-
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదిక
డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు అధిక ఉద్యోగావకాశాలున్నట్లు లింక్డ్ఇన్ కెరీర్ స్టార్టర్ 2024 నివేదిక వెల్లడించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో కంపెనీలు పనిప్రదేశాల్లో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగాలు 15% తగ్గాయి. ఎంట్రీలెవల్ ఉద్యోగాల కోసం కంపెనీలు హైబ్రిడ్ వర్క్కల్చర్ను 52% పెంచాయి. దాంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు పనిచేసేందుకు వీలుగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుటిలిటీస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చమురు, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఫెషర్లను ఎక్కువగా నియమించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ , సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో ఫ్రెషర్లను ఎంపికచేస్తున్నారు. కమ్యూనిటీ, సోషల్ సర్వీసెస్, లీగల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేయని వారికి విద్య, సాంకేతికత, సమాచారం, మీడియా, మానవ వనరులు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీలేనివారు సైతం సాఫ్ట్వేర్ ఇంజినీర్, సెక్రటరీ, డిజైన్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల్లో తమ కెరియర్ ప్రారంభించవచ్చు.ఇదీ చదవండి: సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలులింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ మాట్లాడుతూ..‘కంపనీల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగంకోసం చూస్తున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని చెప్పారు. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి. -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్కు గుడ్బై చెప్పింది. ఇకపై అజ్యూర్ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే.. లింక్డ్ఇన్ నివేదిక
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందువరుసలో నిలిచింది. గత కొద్దికాలంగా టాప్లో నిలుస్తున్న టీసీఎస్ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్ఇన్ టీసీఎస్కు ఈస్థానం కల్పించింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో టెక్ కంపెనీలే ఉండడంతో వాటి హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే.. ఈ జాబితాను తయారుచేసేందుకు సంస్థ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. కెరియర్ గ్రోత్ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థిరత్వం అవకాశాలు ఉద్యోగుల సంతృప్తి వైవిధ్యం ఉద్యోగుల విద్యార్హతలు దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సేవలందిస్తున్న లెంత్రా.ఏఐ సంస్థ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. ఇదీ చదవండి: యాపిల్కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్ లింక్డ్ఇన్ జాబితాలోని టాప్-25 సంస్థలు టీసీఎస్ యాక్సెంచర్ కాగ్నిజెంట్ మాక్వెరీ గ్రూప్ మోర్గాన్ స్టాన్లీ డెలాయిట్ ఎండ్రెస్ప్లస్ హోసర్ గ్రూప్ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ జేపీమోర్గాన్ చేజ్అండ్కో పెప్సీకో డీపీ వరల్డ్ హెచ్సీఎల్ టెక్ ఈవై ష్నైడర్ ఎలక్ట్రిక్ అమెజాన్ కాంటినెంటల్ మాస్టర్కార్డ్ ఇంటెల్ కార్పొరేషన్ ఐసీఐసీఐ బ్యాంక్ మిషెలిన్ ఫోర్టివ్ వెల్స్ ఫార్గో గోల్డ్మన్ సాక్స్ నోవో నోర్డిస్క్ వియాట్రిస్ -
మీలో ఈ స్కిల్స్ ఉంటే చాలు.. ‘AI’ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు!
