-
Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్టౌన్ పిచ్పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్లో ఓ పేసర్పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్తో పోరులోనూ ఓపెనర్గానే రావాలని ఆకాంక్షించాడు.న్యూయార్క్లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అఫ్గనిస్తాన్తో సూపర్-8 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: -
రోహిత్, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.తానే గనుక కోచ్ అయి ఉంటే ప్రతీ బ్యాటర్.. కచ్చితంగా కొన్ని ఓవర్లపాటైనా బౌలింగ్ చేయాలనే నిబంధన ప్రవేశపెట్టేవాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. 2007 టీ20, 2011 వరల్డ్కప్ ఈవెంట్లలో టీమిండియా ఇలాగే విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తమ వంతు పాత్ర పోషించారని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు జరుగుతున్న తరుణంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనే గనుక టీమిండియా కోచ్ అయితే.. ప్రతి బ్యాటర్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉండాలనే రూల్ పెడతా.ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, విల్ జాక్స్ తదితరులు బౌలింగ్ కూడా చేస్తారు. ఫ్రంట్లైన్ బౌలర్లతో పాటు వాళ్లు కూడా రాణిస్తారు.కానీ మన జట్టు పరిస్థితి అలా కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్యూర్ బ్యాటర్లు అస్సలు బౌలింగ్ చేయరు. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే మన జట్టు వెనుకబడినట్లే.ఈ ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటపుడు తుదిజట్టు కూర్పులో మనకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఫ్రంట్లైన్ బౌలర్లతో పాటు అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా వంటి వారిలో ఒకరు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.వరల్డ్కప్-2024: టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: Babar Azam: దమ్ముంటే వరల్డ్కప్ గెలవండి: బాబర్కు పాక్ మాజీ బ్యాటర్ సవాల్ -
'పూర్తి సీజన్కు అందుబాటులో ఉండే రండి.. లేదంటే వద్దు'
టీ20 వరల్డ్కప్-2024కు సమయం దగ్గరపడుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్-2024 నుంచి వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (ఆర్సీబీ) సామ్ కుర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశానికి పయనమయ్యారు.టీ20 వరల్డ్కప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు మే 22 నుంచి నాలుగు మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ సిరీస్కు ముందు తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 10 రోజుల ముందే స్వదేశానికి రావాలని తమ ఆటగాళ్లను ఈసీబీ ఆదేశించింది. అయితే ప్లే ఆఫ్స్కు ముందు స్టార్ ప్లేయర్లు ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడం ఆ జట్లకు పెద్ద ఎదరుదెబ్బగానే చెప్పుకోవాలి. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ జట్టులో బట్లర్ లేని స్పష్టంగా కన్పించింది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే మే 17న సీఎస్కేతో డూ ఆర్డై మ్యాచ్లో తలపడనుంది. గత కొన్ని మ్యాచ్ల నుంచి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విల్ జాక్స్.. సీఎస్కేతో మ్యాచ్కు దూరం కావడం కచ్చితంగా ఆర్సీబీపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్ పూర్తికాకుండానే మధ్యలోనే వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ‘‘ఉంటే పూర్తి సీజన్కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ ఫైరయ్యాడు. -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్తో అంతకు ముందు మ్యాచ్లోనూ ధోని డారిల్ మిచెల్తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్దీప్ బౌలింగ్లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్లో ధోని ఇలా సింగిల్కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
టీ20 వరల్డ్కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్కు టీ20 వరల్డ్కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్కప్లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్గా, రెగ్యూలర్ వికెట్ కీపర్గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్కప్లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్కు వరల్డ్కప్ను అందించి, తన కెరీర్ను ఘనంగా ముగించిడానికి కార్తీక్కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
RCB: ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్పై ఎన్నో మ్యాచ్లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 32 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
'అతడొక సూపర్ స్టార్.. టీ20 వరల్డ్కప్లో ఆడాల్సిందే'
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై దూబే విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో దూబే అలరించాడు. స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 సిక్స్లు , 2 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దూబే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని పఠాన్ కొనియాడు. "నేనే సెలక్టర్ అయితే శివమ్ దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేస్తాను. అతడికి అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్పిన్నర్లను చీల్చి చెండాడతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే స్పిన్నర్లను ఎటాక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో కాకుండా గత ఏడాది సీజన్లో కూడా దూబే స్పిన్నర్లకు అద్బుతంగా ఆడాడు. అటువంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఎంపికచేయరు? అతడి ఆటను సెలక్టర్లు చూస్తున్నరని నేను భావిస్తున్నాను. కాబట్టి టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు ఇవ్వండి. దూబే స్పిన్నర్లను మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్లకు కూడా అద్బుతంగా ఆడుతాడు. అతడు ముంబై నుండి వచ్చాడని మర్చిపోవద్దు. ముంబైలో పిచ్లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. కాబట్టి అతడు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడని" స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్కప్కు భారత జట్టు ఇదే!.. ఎవరూ ఊహించని ప్లేయర్కు ఛాన్స్!?
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్లకు అవకాశమిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్గా మొహ్సిన్ ఖాన్ను తన జట్టులోకి తీసుకున్నాడు. పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్ -
IPL 2024: ఆర్సీబీ, సన్రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్కు చేరే జట్లు ఇవే?
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగైన ఐపీఎల్ 2024 సీజన్కు మరో రెండు గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు చేరే నాలుగు జట్లను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్తో పాటు కోల్కతా నైట్రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు. "ప్రస్తుత జట్ల బలాలు, బలహీనతలను చూస్తే ఆ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్కు చేరే అవకాశముంది. అందులో మొదటిది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చాలా బలంగా కన్పిస్తోంది. ఆ తర్వాత రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కేకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికి ఆ జట్టు మాత్రం ఎలాగైనా ముందుడగు వేస్తోంది. డెవాన్ కాన్వే గాయం కారణంగా దూరమయ్యాడు. దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చాడు. ఏదమైనప్పటికి ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది. ఎంఎస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ తన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తాడు. ఇక మూడో జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ సారి లక్నో కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. రాహుల్ గాయం నుంచి కోలుకుని రావడం ఆ జట్టుకు కలిసిస్తోంది. చివరగా నాలుగో జట్టుగా కేకేఆర్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. కేకేఆర్లో కూడా రస్సెల్, మంచి పవర్ హిట్టర్లు ఉన్నారని" స్టార్స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇర్ఫాన్ తన ఎంచుకున్న జట్లలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పేర్లు లేకపోవడం గమనార్హం. -
'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టుకు ఐపీఎల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ సారి కప్ మనదే అంటూ సందడి చేస్తూంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024కు సమయం ఆసన్నం కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలుస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని రకాల అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయని పఠాన్ తెలిపాడు. "ఈ ఏడాది ఆర్సీబీ అద్భుతమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పరంగా బెంగళూరు పటిష్టంగా ఉంది. జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ ఆఖరివరకు బలంగా ఉంది. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అంత పటిష్టంగా లేదు. అయితే బౌలింగ్ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆర్సీబీని టైటిల్ ఫేవరేట్గా ఎంచుకోరు. కానీ ఈసారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కన్పిస్తోంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్లపై ఎక్స్ప్రెస్ పేస్తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నాని" స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
హార్దిక్కు రూల్స్ వర్తించవా.. పాపం ఇషాన్, శ్రేయస్: మండిపడ్డ ఇర్ఫాన్
వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడించాలి కదా? జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. కాగా గతేడాది వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగేందుకు జిమ్లో చెమటోడుస్తున్నాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this… — Irfan Pathan (@IrfanPathan) February 29, 2024 -
అచ్చం దాదా మాదిరే.. మరో గంగూలీ అవుతాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. యశస్వి బ్యాటింగ్ తీరు చూస్తే తనకు సౌరవ్ గంగూలీ గుర్తుకువస్తాడని తెలిపాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ ఆడటంలో ఈ ముంబై బ్యాటర్ దిట్ట అంటూ కొనియాడాడు. కాగా వెస్టిండీస్ గడ్డపై శతకంతో అంతర్జాతీయ క్రికెట్ను మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఇటీవలే తొలి డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా వైజాగ్లో జరిగిన రెండో మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తదుపరి రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు యశస్వి జైస్వాల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో యశస్వి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సిరీస్లో నేను ఎవరి ఆట కోసమైనా ఎదురుచూస్తున్నానంటే అది యశస్వి జైస్వాల్ మాత్రమే! ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడో మనమంతా చూశాం. అత్యద్భుతమైన ఆటగాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ గేమ్ చితక్కొడతాడు. నిజానికి తనను ఆఫ్ సైడ్ రారాజు అని పిలవొచ్చు. ఒకవేళ వచ్చే పదేళ్ల పాటు అతడు జట్టులో కొనసాగితే.. తప్పకుండా దాదా మాదిరే ప్రభావం చూపగలడు. మనం ఇప్పుడు దాదా గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే యశస్వి గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో యశస్వి మరోసారి నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులాడి 637 పరుగులు, 17 టీ20లలో 502 పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియా మొదటి ప్రాధాన్య ఓపెనర్గా.. కెప్టెన్ రోహిత్ శర్మ జోడీగా కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్రైజర్స్ కెప్టెన్గా అతడే! -
సచిన్, యువరాజ్ మెరుపులు.. సిక్సర్తో గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్
సచిన్ టెండూల్కర్తో పాటు భారత్, ఇతర దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' కప్లో వీరంతా రెండు టీమ్లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించబడే డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్ వారు నిరుపేదల కోసం వినియోగిస్తారు. Sachin Ramesh Tendulkar is Back Guys 🔥🐐pic.twitter.com/170aFmQQ9Q — Arun Vijay (@AVinthehousee) January 18, 2024 ఐక్యత యొక్క శక్తిని, మానవత్వం యొక్క బలాన్ని, సామాజిక బాధ్యత యొక్క భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. Sachin Tendulkar rolling his arms after a long time and got a wicket.pic.twitter.com/4WiqVlCsZu— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ కెప్టెన్సీలోని వన్ వరల్డ్, యువరాజ్ సింగ్ నాయకత్వంలోని వన్ ఫ్యామిలీ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. Watching Sachin Tendulkar play live for the first time and he has taken a wicket in his 2nd over. 🐐 - 50 years old, he still got it. #OWOFCup pic.twitter.com/MWSglJHdqO — Johns. (@CricCrazyJohns) January 18, 2024 ఇంగ్లండ్ ఆటగాడు డారెన్ మ్యాడీ (51) అర్ధసెంచరీతో రాణించగా.. లంక మాజీ వికెట్కీపర్ కలువితరణ 22, టీమిండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ సింగ్ 23 పరుగులు చేశారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అన్న బౌలింగ్లో సిక్సర్ కొట్టి గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్ 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్ వరల్డ్.. అల్విరో పీటర్సన్ (74), సచిన్ టెండూల్కర్ (27), నమన్ ఓఝా (25), ఉపుల్ తరంగ (29) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. యూసఫ్ పఠాన్ బౌలింగ్లో అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. One World needed 3 in 2 balls: Irfan Pathan smashed a six against Yusuf Pathan, after that Irfan hugged Yusuf. pic.twitter.com/1QPPfcVkNG — Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 వన్ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్, యువరాజ్ సింగ్, జేసన్ క్రేజా తలో వికెట్ దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత క్రికెట్ దిగ్గజాలు బరిలోకి దిగడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన పోస్ట్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Sachin's Team Won the match 💙💥 pic.twitter.com/T4cRvUmMsO — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 18, 2024 -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హవెలాక్తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్
South Africa vs India, 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయాలని సూచించాడు. జడ్డూ గనుక ఫిట్గా ఉంటే కేప్టౌన్ మ్యాచ్లో అతడిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ విషయంలో పునరాలోచన చేయాలని పఠాన్ సూచించాడు. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్ను డ్రా చేసుకోవాలంటే రెండో మ్యాచ్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్లోనూ గనుక ఓడితే.. మరోసారి సఫారీ గడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పదు. అందుకే.. గత మ్యాచ్ తాలుకు తప్పిదాలు పునరావృతం కాకుండా.. లోపాలు సరిచేసుకుని బరిలోకి దిగేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. జడ్డూ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధిస్తే అతడిని కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్లో అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ.. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో రాణించగల జడేజా సేవలను ఇండియా కోల్పోయింది. కాబట్టి అతడు జట్టులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ దళం విషయంలో రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్ను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రసిద్ కృష్ణను ఆడిస్తే.. అయితే, నెట్స్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ బాగానే అనిపిస్తే.. అతడి విషయంలో ధీమా ఉంటే రెండో టెస్టులోనూ ఆడించవచ్చు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. సెంచూరియన్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇరవై ఓవర్ల బౌలింగ్లో మొత్తంగా 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీయగలిగాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! -
Ind vs SA: ఇద్దరు పెద్దన్నలు.. రెండు టెస్టులు గెలిస్తే చాలు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో సారథిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే అరుదైన అవకాశం ముంగిట హిట్మ్యాన్ నిలిచాడని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఓపెనర్గా, కెప్టెన్గా రాణిస్తే గొప్ప నాయకుడిగా నీరజనాలు అందుకుంటాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బాక్సింగ్ డే టెస్టుతో పునరాగమనం చేయనున్నాడు. ఇక సఫారీ గడ్డపై ఇంత వరకు టీమిండియా కెప్టెన్లు ఎవరూ కూడా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. మేటి టెస్టు సారథిగా పేరొందిన విరాట్ కోహ్లికి కూడా సంప్రదాయ క్రికెట్లో ప్రొటిస్ జట్టు పైచేయి సాధించడం సాధ్యం కాలేదు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన తర్వాత 2021-22 టూర్లో కోహ్లి సారథ్యంలో భారత్ ఆరంభ టెస్టు గెలిచి ఆశలు రేకెత్తించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి అనూహ్యంగా టెస్టు సారథ్యానికి గుడ్బై చెప్పడంతో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. 2-1తో మరోసారి సౌతాఫ్రికాకు ట్రోఫీని సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టూర్ రోహిత్ శర్మకు సవాలుగా నిలవడంతో పాటు తనను తాను నిరూపించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఈ విషయం గురించి ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ గనుక సౌతాఫ్రికా గడ్డపై సఫారీలను చిత్తు చేయగలిగితే.. భారత క్రికెట్ కెప్టెన్ల జాబితాలో శిఖరాగ్రాన నిలిచే అవకాశం ఉంటుంది. సారథిగా రెండంటే.. రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు అతడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. ఓపెనర్గా, కెప్టెన్గా రోహిత్ రాణిస్తే ఇదేమీ అసాధ్యం కాదు. కొత్తబంతిపై షైనింగ్ పోయేంత వరకు హిట్మ్యాన్ క్రీజులో ఉంటే.. మిగతా బ్యాటర్ల పని సులువవుతుంది. ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ అద్భుతంగా ఆడాడు. అదే ప్యాషన్తో సౌతాఫ్రికాలో ఆడితే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలడు. టీమిండియాకు ప్రస్తుతం ఇద్దరు పెద్దన్నలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉన్నారు. వారి ప్రదర్శనపైనే సిరీస్ గెలుస్తామా లేదా అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. -
రోహిత్ శర్మ ఇకపై టెస్టు కెప్టెన్ మాత్రమే!
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉండటం పట్ల తనకు సదభిప్రాయం లేదని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అయినా.. భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేమన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో జట్ల ఎంపిక విధానం చూస్తే.. రోహిత్ శర్మను ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిస్థాయి కెప్టెన్గా చూసే అవకాశం లేదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. అతడు కేవలం టెస్టులకు పరిమితం అవుతాడని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టూర్లో భాగంగా.. టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. టీ20 పగ్గాలను సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్కు అప్పగించింది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ పూర్తిగా దూరం కానున్నాడనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ టీమిండియా కెప్టెన్లు మారుతూ (తాత్కాలికంగా)ఉండటంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘భవిష్యత్తులో ఈ సంప్రదాయం కొనసాగే అవకాశం ఉంది. అయితే, నాకు ఇలాంటి పరిణామం పెద్దగా ఇష్టం లేదు. భారత జట్టుకు ఒక్కో ఫార్మాట్లో ఒక్కో కెప్టెన్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పని ఒత్తిడి భారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందుకే సౌతాఫ్రికా పర్యటనకు మూడు వేర్వేరు జట్లు, ముగ్గురు కెప్టెన్లను నియమించారు. దీనిని బట్టి రోహిత్ శర్మ ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో కనిపించడని స్పష్టమైంది. అతడిని టెస్టు జట్టు కెప్టెన్గా మాత్రమే చూడగలం. భవిష్యత్తులో ఇది వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి సంప్రదాయం మన జట్టులో కొనసాగకూడదనే అనుకుంటున్నా’’ అని జియో సినిమా షోలో ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వేర్వేరు కెప్టెన్లు, వేర్వేరు కోచ్లు ఉండటం దీర్ఘకాలంలో పెద్దగా ప్రయోజనాలు చేకూర్చదని అభిప్రాయపడ్డాడు. -
ఇర్ఫాన్తో ప్రేమ.. గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు
Payal Ghosh Viral Comments On Irfan Pathan- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్లను ఉద్దేశించి నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇర్ఫాన్తో తను ప్రేమలో ఉన్నపుడు.. గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండేవాడంటూ క్రీడావర్గాల్లో హాట్టాపిక్గా మారారు. ఊసరవెళ్లి వంటి బడా సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన కలకత్తా బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తర్వాత తెలుగులో జూ. ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’ వంటి పలు చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు ఈ బెంగాలీ నటి. తర్వాత బాలీవుడ్లోనూ అడుగుపెట్టారు. అయితే, సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నామె. బాలీవుడ్ దర్శకుడిపై ఆరోపణలు గతంలో.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన ఆమె.. అప్పట్లో ఓ సూసైడ్ నోట్ షేర్ చేసి తన అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచుగా మాట్లాడే పాయల్ ఘోష్.. వన్డే ప్రపంచకప్-2023 నుంచి క్రికెటర్ల గురించి తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. షమీ ‘ఇంగ్లిష్’ గురించి సెటైర్లు భారత్ వేదికగా వరల్డ్కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గురించి పాయల్ అప్పట్లో ఎక్స్లో ట్వీట్ చేశారు. మ్యాచ్ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ‘‘షమీ నువ్వు నీ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని పాయల్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇర్ఫాన్తో ప్రేమలో ఉన్నపుడు గంభీర్ అలా దీంతో షమీ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మాజీ క్రికెటర్ స్టార్లను ఉద్దేశిస్తూ పాయల్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ‘‘గౌతం గంభీర్ గారు నాకు తరచూ మిస్డ్కాల్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇర్ఫాన్ పఠాన్కు బాగా తెలుసు. ఎందుకంటే అతడు నా ఫోన్ కాల్స్ మొత్తం చెక్ చేసేవాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఉన్నపుడే ఈ విషయాన్ని యూసఫ్ భాయ్(ఇర్ఫాన్ అన్న), హార్దిక్, కృనాల్ పాండ్యా సమక్షంలో అతడే స్వయంగా నాకు చెప్పాడు. పుణెలో బరోడా జట్టు దేశవాళీ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇర్ఫాన్ను కలవడానికి వెళ్లినపుడు.. అతడు నా ఫోన్ చెక్ చేసినట్లు తెలిపాడు. ఇర్ఫాన్ని తప్ప ఎవరినీ ప్రేమించలేదు అయితే, మా బ్రేకప్ జరిగిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడే.. ఇర్ఫాన్ తర్వాత నేనెవరినీ ప్రేమించలేదు’’ అని పాయల్ ఘోష్ శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్తో దిగిన సెల్ఫీని ఆమె షేర్ చేశారు. అటెన్షన్ సీకర్ అంటూ ట్రోల్స్ కాగా పాయల్ వ్యాఖ్యలపై అటు ఇర్ఫాన్ పఠాన్ గానీ.. ఇటు గంభీర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, వారి అభిమానులు మాత్రం.. ‘‘కేవలం వార్తల్లో నిలవడానికి మాత్రమే.. అందరి చూపును తన వైపునకు తిప్పుకొనేందుకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్ ఘోష్ జూ.ఎన్టీఆర్, అతడి అభిమానులను.. దక్షిణాది ప్రేక్షకులను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. చదవండి: తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్ ప్రశంసలు Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha… — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 After we broke up … I fell ill .. I couldn’t work for years… but he was the only guy whom I loved… after that I never loved anybody 🥲 pic.twitter.com/vKRYWJl0Ti — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 -
విరుచుకుపడిన ఇర్ఫాన్ పఠాన్.. 19 బంతుల్లోనే 9 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ మెరుపులతో ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా క్యాపిటల్స్, గత సీజన్ రన్నరప్ భిల్వారా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు సుడిగాలి ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. రాణించిన గంభీర్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. గౌతమ్ గంభీర్ (35 బంతుల్లో 63; 8 ఫోర్లు, సిక్స్), కిర్క్ ఎడ్వర్డ్స్ (31 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ డంక్ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), థీరన్ (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో హషీమ్ ఆమ్లా (3), రికార్డో పావెల్ (0) లాంటి స్టార్లు విఫలమయ్యారు. భిల్వారా బౌలర్లలో అనురీత్ సింగ్ 4, రాహుల్ శర్మ 2, జెసల్ కారియా, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ చెడుగుడు.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భిల్వారా కింగ్స్.. సోలొమోన్ మైర్ (40 బంతుల్లో 70; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 65 నాటౌట్; ఫోర్, 9 సిక్సర్లు) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో 19.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. కింగ్స్ ఇన్నింగ్స్లో రాబిన్ బిస్త్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), యూసఫ్ పఠాన్్ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), క్రిస్టఫర్ బామ్వెల్ (12 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2, రస్టీ థీరన్ 2, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భిల్వారా కింగ్స్ గత ఎడిషన్ ఫైనల్లో క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. -
ఇర్ఫాన్ పఠాన్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
WC 2023: వంద శాతం ఫిట్గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే!
