Advertisement
industrialist
-
సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని సది్వనియోగం చేసుకుంటూ మహిళలు సొంతంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి, మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో అంటే.. 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు రాష్ట్రంలో మహిళలు సొంతంగా 2,17,359 ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖే వెల్లడించింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ద్వారా 1,8,03,672 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రూ.7,229.41 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, వీటి టర్నోవర్ రూ.73,435.96 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇవన్నీ అధికారికంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద నమోదైన ఎంఎస్ఎంఈలు కాగా, ఇప్పటికీ నమోదు కాని ఎంఎస్ఎంఈలు రాష్రంలో 2023 జనవరి 11 నుంచి 2024 జనవరి 31 వరకు ఒక్క ఏడాదిలోనే మరో 4,73,932 మహిళా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 6,,22,389 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొంది. మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఎంఎస్ఎంఈలకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆరి్ధక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను అమలు చేస్తోందని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళల ఎంఎస్ఎంఈలను ఉద్యమం పోర్టలో రిజి్రస్టేషన్కు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి, వారికి అవరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ చేయూత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పలు విధాలుగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలు స్థాపించే ఎంఎస్ఎంఈలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. దీంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు రూ.2,087 కోట్లు రాయితీలుగా చెల్లించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. దీంతో ఆ పరిశ్రమలన్నీ కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని, నిలదొక్కుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. -
యూఎస్లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!
భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే.. భారత్కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్లోని జార్జియా టెక్లో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్ఫ్లూయెంట్ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. (చదవండి: మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్) -
Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై
బుందీ/దౌసా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ సేవలో తరిస్తున్నారని, ఆయన కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ మాతా జై’ అని చెప్పే మోదీ అదానీ కోసం నిత్యం 24 గంటలూ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అనడానికి బదులు ‘అదానీజీ కీ జై’ అని నినదించాలని మోదీకి హితవు పలికారు. భరతమాత అంటే పేదలు, రైతులు, కారి్మకులేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజస్తాన్లోని బుందీ, దౌసా జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ రెండు హిందూస్తాన్లను సృష్టించాలని భావిస్తున్నారని, అందులో ఒకటి అదానీ కోసం, మరొకటి పేదల కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు నిర్వహించడం లేదని మోదీని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతటా కుల గణన ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజస్తాన్లోనూ అధికారంలోకి రాగానే కులగణనకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కులగణనతోనే భరతమాత విజయం సాధిస్తుందని వివరించారు. రోజుకు మూడుసార్లు దుస్తులు మారుస్తారు మనదేశంలో బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారా అని రాహుల్ ప్రశ్నించారు. రాజస్తాన్లో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. మోదీ రూ.12,000 కోట్లతో విమానం కొనుక్కున్నారని, రోజుకు మూడు సార్లు దుస్తులు మారుస్తారని, రూ.12 కోట్ల విలువైన కారులో ప్రయాణిస్తుంటారని మోదీపై ధ్వజమెత్తారు. తమ జనాభా ఎంత ఉందో చెప్పాలని ఓబీసీ, దళిత, గిరిజన యువత అడిగితే మాత్రం కులాలు లేవని ప్రధానమంత్రి అంటున్నారని దుయ్యబట్టారు. మోదీ 90 మంది ఐఏఎస్ అధికారులతో పరిపాలన నడిపిస్తున్నారని, వారిలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం ఉందని, ఐఏఎస్లు మాత్రం జనాభాకు తగ్గట్టుగా లేరని తెలిపారు. -
ఆప్తమిత్రులకు గోల్డెన్ పాస్పోర్టా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్పోర్ట్’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్కాల్లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్ పాస్పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్ లేదా గోల్డెన్ పాస్పోర్ట్ పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్మేడ్ రాయితీలను ప్రకటించింది. -
ఉరివేసుకుని పారిశ్రామికవేత్త ఆత్మహత్య
అన్నానగర్: కరుంగల్ సమీపంలో ఆదివారం రాత్రి ఓపారిశ్రామికవేత్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కరుంగల్ సమీపంలోని నెడియవిలకం ప్రాంతానికి చెందిన తంబిదురై సొంత ట్రక్కులతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి స్మైలీన్ ప్రభుదాస్ (32) అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి నడుపుతున్న ట్రక్కుతో వ్యాపారంలో బాధ్యతలు నిర్వర్తించేవాడు. అతను ఆల్డ్రిన్ ఎస్తేర్ బాయ్ (29)ని వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఐదేళ్ల కుమారుడు, 6 నెలల కుమార్తె ఉన్నారు. స్మైల్ ప్రభుదాస్ వ్యాపారంలో నష్టాలను చవిచూశారని, అప్పుల బాధలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా నిరుత్సాహంగా కనిపించారు. ఈ స్థితిలో ఆదివారం స్మైలీన్ ప్రభుదాస్ ఇంటిపై అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు స్మైల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య ఆల్డ్రిన్ ఎస్తేర్ భాయ్ కరుంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు స్మైల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆచారిపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు
సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) ఏం చదువుకున్నారో తెలుసా? దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్లోని పెట్రోల్ బంకులో అటెండెంట్గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆసియా బిలియనీర్, భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) -
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్లోని తారన్తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్క్రీమ్లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా
బెంగళూరు: యువతి పేరుతో పంపిన హాట్ ఫోటోలకు స్పందించిన వృద్ధ పారిశ్రామికవేత్తను కేటుగాళ్లు పోలీసుల పేరుతో బ్లాక్మెయిల్ చేసి రూ.14.90 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న హలసూరుగేట్ పోలీసులు కవనా, నిధి అనే వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులపేరుతో రైడ్ హోసూరురోడ్డులో సదరు పారిశ్రామికవేత్తకు స్వంత కంపెనీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఇన్సూరెన్స్ విషయంపై కవనా అనే యువతి పరిచయమైంది. వారం క్రితం నిధి అనే యువతిని పారిశ్రామికవేత్తకు పరిచయం చేసింది. ఆమె పారిశ్రామికవేత్తతో వాట్సాప్లో చాటింగ్ చేస్తుండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిధి స్నేహితుడు యువరాజు నిధి పేరుతో మరో ఫోన్ నంబర్ ద్వారా ఆ పారిశ్రామికవత్తకు హాట్ పొటోలు పంపాడు. ఈనెల 3 తేదీన నిధి సెల్ నుంచి పారిశ్రామికవేత్తకు మెసేజ్ పంపించి హొసూరురోడ్డు పెట్రోల్బంక్ వద్దకు పిలిపించాడు. మరో వ్యక్తితో కలిసి తాము క్రైం పోలీసులమంటూ ఆ పారిశ్రామికవేత్త కారు కీ, మొబైల్ను లాక్కున్నారు. యువతితో చాటింగ్ చేసిన వీడియో స్క్రీన్షాట్, హాట్ ఫొటోలకు సంబంధించి మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఈ కేసు మూసివేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 14.90 లక్షలు తీసుకున్నారు. చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) ఈనెల 10 తేదీన ఫోన్ చేసి కేజీ.రోడ్డు బసప్పపార్కు వద్దకు పిలిపించి రూ.50 వేలు తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు నకిలీ పోలీసులని పసిగట్టిన సదరు పారిశ్రామికవేత్త హలసూరుగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి యువరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఈ వ్యవహారంలో అతనే సూత్రధారి అని తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జిమ్ ట్రైనర్ అయిన యువరాజు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, స్నేహితురాలు నిధి పారిశ్రామికవేత్తకు మెసేజ్ చేయడాన్ని గమనించి మరో నెంబరు నుంచి అదే పేరుతో చాటింగ్ చేయించి నకిలీ పోలీసుల అవతారమెత్తి నగదు దోచుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. -
బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ అరుదైన ఫోటోలు
-
పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు
సాక్షి, ఆదిలాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్కం టాక్స్ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్ మిత్తల్కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్కు చెందిన రఘునాథ్ మత్తల్కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. -
మన నైపుణ్యమే మనకు గుర్తింపు
నా జీవితాన్ని నాలుగు సెగ్మెంట్లుగా విభజించుకున్నాను. మొదటిది నా ప్రొఫెషన్, రెండు భార్యగా తల్లిగా నా ఇంటి బాధ్యత, మూడవది నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి దోహదం చేసే నా ప్యాషన్, నాలుగవది సాటి మహిళల కోసం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సామాజిక బాధ్యత. ప్రొఫెషన్లో మన సర్వీస్ నూటికి నూరు శాతం ఇవ్వగలగాలంటే మన పర్సనల్ స్పేస్ను సంతృప్తి పరుచుకుంటూ ఉండాలి. తొమ్మిది భారతీయ భాషల్లో త్యాగరాజ కృతులు పాడినా, ఇంట్లో సీతారామ కల్యాణం చేసినా అవన్నీ నా సంతోషం కోసమే. పారిశ్రామికవేత్తగా కష్టపడేది నన్ను నేను గెలిపించుకోవడం కోసం. లా నన్ను నేను గెలిపించుకోవడం సాధ్యమయ్యేది నన్ను నేను సంతోషంగా ఉంచుకున్నప్పుడే. ఈ చిన్న చిట్కా తెలిస్తే జీవితంలో అసంతృప్తులు ఉండవన్నారు నీరజ గొడవర్తి. ఇటీవలే ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నీరజ తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మాది మద్రాసులోని తెలుగు కుటుంబం. మా తాతగారు మద్రాసు నుంచి బాపట్ల వచ్చి స్థిరపడ్డారు. మా నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగరీత్యా తెలంగాణలో పెరిగాను. పెళ్లితో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో స్థిరపడ్డాను. సంగీతంలో ప్రవేశం ఉన్న కుటుంబం కావడంతో నేను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న క్రమశిక్షణ నాలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆ క్రమశిక్షణే జీవితాన్ని సక్రమంగా చక్కదిద్దుకునే నైపుణ్యాన్నిచ్చింది. టైప్, షార్ట్ హ్యాండ్ అర్హతలు కూడా ఉండడంతో బీకామ్ పరీక్షలు రాసిన వెంటనే ఓ పెద్ద కంపెనీలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. చదువు మాత్రమే సరిపోదు, లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలని నాకు తెలిసిన సందర్భం అది. ఉద్యోగం చేస్తూనే కరస్పాండెన్స్లో పీజీ చేశాను. ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం నాకు పెళ్లి తర్వాత నా భర్త కంపెనీని నిర్వహించడంలో చాలా బాగా దోహదం చేసింది. మావారి ఏకశిలా కెమికల్స్ లిమిటెడ్లో మొదట కంప్యూటర్ విభాగం బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు అదే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సక్సెస్కి ఎప్పుడూ షార్ట్ కట్ ఉండదు. కంపెనీ మనదైనా సరే, అందులో ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలంటే మన శ్రమ, మనం కంపెనీకి ప్రయోజనకరంగా ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. అంతేతప్ప మనలో అంకితభావం, పట్టుదల, నైపుణ్యం లేకపోతే పెద్ద బాధ్యతలు అప్పగించే సాహసాన్ని భర్త కూడా చేయడు. మొక్కలు పెంచాను మా బాబు కోసం మూడేళ్లపాటు నా కెరీర్లో గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు నాకు టైమ్ వృథా చేస్తున్నానా అనిపించేది. అప్పుడు హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. బాబు స్కూల్కెళ్లడం మొదలైన తర్వాత బంజరుగా పడి ఉన్న రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చే బాధ్యత తీసుకున్నాను. అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్లో చూసిన బటర్ ఫ్లై పార్క్ను దృష్టిలో పెట్టుకుని పొలం మధ్యలో వాకింగ్ ట్రాక్ నిర్మాణంతోపాటు సీతాఫలం, గోరింటాకు, అశ్వత్థ, రుద్రాక్ష, ఖర్జూరం, అంజూర్ చెట్లు వేశాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రెండేళ్లు అవార్డు అందుకున్నాను. హార్టికల్చర్ అవార్డుకి గీటురాయి ప్రధానంగా ఒక్కటే. మనం పెంచిన ప్రతి చెట్టుకీ ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. చూడడానికి అందంగా కనిపించడం కోసం క్రోటన్స్ నాటానంటే ఒప్పుకోరు. పువ్వులు, కాయలు, ఔషధ గుణాల వంటి ఉపయోగకరమైనవే అయి ఉండాలి. గార్డెన్కి నేను రోజూ చేయాల్సిందేమీ లేదిప్పుడు. కంపెనీ పనులు చూసుకుంటున్నాను. ఒకప్పటి పురుష సామ్రాజ్యం పరిశ్రమ నిర్వహణలో ఉన్న మహిళలు సక్సెస్బాట పట్టిన తమ విజయాలను చూసుకుని సంతోషపడితే సరిపోదు. తమ వంతుగా సామాజిక బాధ్యతను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఓ దశాబ్దం వరకు కూడా ఇది పూర్తిగా మగవాళ్ల సామ్రాజ్యం. ఇప్పుడు మహిళలు ముందుకు వస్తున్నారు. ముందుతరం మహిళాపారిశ్రామిక వేత్తలు తాము నడిచిన దారితో కొత్తవారికి మార్గదర్శనం చేయగలగాలి. పరిశ్రమ నిర్వహణలో దాగిన మెళకువలను కొత్త వారికి నేర్పించాలి. కేవలం అందుకోసమే కోవే (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) లో మెంబర్గా చేరాను. ఇందులో వందల సంఖ్యలో మహిళలున్నారు. తమ పరిశ్రమలను విజయవంతంగా నడిపించుకుంటున్న వాళ్లు దాదాపుగా ఎనభై మంది ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు పెట్టి కొత్తవాళ్లకు దిశానిర్దేశం చేయడం, కుటీర పరిశ్రమలు నడుపుతున్న వాళ్ల ఉత్పత్తులను మార్కెట్ చేయడం కోసం కోవే మార్ట్లు నిర్వహించడం నాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. సమాజంలో ఒకింత విస్తృతమైన పరిచయాలు ఉండడంతో నోటి మాట ద్వారా మా కోవే నెట్వర్క్లో ఉన్న మహిళలకు ఆర్డర్లు ఇప్పించగలుగుతాం. అవసరం ఉన్న వాళ్లకు– సర్వీస్ ఇవ్వగలిగిన వాళ్లకు మధ్య వారధిగా పని చేయడం అన్నమాట. ఇందుకోసం ఓ పది నిమిషాల ఫోన్ కాల్ మినహా మాకు ఖర్చయ్యేది ఏమీ ఉండదు. సక్సెస్ బాటలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను నేను కోరేది ఒక్కటే... మీరు ఎక్కిన నిచ్చెన మెట్లు మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చాయి. తొలి అడుగు ఎలా వేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మహిళలెందరో ఉన్నారు. వారికి చేయి అందించండి. ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కొత్త తరం యువతులు ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ చదువుకుని కూడా గృహిణిగా ఉండిపోయిన వాళ్లలో చాలా మంది పిల్లలు పెద్దయ్యే కొద్దీ జీవితంలో తెలియని వెలితి ఫీలవడాన్ని చూస్తున్నాం. ఈ వ్యాక్యూమ్ అనేది ఎవరికి వాళ్లు ఏర్పరుచుకునేదే. వాళ్లకు నేను చెప్పగలిగిన చిన్న సలహా ఏమిటంటే... ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి, దానినే మీకు గుర్తింపుగా మలుచుకోండి. ఇంటిని అందంగా అలంకరించడం, చక్కగా చీర కట్టుకోవడం, రుచి వంట చేయడం... ప్రతిదీ ఇప్పుడు మార్కెట్ వస్తువులే. స్నేహితులకు, బంధువులకు హాబీగా చేసివ్వచ్చు. ఆర్థిక అవసరాలుంటే వీటినే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. గడచిన తరం మహిళలకు ఇన్ని అవకాశాల్లేవు. ఇప్పుడు అవకాశాలకు ఆకాశమే హద్దు’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : గాలి అమర్ పూలకు పాట ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆర్ట్ గురించి ఒక ఫ్రెండ్ చెప్పింది. ఆ కళను నేర్చుకోవడమే కాకుండా అందులో అడ్వాన్స్ కోర్సు కూడా చేశాను. ఇకబెనా మీద పాట రాసి, స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేసి రెండేళ్ల కిందట హాంగ్కాంగ్లో జరిగిన ఏషియన్ రీజనల్ కాన్ఫరెన్స్లో పాడాను. కోవే మహిళలను ఉత్తేజితం చేయడానికి కూడా పాట రాశాను. మార్కులు తక్కువగా వచ్చాయని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, దిశ సంఘటన మీద కూడా పాట రాశాను. మనసులో అలజడి రేగినప్పుడు పాట రాయడం, మనసు బాగున్నప్పుడు పూలు అలంకరించుకోవడం, కీర్తనలు పాడడం ఇవన్నీ నాకు జీవితం మీద ఇష్టాన్ని పెంచే పనులు. ఏ ఉద్వేగాన్నీ అణుచుకోకూడదు. ఉద్వేగం ఏదో ఒక కళ రూపంలో బయటకు తీసుకురావాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఫలవంతంగా జీవించగలుగుతాం. – నీరజ గొడవర్తి, ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గ్రహీత -
ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఇక లేరు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎవరెడీ ఇండస్ట్రీస్ మాజీ అధిపతి బ్రిజ్ మోహన్ ఖైతాన్ (92) శనివారం కన్నుమూశారు. ‘ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుచుకునే ఖైతాన్ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. విలిమ్సన్ మేగర్ గ్రూప్ వ్యవస్థాపకులు అయిన ఖైతాన్.. వయసు పైబడినకారణంగా గత ఏడాది తన గ్రూప్నకు చెందిన ఎవరెడీ ఇండస్ట్రీస్, మెక్లాయిడ్ రస్సెల్ సంస్థల్లో ఛైర్మన్ పదవికి రాజీనామా గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారత్లోని టీ పరిశ్రమకు ఆయన్ను పెద్దదిక్కుగా భావించే బీఎం ఖైతాన్ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఖైతాన్ బెంగాలీలు అత్యంత గౌరవించే వ్యాపారవేత్త అని ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు తన సానుభూతి ప్రకటించారు. వ్యాపార వర్గాలకు ఖైతాన్ మరణం తీరని లోటని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ పేర్కొన్నారు. అటు ఖైతాన్ మృతికి భారత టీ అసోసియేషన్ కూడా సంతాపం తెలిపింది. ఆయన మృతితో ఒక శకం ముగిసిందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒక మార్గదర్శి, నాయకుడిని టీ పరిశ్రమ కోల్పోయిందని ప్రకటనలో పేర్కొంది కాగా కోలకత్తా యూనివర్సిటీ నుంచి బాచిలర్ ఆఫ్ కామర్స్లో పట్టా పొందిన ఖైతాన్ ఎవరెడీ బ్యాటరీస్, మెక్లాయడ్ రస్సెల్ వ్యాపారంతో ఒక వెలుగు వెలిగారు. ఈ క్రమంలో పలు కీలక పదవులను చేపట్టారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్మంట్ ఇన్సిట్యూట్ వ్యవస్థాపక సభ్యుడుగా పనిచేశారు. 1986 -1987 మధ్యకాలంలో అంతర్జాతీయ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియన్ నేషనల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1973లో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994-2018 వరకు సీఈఎస్ఈకి స్వతంత్ర డైరక్టర్గా ఉన్నారు. 2013లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కోల్కతా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న నూరేళ్ల బ్రాండ్ ఎవరెడీ వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. Saddened at the passing away of noted industrialist BM Khaitan Ji. He was a much respected elder statesman of the business community of Bengal. My condolences to his family, his colleagues and his friends — Mamata Banerjee (@MamataOfficial) June 1, 2019 -
శంషాబాద్ సాతంరాయి పారిశ్రమికవాడలో అగ్ని ప్రమాదం
-
పారిశ్రామికవేత్త అదృశ్యం
చెన్నై: ఊటీలో హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
తాగిన మైకంలో అంబులెన్స్ ఎత్తుకెళ్లాడు
టి.నగర్: మద్యం మత్తులో పారిశ్రామికవేత్త వీరంగం సృష్టించడమేగాక ఆస్పత్రి అంబులెన్స్ను అపహరించాడు. ఈ సంఘటన చెన్నైలో ఆదివారం జరిగింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన నిఖిల్ (36) గాయపడిన తన స్నేహితుడిని చికిత్స కోసం థౌజండ్ లైట్స్లో ఉన్న ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున తన లగ్జరీ కారులో తీసుకొచ్చాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి వెళ్లాలనుకున్న పారిశ్రామికవేత్త మద్యం మత్తులో తన కారును అక్కడే వదిలి అక్కడున్న అంబులెన్స్ తాళం తీసుకున్నాడు. దాని సైడ్ అద్దాలు పగులగొట్టాడు. చివరకు దాన్ని నడుపుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. మద్యం మత్తులోనే నేరుగా పాలవాక్కంలోని తన ఇంటికి చేరాడు. ఆ తర్వాత తేనాంపేటలోగల ఆస్పత్రి బ్రాంచిలో అంబులెన్స్ను అందజేయాలని తన కారు డ్రైవర్ను పురమాయించాడు. డ్రైవర్ అక్కడికి వెళ్లి అంబులెన్స్ తాళాలు అందజేయడంతో అంబులెన్స్ అపహరణకు గురైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. ఈ సమాచారం థౌజండ్ లైట్స్ ఆస్పత్రికి తెలపడంతో ఆస్పత్రి ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. దీనిగురించి థౌజండ్లైట్స్ పోలీసు స్టేషన్లో ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిశ్రామికవేత్తను విచారించారు. చివరకు మద్యం మత్తులో అతను అంబులెన్స్ను తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఆస్పత్రి యాజమాన్యాన్ని పారిశ్రామికవేత్త క్షమాపణ కోరారు. -
టాపర్ల.. షికార్లు!
నర్వ, మరికల్: ‘మంచి మార్కులు తెచ్చుకుంటే ముంబాయికి విహారయాత్రకు తీసుకెళ్తానని.. విమానంలో చక్కర్లు కొట్టిస్తానని.. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నింటిని చూయిస్తానని పారిశ్రామికవేత్త నర్వ లక్ష్మికాంత్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే ఉత్తమ గ్రేడులు సాధించిన వారికి విమానంలో తీసుకెళ్లి.. నగరంలో విహారం చేయించారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం... నర్వ, మరికల్ మండలాలకు చెందిన టెన్త్ టాపర్లతోపాటు ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులకు స్ఫూర్తి యాత్ర నూతనోత్సాహం కలిగించింది. రెండు రోజులు కొనసాగిన ఈ యాత్రలో లక్ష్మీకాంత్రెడ్డి స్వయంగా శంషాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. అక్కడి చారిత్రక, ప్రసిద్ధ స్థలాలను విద్యార్థులు వీక్షించారు. తాజ్హోటల్లో కాఫీలు, టిఫిన్లు.. జుహుబీచ్లో అరేబియా సముద్రపు అలల సోయగం.. గరంగరం మసాల దినుసుల ఆరగింపు.. ఆకాశాన్ని తాకే అంభానీ భవంతులు.. వింతలు.. విశేషాలు చూస్తూ విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు. అక్కడి జ్ఞాపకాలు వారి మాటల్లోనే విందాం.. మరిచిపోని అనుభూతి టెన్త్ పరీక్షల్లో టాపర్గా వచ్చినందుకు విమానంలో వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇందుకు లక్ష్మీకాంత్రెడ్డికి కృతజ్ఙతలు. ఇంకా బాగా చదివితే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయని అనిపిస్తోంది. –శ్రావణి ఇంటర్ మీడియట్ మరికల్ గ్రామం విమాన ప్రయాణం బాగుంది టెన్త్లో మండల టాపర్గా వచ్చాను. ప్రస్తుతం మహబూబ్నగర్లోని ప్రతిభ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. సర్కారు బడుల్లో సత్తా చాటితే ఇలాంటి యాత్రలుంటాయని తెలిస్తే అందరు పోటీపడి చదువుతారు. – నర్మద, మరికల్ గ్రామం ముంబైలో మస్తుగ తిరిగినం ముంబై వీధుల్లో మస్తుగ తిరిగినం. అంబానీ భవంతి.. తాజ్హోటల్, ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద ఇళ్లు చూసినం. బీచ్లోని బాగా తిరిగినం. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. – నందిని, నర్వ గ్రామం పిల్లలకు కొత్త ఉత్సాహం సర్కారు బడుల్లో చదివే పిల్లలు కారు ప్రయాణానికి కూడా నోచుకోరు. అలాంటిది లక్ష్మీకాంత్రెడ్డి సహకారంతో పేద విద్యార్థులు విమానంలో తిరిగారు. అందరు కష్టపడి చదివితే భవిష్యత్లో ఇలాంటి రోజులు నిత్యం వస్తాయి. – బాల్రాజు, ఎంఈఓ, నర్వ -
నమ్మించి.. ముంచారు...
గుణదల (రామవరప్పాడు): తెలుగు రాష్ట్రాల సీఎంలతో తమకు పరిచయాలున్నాయని మాయమాటలు చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నిలువునా మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. టిక్కిల్ రోడ్డుకు చెందిన మేదరమెట్ల వైకుంఠలక్ష్మీనారాయణ కొలవెన్నులో మైక్రోకాస్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆయన కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. సన్నిహితుల ద్వారా ఆయనకు నందిగామకు చెందిన నర్రా కృష్ణారావు, ఇంద్రాణి దంపతులతోపాటు చెరుకూరి శ్రీలత పరిచయమయ్యారు. నష్టాల్లోని కంపెనీల ను లాభాల్లోకి తెచ్చిన అనుభవం తమకు ఉందంటూ వారు ఆయనను నమ్మించారు. కృష్ణారావుకు కంపెనీలో డైరెక్టర్గా అవకాశం కల్పిస్తే తమకున్న పరిచయాలతో రుణాలు తెస్తామని, పెద్ద వాళ్లతో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మబలికారు. లక్ష్మీనారాయణ తన కంపెనీలో కృష్ణారావుకు డైరెక్టర్ స్థానాన్ని కల్పించారు. తర్వాత కృష్ణారావు ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, రుణాలు కావాలంటే మేనేజ్ చేయాలని సాకులు చూపుతూ డబ్బులు దండుకోవడం మొదలెట్టాడు. నెలలు గడుస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కృష్ణారావును అనుమానించి డైరెక్టర్ స్థానం నుంచి తప్పించారు. అయినా కృష్ణారావు అదే తీరులో రూ.99 లక్షల వరకూ మోసం చేశాడు. తీసుకున్న డబ్బు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో కృష్ణారావు సుమారు రూ.62 లక్షలు చెల్లించాడు. మిగిలిన సొమ్ము చెల్లించాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా స్పందించకపోవడంతో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారావు, ఇంద్రాణి, శ్రీలతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
15 కోట్లు డిమాండ్.. టీవీ చానల్ చీఫ్ అరెస్ట్
జయనగర(బెంగుళూరు) : పదిహేను కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పారిశ్రామికవేత్తను బెదిరించిన ఓ ప్రైవేటు టీవీ చానల్ చీఫ్ ప్రసాద్ తో పాటు అతడి అనుచరుడు నితిన్ను కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... ప్రైవేటు టీవీ.చానల్లో చీఫ్గా ఉన్న ప్రసాద్ ఓ పారిశ్రామికవేత్త కు వ్యతిరేకంగా కథనాన్ని టీవీలో ప్రసారం చేశాడు. అనంతరం అతడికి ఫోన్ చేసి రూ.15 కోట్లు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తామని బెదిరించాడు. రూ.15 కోట్లలో ముందుగా రూ.10 కోట్లు చెల్లించాలని, మాకు తెలిసిన వ్యక్తుల పేరుతో అకౌంట్కు జమ చేయాలని పారిశ్రామికవేత్తను సూచించాడు. దీనిపై సదరు పారిశ్రామికవేత్త కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!
అత్తింటి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు బాధితురాలు ప్రముఖ వ్యాపారవేత్త త్రైలోక్య నాథ మిశ్రా కోడలు భువనేశ్వర్: అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా పోలీసులను ఆశ్రయించారు. మంగళ వారం రాత్రి తన ప్రాణానికి ముప్పు ఉందని బెదిరించారని స్థానిక బర్గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అపహరిస్తామని అత్త, మామ బెదిరించారని పేర్కొన్నారు. పెళ్లయిన కొత్తలో హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో వైవాహిక జీవితం తొలి దశలోనే తనపట్ల భర్త అమానుషంగా వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. పెద్దింటి కోడలిగా సమాజంలో గౌరవం కాపాడుకుంటు పుట్టింటికి అగౌరవం కలగకుండా జాగ్రత్తపడేందుకు చాల కాలం ఓపికతో వ్యవహరించడంతో రోజు రోజుకు వేధింపులు తీవ్రంగా మారాయి తప్ప పరిస్థితులు కుదుటపడనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తనను హత్య చేస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకి వివాహం జరిగింది. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి మిశ్రా, మామ త్రైలోక్యనాథ మిశ్రా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినట్లు బహిరంగపరిచారు. ఈ మేరకు స్థానిక మహిళా ఠాణాలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితం శూన్యం కావడంతో ఈసారి స్థానిక బర్గడ్ ఠాణాలో మరో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసుల నిర్వీర్యతపట్ల నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన బుధ వారం మీడియాకు తెలియజేశారు. మహిళా ఠాణా పోలీసుల నిర్వీర్యత ఖాతరు చేయకుండా నగర పోలీసు కమిషనరేటు ఆధ్వర్యంలో కౌన్సిలింగుకు అభ్యర్థించి చేసిన ప్రయత్నాలు కూడ ఫలించనట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. -
జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్
ఆలంపూర్ (మహబూబ్నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రంగుల కళ
