-
మరో కొరియన్ రీమేక్
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
-
బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
BTS (బీటీఎస్).. దక్షిణ కొరియాలో ఫేమస్ బాయ్ బ్యాండ్. దీన్ని బ్యాంగ్టన్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్లో ప్రారంభమైన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్కి మాషప్స్ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, హిందీపాటలతోపాటు విభిన్న భాషల్లోని పాటలకు డాన్స్ చేయడం వీరి ప్రత్యేకం. ఈ బాయ్ బాండ్లో ఏడుగురు సభ్యులున్నారు. వీళ్లుచేసే ఒక్కే పార్ఫమెన్స్ ఒక్కో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్కి డాన్స్ చేసి భారత్లోనూ క్రేజ్ సంపాదించుకుంది బీటీఎస్ బ్యాండ్. ఇటీవల అల్లు అర్జున్ బబ్లాక్ బాస్టర్ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి బుట్టబొమ్మ పాటకు డాన్స్ చేసి దుమ్ములేపారు. (అంధాధున్ రీమేక్: టబు పాత్రలో నటించేది ఆమే!) తాజాగా బాలీవుడ్ చాద్దీ జవానీ, తుమ్సే మిల్కే దిల్ కాపై అనే పాటలకు కూడా మాషప్ చేశారు. ఈ వీడియోను క్వాలిటాపోసస్ట్స్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ పాటకు బీటీఎస్ బ్యాండ్ సభ్యులు తమ స్టైల్లో అద్భుతమైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. భాష రాకున్న స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఈ డ్యాన్స్పై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో చక్కగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ‘ఈ డాన్స్ చూస్తుంటే నాకు కూడా వీళ్లతో కలిసి స్టెప్పులు వేయాలనిపిస్తోంది.’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (సమంత ప్లేస్లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి) -
యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది. డైనమైట్ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. డైనమైట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్ను సృష్టించింది. శనివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో డైనమైట్ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో కొరియా భాష బోధన
ఎచ్చెర్ల క్యాంపస్: ప్రపంచం కుగ్రామమైపోయింది. ఉపాధి అవకాశాలు ఎంత సులభంగా వస్తున్నాయో అంతే తొందరగా పోతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో సరైన ఉపాధి అవకాశాలను అన్వే షించడం విద్యార్థులకు అత్యవసరం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలో ఇంజినీరింగ్ చేశాక వంద శాతం ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ కోర్సు నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, యాప్స్ వంటివాటిపై తర్ఫీదు అందుతోంది. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ ప్రోత్సహించే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం కొరియా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో దూసుకుపోతోంది. ఆ దేశంలో మన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొరియా భా షను నేర్పించేందుకు వర్సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కొరియాలో పనిచేయాలంటే నైపుణ్యంతో పాటు భాష కూడా ప్రధానమే. అందుకే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న ఆ దేశంలో పనిచేసే విధంగా, విద్యార్థులను ప్రొత్సహించే దిశగా కొరియా భాషను ట్రిపుల్ ఐటీలో పరిచయం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు.. రాష్ట్రం యూనిట్గా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కొరియా భాషను ప్రవేశ పెట్టే చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు కొరియన్ కల్చరల్ అండ్ టెక్నాలజీ సెంటర్తో ఎంఓయూ (ఒప్పందం) కుదుర్చుకున్నా రు. మరో పక్క సౌత్కొరియా సంస్థలు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహించటం, భారత దేశంలో పలు ప్రధాన నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మంచి ప్యాకేజీలకు ఎంపికయ్యే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతిభావంతమైన వి ద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నా రు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యంతో పాటు భాషా నైపుణ్యం అవసరవుతోంది. ఈ నేపథ్యంలో కొరియా వంటి భాషలను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. – డాక్టర్ జి.భానుకిరణ్,శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మోస్ట్ వాంటెడ్