ప్రపంచ దేశాల్లో కృత్తిమ మేధ (ఏఐ) ఉద్యోగులకు ఓ సవాల్ విసురుతోంది. ఇందులో ప్రావిణ్యం ఉంటేనే ఉద్యోగిగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా సంస్థలన్నీ ఇప్పుడు ఏఐలో నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఏఐతో పాటు పలు విభాగాల్లో నిష్ణాతులైన వారు మాత్రమే కోరుకున్న ఉద్యోగంలో, కోరుకున్న జీతంతో సెటిల్ అవుతున్నారు. లేదంటే పోటీ ప్రపంచంతో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కంపెనీలు ప్రకటిస్తున్న లేఆప్స్లో ముందు వరసలో ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కి చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్ కంటెంట్ స్ట్రాటజీ గ్లోబుల్ హెడ్ డాన్ బ్రాడ్నిట్జ్ ఉద్యోగార్ధుల కోసం కీలక అంశాలను లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఈ పనులు ఏఐ కూడా చేయలేదు సంస్థలు ఏఐ నిపుణులను ఏరికోరి ఉద్యోగాలిస్తుంటే.. కృత్తిమ మేధ అవసరంలేని, కేవలం మనుషులు మాత్రమే చేసే కొన్ని ప్రత్యేక ఉద్యోగాలున్నాయి. ఆ ఉద్యోగాలకు ఆయా స్కిల్స్ ఉన్న వర్క్ ఫోర్స్ అవసరం. కానీ డిమాండ్కు తగ్గట్లు ఉద్యోగులు లేకపోవడంతో ఈ స్కిల్స్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది అంతేకాదు సంబంధిత స్కిల్స్లో ఇప్పటికే నిష్ణాతులైన నిపుణులతో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా ఉద్యోగిలో స్కిల్స్ ఉంటే మాత్రం ఉద్యోగానికి తిరుగుడుందని డాన్ బ్రాడ్నిట్జ్ వెల్లడించారు. బ్రాడ్నిట్జ్ పేర్కొన్న స్కిల్స్ వ్యక్తిగత కెరీర్ వృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాల జాబితాలో తొలిస్థానంలో ఉన్నాయని లింక్డిన్ వైస్ ప్రెసిడెంట్ అనీష్ రామన్ అంచనా వేస్తున్నారు. ఇక లింక్డిన్ సర్వే ఆధారంగా ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది సీఈఓలు తప్పని సరిగా ప్రతి ఉద్యోగిలో ఈ నైపుణ్యాలు ఉండాలని చెప్పారు. భవిష్యత్కు భరోసా వాటిల్లో కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్, లీడర్షిప్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్, అనలిటిక్స్, టీమ్ వర్క్, సేల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రీసెర్చ్ ఈ నైపుణ్యాలు ఉంటే సంస్థల్లో ఉద్యోగులకు ఢోకా ఉండదని, ఈ ఏడాదిలో అత్యధికంగా డిమాండ్ ఉన్న స్కిల్స్గా ప్రసిద్ధి చెందాయని లింక్డిన్ కంటెంట్ స్ట్రాటజీ గ్లోబుల్ హెడ్ డాన్ బ్రాడ్నిట్జ్ చెబుతున్నారు. -
భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ 'లింక్డ్ఇన్' (LinkedIn) ఇటీవల స్టేట్ ఆఫ్ AI @ వర్క్ రిపోర్ట్ ప్రారంభించింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు గ్లోబల్ ఏఐ కన్వర్జేషన్ ఏకంగా 70 శాతం పెరిగినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఏఐ మీద ఆధారపడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం మంది, భారతదేశంలో 5.6 శాతం మంది ఈ రంగంలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటున్నారు. కంపెనీలు కూడా ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. అధికా వేతనాలు ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల డిమాండ్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మీడియా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అధికంగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ రంగాల్లో ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అధికా వేతనాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో ఏఐ వర్క్ఫోర్స్ లెర్నింగ్ వేగవంతమవుతుంది. ఏఐ సంబంధిత కోర్సులను చూసే సభ్యలు సంఖ్య ఈ త్రైమాసికంలో 80% పెరిగినట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది. ప్రపంచంలోని చాలామంది నిపుణులు ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్, పర్సనల్ ఎఫెక్టివ్నెస్, పర్సనల్ డెవలప్మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్లో పెట్టుబడి పెడుతున్నారు. నిజానికి ఏఐ నెపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించే వారు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'కి చెందిన సాధారణ పనులు మాత్రమే కాకుండా.. సాఫ్ట్ స్కిల్స్ అవసరమయ్యే ఇతర రకాల అర్థవంతమైన సృజనాత్మక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీ ప్రధాన్యతను పెంచడంలో సహాయపడతాయి. కంపెనీల ప్రాధాన్యత రాబోయే రోజుల్లో ఏఐకి సంబంధించిన హబ్రిడ్ ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి. హైబ్రిడ్ వర్క్ సెట్టింగ్ల పరిధిని పెంచడంలో భాగంగా ఏఐ ఉద్యోగాలు 2023 ఆగస్టులో నుంచి 2023 ఆగస్టు నాటికి 13.2 శాతం నుంచి 20.