-
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్కు వెల్కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్లతో పాటు ఇతర డివైజ్లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్లో ప్లస్ మెంబర్షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. -
ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్: ఫ్లిప్కార్ట్ యాపిల్ డేస్ సేల్ అదిరే ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ డేస్ సేల్ను ప్రకటించింది. ఈ సేలో ఇండియాలో లభ్యమవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ఉన్నాయి. ఐఫోన్ కొనాలనుకునే కస్టమర్లు ఫ్లిప్కార్ట్లో నవంబర్ 20 వరకు తగ్గింపులు, ఆఫర్లను పొందవచ్చు ఐఫోన్ 13 రూ.69,900కి లభించే ఐఫోన్ 13ని యాపిల్ డేస్ సేల్లో రూ.64,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ల ద్వారా ఫోన్ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1,500 వరకు తగ్గింపు. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఐఫోన్పై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. 256జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లను రూ.74,999 రూ.94,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీ ఐఫోన్ 12 మినీ ఫ్లిప్కార్ట్లో రూ. 38,999కి లిస్ట్ చేసింది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను వరుసగా రూ.43,999 రూ.53,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 రూ. 79,900ల ఐఫోన్ను ఈ సేల్లో రూ.74,900కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుచేసిన వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభ్యం. ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి తగ్గింపు ఉండదు. బ్యాంక్ ఆఫర్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్తో కలిసి దీనిపై రూ. 20వేల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. -
యాపిల్కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు. హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
అయ్యో! టిమ్ కుక్..ఇక ఆ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్హ్యాండ్ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్ చెక్ చెప్పింది. రిఫర్బిష్డ్ ఐఫోన్లను దిగుమతి చేసుకుని భారత్లో అమ్మేందుకు మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో భారత ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు ఇ-వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన ఆందోళనల కారణంగా సెకండ్హ్యాండ్ ఐఫోన్ల దిగుమతికి ఆపిల్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో ఇలాంటి ఐఫోన్లను విక్రయించే ప్రణాళికలను ఆపిల్ రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. (Tata Group: ఐఫోన్ లవర్స్కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!) భారత్లో ఆపిల్ స్టోర్లు, సెకండ్హ్యాండ్ ఐఫోన్ల దిగుమతి విక్రయాల ద్వారా వినియోగదారులకు మరింత చేరువకావడంతోపాటు, ఇక్కడి అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్లో విస్తరించాలనేది ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రణాళిక. ఈ క్రమంలో ఆపిల్ గత కొన్నేళ్లుగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను దిగుమతి,విక్రయాల అనుమతిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకే 'ప్రీ-ఓన్డ్, సర్టిఫైడ్ ఫోన్ల విక్రయం ద్వారా మార్కెట్ వాటాను విస్తరించుకునేందుక ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కథ ముగిసినట్టు తెలుస్తోంది. కానీ భారతదేశంలో స్థానిక తయారీపై ప్రదానంగా దృష్టి పెడుతోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై ఆపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ( Google Pixel 6a: ఫ్లిప్కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్పై భారీ తగ్గింపు) సెకండ్ హ్యాండ్ పరికరాల దిగుమతికి ఆపిల్ను అనుమతించడం అంటే ఇతర కంపెనీలు ఉపయోగించిన ఫోన్లను భారతదేశంలోకి డంపింగ్కు , తద్వారా భారీ ఇ-వ్యర్థాలకు దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తది అయినా, పాతదయినా ఐఫోన్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో పాత ఫోన్ విక్రయాలతో తన మార్కెట్ వాటాను విస్తరించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుందని ఐడీసీ ప్రతినిధి నవకేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో స్థానికంగా గ్లోబల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ భాగస్వామ్యంతో ఐఫోన్లను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాటా టాటా గ్రూపు విస్ట్రాన్తో చర్చలు జరపుతోంది. పరిశోధనా సంస్థ టెక్ఆర్క్ ప్రకారం, 2022లో దేశంలో దాదాపు 7 మిలియన్ల ఐఫోన్లు విక్రయించనుందని అంచనా. -
