాడు. తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆట కోసం కొంత మొత్తం ఖర్చుచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితమే అల్స్టర్ యూనివర్శిటీనుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అంతా బాగా జరుగుతోంది అనుకున్న సమయంలో గత మంగళవారం ఫిట్జ్ పాట్రిక్ మరణించాడు. అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గత శుక్రవారం సేయింట్ కాలమ్స్ చర్చిలో అతడి అంత్యక్రియలు జరిగాయి. అతడి అకాల మరణంపై పలువురు సంతాపం తెలియజేశారు. ఫిట్జ్ పాట్రిక్ మృతిపై అతడి సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ నా బెస్ట్ ఫ్రెండ్,అన్నయ్య.. మేము నిన్నెంత ప్రేమిస్తున్నామో చెప్పలేదు.. నీకెప్పటికీ తెలియదు కూడా’’ అని పేర్కొంది. -
మహిళా వ్యాపారి నిజాయితీ.. రూ. 6 కోట్ల లాటరీని...
కొచ్చి : నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది కేరళకు చెందిన ఓ లాటరీ వ్యాపారి. రూ. 6 కోట్ల లాటరీ టికెట్ను విజేతకు అందించి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన 37 ఏళ్ల స్మిజ లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గత ఆదివారం ఆమె దగ్గర అమ్ముడుపోని 12 బంపర్ లాటరీ టికెట్లు ఉన్నాయి. తరుచూ టికెట్లు కొనేవాళ్లు కూడా ఎవరూ షాపు దగ్గరకు రాలేదు. దీంతో ఆమె చంద్రన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు ఆ టికెట్లు అన్నీ తానే కొన్నాడు. ఆ రోజు సాయంత్రమే లాటరీ గెలుచుకున్న టికెట్కు సంబంధించిన వివరాలు ప్రకటించబడ్డాయి. చంద్రన్ కొనుక్కున్న టికెట్లలో ఓ దానికి రూ. 6 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆమె వెంటనే చంద్రన్ ఇంటికి చేరుకుని టికెట్ను అతడికి అందించింది. దీంతో జనం ఆమెను ప్రశంసలతో ముంచెత్తటం మొదలుపెట్టారు. దీనిపై స్మిజ మాట్లాడుతూ.. ‘‘ చంద్రన్కు రూ. 6 కోట్ల టికెట్ను ఇచ్చిన తర్వాత అతడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా నిజాయితీని మెచ్చుకుంటూ అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఇలాంటి వన్నీ మామూలే. టికెట్ కొనటానికి డబ్బులకోసం కష్టపడే కస్టమర్ల ద్వారానే మా పూట గడుస్తోంది కాబట్టి మేము నిజాయితీగా ఉండక తప్పదు. నేను, నా భర్త కాక్కనాడ్లోని గవర్నమెంట్ ప్రెస్లో పనిచేసేవాళ్లం. 2011లో ఈ వ్యాపారం మొదలుపెట్టాము. మొత్తం 5 గురు ఉద్యోగులు ఉండేవారు. మా ఉద్యోగాలు పోయిన తర్వాత మేమిద్దరమే వ్యాపారం చూసుకుంటున్నాము’’ అని తెలిపింది. చదవండి.. చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. -
ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా!
కొంత మంది యువకుల మధ్య పలు రకాల పోటీలు పెట్టి విజేతతో వధువుకు వివాహం చేయడం పురాణాల్లోనూ, పురాతన కాలంలోనూ జరిగేదని విన్నాం. ఇలాంటి స్వయం వరమే.. కాకపోతే కొంచెం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించిన నలుగురు యువకుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వధువును కట్టబెట్టారు. ఈ సంఘటన ఇటీవల రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. అసలేమైందంటే.. అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు. ఆ నలుగురు కలసి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఎవర్నీ కాదనకుండా ఆ నలుగురినీ ప్రేమించింది. కొంతకాలం ఈ చతుర్ముఖ ప్రేమాయణం సాగిన తర్వాత.. ఆ నలుగురూ కలసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి పెట్టారు. రెండు రోజుల తర్వాత ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అమ్మాయి గ్రామానికి చేరింది. విషయం బయటపడ్డ తర్వాత ఆ లవర్లను బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యాడు. అయితే అతన్ని గ్రామస్తులు వారించారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. పెద్దలు ఆ అమ్మాయిని పిలిచి నలుగురిలో నీకెవరంటే ఇష్టం అని అడిగారు. ఆ అమ్మాయి.. తడుముకోకుండా నలుగురూ ఇష్టమే అని చెప్పింది. అమ్మాయి ఎటూ తేల్చకపోవడంతో.. తర్వాత అబ్బాయిలు నలుగురినీ పిలిచి.. మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీనిని నలుగురూ ఒప్పుకోలేదు. దీంతో పెద్దలు తల పట్టుకున్నారు. ఇలా మూడు రోజులు చర్చలతోనే గడిచిపోయాయి. ఇక నాలుగో రోజు ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని విశ్వసించారు. లవర్సు, పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పులై నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. చదవండి: మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి అతడి పరిచయంతో ఆమె జీవితం మారింది -
హెచ్1బీ లాటరీకి చెల్లుచీటి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి స్వస్తి పలికింది. హెచ్–1బీ వీసాల మంజూరు విషయంలో మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. నూతన ఎంపిక ప్రక్రియ 60 రోజుల్లో అమల్లోకి రానుంది. హెచ్–1బీ వీసాకు భారీ డిమాండ్ ఉంది. ఇది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసాతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలోనే నియమించుకోవచ్చు. అమెరికా ఐటీ కంపెనీలు ప్రతిఏటా భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను ఈ వీసా ద్వారానే రప్పించుకుంటున్నాయి. తదుపరి హెచ్–1బీ వీసా ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. అమెరికాలోకి వలసలను నిరోధించే దిశగా ఇది మరో ప్రయత్నమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో భారతదేశ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పునఃసమీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం నోటిఫికేషన్పై ఐటీ వర్గాలు స్పందించాల్సి ఉంది. -
25 టికెట్లు కొంటే 25 లాటరీలు గెలిచాడు
వర్జీనియా: ఒక్కసారి లాటరీ తగిలితే ఏమంటారు? అదృష్టం అంటే నీదే అని! మరి రెండు సార్లు లాటరీ గెలుస్తే? మహా అదృష్టమంటారు.. పోనీ మూడు, నాలుగోసారి కూడా గెలిస్తే.. అదృష్టానికి నిలువెత్తు రూపం, అదృష్ట దేవత నీ ఇంట్లో తిష్ట వేసిందంటూ పొగడ్తలు కురిపిస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం మాటల్లో చెప్పలేనంత లక్కీ పర్సన్. అవును, అతను ఏకంగా 25 లాటరీలు గెలుపొందాడు. లక్ లక్కలా అతుక్కున్న ఈ వ్యక్తి పేరు రేమండ్ హారింగ్టన్. ఈయన అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ రోజు సరదాగా బీచ్కు వెళ్లగా అక్కడి వేగ్నమ్ దుకాణంలో 25 డాలర్లు వెచ్చించి 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. (ఉద్యోగం ఊడింది, భారీ లాటరీ తగిలింది) తీరా ఏమాత్రం లెక్క తప్పకుండా అతను కొనుగోలు చేసిన 25 టికెట్లు అన్నీ కూడా లాటరీను గెలుచుకున్నాయి. ప్రతి టికెట్కు 5 వేల డాలర్లు బహుమానంగా వస్తాయి. ఈ లెక్కన అతను మొత్తంగా 1,25,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 93 లక్షల 81 వేల రూపాయలు) గెలుచుకున్నాడు. దీంతో తొలుత అవాక్కయిన అతను తర్వాత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ డబ్బును తన కొడుకుల విద్యకు ఖర్చు పెడతానని, తద్వారా వారికి మంచి భవిష్యత్తును అందించేందుకు ఉపయోగిస్తానంటున్నాడు. (వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ) -
ఉద్యోగం ఊడింది, భారీ లాటరీ తగిలింది
కాన్బెర్రా: ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకునే ఉంటుందనేందుకు ఓ తండ్రి కథ రుజువుగా నిలిచింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాదిమందిలో ఆస్ట్రేలియాలోని ఆర్మడేల్కు చెందిన యువ తండ్రి ఒకరు. కరోనాకు ముందు అతను సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఎప్పుడైతే వైరస్ ప్రభంజనం మొదలైందో అప్పుడు అతని ఏకైక ఆదాయ మార్గమైన ఉపాధి కూడా కోల్పోయాడు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇదిలా వుంటే ఓరోజు అతను తన మూడేళ్ల కూతురు కోసం దుకాణంలో వస్తువులు కొనడానికి వెళ్లాడు. అయితే ఆ షాపులోని లాటరీ టికెట్లు అతని దృష్టిని ఆకర్షించాయి. (కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!) ఎందుకైనా మంచిది అని ఓజ్ లాటో నుంచి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు లాటరీ విజేతను నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఈ విషయం ఆయనకు తెలియదు. ఓ రోజు అతనికి లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తి మాటల మధ్యలో లాటరీ టికెట్ విజేత డబ్బు తీసుకునేందుకు ఇంతవరకూ ముందుకు రాలేదని చెప్పాడు. దీంతో అతను తన టికెట్ నంబర్ను చెక్ చేసి చూడగా ఆ విజేత తనేనని తెలిసింది. అక్షరాలా 31 కోట్ల రూపాయలు అతని సొంతమవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. "వెంటనే ఇంటికి వెళ్లి నా బంగారు బిడ్డను గట్టిగా హత్తుకుంటా" అని సంతోషంగా చెప్పుకొచ్చాడు. అలాగే తన సోదరుడు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఇప్పుడు తానే ఓ ఇల్లు కొనిస్తానంటున్నాడు. (లైవ్లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్)