Iran deal
-
ఇరాన్పై అమెరికా అసహనం
వాషింగ్టన్ : ఇరాన్ పాలన, విధానాలపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇరాన్ అవలంభించే దూకుడు విధానాలు మధ్య ప్రాచ్య దేశాల్లో అస్థిరత సృష్టించేలా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా పాలసీ ప్లానింగ్ అధికారి బ్రెయిన్ హుక్.. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఇరాన్ విధానాల వల్ల మధ్య ప్రాచ్య దేశాల్లో శాంతి, భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఒప్పందం(చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా, జర్మనీ, ఈయూల మధ్య ఉన్న అణు ఒప్పందం)లోని అన్ని నియమాలను తాము పాటిస్తున్నామని, అదే విధంగా ఇరాన్ కూడా జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అన్యాయంగా అదుపులోకి తీసుకున్న అమెరికా పౌరులను ఇరాన్ విడుదల చేయాలని, అందుకు అవసరమైర చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. మాకు దేశ భద్రతే ముఖ్యం... విమానయాన లైసెన్సులకు సంబంధించి ఇరానీయులపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా హుక్ చెప్పారు. ‘మధ్య ప్రాచ్య దేశాల్లో తీవ్రవాదులు, ఆయుధాల కోసం ఇరాన్ వారి ఎయిర్లైన్స్ను ఉపయోగించుకోవచ్చు అంతేకానీ మా దేశ భద్రతను పణంగా పెట్టి వారికి లైసెన్సులు మాత్రం జారీ చేయలేము’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పౌర విమానయాన విధానాల్లో సంస్కరణల కోసం, ఆర్థికంగా బలపడటానికి తమ వంతు సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాల గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా పార్లమెంట్లో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారని హుక్ తెలిపారు. -
ట్రంప్కు సీఐఏ డైరెక్టర్ వార్నింగ్
వాషింగ్టన్: ఇరాన్తో అణు ఒప్పందం విషయంలో అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో గతంలో ఉన్న అణుఒప్పందాన్ని రద్దు చేస్తామని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఓ బహిరంగ సమావేశంలో చెప్పారు. దీనిని ఉద్దేశిస్తూ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ మాట్లాడుతూ అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఇరాన్ కచ్చితంగా అంతర్గతంగా అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచుకుంటుందని, అదే బాటలో మరిన్ని దేశాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. పొరుగు దేశాలతో, వాటికి జరిగే నష్టాలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన తీరుగా వ్యవహరించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. సాధారణంగా సీఐఏ డైరెక్టర్ ఇలాంటి హెచ్చరికలు చేయరు. కానీ, ఇరాన్ తో అణు ఒప్పందమనేది చాలా చెత్త ఒప్పందం అని అభివర్ణించిన విషయం తెలిసిందే. -
సెన్సెక్స్ కు జోష్, 388 పాయింట్ల లాభం!
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పతనం, ఇరాన్ తో అగ్రరాజ్యాల ఒప్పంద అంశాలు స్టాక్ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి. దాంతో ప్రధాన సూచీ 388 పాయింట్లతో లాభపడటం కాకుండా మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికింది. సెన్సెక్స్ పెరుగుదలకు కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియాల్టీ, కంపెనీల షేర్లు దోహద పడ్డాయి. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 6115 వద్ద క్లోజైంది. ఐసీఐసీఐ బ్యాంక్, భెల్ అత్యధికంగా 5 శాతం లాభపడగా, బీపీసీఎల్, కొటాక్ మహేంద్ర, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిండాల్కో, లుపిన్ లు స్వల్పంగా నష్టపోయాయి. బ్యాంకులు, ఎగుమతుదారులు అమెరికా డాలర్ ను అమ్మకాలు జరపడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజి వద్ద ఆరంభంలోనే రూపాయి 31 పైసలు బలపడింది. వివాదస్పద న్యూక్లియర్ కార్యక్రమంపై ఇరాన్, అగ్రరాజ్యాల మధ్య ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ కు వ్యతిరేకంగా యూరో బలపడటం రూపాయి బలపడటానికి కారణం అని ఫారెక్స్ డీలర్స్ తెలిపారు. ప్రస్తుతం 37 పైసల లాభంతో 62.50 వద్ద ముగిసింది.