knife
-
చపాతీలు కోసం చంపేశారు..!
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్లో చోటు చేసుకుంది. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్రూమ్కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఆ వైరస్ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!
కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది. కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది. సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..! -
స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది .. యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో.. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. ‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు. వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. -
గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై..
ముంబై: రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలని ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తిదాడికి గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం థానే జిల్లాలోని ఉల్హసన్నగర్ పట్టణానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే నరేష్ లెఫ్టీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోవటంతో సంజయ్ను డబ్బులు త్వరగా ఇవ్వాలని నరేష్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరేష్, సంజయ్లు తమ మిత్రులతో ఉల్హసన్నగర్లో 4లో కలుసుకున్నారు. సంజయ్ తనతో పాటు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అవినాష్ను తీసుకువచ్చాడు. అతడు మరో మూడు నెలలు ఆగాల్సిందిగా నరేష్కు చెప్పాడు. దీంతో ఇంకా ఎన్ని నెలలు ఆగాలంటూ కోపంతో నరేష్ కత్తితో అవినాష్, సంజయ్పై దాడి చేశాడు. గొడవ గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు కానిస్టేబుల్ గణేష్ దమాలే, ఒక సహోద్యోగితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. గణేష్ దమాలే ఈ గొడవను ఆపడానికి జోక్యం చేసుకున్నప్పుడు, నరేష్ అతని ముఖంపై కూడా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. తరువాత, మరి కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నరేష్, శశి చిక్నా అలియాస్ సుఖీ, ఓమీలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు -
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
మటన్ కత్తి తగిలి బాలుడు మృతి
బహదూర్పురా: ప్రమాదవశాత్తు మటన్ షాపులో ఉన్న కత్తి తగిలి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి తన ఇంటి వద్ద మటన్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన మహ్మద్ ఖురేషి కుమారుడు రియాజ్ ఖురేషి (13) మటన్ షాపులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కత్తి కాలుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా... రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మహ్మద్ ఖురేషి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! ) -
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
-
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
సాక్షి, నెల్లూరు: కోవూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సురేష్.. ఓ మహిళపై కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ షేకున్ (35) కారణమని అనుమానంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి !
సాక్షి, జగిత్యాల : పందెం కోడి వ్యవహారం పోలీసులకు తలనొప్పిని తెచ్చింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్స్టేషన్లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్లో ఈ నెల 22న కొందరు కోడిపందేలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్కు చెందిన తనుగుల సంతోష్ సైతం లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట వద్ద కోడిపందెంలో పాల్గొన్నాడు. సతీశ్ తన కోడికి కత్తులు కట్టి వదిలేందుకు వంగగా.. అది ఒక్కసారిగా లేచి తన్నడంతో సతీశ్ మర్మాంగాలకు గాయమై మృతిచెందాడు. గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయేందుకు కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత సంరక్షణ కోసం కోళ్ల ఫారానికి తరలించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్స్టేషన్లో ఉన్న కోడిని ఫొటో తీసి పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్మీడియాలో పోస్టు చేయగా వైరల్గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన ప్రాంతంలో కోడి ఉండటంతో సంరక్షించేందుకే పోలీస్స్టేషన్కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తర్వాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడిపందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో... తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా -
గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి
భోపాల్: కంట్లో నలుసు పడితేనే కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో ఓ కత్తి దిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా అనిపిస్తోంది కదూ! కానీ మధ్యప్రదేశ్లో అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛత్తర్పూర్కు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు సెంటిమీటర్ల పొడవున్న కత్తిని గుటుక్కుమని మింగేశాడు. దాన్ని మింగేటప్పుడు ఎక్కడా గుచ్చుకోలేదు కానీ, తిన్నగా ఆహారనాళంలోకి ప్రవేశించాక మొదలైంది అసలు సమస్య. (చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి) గుటక వేస్తే చాలు కత్తి కొన త్రిశూలంలా గొంతును పొడుస్తోంది. ఈ బాధను తాళలేకపోయిన సదరు వ్యక్తిని భోపాల్లోని ఎయిమ్స్లో చేర్పించారు. అక్కడి వైద్యులు జనవరి 26న అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆహార నాళంలో ఉండిపోయిన కత్తిని తీసివేశారు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే అతడు ఇలా ఏది పడితే దాన్ని గుటకాయ స్వాహా అనిపించడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం కూడా అతడు పలు వస్తువులను మింగేయగా ఎయిమ్స్ వైద్యులు వాటిని పొట్టలో నుంచి బయటకు తీశారు. (చదవండి: సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?) -
తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్కు విషయాన్ని తెలిపింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య) -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్పాట్) -
20 సెం.మీ. కత్తినే మింగేశాడు..అయినా ఏం కాలేదు
ఢిల్లీ : డ్రగ్స్కి బానిసైన ఓ 28 ఏళ్ల యువకుడు లాక్డౌన్ కారణంగా డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కత్తినే మింగేసాడు. అంతేకాకుండా నెలన్నరకు పైగా పొట్టలో పదునైన కత్తి ఉన్నా చాలా సాధారణంగా గడిపాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎక్స్రే తీయగా 28 సెంటీమీటర్ల పదునైన కత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కాగా యువకుడు వంటింట్లోని కత్తిని మింగేశాడన్నా విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. (కుటుంబంతో డిన్నర్.. ఫొటో షేర్ చేసిన ఎమ్మెల్యే!) గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడటం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిస్ లాంటి చిన్న వస్తువులు మింగినవారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ కేసుసు చాలా చాలెంజింగ్ తీసుకొని విజయవంతంగా శస్ర్తచికిత్స చేశామని డాక్టర్ దాస్ తెలిపారు. (పెళ్లి మండపంలో కోవిడ్ విలయం) -
బ్రిటన్లో మరో జార్జ్ ఫ్లాయిడ్!
లండన్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్ఫ్లాయిడ్ మరణంతో ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్లో జరిగింది. బ్రిటన్లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు. ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్ యార్డ్ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్ ఫ్లాయిడ్ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు. -
30 గంటలపాటు మహిళ ఛాతీలో కత్తి
చెన్నై: తమిళనాడులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మహిళ ఛాతీలోకి దిగిన కత్తిని వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం మహిళ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరిలోని హోసూర్కు చెందిన మహిళను మే25న ఓ దుండగుడు కత్తితో పొడిచారు. ఆ పదునైన కత్తి ఛాతీలోకి లోతుగా చొచ్చుకెళ్లడంతో ఆమె నొప్పి తాళలేక విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెను సేలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. (పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!) అప్పటికే ముప్పై గంటలు గడిచిపోగా ఆమెను కోయంబత్తూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు ఛాతీ లోపల ఉన్న కత్తి ఊపిరితిత్తులకు కొద్దిగా ఆని ఉందని గుర్తించారు. కానీ గుండెకు మాత్రం తాకనందున బతికే అవకాశముందని భావించారు. దీంతో డా. ఈ శ్రీనివాసన్ నేతృత్వంలో వైద్య బృందం మూడు గంటలపాటు శ్రమించి ఆమె ఛాతీలో నుంచి ఆరు ఇంచుల పొడవున్న కత్తిని తీసివేశారు. (మరదలిని చంపిన బావ) -
విశాఖలో కత్తితో యువకుడి హల్చల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద కలకలం చోటు చేసుకుంది. కమిషనరేట్ ముందు ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడు కత్తితో కమిషనరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. రిసెప్షన్ వద్ద నిర్వహించిన తనిఖీలో యువకుడి వద్ద కత్తిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తితో కమిషనరేట్లోకి చొరబడేందుకు యత్నించిన యువకుడిని మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి యువకుడు అనుమానాస్పదంగా సీపీ కార్యాలయం వద్ద తిరగటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని ఆపి తనిఖీలు చేశారు. మెటల్ డిటెక్టర్లో ఆ యువకుడి వద్ద కత్తి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారని పోలీసులు తెలిపారు. -
భర్త మందలించాడని..
