-
విపక్షాల భేటీ వాయిదా!
న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పాట్నాలో ఈ నెల 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేయాలని జేడీ(యూ) నేతలు నిర్ణయించుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటుకు బిహార్ సీఎం నితీశ్కుమార్ యత్నిస్తుండటం తెలిసిందే. -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఢిల్లీలో గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో శివ్నందన్కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేశాక.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలికి కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ పంపుతారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనప్పుడు అడ్హక్గా రూ.పదివేల కోట్లు విడుదల చేసి, రీయింబర్స్మెంట్లో జాప్యం లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు ముందస్తు ఫలాలను అందించడానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్శక్తి శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ పూర్తి చేయడం ద్వారా ముందస్తు ఫలాలను రైతులకు అందించడంపై ఏప్రిల్ 10న రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. కమీషన్ల కక్కుర్తితో, ప్రణాళికారాహిత్యంతో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటంతోపాటు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో కొత్తగా 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అవసరమైన వ్యయంపై సవరించిన ప్రతిపాదనలనుపంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆ సమావేశంలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఆ మేరకు తొలిదశ పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో సవరించిన వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న పీపీఏకి పంపింది. ప్రాజెక్టును సమగ్రంగా పూర్తిచేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని కోరింది. వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు ♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి. కానీ కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రంపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. ♦ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే రూ.4,730.71 కోట్లను పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని మినహాయిస్తే రూ.15,667.90 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ♦ భూసేకరణ చట్టం–2013 ప్రకారం పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరమైతే.. కేవలం రూ.20,398.61 కోట్లతోనే పోలవరాన్ని పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడం ద్వారా ఆ ప్రాజెక్టుకు సమాధి కట్టారు. ♦ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు రూ.4,730.71 కోట్లు, తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చుచేసింది. చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్ల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు వ్యయం చేసింది. దీంతో ఇకపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయాలంటే సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించాలి. పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరానికి నిధుల సమస్యను పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్లకు పలుమార్లు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నేపథ్యంలో రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేయడం అసాధ్యమని వివరించారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. వాటిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ రెండుదశల్లో పోలవరాన్ని పూర్తిచేసేందుకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్శక్తి శాఖను ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ఎల్లుండి బీఆర్ఎస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక సమావేశం ఎల్లుండి(బుధవారం) జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ కీలక భేటీకి హాజరు కానున్నారని తెలిపింది. -
అధికారులదే హవా?
-
ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
సీఎం జగన్ కీలక సమావేశం..ప్రధాన లక్ష్యం అదేనా ?
-
ముగిసిన కాంగ్రెస్ సమావేశం, న్యాయపోరాటంతో పాటుగా..
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ విస్తృత సమావేశంలో రాహుల్ గాంధీ అనర్హత వేటు, భవిష్యత్ కార్యాచరణ ప్రధానాంశంగా ఈ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో.. మూడు విధాలుగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవైపు న్యాయపోరాటంతో పాటు మరోవైపు దేశవ్యాప్తంగా వీధుల్లోనూ పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పోరాటంలో విపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించింది. అదే సమయంలో రాహుల్కు సంఘీభావంగా పలు రాష్ట్రాల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు ప్రణాళిక రచిస్తోంది. ఇక.. కార్యాచరణపై రేపు(శనివారం) స్పష్టమైన ప్రకటన చేయనుంది ఏఐసీసీ. ఈ భేటీకి ఖర్గే, సోనియాగాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారీఖ్ అన్వర్, సీనియర్లు ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాన్షిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సాల్ తదితరులు హాజరయ్యారు. పరువునష్టం దావాకు సంబంధించి రాహుల్గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించి.. ఆ వెంటనే బెయిల్, నెలలోపు అప్పీల్ చేసుకునేందుకు వీలు ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ఇవాళ(శుక్రవారం) కూడా కాంగ్రెస్ ఎంపీల సమావేశం కోసం పార్లమెంట్కు వెళ్లారు. అయితే ఈలోపే లోక్సభ ఎంపీగా రాహుల్గాంధీపై అనర్హత వేటేస్తూ లోక్సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
అమిత్ షా యాక్షన్ ప్లాన్.. ఆ సీట్లపైనే గురి
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రాంతీయ పార్టీ నేతల దూకుడు.. విపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో.. 2024 ఎన్నికల కోసం రోడ్మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన వ్యూహకర్త అమిత్ షా అధ్యక్షతన పార్టీ మెగా సమావేశం జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మంత్రులను కొన్ని స్థానాలపైనే దృష్టిసారించమని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఫీడ్బ్యాక్ అందించాలని అమిత్ షా మంత్రులకు సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా స్థానాల్లో పార్టీని గ్రౌండ్ లెవల్లో బలపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని షా చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు బీజేపీకి అవకాశాలు ఉన్న మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఆయన కేంద్రమంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ 144 సీట్లే! బీజేపీ మేధోమదన సమావేశంలో షా సూచించిన కొన్ని స్థానాల సంఖ్య 144గా తేలింది. అవేంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెల్చుకుంది. ఎన్డీయే కూటమిగా మొత్తం 353 సీట్లకు బలం పెంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 37.36గా వచ్చింది. 1989 ఎన్నికల తర్వాత.. ఒక పార్టీకి ఇంత ఓటు షేర్ రావడం ఇదే ప్రథమం. అయితే.. ఆ ఎన్నికల్లో 144 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. ఈ తరుణంలో ఆ 144 సీట్లే ప్రధానంగా దృష్టిసారించాలని అమిత్ షా మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు -
గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం
-
గాంధీభవన్ లో కాసేపట్లో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
-
సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ఫిలిం ఛాంబర్ సమావేశం
-
గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్ షాప్
-
టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ
-
మరికొంతకాలం అమిత్ షాయే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలను కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తాత్కాలిక చీఫ్ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు అమిత్షా గురువారం వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, 18న ఆఫీస్ బేరర్లు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. రోడ్మ్యాప్పై కమిటీ గురువారం నాటి సమావేశంలో అమిత్షా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని కొనియాడారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తెలంగాణ, ఒడిశాలలో మంచి ఫలితాలను సాధించిందన్నారు. సంస్థాగత ఎన్నికలతోపాటు ఇతర ప్రధాన అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్, నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
రేపు బీజేపీ కీలక సమావేశం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం గురువారం జరగనుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సంస్థాగత ఎన్నికలు, తదుపరి అధ్యక్షుడి ఎన్నికపై చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారుపై సమాలోచనలు జరపనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా ఆర్గనైజేషన్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆర్గనైజేషన్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవికి అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను ప్రతిపాదించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రతిపాదనను బలపరుస్తూ రాష్ట్రాల అధ్యక్షులు తీర్మానం చేయనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై నుంచి చేపట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుగానే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. -
రేపు జైట్లీతో మోదీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం అత్యున్నత భేటీ నిర్వహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండటం గమనార్హం. మరోవైపు జీఎస్టీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులూ పన్ను రాబడిపై ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటితో పాటు నోట్ల రద్దు అనంతరం నల్లధనం చెలామణిపై దూకుడుగా వెళ్లడం వంటి అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.ఆర్థిక వృద్ధి మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ వ్యయంపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ధరల నియంత్రణకు ఏం చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేయనున్నారు. -
ప్రొటోకాల్ తేలేనా?
8న కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం నీటి పంపిణీ, వినియోగంపై పునఃసమీక్ష కోరుతున్న తెలంగాణ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15పైనా స్పష్టత కోరే అవకాశం ఎజెండా అంశాలపై మొదలైన కసరత్తు హైదరాబాద్ కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ల నిర్వహణ, నీటి వినియోగంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ అంశాల్లో నెలకొన్న స్తబ్దతను నివారించే పనిని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రారంభించింది. ఈ నెల 8న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో ఉమ్మడిగా ప్రాజెక్టుల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు, వినియోగం, ఆపరేషన్ ప్రొటోకాల్లపై భిన్న వాదనలు వినిపిస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య ఈ అంశాన్ని కొలిక్కి తేవడం అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా తయారుచేసిన నీటి ప్రొటోకాల్స్లో మార్పులు చేయాలని పట్టుబడుతున్న తెలంగాణ.. ఈ అంశాన్నే మొదట తేల్చాలని బలంగా కోరే అవకాశాలున్నాయి. ప్రాధాన్యతల మార్పులు కోరే అవకాశం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంలో అనుసరించాల్సిన ప్రాధాన్యతల(ప్రొటోకాల్స్)ను పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో 69, 107లపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇప్పటికే పలుమార్లు బోర్డుకు స్పష్టం చేసింది. ముఖ్యంగా చెన్నై తాగునీటి అవసరాలకు 3.75 టీఎంసీల నీటి కేటాయింపునకు తొలి ప్రాధాన్యమిస్తూ.. తెలంగాణ నీటి అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం చెబుతోంది. కేవలం తెలుగు గంగకు నీటిని తీసుకెళ్లేందుకే కుట్ర పూరితంగా చెన్నై అవసరాలకు ప్రోటోకాల్లో తొలి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటోంది. ఇక విద్యుదుత్పత్తిలోనూ ఆంధ్రాకు అనుకూలంగానే ప్రోటోకాల్స్ ఉన్నాయని, ఎడమవైపున విద్యుదుత్పత్తి కేంద్రం ఉన్నా, దాని వినియోగంపై నియంత్రణ ఉందని తెలంగాణ అంటోంది. అలాగాకుండా స్వతంత్రంగా దానిని నడపుకొనేలా ప్రోటోకాల్ మార్చాలని వాదిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రోటోకాల్స్ను మార్చి తాజా మార్గదర్శకాలు రూపొందించడానికి.. సాగునీటి, ఇతర అవసరాలకు సంబంధించిన పూర్తి డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానికితోడు జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా పూర్తయి ఓ ఒప్పందానికి వస్తేనే ప్రోటోకాల్లో మార్పులు సాధ్యమవుతాయి. లేదంటే బోర్డు కొత్త మార్గదర్శకాలు తయారుచేసే వరకు.. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ప్రస్తుత ప్రోటోకాల్స్నే పాటించాల్సి ఉంటుంది. అంత సులువేం కాదు.. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, సాగర్ నీటి వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాన్ని తేల్చడం అంత సులువేం కాదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 15వ అధికరణం కింద ఒక రాష్ట్రం తన పరిధిలోని నీటిని తన సరిహద్దులలో నచ్చిన రీతిలో వాడుకోవడానికి హక్కు కల్పించిందన్న విషయాన్ని తెలంగాణ గతంలోనే తెరపైకి తెచ్చింది. ఈ మేరకే కృష్ణాలో గుండుగుత్తగా జరిపిన కేటాయింపుల్లో ఏపీకి 512.04 టీఎంసీలు (63.14శాతం), తెలంగాణకు 298.96 టీఎంసీల (36.86 శాతం) వాటాలున్నాయని చెబుతూ... సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన నీటిని తెలంగాణ రాష్ట్రం సాగర్ నుంచి వాడుకుంది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని అక్కడే అదే సమయంలో వాడాలి తప్ప, మొత్తం కేటాయింపులను ఒకే దగ్గర వాడుకుంటామంటే కుదరదని వాదించింది. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో బోర్డు ఏం తేలుస్తుందన్నది కీలకంగా మారింది.