ICC ODI WC 2023 Eng Vs Afg: వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అనుకున్న రీతిలో రాణించలేకపోతోంది. ఆరంభ మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన బట్లర్ బృందం.. తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించి గాడిలో పడ్డట్లు కనిపించింది. కానీ.. మూడో మ్యాచ్కు వచ్చేసరికి కథ తలకిందులైంది. తమ వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ ముందు తలవంచింది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా సమిష్టి వైఫల్యంతో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ టీమిండియా, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న వేళ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్లలో రెండు ఓడి పరాభవం మూటగట్టుకుంది. అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది కాగా ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ 2019 వరల్డ్కప్ హీరో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. వంద శాతం ఫిట్గా లేకున్నా సరే ‘‘బెన్ స్టోక్స్ 99 శాతం ఫిట్గా ఉన్నా సరే అతడిని తుదిజట్టులోకి తీసుకోండి. మీకు అతడి అవసరం ఎంతగానో ఉంది. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే కదా వెనక్కి పిలిపించారు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తదుపరి మ్యాచ్ ఓడిపోతే.. తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. గతంలో జరిగినట్లే ప్రతిసారి జరుగుతుందని అనుకోవడం పొరపాటే అవుతుంది’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ప్రతిసారీ అలాగే జరుగదు అదే విధంగా... ‘‘2019 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్తో పాటు మరో జట్టుతో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని ఏకంగా చాంపియన్గా అవతరించింది. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదు కదా!’’ అంటూ ఇంగ్లండ్ తమ లోపాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఇర్ఫాన్ పఠాన్ నొక్కివక్కాణించాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీ ఆడాలన్న మేనేజ్మెంట్ విజ్ఞప్తి మేరకు ఆల్రౌండర్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, గాయం కారణంగా అతడు తొలి మూడు మ్యాచ్లకూ అందుబాటులో ఉండలేకపోయాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్ ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? View this post on Instagram A post shared by ICC (@icc) -
కోలీవుడ్ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్లో క్రికెట్కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
హార్దిక్ స్వార్థం! దారుణంగా ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్.. ట్వీట్ వైరల్
West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్తో మూడో టీ20లో టీమిండియా విజయం నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. పరోక్షంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే పఠాన్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశాడంటూ అభిమానులు చర్చించుకున్నాడు. పనిలో పనిగా.. ఓవరాక్షన్ పాండ్యాకు మంచి కౌంటర్ ఇచ్చావంటూ ఇర్ఫాన్ పఠాన్ను ప్రశంసిస్తున్నారు. పరాజయాల నుంచి తేరుకుని విండీస్ పర్యటనలో భాగంగా హార్దిక్ సేనకు తొలి రెండు టీ20లలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రినిడాడ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడిన టీమిండియా.. గయనా మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అదే వేదికపై జరిగిన కీలక మ్యాచ్లో మాత్రం సత్తా చాటింది. ఐదు మ్యాచ్ల సిరీస్ గెలుపు ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాండ్యా బృందం 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. కరేబియన్లను 159 పరుగులకు కట్టడి చేసింది. సూర్య, తిలక్ కష్టపడి.. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. శుబ్మన్ గిల్(6) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(83) జట్టును ఆదుకునే బాధ్యతనెత్తికెత్తుకున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మ(49- నాటౌట్) అద్బుతంగా ఆడుతూ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి విజయానికి చేరువ చేయగా.. సూర్య అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(20- నాటౌట్) సిక్సర్ బాది లాంఛనం పూర్తి చేశాడు. పాపం తిలక్ వర్మ.. అయితే, అప్పటికి తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు. ఇంకా పదమూడు బంతులు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకు అండగా నిలిచి.. క్లిష్ట సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తిలక్కు హార్దిక్ స్టైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఈ హైదరాబాదీ స్టార్ కెరీర్ ఆరంభంలోనే వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన బ్యాటర్గా నిలిచేవాడు. కానీ.. హార్దిక్ ఇలా మ్యాచ్ పూర్తి చేయడం అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లకు కూడా రుచించలేదు. టీమిండియా అభిమానులైతే.. ‘‘ఇంత స్వార్థం పనికిరాదు. కోహ్లి విషయంలో ధోని ఏం చేశాడో గుర్తుందా?’’ అంటూ సోషల్ మీడియాలో పాండ్యాను ఏకిపారేస్తున్నారు. మీరు కష్టపడండి.. నేను మాత్రం ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘కష్టంగా ఉన్న పని మీరు చేయండి.. సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా. ఇలాంటివి వినీ వినీ..’’ అంటూ తన వ్యాఖ్యలను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో.. ఇర్ఫాన్.. హార్దిక్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సిరీస్ ఆరంభం నుంచి కెప్టెన్గా ఓవరాక్షన్ చేస్తున్న పాండ్యా.. ఇప్పుడిలా స్వార్థంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..! Mushkil kaam aap karo, Asaan kaam mein Kar leta hoo. Suna suna Sa lagta hai… — Irfan Pathan (@IrfanPathan) August 9, 2023