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ టెక్నాలజీలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. 90 దశకంలో ఇంటర్నెట్ ద్వారా జరిగిన వృద్ధికి సమానమైన అభివృద్ధి ఏఐ ద్వారా జరగనుంది. 2024లోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుంది.. ఇందులోనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఈ టెక్నాలజీలో అవగాహన కలిగిన వారు భవిష్యత్తులో నాయకులుగా ఉంటారని అన్నారు. -
ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా కొంతమంది మీద ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేఆప్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మెటా సైతం ఇప్పటి వరకు సుమారు 20వేలమందిని ఇంటికి పంపింది. ఇందులో ఒక ఉద్యోగి లేఆప్స్ మీద తన అసహనం ప్రదర్శిస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టింది. జాబ్ పోయి 201 రోజులు (ఆరు నెలల కంటే ఎక్కువ) అవుతోంది, ఇప్పటికి ఒక్క అవకాశం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, పని వాతావరణం మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఫేస్బుక్లో టెక్నికల్ రిక్రూటర్గా పని చేసిన యువతి ఈ పోస్ట్ చేసింది. ఆగిపోయిన చోటే నిలిచిపోయానని, త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ తమ అసహనం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సంస్థ మాత్రం ఇప్పటికి తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. -
LinkedIn ranking: చేస్తే ఈ స్టార్టప్ కంపెనీలోనే పని చేయాలి..
ఇటీవల యునికార్న్గా మారిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో (Zepto) భారత్లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్గా అవతరించింది. ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్ఇన్ రూపొందించింంది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్ను సాధించింది. ఇక ఈ ర్యాంకింగ్లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్ఫామ్ పాకెట్ ఎఫ్ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్ఫారమ్లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్ఫారమ్లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్ను వివరించే స్క్రీన్షాట్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. 2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది. ఏఐ, ఎంఎల్కు ప్రాధాన్యం ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు. -
సీఈవో అండదండలున్న నో జాబ్ గ్యారెంటీ!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు, తగ్గిపోతున్న ప్రాజెక్ట్లతో పాటు ఇతర కారణాల వల్ల చిన్న చిన్న స్టార్టప్ల నుంచి అంతర్జాతీయ టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లేఆఫ్స్ తెగుబడుతున్న సంస్థలు సామర్ధ్యం పేరుతో వారిని బలి చేస్తున్నాయి. అయితే, తాజాగా పనితీరు బాగున్నా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో మెటా సంస్థ సుమారు 6000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో ఓ ఉద్యోగి మెటాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డిన్లో పోస్ట్ చేశారు. మెటాలో ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ టాప్ పెర్మార్లలో ఒకరిగా నిలిచారు. పనితీరు విషయంలో సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రశంసలు సైతం అందుకున్నారు. కానీ కంపెనీలో చేరిన ఏడాదిన్నర తర్వాత విధుల నుంచి తొలగించినట్లు వాపోయారు. టాప్ పెర్ఫామర్, సీఈవో మార్క్ జుకర్బర్గ ప్రశంసలతో మెటాలో తన జాబ్కు ఢోకా ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా 6,000 లేఆఫ్స్లో తాను ఒకరిగా ఉండటాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, వేరే జాబ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
ఏఐ కోచ్.. మీకు త్వరగా జాబ్ వచ్చేలా చేస్తుంది!