సల్మాన్ ఖాన్ కెరీర్ను గాడిలో పడేసిన సినిమా ‘వాంటెడ్’. ప్రభుదేవా దర్శకత్వంలో ‘పోకిరి’ చిత్రానికి హిందీ రీమేక్గా రూపొందింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘మోస్ట్ వాంటెడ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించనున్న కొత్త సినిమాకు ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండగకు తీసుకురాబోతున్నారు. కొరియన్ చిత్రం ‘ద అవుట్ లాస్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. నవంబర్ 4న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సల్మాన్ఖాన్ – ప్రభుదేవా కాంబినేషన్లోనే రెడీ అయిన ‘దబాంగ్ 3’ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది. -
మృత్యుంజయురాలు.. చదవాల్సిన కథనం
బ్రిస్బేన్: కొండ మీది నుంచి లోయలోకి పడ్డా.. ఆమెకు నూకలు మాత్రం చెల్లిపోలేదు. ఆరో రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. గురువారం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రంలో ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జోహీ హాన్(25) గత గురువారం క్వీన్స్ల్యాండ్లో టల్లీ పట్టణానికి వెళ్లారు. అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె.. కెర్నిస్ అటవీ ప్రాంతంలోని టైసన్ పర్వతంపైకి ట్రెక్కింగ్కు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైన్యం హెలికాఫ్టర్ సాయంతో అధికారులు గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. శనివారం అటవీ మార్గం గుండా వెళ్తున్న కొందరికి దూరంగా సాయం చేయాలన్న కేకలు వినిపించాయి. అయితే వారు పోలీసులకు సమాచారం అందించేసరికి కాస్త ఆలస్యమైంది. తిరిగి ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జలపాతం దగ్గర ఆమెను గుర్తించి రక్షించారు. టల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కొమ్మల్లో చిక్కుకుని... కొండ మీద ఉన్న ఓ రాయిపై నిల్చుని ఫోటో తీసుకునే సమయంలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న రాక్సీ జలపాతం చెట్ల భాగంలో ఆమె చిక్కుకుపోయారు. అలా కొన్ని గంటలు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె.. మేలుకువ రాగానే కిందకు దిగి సాయం కోసం కేకలు వేయటం ప్రారంభించారు. అప్పటికే పూర్తిగా నీరసించిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. పైన హెలికాఫ్టర్ శబ్ధం విన్న ఆమె కింద ఉన్న ఇసుక తిన్నెలపై రక్షించాలంటూ రాతలు రాశారు. అయితే అవి సైన్యం కంటపడలేదు. చివరకు శక్తిని కూడగట్టుకుని ఆమె వేసిన కేకలు స్థానికుల చెవిన పడటంతో ప్రాణాలతో ఆమె బయటపడగలిగారు. -
బుడుగుల కోసం సూపర్ కారు..
పిల్లల కోసం రూపొందించిన లేటెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇది. పేరు ‘బ్రూన్ ఎఫ్8’. కొరియన్ కంపెనీ తయారుచేసిన ఈ కారు మూడు రకాల డ్రైవింగ్ మోడ్లలో నడుస్తుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్తో సైతం దీనిని నియంత్రించొచ్చు. కుదుపులు నివారించేందుకు నాలుగు చక్రాలకూ గ్యాస్ సస్పెన్షన్ సిస్టమ్, స్మార్ట్ టచ్స్క్రీన్ పవర్ కంట్రోల్, పిల్లల భద్రత కోసం బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకుల వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. బ్లూటూత్ రిమోట్ కంట్రోల్తో పెద్దవారు కూడా దీనిని బయటి నుంచి నియంత్రించే అవకాశమూ ఉంటుంది. గరిష్టంగా గంటకు 14 కి.మీ. వేగంతో పరుగెత్తే ఈ కారు పిల్లలకు అద్భుతమైన కానుక అని దీని రూపకర్తలు చెబుతున్నారు. అన్నట్టూ.. దీని ఖరీదెంతో తెలుసా..? జస్ట్ వెయ్యి డాలర్లు.. అంటే రూ. 63 వేలే!