ఐఫోన్14 అలా వచ్చిందో లేదో...ఐఫోన్15 సిరీస్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్14 అలా లాంచ్ అయిందోలేదో అప్పుడే రానున్న ఐఫోన్ సిరీస్పై ఊహాగానాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్లో భారీ మార్పులే చేయనుందట. ప్రస్తుతం ఐఫోన్ 14పై మోడల్స్ ఫీచర్స్ మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ ఈసారి భారీ అప్డేట్స్తో నెక్ట్స్ సిరీస్ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తాజా అంచనాల ప్రకారం ఐఫోన్-15 సిరీస్లో ప్రో, ప్రో మాక్స్ వేరియంట్ మధ్య భారీ మార్పులే తీసుకురానుంది.ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో అందించని ప్రత్యేక ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్లో జోడించనుంది. కాగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరించింది. ఐఫోన్-14 సిరీస్లో ప్రో, నాన్-ప్రో మోడల్స్ ఫీచర్స్ అప్డేట్ చేసినా, కానీ, రెండు ప్రో మోడల్స్ మధ్య బ్యాటరీ, స్క్రీన్ తప్ప మిగతా ఫీచర్స్లో పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ యూజర్లు భారీ నిరాశ చెందారు. ముఖ్యంగా ఆపిల్ వ్యవస్థపాకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఇన్స్టా స్టోరీ కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 చదవండి:ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది? (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 (1/2) I think Apple should name A16 as A16 Pro and A15 used by two iPhone 14 standard models as A16/A15 Plus. Maybe it helps promote two iPhone 14 standard models. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 -
ఐఫోన్ లవర్స్కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ లవర్స్కు ఆనందాన్నిచ్చే వార్త ఒకటి మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఫోన్ల తయారీకి, అలాగే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక జాయింట్ వెంచర్ను స్థాపించేందుకు టాటాగ్రూప్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆపిల్కు తైవాన్ సరఫరాదారుతో టాటా చర్చలు జరుపు తోందని తెలుస్తోంది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ దిగ్గజం టాటాగ్రూపు ఆపిల్ సంస్థకు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇదే వాస్తవమైతే ప్రొడక్ట్ డెవలప్మెంట్, సప్లయ్ చైన్ అండ్ అసెంబుల్ దిగ్గజం విస్ట్రన్తో టాటా గ్రూప్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఫలితంగా ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా నిలవనుంది. దీంతో విలాసవంతమైన ఐఫోన్లు, సరసమైన ధరల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్స్, హైటెక్ మాన్యు ఫాక్చరింగ్పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు ఇటీవల టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత బలాన్ని ఇస్తున్నాయి భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికాలాంటివి దృష్టిపెట్టనున్నాయి. అలాగే దేశంలో అసెంబ్లింగ్ సంస్థల ఏర్పాటుకు ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్కు కూడా ఇది తోడ్పడనుంది. అయితే ఈ వార్తలపై విస్ట్రన్ ప్రతినిధి గానీ, టాటా గ్రూపునుంచి గానీ, ఆపిల్ నుంచిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
ఐఫోన్ లవర్స్కు బంపర్ ఆఫర్: 10వేల దాకా తగ్గింపు
సాక్షి, ముంబై: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్. తాజా ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఆపిల్ ఐఫోన్ 12 మినీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. జూలై ఒకటినుంచి ప్రారంభమైన ఈ సేల్ మరో రెండు రోజులు మాత్రమే కొనసాగుతుంది. ప్రధానంగా ఐఫోన్లపై బెస్ట్ డీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 మిని ఈ ఏడాదికి రాదనే అంచనాల మధ్య తాజా తగ్గింపు ధరలపై మరింత ఆసక్తి నెలకొంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో వినియోగదారులు ఐఫోన్ 12 మినీ రూ.49,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900 అంటూ 6 శాతం తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్ 12 మిని : 5.4 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ14 బయోపనిక్ సాక్, 12 ఎంపీ డ్యూయల్ కెమెరా ప్రధాన ఫీచర్లు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ 12,500 వరకు ఎక్స్చేంజ్ డీల్. ఐఫోన్ 13 మిని : 128 జీబీ స్టోరేజ్ మోడల్పై 7 శాతం తగ్గింపుతో దాదాపు 65,299లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. గతంలో వెబ్సైట్లో దీని ధర రూ. రూ. 69,999. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా అదనపు 5 శాతం క్యాష్బ్యాక్తో పాటు 6 నెలల ఫ్రీ గానా ప్లస్ సబ్స్క్రిప్షన్ను పొందొచ్చు. నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ఆఫర్తో 12,500 తగ్గుతుంది. ఈ ఆఫర్లనీ అమలైతే ఐఫోన్ 13 మిని సుమారు 55 వేలకు సొంతం చేసుకోవచ్చు. -
యాపిల్ ఐఫోన్లకు కొత్త ఐవోఎస్16: ముఖ్య ఫీచర్స్ ఇవే!
క్యుపర్టినో (అమెరికా): టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్వేర్కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. త్వరలో దీన్ని ఉచిత డౌన్లోడ్గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు తరచూ ఫోన్ను మార్చేయ కుండా పాత డివైజ్నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. కొత్త ఐవోఎస్తో యూజర్లు తమ ఫేవరెట్ యాప్లను లాక్ స్క్రీన్పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్ స్క్రీన్పై లైవ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. ప్రస్తుతం ఫోన్ స్క్రీన్ పైభాగం నుంచి వచ్చే ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి. అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్ మెసేజింగ్ సిస్టమ్లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్ మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తుండాలి. హెడ్క్వార్టర్స్ క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ మరికొన్ని ఉత్పత్తులను కూడా ఆవిష్కరించింది. నెక్ట్స్ జనరేషన్ మ్యాక్ చిప్లతో మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో ప్రదర్శించింది. మ్యాక్బుక్ ఎయిర్ రేటు 1,200 డాలర్లుగా, ప్రో ధర రూ. 1,300 డాలర్లుగా ఉంటుంది. -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్పై ఆగ్రహం..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్ అప్డేట్పై ఐఫోన్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లలో ఈ కొత్త ఐఓఎస్ను అప్ డేట్ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యాపిల్కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మార్చి 14న ఐఫోన్లలో యాపిల్ అట్టహాసంగా ఐఓఎస్ 15.4ను అప్డేట్ విడుదల చేసింది. లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్లో ఫీచర్లు బాగున్నా..పనితీరు బాగాలేదంటూ వినియోగదారులు యాపిల్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఐఓఎస్ దెబ్బకు ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందంటూ ట్వీట్లలో ప్రస్తావిస్తున్నారు. మ్యాగ్జిమ్ షిషాకో అనే ట్విట్టర్ యూజర్ ఐఓఎస్ 'ఐఓఎస్ 15.4 అప్డేట్ తర్వాత నా ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. Since iOS 15.4 released yesterday on March.15 2022, many iPhone users started to notice that their iPhone storage has been increased 2x while some notice that they lost some GB of storage after updating to iOS 15.4 and battery life is also worse #Apple #iOS #iOS154 #iPhone — SaadPlayz (@isaadplayz) March 15, 2022 ఇప్పుడే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లో ఐఓఎస్ అప్డేట్ చేశా. ఇంతకు ముందు ఛార్జింగ్ పెడితే ఒకటి , లేదా రెండు రోజులు వినియోగించే వాడిని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. సగం రోజులోనే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని మరో యూజర్ తెలిపాడు. ios 15.4 battery drain is absolutely ridiculous. @Apple @AppleSupport Need to fix the issue asap or you’re gonna lose your customers very badly Model: iphone 13 mini Battery health: 100% — Nasarudheen (@Nasaruattu) March 19, 2022 నా ఐఫోన్కు ఛార్జింగ్ పెట్టా. 95పర్సంటేజ్, 97పర్సంటేజ్ అని చూపించింది. ఛార్జింగ్ తీసేస్తే 100పర్సెంట్ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమెటిగ్గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో కూడా చూపించడం లేదని మండిపడ్డాడు. ఇలా మైక్రోబ్లాగింగ్లో ఐఫోన్ వినియోగదారులు యాపిల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా.. ఐఫోన్ యూజర్లకు తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్ సంస్థ ఇంత వరకూ స్పందించలేదు. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్లాక్! -
ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్, రూ.23వేల వరకు భారీ డిస్కౌంట్!!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు బంపరాఫర్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్లో ఐఫోన్ 12,ఐఫోన్ 12మినీ, ఐఫోన్ ఎస్ తో పాటు పలు మోడళ్ల ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్-13 డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్కార్ట్లో ఐఫోన్-13 128జీబీ వేరియంట్ ధర రూ.74,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.84,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,04,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ తో పాటు కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్ పొందవచ్చు.ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో కొనుగోలు దారులు ఫోన్ పనితీరు, మోడల్ నంబర్ ద్వారా ఫ్లిప్కార్ట్ ఎక్ఛేంజ్ ధరను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి. డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్13 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56400, 128జీబీ ఫోన్ ధర రూ.66400, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86400కే సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు ఫ్లిప్కార్ట్,యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లుపై 5శాతం రివార్డ్, నెలకు రూ.2560 ప్రారంభ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది. -
ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు, లిస్ట్లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి!
మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయడం లేదా?. ఇటీవల వాట్సాప్ తన ఓస్(ఆపరేటింగ్ సాఫ్ట్వేర్)ను అప్డేట్ చేసింది. దీంతో పాత ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లు సైతం పనిచేయడం లేదు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని రిపోర్ట్లు ప్రకారం..బ్రెజిల్లో 100 మిలియన్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 30 రకాల స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం రిపోర్ట్లు పేర్కొన్నాయి. వాటిలో శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్, హెచ్టీసీ డిజైర్ 500, సోనీ ఎక్స్పీరియా ఎం, ఎల్జీ ఆప్టిమస్ ఎఫ్7 ఫోన్ ఉన్నాయి. అయితే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి కారణంగా సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయకపోవడమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2022 నుంచి 30 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని స్ప్రౌట్ వైర్డ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, ఇటీవల కాలంలో భారీగా అమ్ముడైన పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచి పోయాయి. వాట్సాప్ అప్డేట్ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తక్కువ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక ఐఫోన్లలో ఐఎస్ఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఐఫోన్లలో మెసేజ్లు, ఫోటోలు, వీడియోల్ని ఫార్వర్డ్ చేయలేమని Apple iPhone SE (16GB, 32 GB, and 64GB) Apple iPhone 6S (32GB and 64GB) Apple iPhone 6S Plus (16GB, 32GB, 64GB, and 128 GB) Apple iPhone 6S (128 GB) Apple iPhone 6s (16gb) Mini Samsung Galaxy S3 Samsung galaxy Ace 2 Samsung galaxy core Samsung Galaxy Trend II Samsung galaxy trend lite Samsung Galaxy Xcover 2 LG Act LG Lucid 2 LG Optimus F3 LG Optimus F3Q LG Optimus F5 LG Optimus F6 LG Optimus F7 LG Optimus L2 II LG Optimus L3 II LG Optimus L3 II Dual LG Optimus L4 II LG Optimus L4 II Dual LG Optimus L5 II LG Optimus L5 II Dual LG Optimus L7 II LG Optimus L7 II Dual Archos 53 Platinum Caterpillar Cat B15 Faea F1 HTC Desire 500 Huawei Ascend D2 Huawei Ascend G740 Huawei Ascend Mate Lenovo A820 Sony Xperia M THL W8 Vico darkknight Vico sync five ZTE Grand Memo ZTE Grand S Flex ZTE grand x quad v987 ZTE V956 – UMI X2 చదవండి: వాట్సాప్లో యూపీఐ పిన్ మార్చడం ఎలానో తెలుసా..? -
షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే!
ఈ ఏడాది క్యూ3 ఫలితాల్లో 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్పై 'స్ట్రాటజీ అనలిటిక్స్' సంస్థ రిపోర్ట్ను విడుదల చేసింది. యాపిల్ సంస్థ ప్రపంచంలోనే షిప్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవగా షియోమీ రెండో స్థానంలో, శాంసంగ్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రస్తుతం 5జీ మార్కెట్ వరల్డ్ వైడ్గా 25శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఐఫోన్ 12 ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఐఫోన్ 12 సిరీస్ను విడుదల చేసింది. ఈ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసిన రెండు వారాల్లోనే సేల్స్ జరిగి...ఐఫోన్ 12 ,ఐఫోన్ 12 ప్రో'లు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్లుగా నిలిచాయి. తాజాగా స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సైతం 5జీ మార్కెట్లో యాపిల్ తొలిస్థానంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో యాపిల్ షావోమీని వెనక్కి నెట్టిందని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ కెన్ హైర్స్ తెలిపారు. ఐరోపాలో శాంసంగ్, చైనాలో ఒప్పో స్మార్ట్ఫోన్ సేల్స్ కారణంగా షావోమీ అమ్మకాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. షావోమీ హెడ్ క్వార్టర్స్ చైనాలో మాత్రం 5జీ స్మార్ట్ఫోన్ లపై ఆఫర్లు ప్రకటించడంతో డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. శాంసంగ్ సైతం 3వ త్రైమాసికంలో గ్లోబల్ 5జీ ఫోన్ షిప్మెంట్లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒప్పోను వెనక్కి నెట్టింది. శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ సౌలభ్యంతో పాటు ఫోల్డబుల్ ఫోన్ కారణంగా శాంసంగ్కు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. 4వ స్థానంలో ఒప్పో తర్వాత వివో ఐదో స్థానాన్ని సంపాదించుకోగా...హానర్ తన మాతృ సంస్థ హువావే నుంచి విడిపోవడంతో ద్వారా హానర్ ఈ త్రైమాసికంలో 194శాతం వృద్ధిని సాధించినట్లైందని స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు -
అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు
త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఆపిల్ ఫోన్ల వరకు వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుంది. ముఖ్యంగా నవంబర్ 1నుంచి ఆయా టెక్ సంస్థలు తయారు చేసిన 43 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 2బిలియన్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్ కొత్త కొత్త మార్పులు చేస్తుంది. ఫీచర్లను యాడ్ చేస్తుంది. అయితే వాట్సాప్ తెస్తున్న కొత్త అప్డేట్ లకు స్మార్ట్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. ఆ ఫోన్లలో వాట్సాప్ వినియోగం, లేదంటే వాట్సాప్ ఫీచర్లు పనిచేయాలంటే భారీ ఖర్చు చేయాల్సి ఉంది. అందుకే సపోర్ట్ చేయని ఫోన్లలో యాప్ సేవల్ని నిలిపివేసేందుకు వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ OS 4.1..దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సాప్ను ఉపయోగించడం సాధ్యం అవుతుంది. ఇక వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. ఐ ఫోన్: ఐఫోన్ 6 ఎస్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ హువావే ఎస్సేండ్ G740 ఎస్సేండ్ D క్వాడ్ XL ఎస్సేండ్ మాటే ఎస్సేండ్ P1 S ఎస్సేండ్ D2 ఎస్సేండ్ D1 క్వాడ్ XL. శామ్ సంగ్: శామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్ గెలాక్సీ SII గెలాక్సీ ట్రెండ్ II గెలాక్సీ ఎస్ 3 మినీ గెలాక్సీ కోర్ గెలాక్సీ Xcover 2 గెలాక్సీ ఏస్ 2 ఎల్జీ.. ఎల్జీ లూసిడ్ 2 ఆప్టిమస్ L5 డ్యూయల్ ఆప్టిమస్ L4 II డ్యూయల్ ఆప్టిమస్ F3Q ఆప్టిమస్ F7 ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L3 II డ్యూయల్ ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L5 ఆప్టిమస్ L5 II ఆప్టిమస్ L3 II ఆప్టిమస్ L7 ఆప్టిమస్ L7 II డ్యూయల్ ఆప్టిమస్ L7 II ఆప్టిమస్ F6 ఆప్టిమస్ F3 ఆప్టిమస్ L4 II ఆప్టిమస్ L2 II ఆప్టిమస్ నైట్రో హెచ్డీ,4X హెచ్డీ జెడ్డీటీ జెడ్టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్ గ్రాండ్ X క్వాడ్ V987 జెడ్టీఈ V956 గ్రాండ్ మెమో -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్ను ఫోన్కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్ఫోన్లో వైరస్లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్ఫోన్కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్లను మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్ఫోన్లో కొత్త యాప్లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్లు, మెసేజ్ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయాలపై వివాదం నెలకొంది. ఐ ఫోన్లు కావాలంటూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పట్టు బట్టినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం. స్టాండింగ్ కమిటీలోని 17 మంది సభ్యులకు తలా ఒక ఐఫోన్ను ‘బహుమతి’గా ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో మొబైల్ విలువ 1.6 లక్షలు. ఈ మొత్తం వ్యవహారానికి 27 లక్షల రూపాయలకు పైగా వ్యయం కానుంది. అయితే, మార్కెట్లో ఐఫోన్-12 మ్యాక్స్ ప్రో (ఇంటర్నల్ మెమొరీ 512 జీబీ) మొబైల్స్ స్టాక్ లేకపోవడంతో కొనుగోలును జీహెచ్ఎంసీ వాయిదా వేసిందట. దాంతో తమకు మొబైల్స్ అందవేమోనని స్టాండింగ్ కమిటీ సభ్యులు కలవరపడుతున్నారట. మరో 45 రోజుల్లో ప్రస్తుత గ్రేటర్ పాలకమండలి గడువు ముగియనుండటమే ఈ కలవరపాటుకు కారణం! (చదవండి: ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..) తీవ్ర విమర్శలు స్టాండింగ్ కమిటిలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మరో 15 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సభ్యులు. జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ఇక ఈ బహుమతుల కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కారు పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి తాజా బాగోతమే ఉదాహరణ అని బీజేపీ హైదరాబాద్ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ ఇంత ఖర్చు చేసి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని నీళ్లలాగా ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులు సిగ్గుపడాలని చురకలు వేశారు. ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని మీడియాతో శుక్రవారం పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ నూతన పాలక మండలి ఫిబ్రవరిలో కొలువుతీరనుంది. (చదవండి: ఇక హైదరాబాద్లో ఫ్రీ వాటర్.. అయితే..) -
‘విస్ట్రాన్’లో వేలాది ఐఫోన్లు లూటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నరసాపురాలోని ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్లో అత్యంత విలువైన వేలాది ఐఫోన్లు లూటీకి గురయ్యాయి. ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు విస్ట్రాన్ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విస్ట్రాన్ ప్లాంట్లో ఉద్యోగులు శనివారం తీవ్ర బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్లాంట్ చాలావరకు ధ్వంసమైంది. విలువైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆçహుతయ్యాయి. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్ ప్రతినిధి టీడీ ప్రశాంత్ చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు, కర్ణాటక కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 149 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆపిల్కు భారీ జరిమానా
టెక్ దిగ్గజం ఆపిల్కు భారీ షాక్ తగిలింది. వినియోగదారులను నమ్మించేందుకు తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది. తమ వివిధ ఐఫోన్లు వాటర్ రెసిస్టెంట్ అంటూ తప్పుదోవ పట్టించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ , ఆపిల్ ఇటాలియాపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : ఆఫర్లు) ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ప్రకటన ప్రకారం ఆపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.ఈ లక్షణం కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉందని స్పష్టం చేయకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది. కంపెనీ డిస్క్లైమర్లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వినియోగదారులను తప్పుడు ప్రకటనతో మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వాదించింది. అంతేకాదు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా ఆరోపించింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో , ఐఫోన్ 11 ప్రో మాక్స్ మోడళ్లకు సంబంధించిన ప్రచారాన్ని ఇది ఊదహరించింది. ఈ మోడళ్ల నీటి నిరోధక లక్షణాల గురించి తప్పుదారి పట్టించినందుకు ఆపిల్కు 10 మిలియన్ యూరోలు జరిమానా విధించినట్లు తెలిపింది. -
ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్ఫోన్ మార్కెట్పై కన్నేసిన స్మార్ట్ఫోన్ మేకర్ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో టాప్ ఎండ్ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్కాన్ స్థానిక యూనిట్ ద్వారా ఖరీదైన ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయనుంది. ముఖ్యంగా ఐ ఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్, మాక్స్, ఎక్స్ఆర్ లాంటి అతి ఖరీదైన స్మార్ట్ఫోన్లను రూపొందించనుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్ ప్లాంట్లో ఐఫోన్ ఎక్స్ అసెంబ్లింగ్ను సాధ్యమైనంత( వచ్చే ఏడాది ప్రారంభం నుంచి) తొందరగా ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్లోనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్ను మొదలుపెడ్తామని ఫాక్స్కాన్ వెల్లడించింది. సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆపిల్ పెడుతోంది. మరోవైపు కొత్త విస్తరణ నేపధ్యంలో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 25వేలకు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సంపత్ రాయిటర్స్తో చెప్పారు. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి తిరస్కరించారు. కాగా విస్ట్రన్ కార్పోరేషన్ ద్వారా బెంగళూరులో ఐ ఫోన్ ఎస్ఈ, ఆర్ఎస్ మోడల్స్ మాత్రమే దేశంలో ఎసంబుల్డ్ చేస్తోంది ఆపిల్ కంపెనీ. అలాగే చెన్నై ప్లాంట్లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్కాన్ ప్రభుత్వంతో వచ్చిన విబేధాల కారణంగా 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఆ ప్లాంట్లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. -
ఐ ఫోన్లపై భారీ క్యాష్బ్యాక్ ఆఫర్స్