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్.. జాబ్ కోసం వెతుకుతున్న యూజర్లకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనంపై పని చేస్తోంది. ‘ఏఐ కోచ్’ పేరుతో పిలుస్తున్న ఈ కొత్త టూల్ ఉద్యోగార్థులకు మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉద్యోగాలను కనుగొని దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ యాప్ రీసెర్చర్ నిమా ఓవ్జీ ట్విటర్లో షేర్ చేశారు. లింక్డ్ఇన్ ఏఐ కోచ్పై పని చేస్తోందని, ఇది జాబ్లకు దరఖాస్తు చేయండం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, వృత్తిపరమైన నెట్వర్క్ను విస్తరించే మార్గాలను అన్వేషించడంలో ఉద్యోగార్థులకు సహాయపడుతుందని అందులో రాసుకొచ్చారు. ఓవ్జీ షేర్ చేసిన లింక్డ్ఇన్ ఏఐ కోచ్ స్క్రీన్షాట్ను చూస్తే ఇంచుమించు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్బాట్ను పోలి ఉంది. ఇందులో ఏఐ కోచ్ ఎలా పని చేస్తుంది.. కంపెనీల వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది.. తదితర వివరాలను మీరు ఏఐ కోచ్ నుంచి ఆరా తీయవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ అయినందున దాని ఏఐ సాంకేతికతతోనే దీన్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి ➤ బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! ప్రస్తుతం అన్నింట్లోనూ ఏఐ ఆధారిత సాధనాలు వస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అన్వేషణలోనూ ఇవి సహాయం చేయనున్నాయి. ఈ దిశలో ‘ఏఐ కోచ్’ ఒక ప్రధాన అడుగు కాబోతోంది. ఇది ఉద్యోగార్థుల సమయం, శ్రమను ఆదా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తన బింగ్ చాట్ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యాప్లు, ఎడ్, గిట్హబ్లకు పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ ముఖ్యమైన ఉత్పత్తులలో లింక్డ్ఇన్ కూడా ఒకటి కావడం వల్ల ‘ఏఐ కోచ్’ ద్వారా ఇందులోనూ ఏఐ టెక్నాలజీని పరిచయం చేయబోతోందని చెప్పవచ్చు. #Linkedin is working on LinkedIn Coach! It's an AI ASSISTANT that helps you apply for JOBS, learn new SKILLS, and find more ways to CONNECT with your network! pic.twitter.com/jKBrPmEFJt — Nima Owji (@nima_owji) July 27, 2023 -
15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్లో చోటు దక్కలేదు. లింక్డ్ఇన్లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే... హైస్కూల్లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్ని ఏర్పాటు చేశాడు. బాచ్మానిటీ క్యాపిటల్లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్ఇన్ పోస్ట్లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లింక్డ్ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw — Eric Zhu (@ericzhu105) June 15, 2023 -
హిట్లర్ను పొగిడాడు.. దిగ్గజ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్ దిగ్గజం డెలాయిట్ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్తో అడాల్ఫ్ హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్ హిట్లర్లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ ఎక్కువ’అని పేర్కొన్నాడు. అంతే అడాల్ఫ్ హిట్లర్ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్లు, కోచ్లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. మరోవైపు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది సేపటికే డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు. -
Aakanksha Monga: ఆమె ఊరి పేరు... ప్రపంచం
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్కు తిరిగి ప్రాణం పోసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్ను క్రియేట్ చేసింది. తాజాగా... ట్విట్టర్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
‘ఉద్యోగం విసుగొచ్చింది’.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతున్న యువతి!
ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! అప్పటి నుంచి ఆమె తన ట్రిప్లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్లను షేర్ చేయడం, ఆఫ్బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. I quit my job at LinkedIn. Last year, on this very date. When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time. When I left I was burnt out,had 250k followers on IG, worked alone. Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ — Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023 2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్గా పనిచేసింది. అనంతరం లింక్డ్ఇన్లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్. బిటెక్ చేశామా? బోనస్గా ఏదో ఒక కోర్స్ చేశామా? ఐటీ జాబ్లో చేరిపోయామా? అంతే! లైఫ్ సెటిల్ బిందాస్గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్ కమ్ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్కు ఐటీ జాబ్స్ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులు అనుభవిస్తున్న ఆ భోగభాగ్యాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కంపెనీలు చెల్లించే లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఏం చేసుకోను. మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడే వారు లేకపోతే’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్మనేలా..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది లక్షలు ప్యాకేజీ ఏం చేసుకోను? ఇటీవల బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన వ్యక్తి గత జీవితం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘నేనో ప్రముఖ టెక్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. శాలరీ రూ.58 లక్షలు. అయినా సరే సంతృప్తిగా లేను. ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతున్నాను. ప్రేమగా మాట్లాడేందుకు ప్రేమికురాలు లేదు. స్నేహితులేమో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు’ అంటూ తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. దీంతో అయ్యో పాపం! అనడం నెటిజన్ల వంతైంది. ఐటీ ఉద్యోగుల్ని మరో ప్యాండమిక్ ముంచేస్తుందా? ఐటీ ఉద్యోగుల్లో ఈ తరహా ధోరణికి కారణం కంపెనీల్లో మారిపోతున్న వర్క్ కల్చరేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రిమోట్ వర్క్ కల్చర్ని అమలు చేశాయి. అది కాస్త సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది. దీంతో ఉద్యోగులు నెలల తరబడి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. కానీ ఇలాగే కొనసాగితే వర్క్ కల్చర్లో కోవిడ్ కాకుండా మరో ప్యాండమిక్ సైతం ఆవహించేస్తుందని, ఆ ప్యాండమిక్ పేరే ఒంటరితనమని అంటున్నారు టెక్ నిపుణులు. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఎంఐటీ ఏం చెబుతోంది ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అనేక లాభాలున్నాయి. వర్క్ ప్రొడక్టివిటీ పెరగడం, ప్రయాణం, ఖర్చులు, డబ్బులు ఆదా చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గడపం వంటి స్వల్ప కాలంలో బాగుంటాయి. కానీ సూదీర్ఘంగా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఉద్యోగుల్లో ఒంటరి తనం పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైతం తెలిపింది. రిమోట్ వర్క్తో సహచర ఉద్యోగులతో గడపలేకపోవడం, ఇతరులపై నమ్మకం పెరగడం, శరీరాన్ని కష్టపెట్టకపోవడం వల్ల శారీరక ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు న్యూరో సైన్స్ అధ్యయనంలో తేలింది. అందరి మధ్యలో ఉన్నా ఒంటరిగా ఆఫీస్లో పనిచేస్తూ సహచరులతో మాట్లాడడం, క్యాంటీన్లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. మహమ్మారి ప్రారంభ నెలల్లో రిమోట్గా పని చేస్తున్నప్పుడు ఐదుగురిలో ముగ్గురు (60శాతం) భారతీయ ఐటీ నిపుణులు ఏదో ఒక సమయంలో అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్నామని భావించారు. 16,199 మంది భారతీయ టెక్ నిపుణులపై లింక్డిన్ సంస్థ వర్క్ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కే మా ఓటు ఈ ఏడాది మార్చి నెలలో లింక్డిన్ సర్వేలో 78 శాతం మంది ఇండియన్ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళుతున్నారు. ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో చాలా మంది ఇంట్లో ఉండి పనిచేయడం కంటే ఆఫీస్లో పనిచేయడం వల్ల ఉత్పాదక పెరగుతున్నట్లు సర్వే పేర్కొంది. చివరిగా.. మహమ్మారితో ఆకస్మికంగా పనిలో వచ్చిన మార్పులు ఆనందాన్ని దూరం చేసినట్లు 62శాతం మంది ఉద్యోగులు భావిస్తుండగా.. రిమోట్/హైబ్రిడ్ వర్క్ కల్చర్ రానున్న రోజుల్లో ఉద్యోగులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయోనని టెక్నాలజీ నిపుణులు చర్చించుకుంటున్నారు. చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్న్యూస్! -
లింక్డిన్నూ తాకిన లేఆఫ్ల సెగ.. 700 మంది ఉద్యోగుల తొలగింపు!
ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్కు లేఆఫ్స్ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్ స్లిప్లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్ అప్లికేషన్ను షట్డౌన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లింక్డిన్ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ కొనసాగిస్తుంది. లింక్డిన్ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉సుందర్ పిచాయ్పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? ఆరు నెలల్లో 2,70,000 మంది తొలగింపు గత ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది కోల్పోయారు. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. కాగా, 2016లో లింక్డిన్ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన విసయం తెలిసిందే మైక్రోసాఫ్ట్ సైతం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. వారిలో సప్లయి చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని తొలగించింది. జనవరి 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? -
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? -
ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి...
