-
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లంక ప్రీమియర్ లీగ్-2023లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రాబోయే ఎడిషన్ కోసం జూన్ 14న వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో సురేష్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడు తన బేస్ప్రైస్ 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు)గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక గతేడాది సెప్టెంబర్లో అన్నిరకాల క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రైనా విదేశీ లీగ్లపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఈ మిస్టర్ ఐపీఎల్ అలరించనున్నాడు. ఇక ఈ ఏడాది ఎల్పీఎల్ జూలై 30 నుంచి ఆగస్టు 20వరకు జరగనుంది. కాగా లంక ప్రీమియర్ లీగ్లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది వేలంలో 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్, ఆసీస్ క్రికెటర్ మాథ్యూవేడ్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్లో భాగం కానున్నారు. అయితే ఇప్పటివరకు లంక ప్రీమియర్ లీగ్లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే. ఒక వేళ రైనాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే ఈ లీగ్లో భాగమైన రెండో ఆటగాడిగా రైనా నిలుస్తాడు. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
ఫిక్సింగ్ కలకలం.. విండీస్ క్రికెటర్పై వేటు
వెస్టిండీస్ వికెట్కీపర్, బ్యాటర్ డెవాన్ థామస్పై ఐసీసీ సస్సెన్షన్ వేటు వేసింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్ లీగ్ల్లో బుకీలు కలిసిన విషయాన్ని దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంది. థామస్పై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) యొక్క అవినీతి నిరోధక కోడ్ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు వెల్లడించింది. కాగా, డెవాన్ థామస్ గతేడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను విండీస్ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్లు చేశాడు. టెస్ట్ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023 QF 1: సీఎస్కే-గుజరాత్ మ్యాచ్పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..? -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల -
లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
India vs Sri Lanka, 2nd ODI- Nuwanidu Fernando: శ్రీలంక యువ ఆటగాడు నువానీడు ఫెర్నాండో తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరుగతున్న వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. అర్ధ శతకంతో అందరిని ఆకట్టుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా పాతుమ్ నిసాంక దూరం కావడంతో అతడి స్థానంలో నువానీడు ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో 50 పరుగులు చేసిన ఫెర్నాండో దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 6 బౌండరీలు ఉన్నాయి. కాగా వన్డే డెబ్యు మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్గా నువానీడు రికార్డులకెక్కాడు. ఇక తొలి మ్యాచ్లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెర్నాండో గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ నువానీడు ఫెర్నాండో? ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతడు 2016లో కోలంబో తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అదే విధంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న ఫెర్నాండోకు 2018 అండర్-19 ప్రపంచకప్ శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన 132 పరుగులతో రాణించాడు. అనంతరం 2019లో లిస్ట్-ఏ క్రికెట్లోకి నువానీడు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 31 మ్యాచ్లు ఆడిన అతడు 1771 పరుగులు సాధించాడు. అదే విధంగా 23 లిస్ట్-ఏ క్రికెట్లో 748 పరుగులు, 34 టీ20ల్లో 760 పరుగులు చేశాడు. కాగా లంక సీనియర్ పేసర్ విశ్వ ఫెర్నాండో సోదరుడే ఈ నువానీడు ఫెర్నాండో కావడం విశేషం. లంక ప్రీమియర్ లీగ్లో అదుర్స్ గతేడాది ఆఖరిలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్లో ఫెర్నాండో అదరగొట్టాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్ల్లో 211 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే భారత్తో వన్డేలకు శ్రీలంక జట్టులో ఫెర్నాండోకు చోటు దక్కింది. చదవండి: Prithvi Shaw: నాకు తల పొగరా? హర్ట్ అయ్యాను! పర్లేదు.. పంత్ స్థానంలో నువ్వే! జై షా ట్వీట్ వైరల్ -
పాకిస్తాన్ క్రికెటర్కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే ఆసుపత్రికి!
శ్రీలంక ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్లు వరుస పెట్టి గాయాల బారినపడుతున్నారు. శ్రీలంక చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్లో క్యాండీ ఫాల్కన్స్కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్తాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే. Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD — Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు -
chamika Karunaratne: 'ఊడిన పళ్లు వెనక్కి.. మూతికి 30 కుట్లు'
శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్ లీగ్లో భాగంగా గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి మూతికి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని కరుణరత్నే తన ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చాడు. ''నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్'' అంటూ మెసేజ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 View this post on Instagram A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne) చదవండి: LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? -
మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు
లంక ప్రీమియర్ లీగ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ తీసుకునే క్రమంలో మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు లంక క్రికెటర్ చమిక కరుణరత్నే. కాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. గాలె గ్లాడియేటర్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా రావడం చూసిన కరుణరత్నే వారిని వద్దని వారించాడు. ఇక క్యాచ్ను సులువుగా పట్టుకున్నట్లే అని మనం అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్ను మాత్రం జారవిడవలేదు. ఆ తర్వాత పెవిలియన్ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 చదవండి: క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పడిపోతున్నారు.. టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్ -
10 ఫోర్లు, 4సిక్స్లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జాఫ్నా కింగ్స్కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది. చదవండి: ఆ టీమిండియా బ్యాటర్కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ -
ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా!
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. ఆదివారం గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్లో తొలి ఓవర్ను ఆమిర్ వేశాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆమిర్ వేసిన తొలి బంతినే సిక్స్ బాదాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ తన తర్వాతి బంతికి ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకు దెబ్బ తీశాడు. ఈ సమయంలో ఆమిర్ కోపంతో అవిష్క ఫెర్నాండోవైపే చూస్తూ ''గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్'' అంటూ ఇచ్చిన హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆమిర్ను ట్రోల్ చేస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''ఆమిర్ ఎక్కడున్నా సరే.. నీ కవ్వింపు చర్యలు అలాగే ఉంటాయి.. ఇక నువ్వు మారవా'' అంటూ పేర్కొన్నారు. మ్యాచ్లో విజయం సాధించిన గాలే గ్లాడియేటర్స్ ఎల్పీఎల్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించినంతకాలం వివాదాలతో పేరు పొందిన ఆమిర్ అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన తర్వాత కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: BBL 2021: మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?! First ball hit for Six then 👑 Clean bowled with an Inswinger @iamamirofficial Aggression 🔥 pic.twitter.com/6p2LmWyy6r — Mustafa Abid (@mmustafa_abid) December 19, 2021 -
బౌలర్ మ్యాజిక్ స్పెల్.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా
Jeffrey Vandersay Magic Bowling Spell(4-1-25-6) LPL 2021.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో కొలంబో స్టార్స్ బౌలర్ జెఫ్రీ వాండర్సే అద్భుత బౌలింగ్తో మెరిశాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6 వికెట్లతో చెలరేగి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్గా జెఫ్రీ వాండర్సే(4-1-25-6) కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. డిసెంబర్ 17(శుక్రవారం) క్యాండీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో కొలంబో స్టార్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబో స్టార్స్ 8 మ్యాచ్ల్లో ఇది నాలుగో విజయం. చదవండి: LPL 2021: బౌలర్ వింత సెలబ్రేషన్కు బ్యాట్స్మన్ షాక్ ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (38 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనుంజయ్ డిసిల్వా 40 పరుగులు చేయగా.. చివర్లో దినేష్ చండీమల్ 29 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ వాండర్సే దాటికి 17 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రవి బొపారా 47 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచాడు. చదవండి: Diego Maradona: వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా It's @Vandersay all the way!#LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere @ipg_productions @SatsportNews @OfficialSLC pic.twitter.com/vU428h2ONe — LPL - Lanka Premier League (@LPLT20) December 17, 2021 -
బౌలర్ వింత సెలబ్రేషన్కు బ్యాట్స్మన్ షాక్
Bowler Celebration Became Viral After Getting Wicket.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్, డంబుల్లా జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కాండీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విషయం పక్కనపెడితే.. కాండీ వారియర్స్ బౌలర్ బినురా ఫెర్నాండో సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డంబుల్లా జెయింట్స్ బ్యాట్స్మన్ ఫిలిప్ సాల్ట్ను బినురా ఫెర్నాండో ఒక తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో వికెట్ తీశాననే ఆనందంలో ఫెర్నాండో.. యూట్యూట్లో బాగా ఫేమస్ అయిన సాల్ట్ బే సెలబ్రేషన్ను తనదైన స్టైల్లో చేశాడు. అయితే ఔటైన బ్యాట్స్మన్ ఫిలిప్ సాల్ట్ పేరులో ''సాల్ట్'' ఉండడం విశేషం. చదవండి: PAK Vs WI: ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్సీన్ రిపీట్ ఫెర్నాండో సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఫిలిప్ సాల్ట్.. తననేమైనా కామెంట్ చేస్తున్నాడా అన్నట్లు గమనించాడు. కానీ ఫెర్నాండో చివరలో పెవిలియన్ వైపు వెళ్తున్న సాల్ట్ వైపు నవ్వుతూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అయితే సాల్ట్ బే సెలబ్రేషన్కు ఇంత పాపులారిటి రావడానికి కారణం.. ఒక తుర్కీష్ చెఫ్ వంటకాలు తయారు చేసే సమయంలో తనదైన స్టైల్లో స్ప్రింకిల్ చేయడం అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించి పెట్టింది. ఇక మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో కాండీ వారియర్స్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆర్ మెండిస్ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జయతిలకే 34 పరుగులు చేశాడు. బినురా ఫెర్నాండో, అల్ అమిన్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రవి బొపారా (59 పరుగులు నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: కోపంతో ఊగిపోయిన బౌలర్.. తన స్టైల్లో ప్రతీకారం pic.twitter.com/yW8KDIiKQM https://t.co/oAs61Adv1Y — Estelle Vasudevan (@Estelle_Vasude1) December 16, 2021 -
6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్
లంక ప్రీమియర్ లీగ్లో భాగంగా కాండీ వారియర్స్, కొలంబో స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కాండీ వారియర్స్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కొలంబో స్టార్స్ 19.4 ఓవర్లలో చేధించింది. అయితే చివరి 13 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో.. కొలంబో స్టార్స్ ఆటగాడు సీక్కుగే ప్రసన్న అద్భుతం చేసి చూపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన ప్రసన్న.. ఆ తర్వాతి ఓవర్లో రూథర్ఫర్డ్ ఒక ఫోర్ కొట్టాడు. అనంతరం సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 18.5 ఓవర్లో మరో సిక్స్ బాదడంతో సమీకరణం మారిపోయింది. చదవండి: BBL 2021: బ్యాట్స్మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఓవర్ తొలి బంతికి రూథర్ఫర్డ్ సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసన్న వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడడు. అంతకముందు కాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కేన్నార్ లూయిస్ 62 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. Some heroes don’t wear capes! When all seemed lost, #SeekkugePrasanna rose to the occasion. @SLColomboStars @ipg_productions @SatsportNews @OfficialSLC #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/zx4wJEmqsC — LPL - Lanka Premier League (@LPLT20) December 14, 2021 -
లంక ప్రీమియర్ లీగ్లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..!
కొలొంబో: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా ఆరాధించే చాలామంది ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒకరైన శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స తన ఆరాధ్య క్రికెటర్ గురించిన ప్రస్తావన సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంక ప్రీమియర్ లీగ్లో కోహ్లి ఆడితే చూడలని ఉందంటూ తన మనసులో దాగి ఉన్న కోర్కేను బయటపెట్టాడు. ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ఎవరన్న అంశంపై జాతీయ మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కోహ్లి ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడని, అతనిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, కోహ్లిని చూసే తాను క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ నుంచి షాహిద్ అఫ్రిది తప్పుకోవడంతో రాజపక్సకు గాలె గ్లాడియేటర్స్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. లీగ్లో భాగంగా గాలె గ్లాడియేటర్స్ ఇవాళ(డిసెంబర్ 14) డంబుల్లా జెయింట్స్తో తలపడాల్సి ఉంది. చదవండి: KS Bharat: మరోసారి శ'చి'తక్కొట్టిన ఆంధ్రావాలా.. -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
'విజయ్ హజారే, బీబీఎల్, ఎల్పీఎల్పై కన్నేసి ఉంచండి'
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి. జై రిచర్డ్సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్) భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్పీఎల్లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. -
IPL 2022 Auction: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వస్తే!
IPL 2022: Sri Lanka New SIXER KING Avishka Fernando May Break Bank In Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా సమర్పించగా... కారణాలేవైనా డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేశాయి. వీళ్లంతా వేలంలోకి వస్తే కొనడానికి పలు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి కూడా. అదే సమయంలో.. టీ20 వరల్డ్కప్-2021 హీరోలు, ఇతర లీగ్ మ్యాచ్లలో అదరగొడుతున్న ఆటగాళ్లపై కూడా దృష్టిసారించాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో లంక ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకుంటున్న శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో ఈసారి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటున్నారు క్రీడాభిమానులు. ఇప్పటికే వనిందు హసరంగ, దుష్మంత చమీరా క్యాష్ రిచ్ లీగ్లో భాగం కాగా.. 23 ఏళ్ల అవిష్క ఫెర్నాండో కూడా ఐపీఎల్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లంక ప్రీమియర్లో అతడి సిక్సర్ల ప్రదర్శన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది మరి! ఈ లీగ్లో జఫ్నా కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవిష్క.. కాండీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వరుస సిక్సర్లు బాదాడు. 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 7 సిక్స్లు కొట్టి ఎల్పీఎల్ మ్యాచ్లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. అంతేగాక ఇతర మ్యాచ్లలోనూ తనదైన శైలిలో హిట్టింగ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి పవర్ఫుల్ హిట్టర్ ఐపీఎల్లోనూ ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన అవిష్క 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. టీ20 వరల్డ్కప్-2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వనిందు హసరంగ, చరిత్ అసలంక కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! What a show by Avishka Fernando tonight! 🏏💪 53 off 23 balls | 7 sixes 🔥 #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #WinTogether #TheFutureisHere pic.twitter.com/kD7kuD4nXE — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 8, 2021 -
సిక్సర్లతో హోరెత్తించాడు.. విజయానికి చేరువగా
Rovman Powell Hitting 61 Runs From 19 Balls In LPL.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్ ఆటగాడు రోవ్మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 14 ఓవర్లుకు కుదించారు. తొలుత బ్యాటింత్ చేసిన జఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 181 పరుగులు భారీ స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (23 బంతుల్లో 53, 7 సిక్సర్లు), తిసారా పెరీరా( 21 బంతుల్లో 53 , 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించారు. చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్కు ఓపెనర్లు కెన్నార్ లూయిస్ (41), చరిత్ అసలంక(42) మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన రోవ్మన్ పావెల్ భీకర ఇన్నింగ్స్ ఆడడంతో కాండీ వారియర్స్ 11 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయానికి దగ్గరగా వచ్చింది. అయితే పావెల్ ఔటైన అనంతరం మ్యాచ్ జఫ్నా కింగ్స్ వైపు మళ్లింది. ఇక అక్కడినుంచి జఫ్నా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు 14 ఓవర్లలో 166 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. Powell's dominance from start was a testament to his reputation as a power-hitter! @Ravipowell26 @ipg_productions #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/aiQTDa4pmp — LPL - Lanka Premier League (@LPLT20) December 8, 2021 -
లంక ప్రీమియర్ లీగ్లో ఐపీఎల్ విధ్వంసకర వీరులు
Gayle, Du Plessis Among LPL 2021 Picks: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్ లీగ్-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్గా నిలిచిన డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, సీఎస్కే తరఫున బౌలింగ్లో సత్తా చాటిన ఇమ్రన్ తాహిర్ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్ వన్ బౌలర్, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షంషి, పాక్ స్టార్ ఆల్రౌండర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు. వీరే కాకుండా బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్, విండీస్ రోవ్మన్ పావెల్, లంక స్టార్ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్ చండీమాల్, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల(కొలొంబో స్టార్స్, దంబుల్లా జెయింట్స్, గాలే గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, కాండీ వారియర్స్)తో జరగనున్న ఈ లీగ్ డిసెంబర్ 5 నుంచి 23 వరకు జరగనుంది. చదవండి: ట్విటర్లో సచిన్ హవా.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం