kavya sree
-
పెళ్లి చేసుకోనున్న నిఖిల్-కావ్య? నటుడి ఆన్సరిదే!
ఆన్స్క్రీన్లో జంటగా కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్లో కూడా జోడీగా ఉంటే చూడాలని ముచ్చటపడుతుంటారు అభిమానులు. అలాగే చాలామంది రీల్ జంటగా మిగిలిపోకుండా రియల్ లైఫ్లోనూ పెళ్లి చేసుకుని చూపించారు. ఈ క్రమంలో బుల్లితెర జంట కావ్య-నిఖిల్కు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఏ షోకి వెళ్లినా జంటగా వెళ్లే వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నిస్తున్నారు. నిజమైన దంపతులుగా చూడాలని ఉందని అభిమానులు తహతహలాడుతున్నారు. తను నాకు ఫ్రెండ్గా దొరకడమే గ్రేట్ ఈ క్రమంలో పెళ్లిపై పెదవి విప్పాడు నటుడు నిఖిల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కావ్య చాలా మంచి అమ్మాయి, మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే బాగుండని నాలాంటి ప్రతీ అబ్బాయి కోరుకుంటాడు. నిజం చెప్పాలంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్గా దొరకడమే గొప్ప. మీరంతా లవ్వు, గివ్వు అని ఎక్కడికో వెళ్లిపోతున్నారు. జనాలకు మేము జంటగా కనిపిస్తే ఇష్టం. అందుకే మేమిద్దరం కలిసే షోలు చేస్తాము. మేము పెళ్లి చేసుకుంటామా? లేదా? అన్నది మా చేతుల్లో లేదు. పెళ్లి గురించి ఆలోచించట్లే అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మా ఇంట్లో పెళ్లి గురించి తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పట్లో దాని జోలికి వెళ్లను' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. త్వరలోనే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ రియల్ కపుల్గా ప్రమోషన్ పొందాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రస్తుతం ఓ సీరియల్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. చదవండి: విఘ్నేశ్ ఎల్ఐసీ.. సినిమా నుంచి తప్పుకున్న నయనతార? -
సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
బుల్లితెర ప్రేక్షకులకు కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గోరింటాకు సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్న కావ్య శ్రీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. తాజాగా ఆమె బెంగళూరులోని తన డూప్లెక్స్ ఇంటిని చూపించింది. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, పూజా గది, మోడ్రన్ కిచెన్, డైనింగ్ హాల్, ఒక బెడ్ రూమ్ ఉన్నాయి. మొదటి అంతస్థులో ఒక హాల్తో పాటు మరో రెండు గదులున్నాయని పేర్కొంది. అందులో ఒకటి తన తండ్రి వాడుతుండగా మరొక గదిలో తనతో పాటు చెల్లె ఉంటుందని చెప్పుకొచ్చింది. హ్యాండ్ బ్యాగులంటే ఇష్టమైన కావ్య గదిలో 15 కంటే ఎక్కువ బ్యాగులు కనిపించాయి. పనిలో పనిగా తన బర్త్డేకు ఫ్రెండ్స్, ఫ్యాన్ పేజెస్ ఇచ్చిన కానుకలను చూపించింది. చదవండి: ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో అనన్య పాండే! -
డెంగీతో చిన్నారి మృతి
చెన్నూరు: వైఎస్ఆర్ జిల్లా లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసపల్లి గ్రామంలో వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మాదినేని గిరిప్రసాద్, ఉమాదేవి దంపతులకు కావ్యశ్రీ(6) కుమార్తె. కాగా, గత మూడు రోజులుగా జ్వరం రావడంతో కడప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కావ్యశ్రీ మృతి చెందింది. డెంగీ తో బాలిక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.