-
‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది. చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సి కల్యాణ్ కృష్ణ నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్పై అప్డేట్ బయటకు వచ్చంది. చదవండి: నా బెస్ట్ ఆన్స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍 Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4 — Studio Green (@StudioGreen2) January 16, 2022 -
బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్.. 'నా కోసం నువ్వు' అంటూ
Bangarraju Movie Another Lyrical Song Released: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున సినీ కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ సినిమాకు 'బంగార్రాజు' పేరుతో ప్రీక్వేల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా కల్యాణ్ కృష్ణ డెరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్. 'నా కోసం నువ్వు' అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. పాటలో అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ లిరికల్ వీడియో చివరిలో నాగర్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఈ పాట టీజర్ను డిసెంబర్ 2న విడుదల చేయగా పూర్తి సాంగ్ను ఇవాళ (డిసెంబర్ 5) న రీలీజ్ చేశారు. ఇంతకుముందు 'నాగలక్ష్మీ' పాత్రలో కనిపించిన కృతి శెట్టి లుక్కు మంచి ఆదరణ లభించింది. అలాగే నాగార్జున పాడిన 'లడ్డుండా' లిరికల్ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బంగర్రాజు' సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చై సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్డూడియోస్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Here’s #NaaKosam https://t.co/XaBO3LUx24 from #Bangarraju another beautiful melody from @anuprubens with @sidsriram magic .. happy listening !! @iamnagarjuna@IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany@zeemusicsouth — chaitanya akkineni (@chay_akkineni) December 5, 2021 ఇదీ చదవండి: నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు నాన్నా.. చైతూ ట్వీట్ వైరల్ -
నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే...
‘ఫస్ట్ టైమ్ లైఫ్లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తో్తంది’ అంటూ ప్రారంభమయ్యే ‘నేల టిక్కెట్టు’ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి హిట్ చిత్రాల తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఎస్ఆర్టి ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం.. అది కదరా లైఫ్... ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు... ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ వంటి అర్థవంతమైన డైలాగులు ఒకవైపు.. ‘నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా. ఇదే మూడ్ మెయిన్టైన్ చెయ్... నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’... వంటి రవితేజ మార్కు మాస్ డైలాగులు మరోవైపు... మొత్తంగా ట్రైలర్లోని డైలాగులు సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. -
నేల నేల నేల... నేల టిక్కెట్టు
రవితేజ పలికే డైలాగ్స్లోనే కాదు.. చేసే డ్యాన్స్లోనూ మాస్ పల్స్ మస్త్గా ఉంటాయి. అందుకు ఆయన గత చిత్రాల్లోని పాటలే నిదర్శనం. తాజాగా ఆయనపై మరో మాస్ సాంగ్ను గురువారం నుంచి షూట్ చేస్తున్నారు. రవితేజ హీరోగా కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న సినిమా ‘నేల టిక్కెట్టు’. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ‘నేల నేల నేల నేలటిక్కెట్టు’ అనే పాట చిత్రీకరణను గురువారం మొదలుపెట్టారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ‘‘ నేల నేల నేల టిక్కెట్లు.. అంటూ సూపర్హిట్ సాంగ్ రాయించావు కల్యాణ్ కృష్ణ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘మీ చేత పాట రాయించగలమా సార్.. మీరు రాయాలి గానీ.. మాస్ టిక్కెట్ లిరిక్స్ ఇచ్చిన మీకు థ్యాంక్స్’’ అన్నారు కల్యాణ్ కృష్ణ. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. -
రొమాంటిక్ సోగ్గాడు
నాగార్జున సోలో హీరోగా కనిపించి ఏడాది దాటింది. ‘భాయ్’ తర్వాత ఆయన సోలో హీరోగా సినిమా రాలేదు. ‘మనం’, ‘ఒక లైలా కోసం’ విజయాలతో అటు నటునిగా, ఇటు నిర్మాతగా జోష్ మీదున్నారాయన. ఈ ఆనందంలోనే సోలో హీరోగా కూడా హిట్టు కొట్టేయాలనే పట్టుదలతో ఉన్నారు నాగ్. అందుకే... నవంబర్ 15న తన సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘అష్టాచమ్మా’ రామ్మోహన్ నిర్మాతగా నాగార్జున నటించనున్న ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. టైటిల్కి తగ్గట్టే ఇందులో నాగ్ కేరక్టర్ని దర్శకుడు రొమాంటిగ్గా డిజైన్ చేశాడని సమాచారం. చాలాకాలం తర్వాత ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించనుండటం విశేషం. మరో నాయిక కోసం ‘లెజెండ్’ బ్యూటీ సోనాల్చౌహాన్, దీక్షాసేథ్ తదితరులు పరిశీలనలో ఉన్నారు.