-
ప్రేమతోనే కాంగ్రెస్లో చేరుతున్నా..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
11 లేదా 12న కాంగ్రెస్లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీపీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్.. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత ప్రస్తుత పీసీసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
బీఆర్ఎస్లోకి రాకేశ్రెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్రెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్ తదితరులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. రాకేశ్రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు. -
వారంతా కాంగ్రెస్ నిరంకుశంపై పోరాడిన వాళ్లే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నిరంకుశ విధానాలపై పోరాడిన వాళ్లంతా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతు న్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సమక్షంలో చెరుకు సుధాకర్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరే కంగా 46 రోజులు పోరాటం చేసి జైలు శిక్ష అనుభ వించిన నాయకులు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమన్నారు. జిట్టా బాలకృష్ణ, ఏపూరి సోమన్న, హర్దీప్రెడ్డి లాంటి వాళ్లు బీఆర్ ఎస్లో చేరడం గొప్ప విషయమని, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ‘అదృష్టం ఉంటేనే ఇంట్లో ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. మనింటి అమ్మాయిని వేరే వాళ్లకు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో, రాష్ట్రాన్ని ఒకరి చేతిలో పెట్టాలంటే కూడా ఎంతో ఆలోచించాలి. ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంచాలో ప్రజలు కూడా ఆలోచించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్కు హ్యాట్రిక్ సీఎంగా అవకాశమివ్వాలని విన్నవించారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండుకు 12 అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ గెలవాలి. ఈ చేరికలతో నకిరేకల్లో లింగయ్య, ఆలేరులో సునీత గెలుపు ఖాయమ య్యాయి. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఈసారి దసరాకు ఊళ్లలో అభివృద్ధిపైనే చర్చ జరగాలి’ అని కేటీఆర్ చెప్పారు. దూకుడుగా పని చేస్తాను: చెరుకు సుధాకర్ ‘తెలంగాణ ఉద్యమాన్ని గరిష్ట స్థాయిలో నడిపాను. జైలు జీవితాన్ని కూడా గడిపాను. నా ఆలోచన విధానానికి పదును పెట్టింది తెలంగాణ భవన్. పార్లమెంటరీ రాజకీయాలను అవగాహన చేయించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా బీఆర్ఎస్ కొనసాగాలి. తెలంగాణ ప్రజలకు అనేక పాఠాలు, వ్యతిరేకులకు గుణపాఠాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్. భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా పార్టీ నిలవాలి. ప్రజలకు మరింత చేరువై అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజల ఆశయా లు, ఆకాంక్షల సాధన కోసం గతంలో మాదిరిగానే దూకుడుగా పని చేస్తాను’ అని చెరుకు సుధాకర్ చెప్పారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు: మంత్రి హరీశ్రావు చెరుకు సుధాకర్ కరుడుగట్టిన ఉద్యమవాది అని, తెలంగాణ ఉద్యమంలో మొదటగా జైలుకెళ్లిన వ్యక్తి ఆయనే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయని కిషన్రెడ్డి మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. బీజేపీతో పోరాటం తమ డీఎన్ఏలో ఉందని రాహుల్ గాంధీ అన్నారని, మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏముందో చెప్పాలన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు సరిపోలడం లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు 35–40 స్థానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, సోనియమ్మ ను బలి దేవత అన్న రేవంత్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటని, కాంగ్రెస్కు లెహర్ లేదని జహర్ మాత్రమే ఉందన్నారు. ఛత్తీస్గఢ్లో ఎకరాకు 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటున్నారని, కానీ రాష్ట్రంలో ప్రతి గింజనూ సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని చెప్పారు. పనితనం తప్ప, పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్కు ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉంటుందని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని, కాంగ్రెస్ అంటే మాటలు, మంటలు, ముఠాలు అని అభివర్ణించారు. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్బై
సాక్షి, హైదరాబాద్, ఆదిలాబాద్: బీఆర్ఎస్కి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు గుడ్బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. బోథ్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి బోథ్ నియోజకవర్గం టికెట్ను బాపూరావుకు కాకుండా జెడ్పీటీసీ అనిల్జాదవ్కు టికెట్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ను కలి సిన బాపూరావు పలు అంశాలపై చర్చలు జరిపా రు. బోథ్లో తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే విజయం సాధిస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్లో ఎప్పుడు చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, త్వరలోనే చేరుతానని తెలిపారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్లోకి చేరికల పరంపర కొనసాగు తోంది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు రేవంత్ నివాసంలో కాంగ్రెస్లో చేరారు. అలాగే గాంధీభవన్లో రేవంత్రెడ్డి సమక్షంలో పలు వురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కల్వకుర్తి, కొడంగల్ నియోజకవ ర్గాలకు చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్లో చేరారు. షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్, కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు. -
నేడు కేసీఆర్తో పొన్నాల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు. సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల రేవంత్రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు. -
కాంగ్రెస్లోకి సోయం బాపూరావు?
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నోటి నుంచి సోయం బాపూరావు చేరిక ప్రస్తావన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోయం పేరును ప్రకటిస్తారని అంటున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పర్యటనలో ఉన్న ఆయనను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. రేవంత్ నోటి వెంట మీ పేరు వచ్చిందని సోయంను అడగ్గా.. అభిమానంతో ఆయన చెప్పి ఉండొచ్చని బదులిచ్చారు. కాంగ్రెస్లో చేరిక విషయంలో అన్ని ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగు నెలల క్రితం కూడా సోయం కాంగ్రెస్లో చేరుతు న్నారని జోరుగా ప్రచారం జరగగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన బహిరంగంగా ఖండించారు. తాజాగా మళ్లీ ఈ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బీజేపీ ఎంపీలందరూ వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో ఉండాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఆయన దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. తనయుడు వెంకటేశ్ను బోథ్ నుంచి దరఖాస్తు చేయించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్తో సోయంకు సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో బలమైన ఆదివాసీ నేత సోయంను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ జాదవ్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్, బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ తర్వాత జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది. -
చంద్రబాబుకు భారీ షాక్
-
సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల
-
ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరుతున్నాను
-
ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..
పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H — Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023 లోక్ జన్శక్తి పార్టీని బిహార్లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్ కూడా బీజేపీ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు గుడ్న్యూస్.. 30 సెకన్లలో రూ.5 లక్షల లోన్!
ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. కస్టమర్లకు లోన్స్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఇందులో బజాజ్, టాటా క్యాపిటల్ మొదలైన సంస్థలు అతి తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్కార్ట్' (Flipkart) ప్రవేశించింది. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వల్ల సుమారు 450 మిలియన్ కస్టమర్లు అదనపు సౌలభ్యం పొందే అవకాశం ఉంది. కేవలం 30 సెకన్లలోపు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందవచ్చని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి 6 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కావున ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రముఖ బ్యాంకుల సహకారంతో ఫ్లిప్కార్ట్ ఇప్పటికే 'బై నౌ పే లేటర్' (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు (EMI) అండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు వంటివి అందిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. కాగా ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంక్ సహకారంతో పర్సనల్ లోన్ విభాగంలో కూడా అడుగుపెట్టడం చాలా సంతోషముగా ఉందన్నారు. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) ఫ్లిప్కార్ట్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి ప్రాథమిక వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించిన తరువాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఎంత లోన్ అందించాలి, ఎంత లోన్ తీసుకోవడానికి అర్హులు అని నిర్ధారిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి చెల్లించే అర్హతను బట్టి లోన్ మొత్తంతో పాటు.. రీపేమెంట్ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కేవలం ఫ్లిప్కార్ట్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా కోకొల్లలుగా అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు వాటిని గురించి కూడా ఆరా తీయవచ్చు. -
త్వరలో కాంగ్రెస్ గూటికి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
-
రెజ్లర్లకు అండగా రైతు సంఘాలు.. భారీగా పోలీసులు మోహరింపు
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అనూహ్యంగా రైతు సంఘాల మద్దతు లభించింది. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో ఆదివారం దేశ రాజధానిలో వేలాదిమంది రైతులు ఆ రెజ్లర్ల నిరసనకు సంఘీభాం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న రైతుల బృందాన్ని టిక్రి సరిహద్దుల వద్దే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించడమే గాక భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేగాదు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్ను పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా భారీగా బలగాలు మోహరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా భారత రెజ్లర్లు తమకు న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేదే లేదని తెగేసి చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా తొలగించి కటకటాల వెనక్కినెట్టే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి భారీగా రైతు సంఘాల నుంచి ఊహించని రీతీలో మద్దతు లభించింది. కాగా, వారంతా కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాలు కావడం గమనార్హం. VIDEO | A group of farmers trying to enter Delhi to join wrestlers' protest at Jantar Mantar stopped by police at Tikri Border. pic.twitter.com/3L8WyKWgQu — Press Trust of India (@PTI_News) May 7, 2023 (చదవండి: పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..అర్థాంతరంగా పెళ్లిని ఆపేసిన వరుడు) -
ఆపరేషన్ ఆకర్షకు స్పీడు పెంచిన తెలంగాణ బీజేపీ
-
పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
-
చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేతలు
-
కుప్పంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కుటుంబాలు
చిత్తూరు: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, రెస్కో డైరెక్టర్ థామస్, మైనారిటీ నేతలు అల్లాభక్షు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్ -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్కు ఘన స్వాగతం పలికారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్ను వీడుతున్నట్లు చెప్పారు. Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV — ANI (@ANI) February 24, 2023 స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్కు మొబెైల్ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
కెఎస్ఆర్ లైవ్ షో : వలసలపై కేసీఆర్ రివర్స్ అటాక్
-
వైఎస్సార్ సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు: టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒంగోలు నగరంలోని మూడో డివిజన్ నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. నగరంలోని 49వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చదవండి: ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్, ఒంగోలు నగర కార్యనిర్వాహక కార్యదర్శి రేల రాజేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ఆధ్వర్యంలో మరికొంతమంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు 3వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి ఎలియాజర్, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ కూడా బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధ ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ సీపీవైపు ఆకర్షితులను చేస్తోందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో ఆయనతో కలిసి పయనిద్దామనే ఆలోచనతో పార్టీలో చేరామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్రెడ్డిని బాలినేని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుండు మధు, పార్టీ నాయకులు ఎందేటి రంగారావు, మహబూబ్బాషా, షేక్ హబీబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్కు షాక్
గాంధీనగర్: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్ సర్కార్ పాలన సాగిస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలో జరగబోయే గుజరాత్ ఎన్నికలపై ఆప్ దృష్టి సారించింది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇప్పటికే అహ్మదాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని గుజరాతీలకు కోరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు గురువారం ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. కేజ్రీవాల్ను కలిసి అనంతరం ఆయన ఆప్లో చేరారు. ఈ సందర్భంగా ఇంద్రనీల్ మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని ప్రశంసించారు. దేశ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అలాగే, బీజేపీకి పోటీగా ఎదగడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. గుజరాత్లో బీజేపీని ఓడించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆప్ సరైన పార్టీ అని అన్నారు. అందుకే తాను ఆప్లో చేరినట్టు స్పష్టం చేశారు. కాగా, 2012లో రాజ్కోట్ ఈస్ట్ నుంచి ఇంద్రనీల్ రాజ్గురు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో రాజ్కోట్ వెస్ట్ నుంచి సీఎం విజయ్ రూపానీపై పోటీ చేసి ఆయన ఓటమిని చవిచూశారు. ఇక, సీనియర్ నేత ఇంద్రనీల్.. ఆప్లో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. इंद्रनिल राजगुरु जी एवं वसरामभाई सागठिया जी का मैं आम आदमी पार्टी में स्वागत करता हूँ। हम सबको मिलकर गुजरात के लोगों की हर उम्मीद को पूरा करना है। pic.twitter.com/JX8TNTfEjF — Arvind Kejriwal (@ArvindKejriwal) April 14, 2022 -
అమ్మాయిల ఐఐఠీవి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి. 2018 నుంచి అదనపు కోటా ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటర్లో రాణిస్తున్నా.. మండి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తిమోతి ఎ.గోన్సాల్వేస్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను కమిటీ లోతుగా విశ్లేషించింది. -
యూపీ కాంగ్రెస్ లీడర్లు.. టీఎంసీలోకి
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ను పక్క రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రధానంగా యూపీలో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీలోకి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జాయిన్ అయ్యారు. యూపీకి చెందిన సోమవారం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలోకి చేరారు. వీరిలో రాజేష్పతి త్రిపాఠి, లలితేష్పతి త్రిపాఠిలు ఉన్నారు. యూపీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీగా రాజేష్పతి త్రిపాఠి పనిచేయగా, లలితేష్పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడిగాను, మాజీ శాసన సభ్యుడిగాను పనిచేశారు.ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. టీఎంసీ విధానాల పట్ల ఆకర్శించబడి.. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరటానికి మక్కువ చూపిస్తున్నారని అన్నారు. ఇక టీఎంసీ తీర్థం పుచ్చుకున్న వారిద్దరూ మాట్లాడుతూ.. బీజేపీని అధికారంలోంచి దింపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే టీఎంసీలో చేరినట్లు తెలిపారు. చదవండి: రాయలసీమకు చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి అనిల్