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ఉద్యోగం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం.. ఇదీ చదవండి: పీఎఫ్ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిది నెలల సుదీర్ఘ శోధన తర్వాత ఇటీవల ఒక టెక్ సంస్థలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల సమయంలో అతను 150 కంటే ఎక్కువ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట కథను లింక్డ్ఇన్లో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ డెవలపర్గా అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాన్ని పొందడం సవాలుగా మారిందన్నాడు. వందలాది కంపెనీలు తనను రిజెక్ట్ చేశాయన్నాడు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 150 కంపెనీలకు అప్లై చేస్తే 10 కంపెనీల నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని, వాటిలో కేవలం ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని వివరించాడు. అమెజాన్ స్కాట్లాండ్తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్లు పూర్తయ్యాయని, కానీ చివరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ సంస్థలో అయితే డీఎస్ఏ రౌండ్లలో రిజెక్ట్ అయిందన్నారు. ఈ పోస్టు రాయడం వెనుక ఉద్దేశం.. పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, ఉద్యోగం కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలియజేయడమేనని వివరించాడు. ఉద్యోగ వేటలో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగాల తీసివేత ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికిన సంస్థలో తాజా ఆకస్మిక తొలగింపులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగాలదీ ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. సోషల్ మీడియాలో గుండెల్ని పిండేస్తున్న కథనాలు, పంచుకుంటున్న అనుభవాలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన గూగుల్ ఉద్యోగి ఆవేదన ఆ కోవలో నిలిచింది. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్గా నిలిచినా కూడా ఉద్యోగంనుంచి తొలగించారంటూ హర్ష్ విజయ్ వారిగ్య తన ఆవేదనను పంచుకున్నారు. (91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్లో బిజినెస్ టైకూన్) గూగుల్ ఆపరేషన్స్ సెంటర్లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య. ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఈ సంతోషంనుంచి తేరుకోకముందే కంపెనీ షాక్ ఇచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చూసి నివ్వెరపోయిననాయన లింక్డ్ఇన్ సుదీర్ఘమైన పోస్ట్లో తన అనుభవాన్ని షేర్ చేశారు. పాప్-అప్ ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన గుండె ఆగినంత పని అయిపోయిందనీ, ''స్టార్'' పెర్ఫార్మర్ని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ తనను తొలగించింది. ఎందుకిలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సంస్థలోని తొలగింపు ప్రభావం ఎలా ఉండబోతోందో వెల్లడించారు. ఇకపై వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే.. ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ ఆగమైపోయాయని పేర్కొన్నారు, ఈ షాక్నుంచి తేరుకుని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని, ఇపుడిక తన మనుగడ కోసం పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు హర్ష్ విజయ్ వారిగ్య. కాగా గురుగ్రామ్లోని గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆకృతి వాలియా ఇటీవలే తొలగించింది సంస్థ. సంస్థలో తన 5 సంవత్సరాల-గూగుల్వర్సరీ వేడుకలను జరుపుకున్న సంతోషంలో ఉండగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ దర్శనమిచ్చింది. మీటింగ్కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థంకావడం లేదంటూ లింక్డ్ ఇన్లో పోస్ట్లో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. -
Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!
టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగించిన వారిలో కింది స్థాయి ఉద్యోగి నుంచి మేనేజర్ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఇటీవల తొలగింపునకు గురైన ఓ ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఆకృతి వాలియా.. గూగుల్ క్లౌడ్లో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసేవారు. ఈ మధ్యనే ఆమె సంస్థలో ఐదో వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్స్లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయారు. తాను ఇంకో పది నిమిషాల్లో మీటింగ్లో పాల్గొనాల్సి ఉండగా తన కంప్యూటర్లో ‘యాక్సిస్ డినైడ్’ అని కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయారు. మొదట్లో నమ్మలేకపోయిన ఆమె తర్వాత విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గూగుల్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో ఉద్యోగం తన కలలన్నింటినీ సాకారం చేసిందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కంపెనీ తనకు సహాయపడిందని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ ఉంది కార్! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9) అయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని తన ఆరేళ్ల కూతురుకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దీని బయట పడి ముందుకు వెళ్లగలను. అయితే ప్రస్తుతం అమ్మా నువ్వు ఎందుకు వర్క్ చేయడం లేదని నా చిన్నారి పాప అడిగితే వివరించడం చాలా నాకు చాలా కష్టతరమైనది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.