-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ నేతలతో జగన్ సమావేశం
-
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే.. -
ఎన్డీయే పక్ష నేతగా మోదీ.. ఎల్లుండి రాష్ట్రపతి చెంతకు భాగస్వామ్య పక్ష నేతలు
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు సాగిన భాగస్వామ్య పక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ సారథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటునకు తీర్మానం చేశారు కూటమి పార్టీల నేతలంతా. ఆపై మోదీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్, శివసేన షిండే వర్గం, ఇతర నేతలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీయే సమావేశంలో తీర్మానంమోదీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాటం చేశాముఎన్డీయే ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ సాధించిందిమరోసారి ఆయన సారథ్యంలోనే ముందుకు సాగాలని నిర్ణయించాంమోదీనే మేం నాయకుడిగా ఎన్నుకుంటున్నాంపేదలు, మహిళలు , యువత, రైతుల కోసం ఎన్డీయే పనిచేస్తుందిఎన్డీయే పార్టీ నేతలంతా ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంది. అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రపతి ముర్మును కలుస్తారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి(హ్యాట్రిక్) ప్రమాణం చేయనున్నారు. पीएम @narendramodi के आवास पर एक घंटे चली #NDA की बैठक पूरी हुई pic.twitter.com/fkxmYSVW5Y— Pramila Dixit (@pramiladixit) June 5, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. అభినందనలు తెలుపుకోవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి పార్టీలు చర్చించాయి. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనేతలు బుధవారం మధ్యాహ్నానికే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ తరఫున అగ్రనేతలు అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఈ భేటీకి హాజరయ్యారు. అలాగే.. కూటమి పార్టీల తరఫున జేడీయూ నుంచి నితీశ్ కుమార్, తెలుగు దేశం పార్టీ నుంచి చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 292 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. బీజేపీ(240), టీడీపీ(16), జేడీయూ(12), ఏక్నాథ్ షిండే శివసేన(7), ఎల్జేపీ(5), జనసేన(2), ఏజీపీ(1), హిందుస్తానీ ఆవామీ మోర్చా(1), అప్నాదళ్(1), ఎన్సీపీ అజిత్ పవార్(1) ఇతరులు(2) ఉన్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీయే సమావేశానికి ఆ పార్టీల నేతలంతా హారయ్యారు.ఇదీ చదవండి: ఫలితాలపై మనస్తాపం.. రాజీనామాకు సిద్ధం -
ఆడుకుంటూ కారులో ఎక్కి ఊపిరాడక.. మణుగూరులో విషాద ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది. -
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
దేశంలో అంతర్యుద్ధం నడుమ.. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలోనే తమ బిడ్డ కనిపించకుండా పోయాడు. నెలల తరబడి వెతికినా లాభం లేకుండాపోయింది. చివరకు చనిపోయాడని నిర్ధారించేసుకున్నారు వాళ్లు. సరిగ్గా.. పాతికేళ్ల తర్వాత అదే వీధిలో ఓ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబానికి నోట మాట రాలేదు. 1998లో అల్జీరియాలో అంతర్యుద్ధం జరిగిన టైంలో ఒమర్ బీ అనే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని కొన్నాళ్లూ.. ఆ తర్వాత కూడా ఆచూకీ దొరక్కపోవడంతో చంపేసి ఉంటారని అతని కుటుంబం నిర్ధారణకు వచ్చింది.26 ఏళ్లు గడిచాక.. ఒమర్ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో అతన్ని బంధించినట్లు కుటుంబం తెలుసుకుంది. వెంటనే ఒమర్ సోదరుడు ఆ బంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఆస్తి పంపకాల తగాదాలు.. ఆ కేసు కోర్టులో నడుస్తుండడంతో దగ్గరి బంధువే ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు తేలింది.అల్జీరియా డిజెల్ఫా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్కు పాల్పడిన నిందితుడు పారిపోయే యత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్చేశారు. 45 ఏళ్ల వయసులో ఒమర్ను చూడగానే ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం. అయితే.. కిడ్నాప్ చేసి పొరుగింట్లోనే పాతికేళ్లుగా బంధించడం నమ్మశక్యంగా లేదంటున్న పోలీసులు.. సమగ్రంగా దర్యాప్తు చేపట్టాకే కేసు వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. -
Priyanka Kholgade: స్టైలిష్ లుక్లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
ఇప్పుడు 1 షేరుకు 20 షేర్లు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటన!
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:40AM 16 January 2024
-
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
మిచౌంగ్ తుపాన్ : కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలం (ఫొటోలు)
-
సాక్షి స్పీడ్ న్యూస్@08:30AM 23 November 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@08:30AM 21 November 2023
-
మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్@8AM 14 November 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@08:45AM 08 November 2023
-
కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
-
కోహ్లీ, గంభీర్ గొడవ గురించి ప్రత్యక్ష సాక్షి మాటల్లో...
-
IPL 2023: కావ్య పాప నవ్విందోచ్
-
అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?
