-
కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తిన పాక్.. ఖండించిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్పై మరోమారు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై వెంటనే స్పందించిన భారత్ జమ్ముకశ్మీర్పై పాక్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించింది. ఆ దేశంలో జరుగుతున్న పలు ఉల్లంఘనల నుండి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలా చేస్తున్నదని భారత్ తెలిపింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. దీనిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.వారి దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. -
కశ్మీర్లో మిస్టర్ బచ్చన్
కశ్మీర్లో మెలోడీ డ్యూయెట్ పాడుతున్నాడు మిస్టర్ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. విజువల్ ఫీస్ట్గా ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్తో ఈ సాంగ్ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్లోని కెటలాన్లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని లామకాన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్పై ‘భూమిని కాపాడే సూపర్హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
అరుంధతి రాయ్పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్పోస్ట్పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్పోస్ట్పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్పోస్ట్ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్పోస్ట్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 పైచిలుకు స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కశ్మీర్లో మాత్రం మూడు లోక్సభ స్థానాలకు దూరంగా ఉండటం విశ్లేషకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏవీ పోటీ చేయని స్థానాలు ఈ మూడే! ముఖ్యంగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కలి్పంచే ఆరి్టకల్ 370తో పాటు రాష్ట్ర హోదా కూడా రద్దు చేశాక జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకిలా ముఖం చాటేసినట్టన్న ప్రశ్న తలెత్తుతోంది... కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో 5 లోక్సభ స్థానాలున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్– రాజౌరి స్థానాలు శ్రీనగర్ పరిధిలోనివి. వీటిల్లో ముస్లిం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి కావాలనుకుంటే వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థులను బరిలో దింపొచ్చు. కానీ జమ్మూ పరిధిలోని జమ్మూ, ఉదంపూర్ లోక్సభ స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ బీజేపీ సిట్టింగ్ స్థానాలే. తొలి, రెండో విడతలో వీటికి ఎన్నిక ముగిసింది. జమ్మూలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జుగల్ కిషోర్ శర్మ బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేశారు. ఉదంపూర్లోనూ గత రెండు ఎన్నికల నుంచి బీజేపీ టికెట్పై గెలుస్తున్న ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పోటీ చేశారు. శ్రీనగర్లో మే 13న పోలింగ్ ముగిసింది. మే 20న బారాముల్లా, మే 25న అనంతనాగ్–రాజౌరితో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు పూర్తవుతాయి. కారణాలేమిటి? ఆర్టికల్ 370ని, రాష్ట్ర హోదాను రద్దు చేయడం కశ్మీర్లో కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్నది బీజేపీ భావన. అలాంటప్పుడు అక్కడి లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందని, పైగా తనను బూచిగా చూపి ఎన్సీ, పీడీపీ రెండూ ఓటర్లను ఏకీకృతం చేస్తాయని అంచనాకు వచ్చింది. అందుకే నేరుగా బరిలో దిగకుండా చిన్న పారీ్టలకు దన్నుగా నిలిచినట్టు చెబుతున్నారు. బారాముల్లా నుంచి ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. ఆయనకు పీడీపీ నేత ఫయాజ్ మిర్, జేకేపీసీ చైర్మన్ సజ్జాద్ గనీ ప్రత్యర్థులుగా ఉన్నారు. సజ్జాద్ను బీజేపీ ప్రతినిధేనని ఒమర్ అబ్దుల్లాతో పాటు పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఆరోపణలు చేశారు. అనంతనాగ్–రాజౌరిలో తమ ప్రత్యర్థి అయిన జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి జాఫర్ ఇక్బాల్ మన్హాస్కు బీజేపీ మద్దతిస్తోందని ముఫ్తీ ఆరోపించారు. శ్రీనగర్లో కూడా ఎన్సీ, పీడీపీలపై అప్నీ పార్టీ నుంచి మహమ్మద్ అష్రఫ్ మిర్ పోటీ చేశారు. ఈ అప్నీ పార్టీ బీజేపీ మద్దతుతోనే 2021లో పుట్టుకొచి్చందని ఎన్సీ అంటోంది. అసలు