అనంతపురం, ధర్మవరం అర్బన్: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ పేతో అడ్డంగా దొరికిపోయాడు
న్యూఢిల్లీ : మెడికల్ షాపులో దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. ఈ వింత ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా వీధిలో ఉన్న ఒక ఫార్మసీ షాపులో గౌరవ్కుమార్ పనికి కుదిరాడు. అయితే పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోమవారం కుమార్ తన ముఖాన్ని టవల్తో చుట్టుకొని టోపీని అడ్డుపెట్టుకొని ఒక కస్టమర్లాగా షాపులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సేల్స్మెన్ కస్టమర్కు మందులను అమ్ముతున్నాడు. షాపులో సేల్స్మెన్ తప్ప ఎవరు లేకపోవడంతో దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించి కస్టమర్ వెళ్లిపోయాక కుమార్ షాపు షెట్టర్ను మూసేశాడు. తర్వాత సేల్స్మెన్ చేతులను కట్టేసి, నోటిలో గుడ్డను కుక్కి రూ. 75 వేల నగదు, రూ. 3వేలు విలువ చేసే మందులను ఎత్తుకెళ్లాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న షాపు ఓనర్ క్లోజ్ చేసిన షెటర్ను తెరవగానే సేల్స్మెన్ను షాక్కు గురయ్యాడు. తర్వాత సేల్స్మెన్ చేతులకున్న కట్లను విప్పేసి అసలు విషయం తెలుసుకొని తమకు సమాచారమందించాడని అల్ఫోన్స్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న తమకు మొదట ఏం ఆధారాలు దొరకలేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కవర్ను షాపు ముందు పడేయడం గమనించాము. వెంటనే ఆ కవర్ను పరిశీలించగా దాని మీద ఒక బార్కోడ్ ఉండడంతో స్కాన్ చేసి చూడగా 21 స్టోర్స్కు సంబంధించిన వివరాలు కనిపించాయి. అన్ని స్టోర్స్కు వెళ్లి విచారించగా నిందితుడు ఆ కత్తిని ఫోన్ పే ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిసిందని అల్ఫోన్స్ వెల్లడించారు. విచారణలో నిందితుడి ఫోన్ నెంబర్ వివరాలను సేకరించి అతన్ని పట్టుకొని రూ. 65వేల నగదు, మందులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పేర్కొన్నారు. కాగా మిగతా రూ.10 వేలను నిందితుడు తన అవసరాలకు వాడినట్లు తెలిపాడు. నిందితుడి మీద కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీసీపీ అల్ఫోన్స్ వెల్లడించారు. కాగా, నిందితుడు గౌరవ్కుమార్ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంతకముందు 2010లో దంపతుల హత్య కేసులో జైలుకెళ్లిన కుమార్ 8 సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించి 2018లో విడుదలయ్యాడని తెలిపారు. -
కలకలం: ఎమ్మెల్యేపై కత్తితో దాడి
సాక్షి, బెంగళూరు: ఎమ్మెల్యేపై కత్తితో డాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి మైసూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే పక్కనున్న సిబ్బంది అలర్ట్గా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యేను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఫర్హన్ పాషాగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన్వీర్ ప్రస్తుతం నరసింహారాజ్ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ తన్వీర్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసింందే. అప్పట్లో ఆయనపై పెద్ద దుమారమే చెలరేగింది. pic.twitter.com/NH813Fic50 — ANI (@ANI) November 18, 2019 -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
విశాఖ ఎయిర్పోర్టులో వేట కత్తితో వ్యక్తి కలకలం
-
విశాఖ ఎయిర్పోర్టులో మళ్లీ కత్తి కలకలం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్పోర్టులో మళ్లీ కత్తి కలకలం రేగింది. శుక్రవారం ఓ వ్యక్తి వేట కత్తి చేతిలో పట్టుకుని ఎయిర్పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్ నుంచి ఇన్గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. ఆ వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎయిర్పోర్ట్కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. -
గుంటూరులో కత్తితో యువకుడు హల్చల్
-
గుంటూరులో జనతా గ్యారేజ్!
సాక్షి, గుంటూరు : ‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది..జనతా గ్యారేజ్‘ ఇది జూ.ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలోని డైలాగ్. అచ్చం ఆ సినిమా తరహాలోనే ‘మీ వెనుక నేనున్నాను.. మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అంటూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నాడు ఓ యువకుడు. అంతే కాకుండా కత్తి పట్టుకొని నడిరోడ్డుపై వచ్చి హడావుడి చేశాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ యువకుడు సోమవారం ఉదయం కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపైకి వచ్చాడు.తన జనతాగ్యారేజ్కి సమస్యలు చెప్పాలంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాడు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. అతన్ని చూసి ఒక్కసారిగి పరుగులు తీశారు. ఆ యువకుడు కత్తి పట్టుకొని ఫోన్ మాట్లాడూతూ.. ‘నా దగ్గరకి రా. క్షణాల్లో పరిష్కరిస్తా’ అంటూ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జనతా గ్యారేజ్ గ్రూప్ అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ‘ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్లో పెట్టండి. జనతా గ్యారేజ్ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా ’అంటూ మెస్సేజ్ చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయ్యడంటూ ఓ నెంబర్ను కూడా గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి పేరు ప్రదీప్ అని, గ్రూప్లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
పోలీస్స్టేషన్లోనే భార్యపై దాడి
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట పోలీస్స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ఆవరణలో జరగడం గమనర్హం. వివరాలు..యాప్రాల్కు చెందిన రెహమాన్, రసూల్ పురాకు చెందిన కౌసర్ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్ బేగం బేగంపేట పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. రెహమాన్ మద్యానికి బానిస కావడంతో కౌసర్ బేగం భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బేగం పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. భార్యపై కోపంతో కత్తితో పోలీస్స్టేషన్లోనే దాడి చేశాడు. అడ్డొ చ్చిన కుటుంబసభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.