-
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
చంద్రబాబుకు లెక్కలతో సహా ఇచ్చిపడేసిన మంత్రి రోజా
-
జగనన్న సురక్షతో లబ్ధిదారులు హర్షం
-
జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పవన్ రాజకీయ అజ్ఞాని కావడంతో వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా 57లక్షల మందికి సర్టిఫికెట్లు అందించాం. జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది. 11 రకాల సేవలను లబ్దిదారులకు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఎన్నికలకు ఒంటిరిగా వెళ్లి గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం లేదంటూ కామెంట్స్ చేశారు. ప్రజలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంది కాబట్టే సింగిల్గా బరిలోకి దిగుతాము అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్లో రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఎన్టీఆర్ జిల్లాలో జగనన్న సురక్ష విజయవంతం
-
ప్రజల వద్దకే పాలన తెచ్చిన సీఎం వైఎస్ జగన్ కు ప్రశంసలు
-
రెండున్నర గంటల్లో రేషన్కార్డు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు. గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. -
‘సురక్ష’కు నీరాజనం
‘అన్ని వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ కుల, ఆదాయ, ఫ్యామిలీ.. ఇతరత్రా సర్టిఫికెట్లు పొందాలంటే అంత సులువు కాదన్న విషయం అందరికీ అనుభవమే. విద్యా సంవత్సరం ప్రారంభంలో అయితే మరీ కష్టం. సర్టిఫికెట్లు కొంచెం త్వరగా కావాలనుకుంటే రోజుల తరబడి పనులు మానుకుని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు మీకు ఏవైనా సర్టిఫికెట్లు కావాలా? అని ఇంటి వద్దకే వచ్చి వివరాలు తీసుకెళ్తున్నారు. వారం తిరక్కుండానే సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. జయహో జగనన్న సురక్ష’ అంటూ ఊరూరా ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి నెట్వర్క్ : ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తరఫున వలంటీర్లు ఇంటికే వచ్చి ఏవైనా సమస్యలున్నాయా.. సర్టిఫికెట్లు కావాలా.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. అని అడిగి తెలుసుకోవడం తొలిసారిగా చూస్తున్నామని జనం చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలందించేందుకు జల్లెడ పడుతుండగా మరో పక్క క్యాంపుల ద్వారా అక్కడికక్కడే అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసే కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించి రికార్డు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ పాఠశాలలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సురక్ష శిబిరాల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. వారంలోగా ఫ్యామిలీ సర్టిఫికెట్ను అందించారని విశాఖ జిల్లా వాసి సాసబోయిన దాసు ఆనందంగా చెప్పాడు. ఇంటికే వచ్చి వివరాలు తీసుకుని బర్త్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చారని అనంతపురం జిల్లా వాసి అభిదా సంతోషం వ్యక్తం చేసింది. అత్త, మామల పేర్లను రేషన్ కార్డు నుంచి వేరు చేసి, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చారని పల్నాడు జిల్లాకు చెందిన దుడ్డు ఇందు సంబరపడిపోతూ తెలిపింది. ప్రజల ఇంటికే వచ్చి మీకు ఏ సమస్యలున్నాయని అడుగుతున్న తొలి సర్కారు ఇదేనని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వినతుల పరిష్కారం ► ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు 1,305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే, వాటిలో 4,57,642 అక్కడికక్కడే పరిష్కరించారు. 17వ తేదీ నాటికి 9,721 సచివాలయాల పరిధిలో 53.24 లక్షల వినతులు వస్తే, అందులో 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒక్క రోజే 6.5 లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. ► ఇప్పటిదాకా 1,69,891 మంది వలంటీర్లు జగనన్న సురక్ష శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా, అధికారులు 4,37,509 పరిష్కరించారు. అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా, 62,312 పరిష్కారమయ్యాయి. ► ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 4,154 ఓబీసీ సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ► ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8,263, ఆధార్తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి. ► ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని, జగనన్న ప్రభుత్వంలో ఏ పని అయినా సులభంగా పూర్తవుతోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండీ కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వలంటీర్ను కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను కానీ సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. సర్టిఫికెట్ ఇంటికి తెచ్చిచ్చారు.. నాకు బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం సర్టిఫికెట్ అవసరమైంది. వీటి కోసం గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదు. ఇప్పుడు మా ఇంటికే వలంటీర్ వచ్చి నాకేం కావాలో మరీ అడిగి తెలుసుకున్నాడు. కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే బర్త్ సర్టిఫికెట్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్కు కృతజ్ఞతలు. – అభిదా, కణేకల్లు క్రాస్, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా తొమ్మిదేళ్ల తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫ్యామీలీ మెంబర్ సర్టిఫికెట్ లేకపోవడంతో కుటుంబ ఆస్తుల కోసం తగాదాలు చోటు చేసుకున్నాయి. పోలీస్స్టేషన్కు వెళ్లిన సంఘటనలున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తొమ్మిదేళ్ల క్రితం ఆఫీసుల చుట్టూ తిరిగినా అది ఇక రాదని ఆశ వదులుకున్నాం. ఇక మా కుటుంబం బతుకింతే అనుకున్నాం. కొద్ది రోజుల కిందట మా ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది, వలంటీరుకు మా పరిస్థితి వివరించాం. వివరాలు తీసుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకు సురక్ష క్యాంపులో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందించారు. తొమ్మిదేళ్ల మా ఇబ్బందులకు పరిష్కారం చూపించారు. – సాసబోయిన దాసు, ప్రైవేటు ఉద్యోగి, గెడ్డవీధి, జ్ఞానాపురం, విశాఖ జిల్లా కొత్త రేషన్ కార్డు వచ్చింది మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా తెల్లరేషన్ కార్డులో నేను, నా భర్త సాగర్, మా అత్తమామలు యాకోబు, రాణి, మరిది మధు ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు రేషన్కార్డు డివైడ్ చేయాలని కోరినా ఫలితం లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వారం క్రితం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మా ఇంటికొచ్చారు. సమస్య చెప్పాం. నాకు, నా భర్తకు కలిపి వేరే కార్డు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దుడ్డు ఇందు, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా -
నెలలు టైం పట్టే సర్టిఫికెట్స్ కూడా మేము గంట వ్యవధిలో ఇస్తున్నాం
-
ఆ విషయంలో రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం
-
Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్
సాక్షి, విజయవాడ: జగనన్న సురక్ష సర్వే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి 51.14 లక్షల వినతులకు గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిష్కారం చూపారు. జులై 11న అత్యధికంగా ఒకేరోజు 6.25 లక్షల వినతులను పరిష్కరించడంతో.. ప్రజా వినతుల పరిష్కారంలో ‘జగనన్న సురక్ష’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 17 రోజుల్లోనే 9,721 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి చేశారు. లక్ష 73 వేల క్లస్టర్లలో 84.11 లక్షల ఇళ్లను వలంటీర్లు సందర్శించారు. దీంతో ఏపీ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది. కాగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఏ సంక్షేమ పథకమైనా, ధ్రువపత్రామైనా అందని అర్హులకు అండగా నిలిచే సేవా యజ్ఞాన్ని చేపట్టింది. ‘జగనన్న సురక్ష’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటంతోపాటు జనన, మరణ, కుల, ఆదాయ, సీసీఆర్సీ, రేషన్కార్డు విభజన వంటి 11 రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్ష గ్రామసభల ద్వారా అందిస్తున్నారు. ఫలితంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
-
జగనన్న సురక్షపై పబ్లిక్ రెస్పాన్స్...ఇది కదా పరిపాలన అంటే..
-
ప్రతి గుమ్మంలోకి జగనన్న సురక్ష
-
సురక్ష సూపర్..గంటల వ్యవధిలోనే 11 రకాల సేవలు
-
జగనన్న సురక్ష’ నిర్వహణకు రూ.25 కోట్లు
సాక్షి, అమరావతి: వ్యక్తిగత ప్రజా వినతులను సైతం సంతృప్తస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపుల నిర్వహణ ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవసరం పడే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారు ఒక్కరూ మిగిలి పోకూడదన్న లక్ష్యంగా ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికి సంబంధించిన వినతుల పరిష్కారం కోసం జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణకు గ్రామ సచివాలయానికి రూ.15 వేల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో క్యాంపులు జరిగే వార్డు సచివాలయానికి రూ.25 వేల చొప్పున ఈ నిధులను విడుదల చేశారు. వీటికితోడు అదనంగా ప్రతి జిల్లాకు రూ.మూడు లక్షల చొప్పున కలెక్టర్లుకు విడుదల చేశారు. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
ఉద్యమంలా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం
-
‘సురక్ష’ శిబిరాల్లో 30.98 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాల్లో బుధవారం వరకు విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సహా మొత్తం 30,98,697 వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికీ పథకాలు అందజేసేందుకు జగనన్న సురక్ష పేరుతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల విద్య నుంచి పీహెచ్డీ వంటి వాటివరకు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగే ఈ సమయంలో విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకునే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ శిబిరాల్లో అప్పటికప్పుడే సర్విసు చార్జీలు లేకుండా అందజేస్తున్నారు. జూలై 1న మొదలు పెట్టిన ఈ శిబిరాలు సచివాలయాల వారీగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు.. ఆదివారాలు మినహా 10 రోజులు 6,997 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మొత్తం 34,39,585 సర్విసులకు సంబంధించి అధికారులకు వినతులు అందాయని తెలిపారు. వాటిలో 90 శాతానికిపైగా.. 30.98 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కారించారని పేర్కొన్నారు. వీటిలో హౌస్హోల్డు జాబితాలో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్థులకు ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, కౌలు రైతులకు సీసీఆర్సీల జారీ వంటివి పెద్దసంఖ్యలో ఉన్నట్టు వివరించారు. ఒక్కరోజే.. 5,54,009 వినతుల పరిష్కారం ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,54,009 వినతులను అధికారులు పరిష్కరించారు. బుధవారం 573 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జరిగిన శిబిరాల్లో 2,44,582 మంది వినతులు పరిష్కరించారు. -
జగనన్న సురక్షలో బిజీబిజీగా ఎమ్మెల్యేలు
-
సచివాలయాల వద్దే సమస్యలు పరిష్కారించేలా జగనన్న సురక్ష
-
అభాగ్యులకు అండగా..
సాక్షి, నెట్వర్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమస్యకు పరిష్కారం ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయ్యింది. దీంతో ఆమె పింఛన్ ఆగిపోయింది. ‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్ మెహరున్నీసా, వలంటీర్లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్ను తొలగించారు. ఆ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నిరక్షరాస్యులకు ఎంతో మేలు ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్ ఇతని పేరు శర్మాస్ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డు పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్ ఇంటికి వచ్చినపుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్.. సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా -
ఉద్యమంలా జగనన్న సురక్ష కార్యక్రమం
-
Jagananna Suraksha: దిగులు తీర్చిన సురక్ష
ఏ సర్టిఫికెట్ ఎవరిస్తారో తెలియదు. ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియదు. మనకిక ప్రభుత్వ సాయం అందదులే అనుకుంటున్న వారి ఇంటికి.. వలంటీర్లే వచ్చి ఏ సర్టిఫికెట్లు కావాలి అని అడిగి మరీ సేవలు చేస్తుంటే.. ప్రజల ముఖాల్లో ఆనందం అంతా ఇంతా కాదు. జగనన్న సురక్ష శిబిరాల్లో లబ్ధిదారులు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలును వేనోళ్ల కొనియాడుతున్నారు. కొంతమందికి ఇంటి వద్దే వలంటీర్లు సర్టిఫికెట్లు అందజేస్తుంటే.. ఇలాంటి సర్కార్ను ఎప్పుడూ చూడలేదంటూ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. వేలాది మంది ఇందులో లబ్ధిపొందారు. పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ జగనన్న సురక్షలో అధికారుల నుంచి సదరం సర్టిఫికెట్ అందుకుంటున్న ఈమె పేరు షేక్ మీరాబి. పల్నాడు జిల్లా కారెంపూడి మండలం చినకొదమగుండ్ల గ్రామం. మూడు నెలల క్రితం ఆమె భర్త షేక్ ఖాదర్కు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కుడి కాలు తీసేశారు. గతంలో ఇద్దరు పని చేసుకుంటూ జీవనం సాగించారు. 3 నెలలుగా భర్త మంచానికే పరిమితం కావడంతో పోషణ కష్టమైంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పలువురు మీరాబీకి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వలంటీర్కు చెప్పగా.. వారితో దరఖాస్తు చేయించారు. బుధవారం జరిగిన గ్రామ సభలో సదరం సర్టిఫికెట్ను మీరాబీకి అధికారులు అందించారు. పింఛన్కు కూడా అధికారులు దరఖాస్తు చేయించి మంజూరుకు సిఫార్సు చేశారు. త్వరలో దివ్యాంగుల పింఛన్ వస్తుందని తెలిసి మీరాబీ సంతోషానికి అవధులు లేవు. ఎంతో దిగులుతో ఉన్న తనకు సురక్ష శిబిరాల ద్వారా జగనన్న ఎంతో మేలు చేశారంటూ ఆమె కన్నీళ్లతో సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రం ఈమె పేరు సీసా మచ్చూలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి.గొందూరు గ్రామం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, రెండుమూడు సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి నెలరోజుల తర్వాత ఆ పత్రం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కులధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఒక్కరోజులోనే ఫైసా ఖర్చు లేకుండా అధికారులు పత్రం అందజేశారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించిన జగనన్నకు థ్యాంక్స్ అంటూ ఆనందం వెలిబుచ్చారు. సులువుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, గెద్దానాపల్లికి చెందిన జల్లిగంపల పోలారావు ఉన్నత చదువులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అవసరమైంది. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు అతని ఇంటికి వెళ్లినప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం.. అతని దగ్గర నుంచి సర్టిఫికెట్ కోసం వివరాలు, జిరాక్స్లు తీసుకుని అధికారులకు అందజేశారు. వారు ఆ దరఖాస్తును పరిశీలించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇచ్చారు. -
అప్పటికప్పుడే... 10.86 లక్షల సమస్యలకు పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది. సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి. -
జగనన్న సురక్ష: ఇక రావనుకున్న సర్టిఫికెట్లు వచ్చాయి
ఆమె ఓ మధ్య తరగతి గృహిణి. బొటాబొటిగా ఉండే సంపాదనతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం అందితే తమ కుటుంబానికి భరోసాగా ఉంటుందని విశాఖ జ్ఞానాపురానికి చెందిన సంతోష్కుమారి ఆశ. కానీ ఆమెకు చాలా కాలంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇంక విసుగొచ్చేసింది. దాంతో ఆ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడమే మానేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘జగనన్న సురక్ష’ ద్వారా ఎవరికి ఏం కావాలన్నా ప్రభుత్వం మంజూరు చేస్తుందని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు కోసం తాను పడ్డ కష్టాలు వారికి తెలిపింది. వెంటనే వారు వివరాలు అడిగారు. వివరాలన్నీ ఇచ్చి.. ఇప్పుడు కూడా ఆ ధ్రువీకరణ పత్రాలు రావులే అని భావించింది. అయితే రోజుల వ్యవధిలోనే ఆమెకు ఫోన్ వచ్చింది. ‘రేపు సురక్ష క్యాంపు ఉంది. మీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి తీసుకెళ్లండి’ అని ఆ ఫోన్లో సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మలేకపోయింది. తర్వాత రోజు క్యాంపునకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని మురిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏళ్ల తరబడి లేనిది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తాయని అనుకున్నాను. క్యాంపులో పాల్గొన్నాను. నా పేరు పిలిచి.. నాకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు. విసుగొచ్చేలా తిరిగినా రానివి పైసా ఖర్చు లేకుండా రావడం నిజంగా మాలాంటి వారికి ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి పని ఇంటి తలుపు ముంగిటే జరుగుతుందని అందరూ అంటే.. ఏదో అనుకున్నాను. నాకూ అలా జరగడంతో.. ప్రజలంతా జగనన్నని సీఎంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైంది’’ అని ఆనందం వ్యక్తం చేసింది.