లక్ష్యం అసెంబ్లీయే!? ‘‘మా ప్రత్యర్థులు అంచనా వేసినట్టుగా మేము కశ్మీర్ను జయించబోవడం లేదు. ప్రతి కశ్మీరీ హృదయాన్నీ గెలుచుకోవడమే మా కర్తవ్యం’’ అని ఏప్రిల్ 16న జమ్మూ ర్యాలీలో అమిత్షా చేసిన ప్రకటనను కీలకంగా చూడాలి. కశ్మీర్ లోయలో కమల వికాసంపై తమకేమీ తొందర లేదన్నారాయన. ప్రధాని మోదీ కూడా ఆరి్టకల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా మార్చిలో శ్రీనగర్లో ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటికల్లా ఎన్సీ, పీడీపీలను వీలైనంతగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు భావిస్తున్నారు. కొన్నిసార్లు పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని నిర్ణయాలు తప్పవని లోయలో పోటీకి దూరంగా ఉండటంపై జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా చేసిన నర్మగర్భ ప్రకటన అంతరార్థం కూడా అదేనంటున్నారు. లోయలో దేశభక్తి కలిగిన పార్టీలకు బీజేపీ మద్దతిస్తుందని అప్పుడే ఆయన ప్రకటించారు కూడా. ఎన్సీ, పీడీపీలకు స్థానిక పారీ్టలతో చెక్ పెట్టడమే బీజేపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. లోయలోని మూడు లోక్సభ స్థానాలనూ 2019లో ఎన్సీ గెలుచుకోవడం గమనార్హం. ఈసారి తెర వెనక పాత్రకశ్మీర్లో తనకు ఏమాత్రం బలం లేని మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా అక్కడ తెర వెనక కీలకపాత్రే పోషిస్తున్నట్టు స్థానిక రాజకీయ పారీ్టలతో పాటు బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కశ్మీర్లోని మూడు స్థానాలనూ కాంగ్రెస్ కూడా పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్కు కేటాయించడం విశేషం. అలా రెండు ప్రధాన జాతీయ పారీ్టలూ కశ్మీర్లో పోటీకి దూరంగానే ఉన్నాయి. దాంతో ఈ స్థానాల్లో పోటీ ప్రధానంగా ఎన్సీ, పీడీపీ మధ్యే నెలకొంది. అయితే సజ్జాద్ లోన్కు చెందిన జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), అల్తాఫ్ బుఖారీకి చెందిన జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ, మాజీ సీఎం గులాంనబీ ఆజాద్కు చెందిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పారీ్ట (డీపీఏపీ) కూడా బరిలో ఉన్నాయి. ఇవి బీజేపీ షాడో పార్టీలని ఎన్సీ, పీడీపీ ఆరోపిస్తున్నాయి. బీజేపీ వైఖరి గమనిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలకు ఓటు వేయొద్దని గత నెల ఇక్కడ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వీల్చైర్కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్చైర్కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్తో సచిన్ ఫిదా
క్రికెట్పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్లోని సోపోర్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషినిస్తోందంటూ ట్వీట్చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx — Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 క్రికెట్ స్టార్లు మిథాలీ రాజ్,శిఖర్ ధావన్ తన ఫ్యావరెట్ అని చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ని చూసిన తర్వాత క్రికెట్పై ఆసక్తిని పెంచుకుందట. అంతేకాదు చాలా కాలంగా ఈ ప్లేగ్రౌండ్లో ఆడతానని తన కిష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని, తన తాతయ్యతో కలిసి ఆడేదాన్నని చెప్పుకొచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్ షురూ. జాసిమ్ భట్, అర్సలాన్, ఫైసల్, ఫయీజ్, ఇఖ్లాక్ , ఇతర అబ్బాయిలతో పోటీ పడి ఆడుతుంది. ‘‘సచిన్ సర్ నా వీడియోను షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ” హర్మత్. భారత జట్టులోకి ఎంపికై మిథాలీ రాజ్తో మ్యాచ్ ఆడాలని హర్మత్ కలలు కంటోంది. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది కానీ తగిన గుర్తింపు లభించడం లేదని, శిక్షణకోసం అకాడమీలు లేవంటూ స్థానికులు తౌసీఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు హర్మత్ తరహాలో క్రీడాకారులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. -
