kottu satyanarayana
-
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కొట్టు సత్యనారాయణ
పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు...సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం. ..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా? -
టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఫైర్
-
రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
-
‘పవన్పై ప్రజలకు చాలా అనుమానాలున్నాయ్’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి వారిని హక్కుదారులను చేయాలని చూస్తే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడు రామోజీరావు దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాడని.. 50 ఏళ్ల సామ్రాజ్యం అనుకునే ఈనాడు తన సామ్రాజ్యాన్ని తానే కొల్లగొట్టుకుంటుందని దుయ్యబట్టారు. జెండా సభకు జనం రాకపోతే అది కప్పిపుచ్చుకునేందుకే జెండా సభకు వచ్చిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని విషపు రాతలు రాస్తున్నారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్లు పై దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు. వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తే నష్టపోయేది ప్రజలే. చంద్రబాబు లాంటి తన్నే దున్నపోతు వెనుక ఎవరు వెళ్లే పరిస్థితి లేదు’’ అని మంత్రి అన్నారు. చంద్రబాబు రాసిచ్చింది చదివే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ ఊగిపోతూ మాట్లాడుతున్నాడో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇటీవల కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తున్నట్లు.. ఏ మాఫియా వీరికి ఏమేమి సప్లై చేస్తారో మాకు తెలియదు. పవన్ కల్యాణ్ ఉన్మాదంతోనే మాట్లాడారు. జెండా సభలో పవన్ మాట్లాడిన తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. 24 సీట్లు వల్ల కాపులకు ఒరిగేదేమీ లేదు. పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడు పోయాడని అనుకుంటున్నారు. పవన్ తీరు చూసి కాపులు సిగ్గుపడుతున్నారు. ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్న పరిస్థితి. పవన్పై కాపు సామాజిక వర్గానికి నమ్మకం పోయింది. పవన్ కల్యాణ్ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ -
పవన్ వ్యాఖ్యలను ప్రజలు హర్షించరు
-
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్వేస్కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
900 వందల దేవాలయాలను బాగుచేశాం.. మంత్రి కొట్టు కీలక కామెంట్స్
-
రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి
తొండంగి: రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్..
-
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
పవన్, బాబులపై మంత్రి కొట్టు సత్యనారాయణ అదిరిపోయే పంచులు..
-
సైబర్ సిటీ అన్నావ్.. జెండా పీకేశావ్..సత్యనారాయణ కౌంటర్
-
వైభవంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
-
దుర్గగుడి పంచాంగం బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
-
పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారు: కొట్టు
-
‘పురంధేశ్వరి.. బాబు అవినీతిపై మీ భర్త రాసింది మర్చిపోయారా?’
సాక్షి, నంద్యాల జిల్లా: చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో పోల్చారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష ఎందుకుంటుంది? బాబును అక్రమంగా అరెస్ట్ చేయలేదు, అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వంలోనే స్కిల్ స్కామ్ ఆధారాలున్న ఫైల్స్ తగులబెట్టారు. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఇంటి భోజనం వస్తోంది. జైలుకు వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు కేజీ బరువు పెరిగారు. పురంధేశ్వరి చెల్లి కొడుకును తీసుకొని అమిత్ షాను కలిసింది. గతంలో ఆమె భర్త చంద్రబాబు గురించి బుక్స్ రాశారు అవి మర్చిపోయారా’’ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం? -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం: మంత్రి కొట్టు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాల ఏర్పాట్లను శనివారం.. మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓమ్ టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు.. అక్కడి నుంచి ఐదు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండ చరియలు విరిగిపడిన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ‘‘సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. 3,500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం. 500 రూపాయల తీసుకున్న వారికి ముఖమండపం నుంచి దర్శనం. భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశాం. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, ఏసీటీ నుంచి కనెక్షన్లు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం రెండు ప్రత్యేక స్లాట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
చంద్రబాబుకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి భువనేశ్వరి, లోకేష్లదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పెంటపాడు మండలం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ దగ్గర ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదన్న మంత్రి.. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉందన్నారు. ఆనాడు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును కట్టుకున్న భర్త చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ను అధికారంలో నుంచి దించేసి చివరకు ఆయన చావుకు కారణమైన కానీ భువనేశ్వరి స్పందించలేదు’’ అని మంత్రి గుర్తు చేశారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
పవన్ కాపుల పరువు తీసేశాడు: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చేసిన మేలు ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలో ‘కాపు నేస్తం’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో రూ.1492 కోట్లను కాపు సోదరీమణులకు అందించిన ఘనత సీఎం జగన్ది అని మంత్రి కొనియాడారు. ‘‘కాపులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కాపులను అణగదొక్కేందుకు ముద్రగడ కుటుంబాన్ని హింసించారు. రైలుకు నిప్పు పెట్టించి కాపులపై బాబు దొంగ కేసులు పెట్టించాడు. పవన్కు డబ్బులు సంపాదించడం తప్ప వేరే ఆలోచన లేదు. నమ్ముకున్న కాపుల పరువు తీసిన వ్యక్తి పవన్’ అంటూ మంత్రి సత్యనారాయణ మండిపడ్డారు. చదవండి: లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు -
పాజిటివ్ ఓటుతోనే మళ్లీ పగ్గాలు..
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పాజిటివ్ ఓటుతోనే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో అమలుచేసిన పాలన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత కార్యక్రమాలే తమ పా ర్టీకి వజ్రాయుధాలన్నారు. గత ఎన్నికలకు ముందు చెప్పినవి చిత్తశుద్ధితో అమలుచేశామని, దీంతో ప్రజలు ప్రభుత్వంపట్ల పూర్తి సంతృప్తిని కనబరుస్తున్నారని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సీం వైఎస్ జగన్ ఎన్నికల కోసం పనిచేసే మనిషి కాదు. ప్రజలకు వీలైనంత ఎక్కువ మంచి చేసి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. రాష్ట్రంలో 1.62 కోట్ల కుటుంబాల ఇళ్లకు వలంటీర్లను పంపి, అందరి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, ఆ ఊళ్లో డాక్టర్ల క్యాంపులు పెట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలపట్ల సీఎం చిత్తశుద్ధి తెలిసిపోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించే పరిస్థితి ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అడ్డుపడడమే పనిగా పనిచేస్తున్నాయి’అని అన్నారు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో కొన్ని ఆలయాల స్థాయిని పెంచడం ద్వారా దేవదాయ శాఖలో అదనంగా 14 డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులు అవసరమవుతాయి. పదోన్నతుల ద్వారా ఇప్పటికే ఉన్న సిబ్బందికి ఈ పోస్టుల భర్తీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకుల్లో ప్రస్తుతం నగదు డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నందున.. గతంలో తక్కువ వడ్డీ రేటుకు డిపాజిట్లు చేసిన చోట సమీక్షించి, అవసరమైతే పాత డిపాజిట్లను రద్దుచేసి కొత్తగా అదనపు వడ్డీ రేటుకు డిపాజిట్ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించాం. -
పవన్ కు చంద్రబాబు మాయ పట్టుకుంది: డిప్యూటీ సీఎం కొట్టు
-
పవన్ పై రెచ్చిపోయిన మంత్రి కొట్టు సత్యనారాయణ