ఐ ఫోన్ కావాలని కలలు కంటున్నారా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ మిస్ అయ్యారా? అయితే దసరా పండుగ సందర్భంగా పేటీఎం మాల్ పలు ఉత్పత్తులపై భారీగా క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఒకవైపు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫెస్టివ్ సేల్ ఆదివారంతో ముగిసిపోవడంతో పే టీఎం మాల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్ మరోసారి ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్బ్యాక్ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై మహా క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 256జీబీ స్మార్ట్ఫోన్పై భారీగా 20వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్ ఆఫర్తో 1,01,890 రూపాయల వద్ద పేటీఎం మాల్ విక్రయించింది. దీనికి ప్రస్తుత క్యాష్బ్యాక్ అదనం. 64 జీబీ ఐఫోన్ ఎక్స్పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్ ధర రూ. 95,390 నుంచి తగ్గి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K ప్రోమో కోడ్ను ఉపయోగించాలి. అంతేకాదు ఐ ఫోన్ ఎక్స్ఎస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్ ద్వారా 64జీబీ ఐఫోన్ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్ బ్యాక్ ఉంది. 256 జీబీ స్మార్ట్ఫోన్ లో 12వేల క్యాష్ బ్యాక్ ఆఫర్. దీనికి ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ ఐఫోన్ 8 ప్లస్పై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్. ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500. 32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్ MALLFESTIVE8500.32జీబీ ఐఫోన్ 6ఎస్ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ప్రోమోకోడ్ ద్వారానే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ప్రోమోకోడ్ ద్వారా ఆఫర్ చేస్తున్న నగదును ఫోన్లను డెలివరీ చేసిన 24గంటల్లోపు కస్టమర్ల ఖాతాలో క్రెడిట్ చేస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70శాతంరాయితీని ప్రకటించింది. కంప్యూటర్ ఉత్పత్తులపై 25శాతం క్యాష్ బ్యాక్ను, గేమింగ్ కన్సోల్స్పై రూ.6వేల క్యాష్బ్యాక్ ఆఫర్. అలాగే గృహోపకరణాలపై 60శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. -
వాట్సాప్ : ఐఫోన్ యూజర్లకు బ్యాడ్న్యూస్
టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12 ఐఫోన్ యూజర్ల ముందుకు వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో, అప్డేట్లతో ఐఫోన్ యూజర్లను, ఐప్యాడ్ యూజర్లను ఇది అలరిస్తోంది. కొత్త ఐఓఎస్ 12 మార్కెట్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే... ఐఫోన్ యూజర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 7.1.2కి ముందున్న ఐఓఎస్ వెర్షన్లకు తమ యాప్ పనిచేయదని ప్రకటించింది. అంటే 1 ఫిబ్రవరి, 2020 నుంచి ఐఓఎస్ 7, దాని ముందున్న వెర్షన్లు వేటికి కూడా వాట్సాప్ సపోర్టు చేయదని చెప్పేసింది. ఐఓఎస్ 7.1.2 యూజర్లకు కూడా తమ యాప్ను వాడుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన కొత్త ఎఫ్ఏక్యూ సెక్షన్లో వెల్లడించింది. వాట్సాప్ సపోర్టు చేసే ఐఫోన్ డివైజ్లను కూడా పేర్కొంది. ఇక నుంచి కేవలం ఐఓఎస్ 8, ఆపై యూజర్లకు మాత్రమే వాట్సాప్ పనిచేయనుందని స్పష్టం చేసింది. ‘ఐఫోన్కు వాట్సాప్ కావాలంటే, ఐఓఎస్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉండాల్సిందే’నని తేల్చి చెప్పింది. 1 ఫిబ్రవరి, 2020 తర్వాత కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి, పాత అకౌంట్లను పునఃధృవీకరించుకోవడానికి కూడా కుదరదు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మంది యూజర్లపై పడదని తెలుస్తోంది. ఐఓఎస్ 7.1.2 వచ్చిన తర్వాత ఐఫోన్ పాత డివైజ్లకు ఎలాంటి అప్డేట్లు లేదు. ముఖ్యంగా ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్లకు. ఐఫోన్ 4ను 2010లో లాంచ్ చేయగా.. ఐఫోన్ 3జీఎస్ 2009లో మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6.1.6 తర్వాత ఇక ఎలాంటి అప్డేట్ను పొందలేదు. 2008లో లాంచ్ అయిన ఐఫోన్ 3జీ కి కూడా వాట్సాప్ పనిచేయదు. అయితే 2011లో లాంచ్ అయిన ఐఫోన్ 4ఎస్లకు చివరి అప్డేట్ ఐఓఎస్ 8.4.1. దీంతో వీటికి వాట్సాప్ పనిచేస్తుంది. కాగా, తాజాగా ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను సెప్టెంబర్17న విడుదల చేసింది.. 85 శాతం యాక్టివ్ డివైజ్లు ఐఓఎస్ 11తో పనిచేస్తూ ఉండగా.. ఐఓఎస్ 10తో 10 శాతం, పాత వెర్షన్లతో మిగిలిన 5 శాతం పనిచేస్తున్నాయి. అంటే ఐఓఎస్ 10కు ముందున్న వెర్షన్ డివైజ్లు లక్షల్లో కొన్ని మాత్రమే. -
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
ఆపిల్ వాచ్ బైపాస్ సర్జరీ చేస్తుందట!!
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ 12.. ఓ ఐకానిక్’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్ సిమ్ ఫీచర్తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్లపై సోషల్ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 2018 ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఈసీజీ ఫీచర్ ఉంటే, 2019 వాచ్లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్లో బైపాస్ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్ సిమ్ ఫీచర్ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఐఫోన్ ఆపిల్ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్ ఫోన్ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Apple watch features 2018 : ECG 2019 : Angioplasty 2020 : Bypass Surgery 2021: Funeral arrangements#AppleEvent — SAGAR (@sagarcasm) September 12, 2018 IPhone fans right now #AppleEvent pic.twitter.com/nuQgOyaMWt — Mask ishan (@Mr_LoLwa) September 12, 2018 We’re all living in 2018 while Apple is living in 2012 #AppleEvent pic.twitter.com/hJnyfbGgbK — 9GAG (@9GAG) September 13, 2018 Android be like : Launch wo kar rahein hain par features humaare hain.#AppleEvent pic.twitter.com/v24iRk4tst — SAGAR (@sagarcasm) September 12, 2018 Reality check. #AppleEvent #iphoneXs pic.twitter.com/tC6wBYFqAc — Godman Chikna (@Madan_Chikna) September 12, 2018 me @ my iPhone 📱 after seeing the new prices #AppleEvent pic.twitter.com/xPJW1iB4vV — Khattak (@Nayapakistan_55) September 12, 2018 Fixed it. #AppleEvent pic.twitter.com/6Y1cHkcrzY — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Samsung fans watching #AppleEvent and realising they can’t even taunt you about dual sim anymore. pic.twitter.com/Ka2nksuv15 — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Me and my broke friends checking the price of the new iPhone. #AppleEvent pic.twitter.com/88a1yUyeDm — Bade Chote (@badechote) September 12, 2018 -
ఆపిల్ అభిమానులకు పండుగ : రేపే మూడు ఐఫోన్లు
ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఎన్ని మోడళ్లు వస్తున్నా కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తుంటారు ఐఫోన్ అభిమానులు. కొత్త మోడల్ ఐఫోన్ విడుదలవుతుంటే చాలు ... అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. గంటల తరబడి లైన్లో నిలబడి మరీ కొత్త ఐఫోన్ను సొంతం చేసుకోవాలనుకుంటుంటారు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఏడాది కూడా ఆపిల్ మూడు సరికొత్త ఐఫోన్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. అది కూడా రేపే. సెప్టెంబరు 12న అంటే రేపు కూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో వీటి లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ పేర్లతో ఇవి లాంచ్ కాబోతున్నాయని టాక్. ఐఫోన్ 9 మూడు ఐఫోన్లలో అత్యంత సరసమైనదిగా ఉండనుందని, ఇది 6.1 అంగుళాల ఎల్సీడీ ప్యానల్తో రూపొందిందని ఇప్పటికే పలు రిపోర్టు చెప్పాయి. మిగతా రెండు 5.8 అంగుళాల ఓలెడ్, 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్ఎస్లు రెండు రోమనియన్ వెబ్సైట్ క్విక్మొబైల్లో సీక్రెట్గా ప్రీ-ఆర్డర్కు కూడా అందుబాటులోకి వచ్చాయట. ఈసారి లాంచ్ చేయబోయే ఐఫోన్లలో ఒకటి డ్యుయల్ సిమ్తో అలరించబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆపిల్ ఐఫోన్లన్నీ సింగిల్ సిమ్తోనే పనిచేసేవి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీ తట్టుకునేందుకు ఆపిల్ కూడా ఒక మోడల్ను డ్యుయల్ సిమ్తో విడుదల చేయబోతుందని తెలిసింది. మూడు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా ఈ కంపెనీ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అసలు రేపు జరిగే ఈవెంట్లో ఆపిల్ తన అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తోందో వేచిచూడాలి. -
2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్ డివైజ్ను 6.1 అంగుళాల స్క్రీన్లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్లను ఆపిల్ ఎప్పుడు లాంచ్ చేస్తుందో కూడా తెలిసిపోయింది. ఇద్దరు జర్మన్ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో లాంచ్ చేయనుందని తెలిసింది. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి. ఆపిల్ అప్కమింగ్ స్మార్ట్ఫోన్ల గురించి ఇంటర్నెట్లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్ ఐఫోన్ల పేరు ఐఫోన్ ఎక్స్ఎస్గా, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్టైలస్ ఫీచర్ అంటే ఆపిల్ పెన్సిల్ సపోర్టుతో ఈ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయట. స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని తీసుకొస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ రెండూ కూడా కంపెనీ ఏ12 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తాయని, 4జీబీ ర్యామ్, ప్రముఖ ఫేస్ఐడీ ఫీచర్ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం. ధర విషయంలో 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ మోడల్ 899 డాలర్లుగా.. 6.46 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ వేరియంట్ 999 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ వేరియంట్ ధర 650 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఇది లభ్యమవుతుందని టాక్.