2023 ప్రారంభం నుంచి ఎంతోమంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, గత మూడు నెలల కాలంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. భారతీయుల నిరుద్యోగిత రేటు మార్చి నెలలో మునుపటికంటే పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఎంతోమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ డేటాను సిఎమ్ఐఈ విడుదల చేసింది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని కూడా స్పష్టం చేసింది. డిసెంబర్ 2022లో నిరుద్యోగుల రేటు 8.30 శాతం ఉండేది, అయితే ఈ రేటు 2023 జనవరి నాటికి 7.14 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 7.8 శాతానికి పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే డీలర్ యార్డ్లో కనిపించిన మారుతి జిమ్నీ - పూర్తి వివరాలు) మార్కెట్లో తీవ్ర క్షీణత ఏర్పడిన కారణంగా 2023 మార్చిలో ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరుగుదల 39.8 శాతానికి చేరిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ 'మహేష్ వ్యాస్' తెలిపారు. అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత జాబితాలో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం: ఇండియన్ స్టార్టప్ సీఈఓ డీకోడ్స్
అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్గా కీర్తి పొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) పతనం ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 సంవత్సరం ఆర్ధిక సంక్షోభం తరువాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్ ఎస్వీబీ కావడం గమనార్హం. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్ నుంచి సుమారు 42 బిలియన్ డాలర్లను ఒక్కసారిగా ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని వినియోగదారులకు ఎస్వీబీ యాజమాన్యం లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. (ఇదీ చదవండి: సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్) 1980 నుంచి US స్టార్టప్లకు కీలక రుణదాతగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, భారతదేశంలోని అనేక స్టార్టప్లను కూడా ప్రభావితం చేసింది, అంతే కాకుండా వారి రోజువారీ నగదు అవసరాలు, ఇతర నిర్వహణ ఖర్చులను కూడా దెబ్బతీసింది. హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్వర్క్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రుచిత్ జి గార్గ్, భారతదేశంలోని స్టార్టప్ ఓనర్లలో ఒకరు, సుమారు పది సంవత్సరాలుగా ఎస్వీబీతో బ్యాంకింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం మా వద్ద డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. పూర్తి ప్రణాళిక, అదృష్టం ద్వారా మేము భారతీయ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఇప్పటికే చాలా డబ్బు సంపాదించామని, అందులో ఎక్కువ భాగం ఆ బ్యాంకులోని ఉన్నట్లు చెప్పారు. (ఇదీ చదవండి: భారత్లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, US వెంచర్-బ్యాక్డ్ టెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలలో కనీసం 50 శాతం SVBతో బ్యాంకింగ్ సంబంధాలను కలిగి ఉన్నాయి. అనేక భారతీయ స్టార్టప్లు ఇందులో డిపాజిట్లు, పెట్టుబడులను కలిగి ఉన్నాయి. మిస్టర్ గార్గ్ భారతీయ సంస్థలపై పతనం ప్రభావాన్ని వివరించడానికి డెట్, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. -
ఆగని తొలగింపుల పర్వం.. ట్విటర్ నుంచి మరో 200 మంది
ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ట్విటర్ సంస్థ మరో సారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ కంపెనీ సారి మరో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఇందులో ప్రోడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఈ తొలగింపులు గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ట్విట్టర్ బ్లూ ఇన్చార్జ్గా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ పేరు కూడా తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ట్విటర్ సంస్థలో 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని గత నెలలో ఎలాన్ మస్క్ తెలిపారు. తాజా నివేదికల ప్రకారం, 200 మంది తొలగింపు నిజమయితే ఎలాన్ మాస్క్ ప్రకటించిన సంఖ్య ఇంకా తగ్గుతుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ సమయంలో, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ఎదుర్కొనే నష్టాలను కూడా అదుపు చేయడానికి ఉద్యోగులను తొలగించినట్లు మస్క్ ప్రకటించారు. (ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!) గత ఏడాది నుంచి ఉద్యోగులను తొలగిస్తున్న ఎలాన్ మస్క్ కొన్ని సార్లు ఇక ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు. అయితే అది నిజం కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా శక్తిని రద్దు చేశారు.. సీజేఐ సమక్షంలో ఉపరాష్ట్రపతి ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్ అంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కార్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నందకుమార్కు బెయిల్ మంజూరు.. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉంది.. ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?: మంత్రి అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్ వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు ఎన్ఆర్ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫిట్గా పంత్! సంజూకు అసలు జట్టులో చోటే లేదు! రజత్పై ఎందుకంత ప్రేమ? బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్ను కాదని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మహేశ్బాబు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ యూటర్న్.. ఒక వ్యక్తి ఒకే పదవికి రాంరాం కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్.. నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్.. అఖిలేష్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్! ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్కు మాత్రమేనా?: వైఎస్ షర్మిల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తీరు మారని అమెరికన్ ర్యాపర్.. ట్విటర్ వేటు.. ట్విటర్ శుక్రవారం మరోసారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికన్ ర్యాపర్, వ్యాపారవేత్త కాన్యే వెస్ట్ అలియాస్ ‘యే’ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఊహించని షాక్.. భారత్లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్! కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రికీ పాంటింగ్కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఖరీదైన కారును కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధర తెలిస్తే షాక్! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. తప్పు చేశావ్ కాబట్టే శిక్ష తప్పదు’ తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసు: హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే? ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మల్లారెడ్డికి ఊహించని షాక్.. సంచలనంగా మారిన ఐటీ అధికారుల లేఖ! తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి’ టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! డిజిటల్ రుణాలకు ఆర్బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బంగ్లా టూర్లో వన్డేలతో పాటు టెస్ట్ అరంగేట్రం కూడా..? అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్, హిట్టింగ్ అన్నింటికీ మించి మంచి ఫామ్లో ఉన్నా, తమ ఫేవరెట్ క్రికెటర్కు ఛాన్స్లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సమంత లాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్! హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలాన్ మస్క్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్! ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి