land Registrations
-
తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.ప్రస్తుతానికి కార్డు (CARD) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ముందస్తు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఆదేశించారు. కాగా, వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు అడగకుండా మాన్యువల్కు మార్పులు చేసే దాకా స్లాట్ బుకింగ్ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. ధరణి పోర్టల్లో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్లను ఆపాలని తామెప్పుడూ ఆదేశించలేదని తెలిపింది. ధరణి వెబ్పోర్టల్లో ఆస్తుల నమోదు కొరకు ప్రభుత్వం చేస్తున్న సమా చార సేకరణ చట్టబద్దమని తేలిన తర్వాతే కొత్త విధానం (ధరణి పోర్టల్)లో రిజిస్ట్రేషన్లు చేసుకో వచ్చని, అప్పటిదాకా పాత విధానాన్నే కొనసాగిం చాలని పేర్కొంది. ధరణిలో వ్యవసాయ, వ్యవసా యేతర ఆస్తులు నమోదు చేసుకోవాలని, ఇందుకు ఆధార్ నంబర్, కులం, కుటుంబసభ్యుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్శర్మ, కె.సాకేత్లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ‘ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ప్రభుత్వాలు చేసే చట్టాలు, విధానాలు రాజ్యాంగబద్దంగా ఉండాలి. అప్పుడే ఆ చట్టాలు న్యాయసమీక్షలో నిలబడతాయి. ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభు త్వం అనుసరిస్తున్న విధానం రాజ్యాంగబద్ధమా అన్నదే మా సందేహం. యజమానుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తారు? ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? ఆ సమాచారం లీక్ అయితే అందుకు బాధ్యులు ఎవరు? అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. ఇంత పెద్దఎత్తున సమాచారం సేకరించేటప్పుడు... దాని చట్టబద్దతపై ప్రజల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంద’ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పనిసరి అంటే ఎలా ? వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను తప్పని సరిగా ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవాలనడం రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ – 300ఎ’కు విరుద్ధం. కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, కులం లాంటి సున్నితమైన సమాచారం అడుగుతున్నారు. ఈ సమాచారం లీక్ కాదన్న ప్రభుత్వ హామీని నమ్మలేం... అని ధర్మాసనం పేర్కొంది. సమాచార సేకరణకు సంబంధించి ప్రభుత్వం అక్టోబరులో మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, పంచాయతీలకు సంబంధించి మూడు వేర్వేరు జీవోలు జారీచేసిందని, ఈ రోజే అవి తమకు ఇచ్చారని, వాటినీ సవాల్ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది డి. ప్రకాశ్రెడ్డి చెప్పారు. ఈ పిటిషన్లపై తాము కౌంటర్లు దాఖలు చేస్తామని ఏజీ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
‘తెలంగాణ ధరణి’ పేరుతో నకిలీ యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్కు లింక్ చేస్తూ నకిలీ యాప్ సృష్టించిన ఇద్దరు కర్ణాటక వాసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు ఆ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే పోస్ట్ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ శనివారం తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ధరణి వెబ్సైట్లో భూ రికార్డులు, పహాణీ, ఫామ్ బీ–1, తదితరాలు పొందుపరిచింది. సర్కారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. దీన్ని గమనించిన కర్ణాటకలోని బసవకల్యాణం ప్రాంతానికి చెందిన ప్రేమ్ మూలే, మహేశ్ కుమార్ ధండోటే ఓ మొబైల్ యాప్ రూపొందించారు. దీనికి ‘ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్’అనే పేరు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను చూసిన అనేక మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. నిందితులు యూట్యూబ్ ద్వారా యాప్ తయారీ నేర్చుకుని, దానిని క్లిక్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్కు లింకు అయ్యేలా మాత్రమే డిజైన్ చేయగలిగారు. అంతకు మించి ఇందులో ఏ వివరాలూ పొందుపరచలేదు. ఈ యాప్ విషయం ఇటీవల తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, ఎస్సై వెంకటేశం దర్యాప్తు చేశారు. గూగుల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రేమ్, మహేశ్ ఈ యాప్ను రూపొందించినట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
ధరణి: కులం వివరాలు అడగడం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసమే ధరణి వెబ్పోర్టల్ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రజల ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేసిందని, ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పరిపాలనాపరమైన సంస్కరణలను తెచ్చిందని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని, ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్న నేపథ్యంలో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కులం వివరాలు అడగడం లేదని, పథకాల అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్న వివరాలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ కోసం ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సోమేష్కుమార్ శనివారం కౌంటర్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా కోటీ ఆరు లక్షల ఆస్తులు నమోదు చేసుకున్నారు. ఇందులో 12,751 పంచాయతీల్లో 59 లక్షలు, 140 మున్సిపాలిటీల్లో 22 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల ఆస్తుల వివరాలను నమోదు చేశారు. 1971 తెచ్చిన భూయాజమాన్య హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకత పెంచేలా నూతన చట్టాన్ని తెచ్చాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం మున్సిపాలిటీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించాం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు గతంలో కాకుండా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కలిసి ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అయ్యేలా రూపకల్పన చేశాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గతంలో లోపభూయిష్టంగా ఉండేది. ప్రస్తుత విధానంలో బయోమెట్రిక్ ద్వారా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సేకరించిన వివరాలు డేటా సెంటర్లో భద్రంగా ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. బహిరంగంగా ఎవరికీ కనిపించవు. రికార్డుల్లో తప్పులు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించి సవరించుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో భాగంగానే ఆధార్ వివరాలు అడుగుతున్నాం. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలి’అని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేనట్లే! ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడింది. 23న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుండగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. హైకోర్టు నుంచి అనుమతి వస్తే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కా వాల్సిన రిజిస్ట్రేషన్లు మరో 3, 4 రోజులు వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
29న ‘ధరణి’ ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముహూర్తా న్ని ఖరారు చేసింది. ఈ నెల 29న మధ్యా హ్నం 12.30కు సీఎం కేసీఆర్ ఈ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఈ నెల 25న దసరా రోజున ధరణి పోర్టల్ను ప్రారంభించాలని తొలుత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం కావడంతో ముహూర్తాన్ని 29కు మార్చారు. ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నా యి. ప్రస్తుతానికి సాగుభూముల రిజి స్ట్రేషన్లే ప్రారంభించనున్న సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండ లాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లో వ్యవసాయ భూములు లేనం దున.. దీని నుంచి మినహాయించారు. -
అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్బుక్
సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్పుస్తకాల చట్టం–2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది. సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్ బుకింగ్ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్ను రూపొందించింది. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్కు వెళ్లేలా ఈ ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దింది. ఆన్లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్ రైటర్లనో, ఈ–సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్ సమయంలో పాన్కార్డు నంబర్ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్ సమరి్పంచాల్సి వుంటుంది. హైదరాబాద్ మినహా 570 తహసీళ్లలో ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది. ప్రమాణపత్రం తప్పనిసరి క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది. క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది ► ధరణి పోర్టల్లోకి వెళ్లి స్లాట్బుక్ చేసుకోవాలి. ► రైతుల మొబైల్ నంబర్కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి. ► రిజి్రస్టేషన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ► రైతు పాస్బుక్కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్లోనే దరఖాస్తులో నమోదు చేయాలి. ► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి. ► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ–చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజి్రస్టేషన్ ఫీజులను చెల్లించాలి. ► సాక్షుల వివరాలు నమోదు చేయాలి. ► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది. రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే.. ⇒ రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది. ⇒ డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్లైన్లో తీసుకుంటారు. ⇒ ఆ తర్వాత తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి్రస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజి్రస్టేషన్కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్కు అనుమతి ఇస్తారు. ⇒ తహసీల్దార్ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది. ⇒ మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్ను డీఈవో ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ⇒ మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజి్రస్టార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు. ⇒ ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్కు సంబంధించిన కొత్త పాస్పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
పల్లె స్పందించలే!
సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్ఆర్ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు! స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్ఆర్ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్ రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి. -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసిన తర్వాతే పటిష్ట పద్ధ తిలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలో చనతో ఉందని, వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూరికార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరా లను సమన్వయ పరుచుకోవడం, ధరణి వెబ్ సైట్ను అప్డేట్ చేయడం జరగాలి. రెవెన్యూ చట్టం అమలుపై నూతన మార్గదర్శకాలు వెలు వడాలి. దీంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని, భూముల మార్కెట్ విలువల సవరణ కసరత్తు పూర్తి చేయాలని, అదే విధంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిస్థాయిలో అందు బాటులోకి రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుందని సచి వాలయ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి పది రోజులు దాటుతున్నందున... మరో పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, అక్టోబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నాయి. సవరణ... ఆధునీకరణ ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూముల మార్కెట్ విలువలను సవరించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విలువల సవరణ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ వర్గాల నుంచి భూముల మార్కెట్విలువలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ప్రస్తుత విలువలు, సవరించాల్సిన విలువల విషయంలో పారదర్శకత లోపించిందనే కారణంతోనే మార్కెట్ విలువల సవరణ కసరత్తును ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్ వర్గాలు చెపుతున్నాయి. సరళీకరణ, హేతుబద్ధీకరణ కోణంలో మార్కెట్ విలువలను సవరించాలని, అవసరమైన చోట్ల తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలను సవరించి ఆరేళ్లు దాటుతున్నందున కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, హైవేల చుట్టుపక్కల ప్రాంతాలు, ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్సులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచే దిశలో కసరత్తు జరుగుతోంది. అల్పాదాయ ఆఫీసుల ఎత్తివేత దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ లావాదేవీలు జరిగి, స్వల్ప ఆదాయం వచ్చే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేయాలని, అదే విధంగా అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను రెండు లేదా మూడుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని 25వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేసి అర్బన్ ప్రాంతాల్లో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పనిలోపనిగా సబ్రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలోని ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనుండగా, ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను కూడా ఆధునీకరించాలని, వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో జరిగే డాక్యుమెంట్ల రూపకల్పనలో తప్పులు జరిగితే వారినే బాధ్యులను చేయాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వారి విద్యార్హత, అనుభవానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పని విభజన కోసం.. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు, ఇతర భవనాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న ఇతర కార్యకలాపాలను సబ్రిజిస్ట్రార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల సమన్వయం, వాటిని ధరణి వెబ్సైట్తో పాటు కొత్త సాఫ్ట్వేర్లో ఇమిడ్చే పనిలో ప్రభుత్వ వర్గాలున్నాయి. దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఇది ముగిసేలోపు ధరణి వెబ్సైట్ను కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంది. -
మేం ఎలా చేయగలం?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దూకుడుతో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఈ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ మున్సిపల్ అధికారులు మెలికపెడుతుండటం, రిజిస్ట్రేషన్ చేయడం వరకే తమ పని అని, ఆ లేఅవుట్ అక్రమమో,సక్రమమో తామెలా తేలుస్తామని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇరు శాఖల మధ్య సమన్వయలోపం, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ల విషయంలో కఠినంగా ఉం డాలని నిబంధనలు చెబుతుండటం, రిజి స్ట్రేషన్ చేయకూడని లేఅవుట్లను మున్సిపల్ శాఖ సరిగా గుర్తించలేకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ మున్సిపల్ వర్గాల నుంచి లేఖలు వచ్చిన చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆ మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది. అయితే, ఈ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ శాఖను కోరినా మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పురపాలక శాఖ ఇంకా స్పందిచనట్లు తెలుస్తోంది. పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు 15–20 ఏళ్లుగా లే అవుట్ల వ్యాపారం రియల్ వ్యాపారులకు కాసులు కుమ్మరిస్తోంది. అయితే, వీరు అనుమతులు తీసుకోకపోవడం, నిబంధన లు పాటించకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తోంది. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి సంస్థల అనుమతుల్లేకుండానే అంతస్తుల మీద అంతస్తులు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కొత్త మున్సిపల్ చట్టంలో లేఅవుట్లపై కఠిన నిబంధనలు విధించారు. స్పష్టత ఇవ్వండి: ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో తామెలా ముందుకెళ్లాలన్న దానిపై చట్టపరంగా ఉన్న సానుకూలతలు తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కమి షనర్ల నుంచి లేఖలు రావడం ప్రారంభం కాగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఈ లేఖను పురపాలక శాఖకు పంపగా, మొన్నటివరకు ఎన్నికల హడావుడిలోనే ఉన్న మున్సిపల్ అధికారులు దీనిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 250 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆ వివరాలు ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నోటీస్ బోర్డుల్లో డిస్ప్లే చేయడంతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు 15 మందితో యాక్షన్ టీం కూడా తయారు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ వర్గాలు కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. కొత్త చట్టం ఏం చెబుతోందంటే! కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణాలు, నగరా ల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్మాలంటే నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక లేఅవుట్ ప్లాన్కు మున్సిపల్ అధికారులు 21 రోజుల్లోగా అనుమతిస్తారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి ప్రాధికార సంస్థలు అనుమతించిన లేఅవుట్లనే రిజిస్ట్రేషన్ అధికారు లు రిజిస్టర్ చేయాలి. ఈ విషయంలోనే మున్సిపల్ కమిషనర్ల పేరిట రిజిస్ట్రేషన్ల శాఖకు లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై లేఖలు వెళ్తున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి వెళ్తున్న లేఖల విషయంలో గందరగోళం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబు తున్నారు. కొన్ని మున్సిపాలిటీల నుంచి వస్తున్న ఇలాంటి లేఖలతో పాటు ఏ సర్వే నంబర్లో లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దో ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారని, కొన్నిచోట్ల లేఖ లురాసి వదిలేస్తున్నారని చెబుతున్నారు. లేఖలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఏ లేఅవుట్ అక్రమమో, ఏ లేఅవుట్ సక్రమమో తామెలా గుర్తిస్తామని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏదైనా స్థలం, భూమి లేదా భవనాన్ని రిజిస్టర్ చేయడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. ఒకవేళ డెవలపర్లను లేఅవుట్ అనుమతులు చూపెట్టా లని అడిగినా నకిలీ అనుమతులు చూపెడితే వాటిని గుర్తించలేమంటున్నారు. ఏదేమైనా తమ మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖలు వచ్చిన అన్ని మున్సిపాలిటీల్లో 10 రోజుల నుంచే పూర్తిగా కొత్త లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని వారు చెబుతున్నారు. -
తెలంగాణ భూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమలుతోపాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం అమ ల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి ‘తెలంగాణ భూ చట్టం’గా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టం తీరుతెన్నులు ఎలా ఉండాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారాన్ని కోరింది. అసైన్డ్, ఇనాం, రక్షిత, కౌలుదారు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి కలె క్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంది. కొత్త చట్టం రూపకల్పనపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశం పైనా సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ముందు మూడు మార్గాలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తేవడంతోపాటు కాలం చెల్లిన వాటిని తొలగించడం, గజిబిజిగా ఉన్న చట్టాలను సరళతరం చేస్తూ ఒకే చట్టం తీసుకువస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్గౌడ్ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టడమేగాకుండా రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఫైలును ఢిల్లీకి పంపారు. తరువాత ఆ ఫైలు అటకెక్క గా రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ కోడ్ను రూపొందించాలనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ కోడ్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. ఈ రెండింటితోపాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్ధగా కొత్త చట్టం రూపొందించడం ఉత్తమమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు... కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల రెవెన్యూ సేవలకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే అంశంపై శాసనసభ సాక్షిగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలలో విలీనం చేయలా లేదా పనితీరు, మెరిట్ ఆధారంగా రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలా? అనే దానిపై కొత్త చట్టంలో స్పష్టత రానుంది. అలాగే బ్రిటిష్ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండటాన్ని తప్పుబడుతున్న సీఎం.. కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోదాల మార్పు కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. -
డొంక కదులుతోంది
అమలాపురం టౌన్: లేని భూములకు నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంక్ నుంచి రూ.1.50 కోట్ల రుణాన్ని కాజేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఈ భూ మాయజాలంపై డొంక కదులుతోంది. ప్రాథమికంగా ఈ తప్పిదానికి బాధ్యులని భావిస్తున్న సూత్రధారి అమలాపురం రూరల్ మండలం కామనగరువు వీఆర్వో ప్రశాంత్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ టోకరా వెలుగు చూసినప్పటి నుంచి ఆ వీఆర్వో అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. లేని 53 ఎకరాలకు అధికారికంగా ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసిన అప్పటి అమలాపురం తహసీల్దార్, ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న బేబీ జ్ఞానాంబకు వారం రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో భూమి రికార్డులను కంప్యూటర్లో నకిలీ పత్రాలను తయారు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ వంశీపై క్రిమినల్ కేసు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ నుంచి గురువారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఒక పథకం ప్రకారం జరిగిన ఈ భూ మాయలో భారీ రుణం ఇచ్చిన అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారుల పాత్రపైనా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తొలుత ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్కు ఇక్కడ జరిగిన పరిణామాలపై లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ అమలాపురం ఆర్డీవోను ఆదేశించారు. బ్యాంక్కు నకిలీ పత్రాలు సమర్పించిన అసలు సూత్రధారి ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి బలరామమూర్తికి ఒకేసారి రూ.1.50 కోట్ల రుణం ఇలా ఇచ్చారనే కోణంలో కూడా బ్యాంక్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే నకిలీ పత్రాలతో అడ్డగోలుగా అంతటి రుణాన్ని ఇచ్చిన హెచ్డీఎఫ్సీ అమలాపురం శాఖపై విచారణ జరపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ షణ్ముఖరావును జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదేశించారు. దీనిపై షణ్ముఖరావు ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. నకిలీ పత్రాలతో రుణం ఇచ్చిన డాక్యుమెంట్లను తమకు చూపించాలని కోరారు. అయితే ఆ డాక్యుమెంట్లు తమ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉన్నాయని బ్యాంక్ అధికారులు బదులిచ్చారు. తక్షణమే వాటిని ఇక్కడికి రప్పించాలని ఆయన చెప్పడంతో ముంబై నుంచి వాటిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లేని భూములకు కళ్లు మూసుకుని ఈసీ, తనఖా రిజిస్ట్రేషన్ చేసిన అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపైనా జిల్లా రెవెన్యూ అధికారులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఉన్నతాధికారులు కూడా ఈ భూ మాయపై చాపకింద నీరులా విచారణ చేస్తున్నారు. ఇలా పలు కోణాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నకిలీ భూమి రికార్డుల మోసాలపై ఉచ్చు బిగిస్తూ బాధ్యులపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
తిరుపతిలో రిజిస్ట్రేషన్ల కుంభకోణం?
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ఇష్టారాజ్యంగా కబ్జాచేశారు. గత ఐదేళ్ల కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పూబెల్లంలా పంచుకుతినేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకునేశారు. సర్వే నం.13లోనే 110 ఎకరాలకు సంబంధించి సుమారు 602 అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై కూలంకుషంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో వందలాది ఎకరాలు హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు హథీరాంజీ మఠం భూములపై దృష్టి సారించారు. ఆ భూములను ఐదుగురు వ్యక్తులు కలిసి పంచుకునేశారు. ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులు రిజి స్ట్రేషన్ స్థలాలు కావాలని అడగడంతో అక్రమార్కులు సబ్రిజిస్టార్ కార్యాలయంలో కొందరిని సంప్రదించారు. అక్రమార్కులకు రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు అధికారులు తోడవడంతో విక్రయాలు సులభతరమయ్యాయి. అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్కోలో పనిచేసే మరికొందరు కుమ్ముక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ముచేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే.. అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూళ్లు చేసి స్థలాలు కొనుగోలుచేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభిం చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలం లో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగి నట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్కోలో పనిచేసే మరికొందరు కుమ్మక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ము చేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూలు చేసి స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. -
పాస్బుక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్!
సాక్షి, యాదగిరిగుట్ట(నల్గొండ) : పాస్పుస్తకాలు లేకుండానే తమ భూమిని వేరేవారి పేరుమీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన ఓ కుటుంబం సబ్ రిజిస్ట్రార్ను నిలదీశారు. ఈ సంఘటన మంగళవారం గుట్ట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన బైరా ఎల్లయ్య, సిద్ధమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు వెంకటేష్ ఇటీవల మరణించాడు. దీంతో పెద్ద కోడలు యాదమ్మ పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. ఎల్లయ్యకు గ్రామంలోని 267, 268, 269 సర్వేనంబర్లలో 4ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పంచాలని వృద్ధులైన ఎల్లయ్య–సిద్దమ్మ దంపతులను పెద్ద కోడలు అడగడంతో చిన్న కుమారుడు సిద్ధులుతో పాటు సమానంగా పంచి, మిగిలిన భూమిని తాము, ఆడ పిల్లలకు ఇస్తానని చెప్పారు. దర్శనానికి వచ్చి.. గతనెల రోజుల క్రితం వృద్ధుడైన ఎల్లయ్యను కోడలు యాదమ్మ హైదరాబాద్కు తీసుకెళ్లింది. గత శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి తీసుకొచ్చింది. అక్కడ అతడి దగ్గర ఉన్న జీరాక్స్ భూమి పత్రాలను తీసుకొని, సబ్ రిజిస్ట్రేషన్ వద్ద ఓ డ్యాక్యుమెంట్ కార్యాలయంలో రిజిస్టేషన్ ప్రాసెస్ను పూర్తి చేసింది. అనంతరం కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో 4.9 ఎకరాల్లో 2.5ఎకరాల భూమిని యాదమ్మ తన పేరున చేసుకుంది. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెట్టాలని వినతి.. ఇది తెలుసుకున్న ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, బిడ్డలు కనకమ్మ, రజిత, అనితలు అదే రోజు సాయంత్రం అధికారుల వద్దకు వచ్చి యాదమ్మ జీరాక్స్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని పెండింగ్లో పెట్టాలని, 4.9 ఎకరాలకు సంబంధించిన ఒరి జినల్ పాస్పుస్తకాలు, టైటిల్ డీడీలు తమ వద్ద ఉ న్నాయని వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్న మరో సారి ఎల్లయ్య భార్య, కుమార్తెలు కార్యాలయానికి వచ్చి జీరాక్స్ పేపర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని, మీరు ఎంత లంచం తీసుకున్నారని, కార్యాలయంలో పని చేసే నవీన్ అనే వ్యక్తే డాక్యుమెంట్ దగ్గరుండి తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల వద్ద సమాచారం సేకరించి శాంతిపజేశారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ వివరణ అడగగా.. ఎల్లయ్య పెద్ద కొడలు యాదమ్మ గత శనివారం సర్వే నంబర్ 267, 268, 269లో ఉన్న 4.9 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ తీసుకువచ్చారని, అందులో జీరాక్స్ ఉన్న విషయాన్ని అంతగా గమనించలేదన్నారు. ఈ విషయమై ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, ముగ్గురు కూతుర్లు వచ్చారు. జిరాక్స్ పత్రాలతో, తమ నాన్నను మోసం చేసి యాదమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని నిలిపివేయాలని వినతి ఇచ్చారు. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
రూటు మార్చెన్..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనాపరంగా రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్న ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సదరు కార్యాలయాల నుంచి పొందాలంటే పడే ప్రయాస నుంచి విముక్తి కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చగా.. ప్రస్తుతం స్థిరాస్తి క్రయ విక్రయాలు పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ల కోసం దళారుల ప్రమేయం లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా కొనుగోలుదారుడికే ధ్రువపత్రాలు అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి కొనుగోలుదారుడి మొబైల్ నంబర్కు ఓటీపీ వచ్చేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో సదరు వ్యక్తులు తమకు సంబంధించిన సెల్ నంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటి ఆధారంగా ఓటీపీ(వన్టైమ్ పాస్వర్డ్) నంబర్ వారికి పంపిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడి సెల్కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే ఇచ్చేస్తారు. జిల్లాలో మొత్తం 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయ విక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు నిత్యం జరుగుతుంటాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంబంధిత వ్యక్తులకు స్కానింగ్ అనంతరం డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియలో కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రవేశ పెట్టిన ఈ పద్ధతి ద్వారా నేరుగా కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇబ్బందులు తొలగించేందుకే.. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం డాక్యుమెంట్లు తీసుకోవడం ఇప్పటివరకు కొనుగోలుదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయితే వీటిని నివారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇకపై తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటప్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు సిద్ధం కాగానే కొనుగోలుదారుడి సెల్కు వన్టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నంబర్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్కు సంబంధిత వ్యక్తి చూపిస్తే డాక్యుమెంట్లను నేరుగా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆన్లైన్లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అందుబాటులో ఉన్నా.. ఎక్కువ శాతం మంది ఇప్పటికీ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ అనంతరం నాలుగు లేదా వారం రోజులకు కానీ స్కాన్ అయిన డాక్యుమెంట్లు తిరిగి రావడం లేదు. ఈలోగా సంబంధిత కొనుగోలుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉండేది. దీంతో మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఆధారపడి కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే సదరు వ్యక్తుల ఫోన్కు ఎస్ఎంఎస్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తాజాగా రిటర్న్ డాక్యుమెంట్ కోసం కూడా ఎస్ఎంఎస్ ఇస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి వచ్చింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొనుగోలుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. పారదర్శకతకు పెద్దపీట.. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పారదర్శకత ఉండేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసమే కొత్త చర్యలకు ఆ శాఖ శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం ద్వారా కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరం కానున్నది. తమ డాక్యుమెంట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. తమ సెల్కు డాక్యుమెంట్లు తీసుకోమని ఓటీపీ వచ్చినప్పుడు కార్యాలయానికి వెళ్లి నేరుగా డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్కు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీ నంబర్ను చూపించినట్లయితే.. సబ్ రిజిస్ట్రార్ ఓటీపీని సరిచూపి డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఓటీపీ విధానం వల్ల రెండు విధాలుగా లాభం కూడా ఉంటుంది. గతంలో డాక్యుమెంట్లను డాక్యుమెంట్ రైటర్ ద్వారా కొనుగోలుదారులు తీసుకునే వారు. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్కు సంబంధిత డాక్యుమెంట్లు ఎవరు తీసుకెళ్లింది సమాచారం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం నేరుగా సబ్ రిజిస్ట్రార్ చేతుల మీదుగానే డాక్యుమెంట్లు అందజేస్తుండడంతో ఆయనకు కూడా డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు తెలిసి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డాక్యుమెంట్లు అందజేసినట్లయితే కొన్ని డాక్యుమెంట్లు స్కాన్ కాకుండానే కొనుగోలుదారులకు అందజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓటీపీ విధానం వల్ల డాక్యుమెంట్ స్కాన్ చేసిన అనంతరం సంబంధిత కొనుగోలుదారుడికి ఓటీపీ వెళ్తుంది. దీనివల్ల ప్రతి డాక్యుమెంట్ స్కాన్ చేసినట్లుగా గుర్తించవచ్చు. ఓటీపీ చూపితే చాలు.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో కొనుగోలుదారులు సులువుగా తమ డాక్యుమెంట్లను పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త చర్యలు ఇటీవలే ప్రారంభించింది. ఈ విధానంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లు సంబంధిత కొనుగోలుదారులు ఒకటి, రెండు రోజుల్లో తీసుకోవచ్చు. డాక్యుమెంట్లు స్కాన్ అయిన వెంటనే కొనుగోలుదారుడి సెల్కు ఓటీపీ వస్తుంది. దీనిని సబ్ రిజిస్ట్రార్కు చూపించినట్లయితే డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఉన్నట్లు అవుతుంది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
శ్రీరామా.. నీవే దిక్కు!
షాద్నగర్ రూరల్: ఆ భూములను స్థానిక రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. కౌలుదారు హక్కు కలిగి భూమి శిస్తు చెల్లిస్తూ పంటలు పండించుకుంటున్నారు. అయితే, ఆ భూములు శ్రీ సీతారామస్వామి దేవాలయానికి చెందినవని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇది తెలుసుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు బతుకుదెరువు అయిన భూములను వదులుకోబోమన్నారు. ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో రాజోలి లక్ష్మణ్రావుకు కొన్నేళ్ల క్రితం 351 నుంచి 401 సర్వే నంబర్లలో సుమారు 140 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామ రైతులు సాగుచేసుకుంటూ పట్టాదారు అయిన రాజోలి లక్ష్మణ్రావుకు శిస్తులు చెల్లించే వారు. కాలక్రమేణ రాజోలి లక్ష్మణ్రావు సదరు భూమిని చేవెళ్ల డివిజన్ షాబాద్ మండల పరిధిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. 1960 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రాజోలి లక్ష్మణ్రావు పేరు పైనే ఉన్నాయి. ఆ తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని రికార్డులు చెబుతున్నాయి. 1960 నుంచి 2012 వరకు రెవెన్యూ రికార్డుల్లో రైతులు కౌలుదారులుగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి దేవాదాయశాఖ భూములుగా మారి కౌలుదారులుగా ఉన్న రైతుల పేర్లు రికార్డుల్లో కనిపించడం లేదు. న్యాయం కోసం రైతుల పోరాటం రాజోలి లక్ష్మణ్రావు పేరు పైన ఉన్న భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పు జరగడంతో రైతులు పోరాటం ప్రారంభించారు. ఈ విషయమై 2007లో ఓఆర్సీలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవా కావా అని తెలియజేయాలని హై కోర్టు దేవాదాయ శాఖ అధికారులను కోరింది. దీంతో రైతులు అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ భూములకు సంబందించిన వివరాలను ఇవ్వాలని కోరారు. రెండు జిల్లాల్లోనూ ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కావని అధికారులు తెలిపారు. దీంతో హైకోర్టు రైతులు సాగు చేస్తున్న భూములకు ఓఆర్సీలు ఇవ్వాలని అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్డీఓను ఆదేశించింది. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓఆర్సీ రాకపోవడం, ఆర్డీఓలో రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు రంగారెడ్డి జిల్లా జేసీ వద్దకు అప్పీలుకు వెళ్లారు. ఇటీవల జేసీ వద్ద కూడా రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. భూముల స్వాధీనానికి అధికారుల యత్నం జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పుతో రంగంపల్లి గ్రామశివారులోని భూములు రంగారెడ్డి జిల్లాషాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబందించినవని దేవాదాయ శాఖ అధికారులు గత పది రోజుల క్రితం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకొని భూమిలో పాతిన బోర్డులను తొలగించారు. భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో దేవాదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. ఊరు కనుమరుగుకానుంది! గ్రామంలో 100 కుటుంబాలు ఉండగా దాదాపుగా 700 జనాభా ఉంది. ఆ గ్రామస్తులకు వ్యవసాయ మే జీవనాధారం. గ్రామ శివారులోని 140 ఎకరా ల భూమిని సాగుచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ గ్రామంలోని 90శాతం రైతులకు పట్టా భూములు లేవు. దీంతో ఆ గ్రామ రైతులు లక్ష్మణ్రావుకు చెందిన ఈ భూమిలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తాము నిర్మించుకున్న ఇళ్లు కూడా ఈ భూముల్లో ఉన్నాయని, అధికారులు భూ ములను స్వాధీనం చేసుకుంటే ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు పోతే ఎక్కడ ఉండాలి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను కూడ బెట్టి ఉండడానికి వంద గజాల స్ధలంలో ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఇళ్ళ స్ధలాలు సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని పొందుతున్న భూములు కూడా దేవాలయం భూములే అంటున్నారు. మేము చదువుకోకపోవడంతో భూములకు సంబంధించిన రికార్డులను తెలుసుకోలేకపోతున్నాం. వందల ఏళ్ళ నుంచి సాగుచేస్తున్న భూములు ఇప్పుడు దేవాలయం భూములు అంటే మేము ఎలా బతికేది. సర్వే చేసిన తర్వాత ఇళ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇళ్లు పోతే మేము ఎక్కడ జీవించాలి. అధికారులే న్యాయం చేయాలి ఆ భూములే మాకు జీవనాధారం ప్రస్తుతం దేవాలయ భూములుగా చెబుతున్న పొలాన్ని కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పట్టాదారుడి పేరు మీద ఉన్న పొలాల్లో తాము కౌలుదారులుగా ఉన్నాం. ఆ పొలాలు ఇప్పుడు దేవాలయం భూములని చెబుతున్నారు. భూములు స్వాధీనం చేసుకుంటే మేము జీవనోపాధిని కోల్పోతాం. – పురుగుల ఎల్లయ్య, రైతు, రంగంపల్లి నిబంధల ప్రకారం భూములు ఆలయానికి చెందినవి రెవెన్యూ రికార్డుల ప్రకారం రంగంపల్లిలోని భూములు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవి జిల్లా జాయింట్ కలెక్టర్ ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాం. గ్రామస్తులు అడ్డుకొని గొడవ చేశారు. దీంతో భూములు ఖాళీ చేసేందుకు వారికి కొద్ది సమయం ఇచ్చాం. – శ్రీనివాసశర్మ, ఈఓ, శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, షాబాద్ మండలం -
నిఘా నీడలో.. ‘రిజిస్ట్రేషన్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములకు సంబంధించి రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. నిత్యం కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా.. అనే విషయాలను ఏరోజుకారోజు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుంది. జిల్లావ్యాప్తంగా 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా.. ఎవరూ మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆస్తులు అమ్మే క్రమంలో దొంగ సంతకాలు పెట్టకుండా.. నకిలీ డాక్యుమెంట్లు చూపించకుండా ఉండేందుకు.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు నిఘాను కట్టుదిట్టం చేసింది. కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు వీలు కలుగుతోంది. రాష్ట్ర శాఖకు అనుసంధానం.. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర శాఖ ఐజీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీనిద్వారా రాష్ట్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాఖలోని అధికారులు తెలుసుకునే వీలుంటుంది. ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్ను రాష్ట్ర శాఖ కార్యాలయంలోనే పరిశీలించి.. చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల తీరును కూడా పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్కు సంబంధించిన సీసీ పుటేజీని కూడా కట్ చేసి ఆయా వ్యక్తులకు అందజేయనున్నారు. నిత్యం నిఘా.. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండేసి చొప్పున సీసీ కెమెరాలు, ఒక టీవీ, కంప్యూటర్ను రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయించింది. టీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజీ మొత్తం ఆయా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఐజీ కార్యాలయంలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ పుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న శాఖ మరో అడుగు ముందుకేసి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. అలాగే క్రయ, విక్రయదారులు కేవైసీ(ఆధార్ నంబర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిద్వారా కంప్యూటర్లో వారి ఆధార్ నంబర్ నమోదు చేయగా.. క్రయ, విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీంతో వారు ఆ భూములు, ఆస్తులకు సంబంధించిన వారా..? కాదా..? అనే విషయాలను తెలుసుకుని రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేసే వీలు కలుగుతుంది. కేవైసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి పని పారదర్శకంగా జరిగేందుకు వీలు కలిగింది. పకడ్బందీగా నిర్వహించేందుకు.. జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాష్ట్ర శాఖ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలు కలిగింది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
డబుల్ బారెల్ గన్తో బెదిరింపులు
నేరేడ్మెట్: భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో డబుల్ బారెల్ గన్తో బెదిరించిన సంఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 8మందిని అరెస్టు చేసి, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేర్కొన్నారు. శనివారం నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామితో కలిసి ఏసీపీ మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన మేరకు.. నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని మధురానగర్లో రామ్నర్సింహకు సిమెంట్ దుకాణం ఉంది. మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో రామ్నర్సింహభార్య పేరుతో 14వేల చదరపు గజాల స్థలం ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో అమీర్పేట్ నర్సింహులు మధ్యవర్తిగా మణికొండకు చెందిన పొలిశెట్టి పెండ్యాలలో ఉన్న భూమి కొనుగోలుకు సిమెంట్ వ్యాపారి రామ్నర్సింహతో రూ.7కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒప్పందం సమయంలో 25శాతం ప్రకారం రూ.1కోటి నగదు, మరో కోటి బ్యాంకు ద్వారా పొలిశెట్టి చెల్లించాడు. మరో 25శాతం గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ సమయంలో మిగితా 50శాతం డబ్బులు చెల్లిస్తానని పొలిశెట్టి ఒప్పందం సందర్భంగా చెప్పాడు. వాయిదా ప్రకారం డబ్బులు చెల్లించాలని రామ్నర్సింహ పలుసార్లు అడిగినా ఇప్పుడుఅప్పుడూ అంటూ పొలిశెట్టి కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో తనతోపాటు మరో 7మంది అనుచరులను వెంట బెట్టుకొని రెండు ఇన్నోవా కార్లలో మధురానగర్లోని సిమెంట్ దుకాణం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో రామ్నర్సింహ దుకాణంలో లేరు. గుమాస్తా పాండును పొలిశెట్టి, అనుచరులు ‘మీ సార్ ఎక్కడ...భూమి రిజిస్ట్రేషన్ చేయకుంటే బాగుండద’ని.. డబుల్ బారెల్ గన్తో భయభ్రాంతులకు గురి చేశారు. గుమాస్తా వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం రామ్నర్సింహ తన న్యాయవాది ద్వారా 100కు ఫోన్ చేశాడు. వెంటనే పెట్రోలింగ్,నేరేడ్మెట్ పోలీసులు రంగంలోకి దిగి సిమెంట్ దుకాణం వద్ద ఉన్న పొలిశెట్టితోపాటు అతని అనుచరులు చెగూరి నర్సింహ, చంద్రమణి త్రిపాఠి(యూపీ లైసెన్స్–ఆయుధం కలిగిన వ్యక్తి), రామకిషన్,సునీల్కుమార్, బాలకిషన్, యూసుఫ్ఖాన్, ముక్తార్(బౌన్సర్లు)లను అదుపులోకి తీసుకున్నారు. భూయజమాని ఫిర్యాదు మేరకు బెదిరింపులు, ఆరŠమ్స్సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 8మందిని అరెస్టు చేసి, ఆయుధంతోపాటు 6రౌండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బంజారాహిల్స్ ఠాణాలో గన్ గురించి రిపోర్టు చేసినట్టు నిందితుడు తెలిపారని, అసలు లైసెన్స్ ఉందా లేదా?అని విచారణ చేస్తున్నామని, ఉంటే రద్దు చేయాలని పై అధికారులకు లేఖ రాస్తామని ఏసీపీ వివరించారు. -
పట్టా భూములకు రిజిస్ట్రేషన్ బంద్
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటికి తోడు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు.. ఇవన్నీ తీరాలంటే పేద రైతులు తమ పొలాలను అమ్ముకోవడమే ఏకైక మార్గం. కష్టాలో ఉన్న రైతులు అత్యవసర సమయంలో పట్టా భూములను అమ్ముకుందామంటే వారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో ఉన్న పట్టా భూముల రిజిస్ట్రేషన్లను కొన్ని నెలల నుంచి నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 1 నుంచి 76 వరకు ఉండగా.. కేవలం సర్వేనంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మిగతా సర్వే నంబర్లలో రైతులకు సుమారు 600 ఎకరాల పట్టా భూములుండగా.. వాటిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి భూములు మొదటి నుంచి వివాదాస్పదంగా మారడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రైతులకు వారి భూములకు సంబంధించిన పట్టా పాస్బుక్లు, టైటిల్ డీడ్లు కూడా అందజేశారు. అయితే కొన్నేళ్ల కిందటి నుంచి ఈ భూములకు మ్యూటేషన్ను కూడా నిలిపివేశారు. నకిలీ డాక్యుమెంట్ల రద్దుతో.. సర్వే నంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూములకు నకిలీ సర్వే నంబర్లు వేసి అక్రమార్కులు పత్రాలు సృష్టించారు. ఈ భూముల్లో పెద్ద ఎత్తున వెంచరు చేసి అమ్మకానికి పెట్టారు. విషయం వెలుగు చూడడంతో అధికారులు ఈ భూములకు సంబంధించిన నకిలీ పత్రాల సేల్ డీడ్లను గత అక్టోబరులో రద్దు చేశారు. ఇక్కడి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బహదూర్గూడలో సర్వే నంబర్లు వివాదాస్పదం కావడంతో పాటు వెబ్ పహాణీలో రైతుల వివరాలు నమోదు చేయలేదు. దీంతో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పట్టా భూములకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. వెంచరులోని ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు.. గ్రామంలోని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు నిరాకరిస్తున్న అధికారులు ఇక్కడ వెలసిన అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జీఓ 111 పరిధిలో వెంచర్లు చేయడం నిషేధం. కానీ ఇక్కడ వెంచర్లు వేసి రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మాకు సర్వే నంబర్లు 73, 14లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. మా అన్న కూతురు పెళ్లీడుకు వచ్చింది. భూమి అమ్ముకుని పెళ్లి చేద్దామంటే రిజిస్ట్రేషన్ నిలిపి వేశారు. ఎవరూ కొనడానికి రావడం లేదు. -మల్లేష్, బహదూర్గూడ, శంషాబాద్. వెబ్ పహాణీలో వివరాలు లేనందుకే.. వెబ్ పహాణీలో రైతుల వివరాలు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నాం. రైతుల వద్ద పాస్బుక్లు, టైటిల్ ఉన్నా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. వెంచర్లలో గజాల చొప్పున ప్లాట్లు ఉంటాయి కాబట్టి వాటికి వెబ్ పహాణీతో సంబంధం ఉండదు. - ఎంఏ.నయీం, సబ్ రిజస్ట్రార్, శంషాబాద్. రీ సర్వే చేయాల్సి ఉంది బహదూర్గూడ భూములకు మొదటి నుంచి సర్వే నిర్వహించ లేదు. ఇక్కడ మొత్తం 1250 ఎకరాల భూములుండగా.. ఇందులో 650 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. మిగతావి రైతుల పట్టా భూములు. వీటికి సర్వే నిర్వహించి కొత్త సర్వే నంబర్లు ఇచ్చిన తర్వాత వెబ్ పహాణీలో నమోదు చేస్తాం. వచ్చే నెలలో భూములను సర్వే చేసేందుకు కృషిచేస్తాం. - సురేష్కుమార్, తహసీల్దార్, శంషాబాద్. -
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
బద్వేలు: ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన దస్తావేజు నకల్లు, చరిత్ర తెలిపే ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొంతమేర అవగాహన, కంప్యూటరు పరిజ్ఞానం ఉంటే సులువుగా వీటిని పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచే ఈసీలు, సీసీలు పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈసీకి 30 ఏళ్ల లోపు అయితే రూ.220, 30 సంవత్సరాలు పైబడితే రూ.520, దస్తావేజు నకళ్ల కోసం రూ.220 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో వీటిని పొందే అవకాశం కల్పించారు. పొందడం ఇలా...: ఆన్లైన్లో ఉచితంగా ఈసీలు, సీసీలు తీసుకోవావడానికి కంప్యూటర్, ఇంటర్న్ట్ సౌకర్యం ఉంటే చాలు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్.ఏపీ.జీఓవీ.ఇన్ అని టైపు చేయాలి. అప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అధికార వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ♦ వెబ్సైట్ కిందిభాగంలో కుడివైపున ‘న్యూ ఇంటెంటివిస్’ కింద ఆన్లైన్ ఈసీ, ఆన్లైన సీసీ, డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనే అప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే పబ్లిక్ ఆన్లైన్ సర్వీసు అని వస్తుంది. ♦ దీనిపై క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్వర్డు ఆప్షన్లు వస్తాయి. అందులో నాట్ ఏ మెంబరు? పై క్లిక్ చేస్తే సిటిజన్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరు, యూజర్ ఐడీ, పాస్వర్డు, సెల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈ–మెయిల్, అడ్రస్ వంటి వివరాలు టూపు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం సెల్ఫోన్కు వచ్చిన వన్టైమ్ పాస్వర్డును నమోదు చేసి యూజర్ ఐడీ సహాయంతో లాగిన్ అవ్వాలి, ♦ అనంతరం ‘పబ్లిక్ ఆన్లైన్ సర్వీసుకు వెళ్లి యూజర్ ఐడీ, పాస్వర్డుతో లాగిన్కాగానే పబ్లిక్ ఆన్లైను పేరుతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన ఎన్కంబరెన్స్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (దస్తావేజులు, నకళ్లు), డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు కావాల్సిన సర్వీసుపై క్లిక్ చేసి పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ♦ ఉదాహరణకు సర్టిఫైడ్ కాపీ (సీసీ)లోకి వెళ్లాలంటే జిల్లా, ప్రాంతం, డాక్యుమెంట్ నెంబరు, సంవత్సరం వివరాలను ఎంటర్ చేస్తే అప్పుడు, డీడ్ పర్టిక్యూలర్ ఆఫ్ డాక్యుమెంట్ అని వస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే సెల్కు వన్టైమ్ పాస్వర్డు వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే సర్టిఫైడ్ కాపీ రిసీవ్డ్ అని ఓపెన్ అవుతుంది. అనంతరం కావాలంటే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే క్లిక్ ఆప్షన్ నుంచి ఈసీలు, నకళ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. . ♦ 1983 నుంచి ఆన్లైన్లో ఉన్న ఈసీలు వస్తాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సొమ్ము చెల్లించి పొందవచ్చు. ♦ సర్టిఫైడ్ కాపీ నకళ్లు 1999 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి నగదు చెల్లించి పొందాల్సి ఉంటుంది. ♦ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ముందుగా వ్యవసాయ భూముల క్రయ దస్తావేజులు (సేల్) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ సైట్ ఎర్రర్ చూపిస్తోంది. త్వరలో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ♦ ప్రీ రిజిస్ట్రేషన్ దస్తావేజు ప్రిపరేషన్కు ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి. -
రెవె‘న్యూ’పాలన
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారాలకు త్వరలోనే కత్తెర పడనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ శాఖ పరిధి, అధికారాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నిర్వహిస్తున్న విధుల్లో ఎక్కువ భాగం పనులను రెవెన్యూశాఖకు బదలాయించాలని సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు నుంచి రెవె‘న్యూ’ పాలనకు తెరలేవనుంది. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా వ్యవహరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రోజు నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి తగ్గనుంది. ఇకపై ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందో దాని పరిధి ఆ మండలానికే పరిమితం కానుంది. మిగతా చోట్ల తహసీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. భూముల క్రయ విక్రయాల బాధ్యతలను వారే చూస్తారు. సగం చోట్ల ఖాళీ! ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సగం మండలాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తహసీల్దార్లే పర్యవేక్షించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 45 మండలాలకుగాను కేవలం 22 మంది సబ్రిజిస్ట్రార్లు మాత్రమే ఉన్నారు. దీంతో వీరు మినహా మిగతా మండలాల బాధ్యతలు తహసీల్లార్ద నెత్తిన పడనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరులో మాత్రమే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. దీంతో ఇవి ప్రతి రోజూ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతాయి. ఇకపై ఇవి కేవలం ఆయా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కానున్నాయి. అయితే, అదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయంలో సగం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రధాన ఆదాయార్జన శాఖగా చెప్పుకునే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూములు, స్థలాలు, ఇతర దస్తావేజుల నమోదుతో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా రాబడి లభిస్తోంది. రాజధాని పరిసరాల్లోనే ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో స్థిరాస్తిరంగం బలంగా ఉంది. దీంతో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు, అగ్రిమెంట్లు సహా ఇతరత్రా డాక్యుమెంట్ల నమోదులోనూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిని సంబంధిత మండలానికే పరిమితం చేసినా మిగతా మండలాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ల భారం తహసీల్దార్లను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు యాచారం, మంచాల, కందుకూరు, ఆమనగల్లు, కొత్తూరు, నందిగామ, మొయినాబాద్, కడ్తాల, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో తహసీల్దార్ల ఇతర పనులపై ప్రభావం పడనుంది. అదే సమయంలో భూ వివాదాలు కూడా ఎక్కువే కావడంతో ఈ కొత్త విధులు తమ మెడకు ఎక్కడ చిక్కుకుంటాయోననే ఆ మండలాల తహసీల్దార్లు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అధికంగా ఉన్నందున వీటిని పునర్విభజించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ల విధులను దాదాపుగా రెవెన్యూశాఖకు బదలాయిస్తుండడంతో జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలేమిటనేది చర్చనీయాంశంగా మారింది. -
శూన్య మాసంలోనూ సూపర్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. గత రెండు నెలలుగా లక్షల సంఖ్యలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆ శాఖకు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. శూన్యమాసం అయినప్పటికీ డిసెంబర్, జనవరి నెలలమధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.430 కోట్లకు పైగా ఆదాయం రావడం గమనార్హం. రికార్డుస్థాయి ఆదాయం డిసెంబర్నెల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఎప్పు డూ ఒక్క నెలలో రూ.400 కోట్లకు మించి ఆదాయం రాలేదు. లక్షకు లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. కానీ, డిసెంబర్ నెలలో మాత్రం ఒక లక్షా 8వేలకు పైగా లావాదేవీల ద్వారా రూ.430 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. ఇదే ఊపు జనవరిలోనూ కొనసాగుతోంది. ఈనెలలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు 42,286 లావాదేవీలు జరగ్గా, రూ.151.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారానే రాగా, ఆన్లైన్ ఈ–చలాన్ల ద్వారా మరో రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.4వేల కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటివరకు ఈ ఏడాది 8,50,148 లావాదేవీలు జరగ్గా, రూ. 3,440.58 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఈసారి లక్ష్యాన్ని మించుతుందని అంచనా వేస్తున్నారు. మంచిరోజులు కాకపోయినా.. డిసెంబర్ 16 నుంచి శూన్యమాసం ప్రారంభమైంది. సంక్రాంతి దాటేంతవరకు ఉండే ఈ మాసంలో శుభ కార్యాలకు మెజార్టీ ప్రజలు ఇష్టపడరు. అయినా, రిజిస్ట్రేషన్ లావాదేవీలు పోటెత్తుతుండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుభ కార్యం కాదని, ఆషాఢమాసంలో బంగారం ఎక్కువగా కొన్నట్టు ఓ పనయిపోతుందిలే అనే భావనలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గతంలో మాదిరిగా శూన్యమాసం సెంటిమెంట్ను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పంట భూముల రిజిస్ట్రేషన్లు అంతగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సొంత సర్వర్తో వేగంగా లావాదేవీలు.. సాంకేతికంగా శాఖాపరమైన మార్పులు కూడా ఆదాయాభివృద్ధికి కారణమవుతున్నాయని అంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ నుంచి విడిపోయి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ, హైదరాబాద్ గచ్చిబౌలిలో అతి పెద్ద సర్వర్ను కూడా ఏర్పాటు చేసుకుని దానిని రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసింది. దీంతో గతంలో మాదిరిగా సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో అంతరాయం కలగడం లేదని, చకచకా ప్రక్రియ ముగిసిపోతుండడంతో మరిన్ని లావాదేవీలు నమోదు చేస్తున్నామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్
- నవంబర్ 1 నుంచి కొత్త విధానం - బలవంతపు రిజిస్ట్రేషన్లు, పోలీసు కేసులు, బోగస్ వ్యక్తులకు చెక్ - సీసీ కెమెరాలతో క్రయ, విక్రయ లావాదేవీలన్నీ రికార్డు - ప్రక్రియ పూర్తయ్యాక కొనుగోలుదారులకు సీడీ రూపంలో అందజేత - భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే సాక్ష్యంగా వినియోగం సాక్షి, హైదరాబాద్: మల్లిక్ అనే వ్యక్తి తారక్ నుంచి రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొత్తం డబ్బు చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మల్లిక్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ కూడా అయింది. కానీ నాలుగు నెలల తర్వాత పోలీస్స్టేషన్ నుంచి మల్లిక్కు పిలుపు వచ్చింది. మల్లిక్ తనను బెదిరించి తన రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, తన భూమి తనకు ఇప్పించాలని తారక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న మల్లిక్.. ఇంటికి వెళ్లి ఒప్పందం పత్రాలు తెచ్చాడు. కానీ పోలీసులు వాటిని నమ్మలేదు. ‘అలాంటి కాగితాలు ఎన్నయినా సృష్టించొచ్చు కదా.. బెదిరించి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్’ అని ప్రశ్నించడంతో మల్లిక్ తెల్లబోయాడు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ రిజిస్ట్రేషన్లు, బోగస్ వ్యక్తులు, బలవంతపు రిజిస్ట్రేషన్ల పేరిట తలెత్తుతున్న సమస్యలకు దీనితో పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది. దీనిని వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని.. కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ భరోసా కల్పించేందుకు ఆ వీడియోలను సీడీ రూపంలో అందజేయాలని నిర్ణయించింది. అంతా పక్కాగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు విక్రేతలు, కొనుగోలుదారులు, సాక్షులు కేవలం సంతకాలు పెట్టడం, వేలిముద్రలు వేయడానికే పరిమితమవుతున్నారు. కానీ కొత్త విధానం అమల్లోకి వచ్చాక విక్రయించేవారు తాను ఫలానా భూమి లేదా ఆస్తిని కొనుగోలుదారుడికి ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నానని.. అందుకు సంబంధించిన సొమ్ము కూడా తనకు అందిందని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పే సమయంలో కొనుగోలుదారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్కడే ఉంటారు. ఈ మొత్తం దృశ్యాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. అందులోనే తేదీ, సమయం కూడా నమోదవుతాయి. మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వీడియో దృశ్యాలను సీడీలోకి నింపి కొనుగోలుదారులకు అందజేస్తారు. ఇందుకోసం ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి కార్యాలయంలో, మరోటి రికార్డుల కోసం వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇప్పటికే 30 కార్యాలయాలకు సీసీ కెమెరాలు అందాయి. మిగతా వాటికి అక్టోబర్ 15 లోగా పంపుతామని, నవంబర్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తేస్తామని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. పారదర్శకంగా ఉండేలా చర్యలు సీసీ కెమెరాల ద్వారా క్రయ, విక్రయాలు జరిపేవారితోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది వ్యవహారశైలి కూడా రికార్డవుతుందని.. తద్వారా సిబ్బంది పనితీరు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో విక్రేతలు స్వచ్ఛందంగానే అమ్ముతున్నారా లేక బలవంతంగా వ్యవహరిస్తున్నాడా అన్న అంశాలను వారి వ్యవహార శైలిని బట్టి తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. కొనుగోలుదారులకు భరోసాతోపాటు సాక్ష్యంగా ఉపయోగించుకునే ఆలోచనతో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తిచేస్తున్నామని, నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. -
భూఅక్రమాలపై ఏసీబీ కన్ను
► రాజంపేటలో జోరుగా భూ అక్రమాలు ► రికార్డుల కోసం వచ్చిన అధికారులు ► క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై ఆరా ► కాసులు కురిపిస్తున్న భూ వ్యవహారాలు ► కోట్లాది విలువచేసే సర్కారు భూములు ధారాదత్తం రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోజరిగిన భూ అక్రమాలపై ఎసీబీ కన్నుపడింది. మండల పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల టాంపరింగ్, కబ్జాలు ఇలా ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో భూ బకాసురులు అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. రికార్డులు తారుమారు, టాంపరింగ్ చేసి తమవి అన్నట్లుగా చిత్రీకరించుకోవడం రాజంపేటలో అధికం కావడంతో నిజమైన భూబాధితులు అధికారుల అవినీతికి అడ్డుకట్టవేసేందుకు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దారు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించారు. అక్కడి అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టి...కోట్లు లాభర్జన: తహసీల్దారు కార్యాలయంలో కొందరు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా భూ బకాసురులకు కట్టబెడుతున్నారు. ఇందుకు కొంతమంది అధికారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నట్లుగా ఆరోపణలు వెలుడుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుం చి కోట్లాది రూపాయలు భూ కుం భకోణంకు పాల్పడినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయíస్థితిలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండిపోయారు. అధికార పార్టీ అండదండలతో భూ అక్రమ వ్యవహారాలను తమ్ముళ్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ రూ.కోట్లు వెనుకవేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు వీఆర్వోలు కూడా భూ బకాసురు లకు అంతర్గత మద్దత్తు ఇస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఏసీబీ ఆరాతో రెవెన్యూ అధికారుల్లో వణుకు ఏసీబీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి రావడంతో కొందరు అధికారుల్లో వణుకుపుట్టింది. అలాగే ప్రభుత్వ భూములను కూడా రికార్డులు మార్చేసి రాజం పేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్లు కూడా చేయించుకున్నారంటే ఎంత పక్కాగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదని భూ బాధితులు చెబుతున్నారు. తాళ్లపాక, ఊటుకూరు, వెంకటరాజంపే ట, బోయనపల్లె, అన్నమయ్య థీం పార్కు ఏరియా, బైపాస్ రహదారి, చక్రాలమడుగు ఏరియా, ఎస్ఆర్పాళెం(పుల్లంపేట మండలం), రాయచోటి రోడ్డు తదితర ప్రాంతాల్లో భూ అక్రమ వ్యవహారాలు కోట్లరూపాయలు సాగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. పైవాటిలో కొన్నింటికి సంబంధించి భూ రికార్డులలో గోల్మాల్ చేసినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడాలేదనే రాజంపేట రెవెన్యూ అధికారులు మాత్రం బడాబాబులు, అధికారపార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సాగు, ఇంటి స్థలాలను చూపించి.. వారి వద్ద నుంచి కొంత మొత్తం తీసుకొని కట్టబెడుతున్నారు. గత మూడేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారం ఎట్టకేలకు ఏసీబీని కూడా తాకింది...ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా దాడి చేయవచ్చనే భయాందోళన రెవెన్యూ వర్గాల్లో హాట్టాఫిక్గా మారింది. రికార్డుల కోసం.. ఏసీబీ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల కోసం ఆయాశాఖల అధికారులను సంప్రందించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రాజంపేటలో జరుగుతున్న భూ అక్రమ వ్యవహారాలపై నిఘా ఉం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ అక్రమ వ్యవహా రాలు అధికమయ్యాయి. ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించడం లాంటివి స్థానిక రెవెన్యూ అధి కారుల సహకారంతో చేపట్టినట్లు ఆరోపణలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ప్ర«భుత్వ భూములను తమవి అన్నట్లుగా రికార్డులు సృష్టించుకొని అందులో రియల్ వ్యాపారం చేస్తున్నారు. -
అనూహ్యం.. అతలాకుతలం
► కేంద్రం వరుస షాక్లతో ► రాష్ట్రం బెంబేలు ► రూ.2000 కోట్ల మేరకు పన్నుల వాటాకు గండి ► నోట్ల రద్దుతో ఆదాయ అంచనాలు తలకిందులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతోంది. జిల్లాల ఏర్పాటుతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇక ఆర్థిక లోటు ఉండదు అనుకుంటున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు, కేంద్ర నిధుల్లో కోత ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర ఆర్థిక శాఖను అతలాకుతలం చేస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం స్తంభించడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఊహించనంతగా పడిపో యింది. భవిష్యత్తులో వ్యాట్ పెరుగుతుందనే భరోసా ఉన్నప్పటికీ నగదు లావాదేవీలతో సంబంధమున్న వ్యాపారాలన్నీ స్తబ్దుగా ఉన్నాయి. కొత్త జిల్లాలతో రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు ప్రభావం ఒక్కసారిగా దెబ్బతీసిందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుందని ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నిర్ణయంతో అంచనాలు తలకిందులయ్యాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలు ఇప్పటికిప్పుడు అంచనా వేసే పరిస్థితి లేదని, కొంతకాలం గడిస్తే రాష్ట్రాలకు వచ్చే ఏయే పన్నులు పెరిగే అవకాశముంది, ఏయే పన్నులు తగ్గే పరిస్థితి ఉందని స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కేంద్రానికి లేఖ రాసే యోచన.. ఇదే తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కోత పెట్టడం పుండు మీద కారం చల్లినట్ల యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.13,995 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నెలసరి వా యిదాల్లో కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుంది. ఏడాది చివర్లో పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే రాబడికి అనుగుణంగా నిధుల్లో కోత వేస్తుంది. ఈసారి ఆర్థిక సంవత్సరం మధ్యలోనే 48 శాతం కోత విధించింది. దీంతో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు పన్నుల వాటాను కేంద్రం కత్తిరించే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసింది. నోట్ల రద్దు ప్రభావానికి తోడు పన్నుల ద్వారా రావాల్సిన రాబడి తగ్గటంతో ఈ నెలలో ఖర్చులకు సరిపడే ఆదాయం సమకూరుతుందా.. లేదా... అని ఆర్థిక శాఖ మల్ల గుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ పరిణామాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. గవర్నర్ నరసింహన్కు నివేదించారు. తాజా పరిణామాలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.