-
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
కమల్ క్రేజీ ప్రాజెక్ట్.. ఇక శుభం కార్డ్ పడినట్లేనా?
గతేడాది విక్రమ్ సినిమాతో హిట్ కొట్టిన కమల్ హాసన్ అదే జోరు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం ప్రాజెక్ట్ థగ్ లైఫ్తో బిజీగా ఉన్నారు. కమల్– మణిరత్నం కాంబోలో ‘నాయగన్’–1987 (నాయకుడు) తర్వాత 37 ఏళ్లకు రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో పాటు కమల్ హాసన్ మరో ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా దీనిపై నెట్టింట మరో చర్చ మొదలైంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. కమల్కు చెందిన నిర్మాణసంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై హెచ్.వినోద్ దర్శకుడిగా గతేడాది ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. కమల్హాసన్ 233వ ప్రాజెక్ట్గా ఇది ప్రచారంలో ఉంది. కమల్ కోసం వినోద్ పవర్ఫుల్ పాత్ర సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తమ బ్యానర్లో రానున్న చిత్రాలను ఉద్దేశించి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ట్విటర్ పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది. ట్విటర్లో రాస్తూ..' థగ్ లైఫ్’, కమల్ 237, శివకార్తికేయన్ 21, శింబు 48 త్వరలో తమ బ్యానర్ నుంచి విడుదల కానున్నట్లు వెల్లడించింది. అయితే ఈ లిస్ట్లో కమల్-233 ప్రాజెక్ట్ లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై చిత్రబృందం, వినోద్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. Rest is Action #Ulaganayagan #KamalHaasan#ThugLife #KH237 #SK21 #STR48 @ikamalhaasan @Siva_Kartikeyan @SilambarasanTR_#Maniratnam #Mahendran @anbariv @Rajkumar_KP @desingh_dp@turmericmediaTM @magizhmandram pic.twitter.com/G681xU6xsK — Raaj Kamal Films International (@RKFI) January 24, 2024 -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ కూతురు!
వైద్య విద్య చదివి హీరోయిన్గా సినీ రంగప్రవేశం చేసిన నటి ఆదితి శంకర్. అంతే కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆదితి శంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అందులో ఈ చైన్నె చంద్రం పక్కా పల్లెటూరి యువతిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా తొలి చిత్రంలోని పాటను కూడా పాడి సింగర్గా కూడా పరిచయమయ్యారు. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది. కాగా.. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగానే ఆదితి శంకర్ మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్టు తాజా సమాచారం. విరుమాన్ చిత్రంలో కార్తీతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా... నటుడు సూర్య ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శివ దర్శకత్వంలో ఈ భారీ చారిత్రక కథా చిత్రం త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. కాగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్ర షూటింగ్లో సూర్య 10 రోజులు పాల్గొననున్నారు. ఆ తరువాత సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో దుల్కర్ సల్మాన్ ,విజయ్వర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అదేవిధంగా ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆదితి శంకర్ను తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
భారీ బడ్జెట్తో చేయగలరా అని డైరెక్టర్ను అడిగా: ధనుశ్
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్ కథా చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్కు ధనుశ్ తన ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులతో పాల్గొనడం విశేషం. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్కు నివాళులు అర్పించాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై ధనుష్ మాట్లాడుతూ.. 'చిన్న చినుకు పెను తుపాన్గా మారుతుందని అంటారని. అదేవిధంగా 2002లో చిన్న చినుకుగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఇప్పుడు పెను తుపాన్గా ఎదిగాను. ఇప్పుడు తాను సంపాదించుకున్న సొత్తు అభిమానులే అని పేర్కొన్నారు. ఇకపై ఈ చిత్రాన్ని చూస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రమ అన్నారు. దర్శకుడు అరుణ్ మాతీశ్వరన్ను చూస్తున్నప్పుడు తనకు వెట్రిమారన్ గుర్తుకు వస్తారన్నారు. ఆయన మొదటిగా కలుసుకున్నప్పుడు ఈ తమ్ముడా దర్శకుడు అని అనిపించిందన్నారు. అయితే కథ విన్న 15 నిమిషాల తరువాత భారీ బడ్జెట్ అవుతుందిగా.. సాధ్యం అవుతుందా? అని అడిగానన్నారు. అందుకాయన అలాగే చేద్దామని చెప్పారన్నారు. ఇటీవల చిత్రాన్ని చూశానని ఆయన చెప్పినట్టుగానే ఉందని పేర్కొన్నారు. కెప్టెన్ మిల్లర్ విజయం సాధించడం తథ్యమని ధనుష్ పేర్కొన్నారు. గౌరవమే స్వాతంత్య్రం అన్నది ఈ చిత్ర ట్యాగ్ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది. ఎవరికి స్వాతంత్య్రం ఉంది అన్నది తనకు తెలియడం లేదన్నారు. ఏం చేసినా ఆలోచించి చేయాల్సి వస్తుందని.. అలా ఆలోచించి చేసిన మంచి పనును కూడా తప్పు పట్టేందుకు ఒక వర్గం ఉండటమే స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. తన వరకు అది స్వాతంత్య్రం కాదని ధనుష్ పేర్కొన్నారు. -
మరో చిత్రానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్!
ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నటుడు కమల్ హాసన్. తదుపరి హెచ్.వినోద్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్ నాయకన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ, కమలహాసన్కు చెందిన రాజ్కమల్ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్ లైఫ్ అనే టైటిల్ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్, నిర్మాత ఆనంద్ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్ సింబల్ చూపగా కమలహాసన్ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
స్టార్ హీరో లేటెస్ట్ మూవీ.. న్యూ ఇయర్కు క్రేజీ అప్డేట్
ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తోన్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరీ దర్శకత్వం వహిస్తుండగా.. కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్తో పాటు లిరికల్ సాంగ్ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తే విశాల్ ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్లో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్లుక్తో పరాటు ఓ లిరికల్ పాటను విడుదల చేశారు. 'రా రా రత్నం' అంటూ సాగే ఈ పాట మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్లో నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్గా ఉన్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
Actor-Politician Captain Vijayakanth: విజయ్ కాంత్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం (ఫొటోలు)
-
సినిమాలు, రాజకీయాలు.. విజయ్కాంత్ ఆస్తులు ఎన్ని కోట్లంటే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: విజయ్కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!) అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్కాంత్ గురించి సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్కాంత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎంత సంపాదించారు? ఆయనకున్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన 1991 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్లో సాహసోపేతమైన పోలీసు అధికారి పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి అభిమానులు ఆయనను 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. 2016లో విజయకాంత్ ఉలుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.7.6 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు. అతని భార్య ప్రేమలతతో పాటు.. అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు రూ. రూ.14.79 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. (ఇది చదవండి: కెప్టెన్ విజయ్కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) అంతే కాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ రూ. రూ. 19.37 కోట్ల ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య ప్రేమలత విజయ్కాంత్ పేరుపై రూ. 17.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం రూ. 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో మొత్త స్థిర, చరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.53 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా.. ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయ్కాంత్ సమర్పించారు. -
కెప్టెన్ విజయ్కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. విజయ్కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
'నాలో మనిషిని నిద్రలేపింది'.. విశాల్ ట్వీట్ వైరల్!
ఇటీవలే విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను పలరించాడు. అక్టోబర్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ స్టార్ హీరో రత్నం సినిమాలో నటిస్తున్నారు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. కార్తికేయన్ సంతానం జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. అయితే చెన్నైలో వరదలు రావడంతో బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రత్నం మూవీతో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ జీవిత కథను చదివినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ రాసిన పుస్తకం 'ఉమెన్ ఇన్ మీ' చదివాక నాలో మనిషిని నిద్రలేపిందని అన్నారు. ఇక నుంచి మహిళలను మరింత గౌరవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిస్టుల మనోభావాలను అర్థం చేసుకోవడం తెలుసుకున్నానని అన్నారు. ఆమె యూత్ ఐకాన్ అయినప్పటికీ చాలా చిన్న వయస్సులో జీవిత ప్రయాణం.. ఎదుర్కొన్న ఇబ్బందులు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఆమె జీవితంలో సాధించిన విజయాలకు.. ముఖ్యంగా స్తీలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని అన్నారు. మీ జీవితంలో సరైన ఎంపిక, ధైర్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం సరళంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని విశాల్ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు మహిళలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఉమెన్ ఇన్ మీ పుస్తకం.. ది ఉమెన్ ఇన్ మీ అనే పుస్తకాన్ని అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రాశారు. ఈ బుక్ అక్టోబర్ 24, 2023న 26 భాషల్లో విడుదలైంది. ఉమన్ ఇన్ మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Well, the transformation from b/w to color is the mood in my mind by Reading #BritneySpears #TheWomanInMe brings out the Man in me. Honestly makes me wanna respect women more. Especially understanding the psyche of performing artistes. Truly inspiring to read her life journey and… pic.twitter.com/H88utzadzV — Vishal (@VishalKOfficial) December 22, 2023 -
ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం!
గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తీసుకొచ్చిన బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ అధినేత ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్న తాజా చిత్రం వీరపథం కాట్రుమళై. ఈ చిత్రం దేర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురి జీవితాలను ఆవిష్కరించేదిగా ఉంటుంది. దీని ద్వారా సలీం ఆర్ బాషా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన ఇంతకుముందు మయక్కం అదు మాయం అని షార్ట్ ఫిలింను రూపొందించారు. జీవి చిత్రం ఫేమ్ వెట్రి, ముదలుమ్ నీ ముడివుమ్ నీ చిత్రం ఫేమ్ కిషన్ దాస్ హీరోలుగా నటిస్తురన్నారు. ఈ చిత్రంలో దీప్తి ఒరండేలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్ర దర్శకుడు సలీం ఆర్ బాషా మాట్లాడుతూ ఇది వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రమన్నారు. వారి భావాలు, ఎదుర్కొనే సమస్యల సమాహారంగా కథ ఉంటుందన్నారు. ఇక్కడ మనుషులు పూర్తిగా మంచి వారిగా ఉండరు, పూర్తిగా చెడ్డవారు గాను ఉండరని పేర్కొన్నారు. వారి పరిస్థితుల ప్రభావం బట్టి మనస్తత్వాలు మారుతుంటాయని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. జీవితం ఒకరిపై క్రూరత్వాన్ని మరొకరిపై దయ కురిపిస్తుందన్నారు. ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం వీరపథం కాట్రుమళై అని తెలిపారు. తమ సంస్థ నుంచి బలమైన కథా చిత్రాలను నిర్మించాలన్న విషయంలో ధృడంగా ఉంటామని నిర్మాత పేర్కొన్నారు. అదే విధంగా ఇందులో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేన్నారని, ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు చిత్రాన్ని కథను చెప్పిన దాని కంటే బాగా తెరకెక్కిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Stills from the upcoming psychological drama, #EerappadhanKaattruMazhai. Dir by @RBaadshah60574 Starring @act_vetri, @kishendas & @thedeepthie Produced by @BigPrintoffl DOP @AmaltomySB Music @raam_records#EKM @DoneChannel1 pic.twitter.com/yURJ49npxq — M.L.Prabhakaran. (@muniPrabhakaran) December 22, 2023 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. టీజర్తోనే భయపెట్టేశాడు!
కోలీవుడ్ హీరో ఆర్య తెలుగువారికి కూడా సుపరిచితమే. తన సినిమాలతో టాలీవుడ్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ రోజుల్లో సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్య తొలి వెబ్ సిరీస్ 'ది విలేజ్' లో నటిస్తున్నారు. ఈ సిరీస్కు మిలింద్ రాజు దర్శకత్వంలో.. బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ ఈ సిరీస్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్, జార్జ్ మయన్, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో సైంధవ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూువీ 2024 జనవరి 13న విడుదల కానుంది. dare to venture into ‘the village' where darkness holds the secrets! 🌙#TheVillageOnPrime, Nov 24#Arya @milindrau #KiranKonda @thespcinemas @DivyaPillaioffl @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @theabishekkumar #NaveenGeorgeThomas @ashwin_kkumar @arjunchdmbrm… pic.twitter.com/3muX5zC29w — prime video IN (@PrimeVideoIN) November 9, 2023 -
విక్రమ్ డబుల్ సర్ప్రైజ్.. తంగలాన్ క్రేజీ అప్డేట్!
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్స్ ఇచ్చేశారు. ఓకేసారి టీజర్, మూవీ రిలీజ్ తేదీలను ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీన తంగలాన్ టీజర్ విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేస్తూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A fiery story of a bygone era that’s waiting to be told & cherished #Thangalaan teaser dropping on 1st November &#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/pDfT6HiNs4 — Vikram (@chiyaan) October 27, 2023 A film that will touch your heart & blow away your mind!#Thangalaan coming to you on 26th January 2024🔥🔥🔥 Teaser out on Nov 1st! 💃🏻🔥💃🏻 pic.twitter.com/wEf3MaabqF — Malavika Mohanan (@MalavikaM_) October 27, 2023 -
యదార్థ సంఘటన ఆధారంగా వస్తోన్న 'రెబెల్'!
తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెబెల్. నటి మమితా బైజూ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నికేశ్ ఆర్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న రెబల్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్ను హీరో శింబు విడుదల చేశారు. ఈ సినిమాను 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు చిత్ర దర్శకుడు నికేష్ ఆర్ఎస్ తిరుపతి తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రెబల్ చిత్రం ఉంటుందన్నారు. ఇది జీవీ ప్రకాష్ కుమార్ సినీ కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. రెబల్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఈ చిత్రంలో కరుణాస్, సుబ్రహ్మణ్య శివ, షాలు రహీం, వెంకటేష్, దీప్తీ ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, అదిరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. #rebel first look is here … a super promising script from a debutant director @NikeshRs …. Joining hands wit my fav @StudioGreen2 after the success of #darling amd #trishaillananayanthara @kegvraja @NehaGnanavel @Dhananjayang #rebel @arunkrishna_21 pic.twitter.com/RK0Ok1NQNX — G.V.Prakash Kumar (@gvprakash) October 26, 2023 -
రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్ను సైతం లియో బద్దలు కొట్టింది. గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్ తర్వాత ఆ లిస్ట్లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్లో కనిపించడంతో చిత్రబృందం షాక్కు గురైంది. అయితే ప్రింట్ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్ ఎస్.లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మారినా..? ఇదిలా ఉంటే విజయ్ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది. లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
అధర్వ హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి డీఎన్ఏ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇంతకుముందు మనం కొత్తి పరవై, డాడా, కళువేత్తి మూర్కన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఒలింపియా మూవీస్ అధినేత అంబేత్కుమార్ తర్వాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా చిత్తా చిత్రంతో పాపులర్ అయిన మలయాళ నటి నిమీషా సజయన్ నటిస్తున్నారు. కాగా ఇంతకుముందు ఒరునాళ్ కూత్తు, మాన్స్టర్, పర్హానా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) తాజాగా ఈ మూవీకి డీఎన్ఏ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకలో నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు పా.రంజిత్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని త్వరగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. (ఇది చదవండి: నువ్వు నీలా ఉండు అని చెప్పింది ) Twitter Glimpse from #DNA film launch auspicious Pooja Starring @atharvaaMurali #NimishaSajayan Directed by @nelsonvenkat@Olympiamovis Production@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir @Sanjay_cheqba @sharmaseenu11 @SriramRavi33@donechannel1 pic.twitter.com/SAZyHQsyPQ — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 Twitter Presenting the title look of @atharvaaMurali & #NimishaSajayan starring #DNAmovie 🧬 Directed by @nelsonvenkat The shooting has officially kicked off. Brace yourself for an crime action drama@Ambethkumarmla@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir pic.twitter.com/5T8io8BpkD — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్దీప్కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
ఆ మూవీ రిలీజ్ తర్వాత చాలా బాధపడ్డా: రాఘవ లారెన్స్
నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య విలన్గా నటించిన తాజా చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్'. నటి నిమిషా సజయన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరునావుక్కరుసు చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో రాఘవ లారెనన్స్ మాట్లాడుతూ జగర్తండా చిత్రంలో తానే నటించాల్సి ఉందని.. ఆ సమయంలో తాను తెలుగులో చిత్రం చేయడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. అయితే చిత్రం విడుదలైన తరువాత చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానని ఒక రోజంతా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని చేయకపోవడమే మంచిదిగా భావిస్తున్నానని అన్నారు. కారణం అప్పుడు రూ. 20 కోట్ల బడ్జెట్లో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ జిగర్తండా డబుల్ ఎక్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. తాను సూర్య నటించే ముందు అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేసుకునే వాళ్లమని, అయితే స్పాట్లోకి వచ్చిన తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినట్లే చేయాల్సి వచ్చేదని అన్నారు. ఆయనకు అంత కమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. జిగర్తండ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. ఈ చిత్రానికి కూడా రెండు, మూడు జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని నిర్మాత కార్తికేయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థలో రూ. 100 కోట్ల బడ్జెట్లో నిర్మించిన తొలి చిత్రం అని చెప్పారు. -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్ను పబ్లిక్లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రియల్ హీరో అంటే మీరే సార్.. !
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన గొప్ప మనసును చాటుకున్నారు. తన అభిమాని ఒకరు మృతి చెందడంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినిమాలతో ఎప్పుడు హీరో తన అభిమాని కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రావడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ మీలో హీరో ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ! ) చెన్నైలోని ఎన్నూర్లో నివసించే అరవింద్ హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్లబ్లో కొన్నేళ్లుగా మెంబర్ కూడా పని చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. గతంలోనూ అభిమానులు చనిపోతే వాళ్ల కుటుంబాలకి అండగా నిలిచారు. కాగా.. సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) The Man With Golden Heart 🛐❤️#Aravind a fan and a member of Fans Club lost his life in a road accident. Upon hearing the news, @Suriya_offl visited Aravind's home in Ennore to meet the family and conveyed his prayers and condolences.@rajsekarpandian #Kanguva pic.twitter.com/IycmuazAMC — SURIYA FANS TELUGU (@SuryaFansAndhra) September 28, 2023 -
అసిస్టెంట్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ పెళ్లిలో సందడి చేశారు. తన అసిస్టెంట్ ఆనంద్ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ధనుశ్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లిలో ధనుశ్ దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ధనుశ్తో పాటు అసురన్ సహనటుడు కెన్ కరుణాస్ కూడా ఉన్నారు. అక్కడే ధనుష్ రాధిక, శరత్కుమార్లను కలిశారు. కాగా.. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అసిస్టెంట్ పెళ్లికి హాజరైన సందడి చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్తోనే!) కాగా.. ప్రస్తుతం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. గతంలో రాకీ, సాని కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్కుమార్, నివేదిత సతీష్, సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత ఆనంద్ ఎల్ రాయ్తో తేరే ఇష్క్ మే అనే చిత్ చేయనున్నారు. వీరిద్దరూ గతంలో రాంఝనా, అత్రంగి రే చిత్రాల్లో కలిసి పనిచేశారు. (ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!) தனது உதவியாளர் ஆனந்த் திருமண வரவேற்ப்பு நிகழ்ச்சியில் திடீரென வந்து வாழ்த்திய தலைவர் @dhanushkraja sir ❣️🔥🙏 #CaptainMiller #Dhanush pic.twitter.com/Lep0bzGyNR — Dhanush Trends ™ (@Dhanush_Trends) September 16, 2023