-
దక్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్కటే మార్గం: మోర్కెల్
టీ20 వరల్డ్-2024 ఫైనల్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు."బుమ్రా అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి. అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు. కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్లో ఉటుందని"ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
ఏమి చేస్తున్నావు కుల్దీప్.. రోహిత్ శర్మ సీరియస్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో సెమీఫైనల్కు చేరేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్లో ప్రత్యర్ధిని 146 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా(50), విరాట్ కోహ్లి(37), రిషబ్ పంత్(36), శివమ్ దూబే(34) పరుగులతో రాణించగా.. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్పై రోహిత్ అసహనం..ఇక ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తొలి బంతిని షకీబ్ అల్ హసన్ భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత రెండో బంతికి షకీబ్ రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్ముదుల్లాకు కుల్దీప్ గుగ్లీగా సంధించాడు. అయితే మహ్ముదుల్లాకు గుగ్లీ వేయడం రోహిత్కు నచ్చలేదు. వెంటనే రోహిత్.. ఏమి చేస్తున్నావు కుల్దీప్, అతడికి స్వీప్ ఆడనివ్వు. ఒకరు స్వీప్ ఆడి ఇప్పుడే ఔటయ్యాడు. కాబట్టి అతడు స్వీప్ ఆడేట్లు బౌలింగ్ చేయు అని చెప్పాడు. ఇదింతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Rohit Sharma and Stump Mic😂🫶🏻 pic.twitter.com/cSUrBnLJHJ— Kuljot⁴⁵ (@Ro45Kuljot) June 22, 2024 -
అఫ్గాన్తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్కు నో ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్మెంట్ అఫ్గాన్తో మ్యాచ్లో అదనపు స్పిన్నర్ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.అఫ్గాన్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
IND vs CAN: భారత తుదిజట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.కాగా ఫ్లోరిడాలోని లాడెర్హిల్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక టీమిండియా- కెనడా మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.ఆ ఇద్దరు అవుట్!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్లో సూపర్-8 మ్యాచ్ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మ్యాచ్లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్లు న్యూయార్క్లోనే జరిగాయి.అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్కు తుదిజట్ల అంచనా భారత తుదిజట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కెనడా తుదిజట్టు(అంచనా)ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx— BCCI (@BCCI) June 14, 2024 -
IND Vs PAK: పాకిస్తాన్తో మ్యాచ్.. భారత జట్టులోకి గేమ్ ఛేంజర్! ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024లో- దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తోంది. ఈ బ్లాక్బ్లాస్టర్ క్లాష్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఐర్లాండ్పై విజయం సాధించి సమరోత్సహంతో భారత్ బరిలోకి దిగనుండగా.. పసికూన చేతిలో ఓడిన పాక్ మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.ఐర్లాండ్తో మ్యాచ్లో గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు పాకిస్తాన్తో మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. న్యూయర్క్ వికెట్ స్పిన్కు అనుకూలించడంతో పాటు పాక్పై కుల్దీప్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. అదే విధంగా కుల్దీప్ కూడా ఇటీవల అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఒక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.మరోవైపు పాకిస్తాన్ కూడా ఓ మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ స్ధానంలో ఆల్రౌండర్ ఇమాద్ వసీం తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తుది జట్లు(అంచనా)భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్. -
కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్లో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.టీమిండియాకు విలువైన ఆస్తిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.‘‘బ్యాట్తోనా? అదెప్పుడు?’’ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.ఈ జట్టుకు నేనే కెప్టెన్ను!దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా జూన్ 1 బంగ్లాదేశ్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్కప్లో లీడింగ్ వికెట్ టేకర్ అతడే..!
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ 2024పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు.. పలానా బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడు.. పలానా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్కు చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్మీడియా వేదికగా జోస్యాల మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా స్పందించాడు.బిషప్ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్కు చెప్పి క్రికెట్ సర్కిల్స్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్కప్లో లీడింగ్ వికెట్ టేకర్గా టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉంటాడని బోల్డ్ స్టేట్మెంట్ చేశాడు. మరో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్ లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని ముక్తకంఠంతో వాదిస్తుంటే.. బిషప్ మాత్రం కుల్దీప్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్కప్ లీడింగ్ రన్ స్కోరర్పై కూడా బిషప్ తన అంచనాను అందరికీ భిన్నంగా వెల్లడించాడు. ఈ విభాగంలో మెజారిటీ శాతం విరాట్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్ల పేర్లు చెబుతుంటే బిషప్ మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు చెప్పి అందరి అంచనాల్లో తన అంచనా వేరని నిరూపించాడు. సెమీఫైనలిస్ట్ల విషయంలోనూ బిషప్ అంచనా కాస్త వైవిధ్యంగా ఉంది. ఈసారి ఫైనల్ ఫోర్కు భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చేరతాయని బిషప్ చెప్పుకొచ్చాడు.కాగా, టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. అనంతరం టీమిండియా జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో తలపడుతుంది. ఐర్లాండ్తో మ్యాచ్ కోసం ఇదివరకే న్యూయార్క్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్లో నిమగ్నమై ఉన్నారు. -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో కుల్దీప్దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. -
పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్లో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. ఆది నుంచే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ శుబ్మన్ గిల్ వికెట్ తీసి టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని మొదలుపెట్టగా.. ముకేశ్ కుమార్ వృద్ధిమాన్ సాహా వికెట్ పడగొట్టాడు. ఇక సుమిత్ కుమార్ అద్భుత రీతిలో సాయి సుదర్శన్(12)ను రనౌట్ చేయగా.. ఇషాంత్ మరోసారి మ్యాజిక్ చేసి డేవిడ్ మిల్లర్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ట్రిస్టన్ స్టబ్స్ అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ వికెట్లు తీసి టైటాన్స్ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. రషీద్ అవుట్ కావడంతో.. తానేమీ తక్కువ కాదన్నట్లు అక్షర్ పటేల్ రాహుల్ తెవాటియా(10) రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. ఖలీల్ అహ్మద్ మోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్ గాడిన పడేసే ప్రయత్నం చేసిన రషీద్ ఖాన్(31)ను పెవిలియన్కు పంపిన ముకేశ్ కుమార్ .. నూర్ అహ్మద్ వికెట్ కూడా తీసి కథ ముగించాడు. ఫలితంగా సొంతమైదానంలో 89 పరుగులకే కుప్పకూలింది గుజరాత్ టైటాన్స్. ఇక లక్ష్య ఛేదనలో ధనాధన్ ధోరణి అవలంభించిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లాంఛనం పూర్తి చేసింది. A clinical bowling performance in Ahmedabad powered @DelhiCapitals to their third win of the season 👌 Watch the recap of the #GTvDC clash 🎥#TATAIPL pic.twitter.com/ukxCq7MOpS — IndianPremierLeague (@IPL) April 18, 2024 అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఢిల్లీ పొరపాట్లకు తావు లేకుండా గెలిచిన తీరు.. అందులోనూ ముఖ్యంగా కెప్టెన్గా, వికెట్ కీపర్గా రిషభ్ పంత్ రాణించడం అభిమానులను ఖుషీ చేసింది. అదే విధంగా అతడు ఈ మ్యాచ్లో కూల్గా డీల్ చేసిన విధానం కూడా ముచ్చటగొలిపింది. పిచ్చి పట్టిందా అంటూ కుల్దీప్ ఆగ్రహం ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గుజరాత్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ బౌల్ చేశాడు. అతడి బౌలింగ్లో ఐదో బంతికి రాహుల్ తెవాటియా షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. కానీ, అప్పటికే మరో ఎండ్లో ఉన్న అభినవ్ మనోహర్ తెవాటియా పరుగు తీస్తాడేమోనని క్రీజు వీడాడు. ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్ ముకేశ్ కుమార్ను వికెట్లకు గిరాటేయాల్సిందిగా పంత్ ఆదేశించాడు. ముకేశ్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్వైపు గురిపెట్టాడు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన తెవాటియా మనోహర్ను వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించగా.. అతడు సరైన సమయంలో క్రీజులో చేరాడు. Angry 💢 kullu 😭😭 pic.twitter.com/y7NQy1NQD3 — RITIKA RO 45 (@RITIKAro45) April 17, 2024 మరోవైపు.. ముకేశ్ విసిరిన బంతి ఓవర్ త్రో అయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుల్దీప్ యాదవ్.. ముకేశ్ కుమార్ను ‘నీకేమైనా పిచ్చి పట్టిందా’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇంతలో పంత్ జోక్యం చేసుకుని ‘కోపం వద్దు భయ్యా’ అంటూ కుల్దీప్ను హత్తుకుని మరీ సముదాయించాడు. ఇంతలో ముకేశ్ సైతం చిరునవ్వులు చిందిస్తూ కుల్దీప్ కోపాన్ని లైట్ తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: Shubman Gill: ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
LSG Vs DC: కుల్దీప్ మ్యాజిక్ డెలివరీ.. పూరన్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్ అద్బుతమైన బంతితో లక్నో విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి పూరన్కు కుల్దీప్ ఆఫ్ స్టంప్ దిశగా అద్బుతమైన గూగ్లీని సంధించాడు. అయితే బంతి టర్న్ అవుతుందని భావించిన పూరన్ ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. గానీ బంతి ఎటువంటి టర్న్ కాకుండా బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చేసిన పూరన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. కుల్దీప్ దెబ్బకు పూరన్ ఖాతాతెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో కుల్దీప్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍 Kuldeep Yadav straight away unveiling his magic!👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికంటే..?
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించింది. విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లు ఈ సిరీస్కు దూరమైనప్పటికీ వారి స్థానాలకు భర్తీ చేస్తూ యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ సిరీస్లో టీమిండియా కుర్ర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్ లాంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో సీనియర్ల స్థానాన్ని ప్రశ్నార్దకంగా మార్చారు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. కుల్దీప్, బుమ్రా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ సత్తా నిరూపించుకున్నారు. దృవ్ జురెల్ బ్యాటర్గానే కాకుండా వికెట్కీపర్గానూ రాణించి పంత్ స్థానానికి ఎసరుపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్ మొత్తంలో ఒక్క రజత్ పాటిదార్ మినహాయించి టీమిండియాకు అన్ని శుభాలే జరిగాయి. Any guesses who won the Fielding Medal for the series 🤔#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/NxZVWOX422 — BCCI (@BCCI) March 10, 2024 పాటిదార్ ఒక్కడే మూడు మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆకాశ్దీప్ సైతం లభించిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆకాశ్ నాలుగో టెస్ట్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా ఈ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్లోనూ మెరుగ్గా రాణించారు. భారత ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్లో మైదానంలో పాదరసంలా కదిలారు. అద్భుతంగా ఫీల్డింగ్ చేసి పరుగులు నియంత్రించడంతో పాటు కొన్ని కళ్లు చెదిరే క్యాచ్లు పట్టారు. సిరీస్ మొత్తంలో ఫీల్డింగ్లో సత్తా చాటిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లకు ఇంపాక్ట్ ఫీల్డర్స్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఫీల్డింగ్కు సంబంధించి కుల్దీప్ యాదవ్కు ప్రత్యేక అవార్డు లభించింది. గతకొంతకాలంగా మైదానంలో రాణించే వారిని ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన రాంచీ టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత రెండో టెస్ట్లో 106 పరుగుల తేడాతో, మూడో టెస్ట్లో 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఆధ్యాంతం పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్లో జైస్వాల్ 9 ఇన్నింగ్స్ల్లో 2 డబుల్ సెంచరీలు, 3 అర్దసెంచరీల సాయంతో 712 పరుగులు చేసి సిరీస్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. -
మాటలు రావడం లేదు.. అతడొక సంచలనం! చాలా సంతోషంగా ఉంది: రోహిత్
సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గతకొంత కాలంగా బాజ్బాల్ అంటూ సంప్రాదయ క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన ఇంగ్లండ్ జట్టుకు.. భారత్ సరైన గుణపాఠం నేర్పింది. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఆఖరి టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-0 తేడాతో టీమిండియా ఘనంగా ముగించింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్ అసాంతం అదరగొట్టిన యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టుల్లో ఇటువంటి విజయం సాధించాలంటే అన్ని ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలి. సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. గానీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. అందుకే తీవ్రమైన ఒత్తడిలో సైతం వారు అద్బుతంగా రాణించారు. ఈ సిరీస్ విజయం సాధించేందుకు మా జట్టు మొత్తం తీవ్రంగా శ్రమించింది. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ మా జట్టు మొత్తానికి ఇవ్వాలనకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సిరీస్ విజయం సాధిస్తే అందరూ సెంచరీలు, వ్యక్తిగత రికార్డుల కోసమే మాట్లాడతారు. కానీ ఒక టెస్టులో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి బౌలర్ల కృషి లేనదే గెలుపొందడం చాలా కష్టం. ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కోసం ఎంతచెప్పుకున్న తక్కువే. మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్ను ఎటాక్లో తీసుకురావాలని భావించాను. అందుకు తగ్గట్టే అతడు మాకు తొలి వికెట్ను అందించాడు. గాయం నుంచి కోలుకోని కుల్దీప్ ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయడం కూడా మా జట్టుకు బాగా కలిసిచ్చోంది. ఇక జైశ్వాల్ గురించి ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. అతడొక సంచలనం. యశస్వీ ఇంకా తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాలి. జైశ్వాల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి జైశ్వాల్ ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇదొక అద్బుతమైన సిరీస్ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ ఈ సిరీస్లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా జైశ్వాల్ నిలిచాడు. -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్లపై ‘బజ్బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్ను కుప్పకూల్చాడు. శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్. ఓవరాల్గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్ను అవుట్ చేసి ఐదో వికెట్ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800 షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708 జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700* అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
కుల్దీప్ ఫటాఫట్...ఓపెనింగ్ ధనాధన్!
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్లో భారత్కు తొలిసారి ఓపెనింగ్లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. ధర్మశాల: ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్తో పాటు శుబ్మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజ్లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్దత్ పడిక్కల్ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది. టపటపా... ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్తో తన తొలి ఓవర్లోనే డకెట్ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్లో పట్టుదలగా నిలబడ్డాడు. అయితే రెండో సెషన్లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. శుభారంభం... భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు. బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్@ 314 ఈ మ్యాచ్తో కర్ణాటకకు చెందిన దేవ్దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు. 17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్గా బెయిర్స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు. 14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1. -
Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్ను చూసే నేర్చుకోవాలి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు. రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. First Kuldeep Yadav give the ball to Ravi Ashwin but Ashwin return the ball to Kuldeep Yadav to celebrate his 5-Wicket haul. - Beautiful moments of the day...!!!! pic.twitter.com/64ev9CFM4f — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్కు వెళ్తుండగా వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ ఇన్నింగ్స్ హీరో కావడంతో అశ్విన్ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్.. కుల్దీప్ను ఒప్పించాడు. కుల్దీప్ టీమ్ను లీడ్ చేస్తూ పెవిలియన్వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ‘బజ్బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్గా వెనుదిరగగా.. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. భారత తొలి బౌలర్గా అరుదైన రికార్డు
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఆఖరి టెస్టు ఆరంభమైంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో కుల్దీప్ అదరగొడుతున్నాడు. బెన్ డకెట్(27), జాక్ క్రాలే(79), ఒలీ పోప్(11) రూపంలో టాపార్డర్ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్.. మిడిలార్డర్ బ్యాటర్లు జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0)లను కూడా అవుట్ చేశాడు. కాగా స్టోక్స్ను పెవిలియన్కు పంపిన సందర్భంగా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్లను ఈ చైనామన్ బౌలర్ అధిగమించాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్గా నిలిచాడు. తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్లు 1871 - కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 2205 - అక్షర్ పటేల్(Axar Patel) 2520 - జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ధ్రువ్తో అట్లుంటది మరి.. చెప్పి మరి ఔట్ చేశాడు! ధోనిలా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్ కీపర్ మరోసారి తన స్కిల్స్ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ను జురెల్ బోల్తా కొట్టించాడు. ఏం జరిగిందంటే? భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రోజు లంచ్ విరామానికి ముందు 26 ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్కు అప్పగించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలే సింగిల్ తీసి ఓలీ పోప్కు ఇచ్చాడు. పోప్ రెండో బంతికి ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి వెళ్లింది. అయితే జురెల్ కుల్దీప్ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు. యాదృచ్ఛికంగా జురెల్ చెప్పటినట్లగానే పోప్ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్ సూచనతో కుల్దీప్ టర్న్ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్ బ్యాట్కు మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే జురెల్ బెయిల్స్ను పడగొట్టి స్టంపౌట్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జురెల్ స్కిల్స్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్ -
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతడు ఇచ్చిన క్యాచ్ను శుబ్మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. -
మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా?
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జడేజా, గిల్, సర్ఫరాజ్ వంటి స్టార్ బ్యాటర్లు ఇంగ్లండ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న చోట.. కుల్దీప్ తన క్లాస్ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్.. ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తన డిఫెన్స్తో ఇంగ్లండ్ స్పిన్నర్లకు విసుగు తెప్పించాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. దృవ్ జురల్తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 131 బంతులు ఎదుర్కొన్న యాదవ్ 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఆఖరికి జేమ్స్ ఆండర్స్ బౌలింగ్లో కుల్దీప్ ఔటయ్యాడు. కాగా భారత తొలి ఇన్నింగ్స్లో అందరి కంటే ఎక్కువ బంతులు కుల్దీప్ యాదవే ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కుల్దీప్ అద్భుత ఇన్నింగ్స్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసింది 28 పరుగులే కానీ సెంచరీ కంటే ఎక్కువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది అయితే "మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నాండంటూ" ఇంగ్లండ్ను ఉద్దేశించి పోస్టులు చేస్తున్నారు. కాగా రూట్ కూడా తన అద్బుత సెంచరీతో ఇంగ్లండ్ను అదుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 94 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. దృవ్ జురల్(59) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంక భారత్ తొలి ఇన్నింగ్స్లో 88 పరుగులు వెనుకంజలో ఉంది. If You Have Joe Root Then We Have Sir Kuldeep Yadav .#INDvENG pic.twitter.com/spUiB8299a — ShivX #ExMIFan (@ShivX45) February 25, 2024 Meanwhile Rahul Dravid to Rajat Patidar after Kuldeep Yadav faced the maximum ball in the Indian inning 😅#INDvENG pic.twitter.com/Q2VWu4WhoP — Sujeet Suman (@sujeetsuman1991) February 25, 2024 -
మొన్న సర్ఫరాజ్.. ఇవాళ గిల్
సహచర ఆటగాళ్ల తప్పిదాల కారణంగా రనౌట్లు కావడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువైంది. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సహచరుడు రవీంద్ర జడేజా తప్పిదానికి బలైపోగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా యంగ్ గన్ శుభ్మన్ గిల్.. సహచరుడు కుల్దీప్ యాదవ్ రాంగ్ కాల్ కారణంగా రనౌటయ్యాడు. A heart-breaking run-out for Shubman Gill....!!!!pic.twitter.com/GoFZ3OEeOl — Johns. (@CricCrazyJohns) February 18, 2024 ఈ రెండు ఘటనల్లో స్ట్రయికింగ్లో ఉన్న ఆటగాళ్లే (జడేజా, కుల్దీప్) తొలుత పరుగుకు పిలుపున్చి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రెండు సందర్భాల్లో రాంగ్ కాల్కు బలైపోయిన ఆటగాళ్లు మాంచి ఊపులో ఉన్నప్పుడు రనౌటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యే సమయానికి మెరుపు అర్ధసెంచరీ (66 బంతుల్లో 62 పరుగులు; 9 ఫోర్లు, సిక్స్) చేసి జోరు మీదుండగా.. ఇవాళ జరిగిన దురదృష్ట ఘటనలో గిల్ సెంచరీకి తొమ్మిది పరుగులు దూరంలో (151 బంతుల్లో 91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నప్పుడు ఔటయ్యాడు. సర్ఫరాజ్, గిల్ రనౌట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాగా, రాజ్కోట్ టెస్ట్ నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 440 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్లో ఉన్నారు. ఇవాల్టి ఆటలో శుభ్మన్ గిల్తో పాటు కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153)