ఆర్టికల్ 370 రద్దు.. మొదటిసారి శ్రీనగర్కు ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు మోదీ కశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాని మోదీ నేడు కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. ఇక, కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. New Jammu kashmir after the abrogation of 370 and 35A. Ahead of PM Modi's arrival in the valley, BJP supporters take out a flag march while shouting, "Har Har Modi, Ghar Ghar Modi." Please retweet it pic.twitter.com/MqPQTrHM8g — Aquib Mir (@aquibmir71) March 6, 2024 అలాగే.. శ్రీనగర్లోని హజ్రత్బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు, మోదీ వస్తున్న క్రమంలో కశ్మీర్లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రియల్ హీరోకు సచిన్ బహుమతి.. ఎమోషనల్ వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. భూతల స్వర్గంలో గల్లీ క్రికెట్ ఆడుతూ, జవాన్లను పలకరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 కుటుంబంతో కలిసి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. ఇంతకీ అందులో ఏముంది?!... జమ్మూ కశ్మీర్కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అమిర్.. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్ పెట్టకుని క్రికెట్ ఆడే అమిర్.. కాళ్లతో బౌలింగ్ చేయగలడు. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 ఈ క్రమంలో అమిర్ హుసేన్ గురించి తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. తాజాగా తన పర్యటనలో భాగంగా అమిర్ హుసేన్ను కలిశాడు సచిన్. తన సంతకంతో కూడిన బ్యాట్ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. ‘‘అమిర్ నిజమైన హీరో.. నువ్విలాగే ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్ క్యాప్షన్ జతచేశాడు. ఈ నేపథ్యంలో అమిర్ హుసేన్తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! To Amir, the real hero. Keep inspiring! It was a pleasure meeting you. pic.twitter.com/oouk55lDkw — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2024 -
వాహ్! ఐస్ టీ వాహ్!
బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్ చెబుతున్నాయి. కశ్మీర్కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్స్టాలో ‘ట్రాహులర్’ అనే అకౌంట్లో తన ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు. టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల? -
లాల్చౌక్లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్లోని లాల్చౌక్లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
'కశ్మీర్కూ గాజా గతే..' ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు
శ్రీనగర్: భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు. 'పాకిస్థాన్కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్ఎస్పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. "బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గత నెలలో, శ్రీనగర్లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
2023లో కశ్మీర్ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్లను పాక్కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్గా పుషప్లు చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
‘కశ్మీర్ గాజా కాదు.. ఆ ఘనతంతా ప్రధాని మోదీదే’
కశ్మీర్ గాజా కాదని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకురాలు షీహ్లా రషిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ గతంలో కశ్మీర్లో రాళ్లు రువ్విన ఉద్యమకారులకు మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడిలా కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘అవును అది 2010లో. అప్పుడు ఉద్యమకారులకు మద్దతివ్వడం వాస్తవమే. కానీ ఈ రోజు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కశ్మీర్ గాజా కాదని స్పష్టమైంది’ అని షీహ్లా రషిద్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో వచ్చిన మార్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధానాలే కారణమని ప్రశంసించారు. రక్తపాతాలు లేకుండా అక్కడి ఉద్రిక్తతలకు వారు రాజకీయ పరిష్కారాన్ని చూపించారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని రషీద్ ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా విమర్శించిన రషీద్.. ఆ తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కృషి చేశారంటూ అభినందించారు. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి? -
కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్ప్రీత్సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్లోని మల్లాన్పూర్కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
కశ్మీర్ ట్రిప్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. వైరల్ ఫొటోలు