మీరే పారిశ్రామికవేత్త రైతు పండించిన పత్తి నుంచి దారం తీయడం ఓ పరిశ్రమ. ఆ దారానికి వస్త్ర రూపాన్నిచ్చేది మరో పరిశ్రమ. ఆ వస్త్రాన్ని అందమైన చీరగా, చుడీదార్ మెటీరియల్గా దిద్దేది మరో పరిశ్రమ. అందమైన డిజైన్లను అచ్చుల్లో ఇమిడ్చి అలవోకగా అద్దేదే బ్లాక్ ప్రింటింగ్ పరిశ్రమ! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: శివమల్లాల బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ నిర్వహణలో రాణించాలంటే సృజనాత్మకతతో కొత్త డిజైన్లకు రూపకల్పన చేయగలగాలి. డిజైన్లలో ప్రయోగాలు చేస్తుండాలి. ఈ యూనిట్ పెట్టడానికి కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం కావాలి. అందులో 500 అడుగుల గది, 500 అడుగుల ఎండ తగిలే ఖాళీ స్థలం ఉండాలి. కావల్సిన వస్తువులు: ప్రింటింగ్ టేబుల్ -1 (ఐదున్నర మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); ట్రాలీలు - 2; ట్రేలు - 3; తాపీలు - 6; చింతాలు - 6; రెగ్జిన్ షీట్లు - 6 (ఒక్కొక్కటి అర మీటరు); క్లిప్పులు - 12; గుండు సూదులు. డై చేయడానికి... ఇరవై లీటర్ల నీరు పట్టే కడాయి (స్వీట్ షాపుల్లో వాడుతారు)-1; గ్యాస్ స్టవ్ - 1 (కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి); తొట్టెలు - 4; చిన్న బకెట్లు - 6; మీడియం సైజు బకెట్లు -4 స్టీలు గిన్నెలు - ఐదులీటర్లవి 2, రెండు లీటర్లవి 2 ఇదంతా పరిశ్రమ ఏర్పాటు కోసం ఒకసారి పెట్టుబడి. ఇందుకు కనీస అంచనా వ్యయం డెబ్భై వేల రూపాయలు. రా మెటీరియల్ కోసం... మూడు నెలల పాటు ఉత్పత్తి కొనసాగడానికి తగినంత వస్త్రాన్ని, రంగులను కొనాల్సి ఉంటుంది. ముడి సరుకులో మనం ఎంపిక చేసుకునే క్వాలిటీని బట్టి రెండు నుంచి మూడు లక్షల రూపాయలవుతుంది. ఒక టేబుల్తో రోజుకు పది చీరలు లేదా డ్రెస్సుల అద్దకం చేయవచ్చు. ఆదివారాలు, సెలవులు పోను సరాసరిన నెలకు 25 రోజులు పనిచేస్తే 250 పీసులు (చీరలు, చుడీదార్లు కలిపి) తయారవుతాయి. ఒక చీర విత్ బ్లౌజ్కు దాదాపుగా ఆరున్నర మీటర్ల వస్త్రం కావాలి. చుడీదార్కూ దాదాపుగా అంతే. రంగులు కానీ, వస్త్రం కానీ టోకుగా తీసుకోవడమే మంచిది. ఈ ఖర్చులతోపాటు గది అద్దె, కరెంటు, ఇద్దరు సహాయకుల వేతనాలు కూడా కలుపుకోవాలి. శిక్షణ, రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించండి. ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... ‘ఆంటీ, నాకు పెళ్లి కుదిరింది’ చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం. స్కూల్లో కుట్లు, అల్లికల పోటీల్లో నాకే బహుమతులు వచ్చేవి. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. యాభై వేల పెట్టుబడితో ఒక టేబుల్, నలుగురు వర్కర్లు, ఇద్దరు సహాయకులతో బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ పెట్టాను. ప్రస్తుతం నెలకు లక్షరూపాయలు ఖర్చవుతోంది. మొదట్లో కాటన్తో మొదలు పెట్టాను. ఇప్పుడు క్రేప్ వంటి ఇతర మెటీరియల్స్ మీద కూడా ప్రింట్స్ వేస్తున్నాను. ఒక ప్రైమ్ కలర్లో మరో పాస్టల్ కలర్ని ఎంత మోతాదులో కలిపితే ఎలాంటి షేడ్ వస్తుందనే విషయంలో ప్రయోగాలు చేస్తుంటాను. ఏ రెండు రంగుల కలయికలో చీర కానీ, చుడీదార్ కానీ ఆకర్షణీయంగా కనిపిస్తుందోనని ఎప్పటికప్పుడు కాంబినేషన్స్ మారుస్తుంటాను. నాకేమో ఇద్దరూ అబ్బాయిలే. డ్రెస్సులు డిజైన్ చేద్దామంటే అమ్మాయి లేదు. ఈ పరిశ్రమతో వేలాది మంది అమ్మాయిలకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. పెళ్లి కుదిరిన అమ్మాయిలు వచ్చి ‘ఆంటీ! మీకెలా బావుంటుందనిపిస్తే అలా డిజైన్ చేసివ్వండి’ అంటుంటారు. - పి.లక్ష్మీస్వరూప (పై ఫొటో మధ్యలో) వసుంధర బొటిక్, ఈఎస్ఐ, హైదరాబాద్ 9703444386 -
పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం సమావేశం
-
చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు
బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ డా.వరప్రసాద్ రెడ్డి ప్రకటన నాంపల్లి: బాపు కేవలం చిత్రకారుడు మాత్రమే కాదని...చరిత్రకారుడని పారిశ్రామికవేత్త పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి శ్లాఘించారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాపు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా సాహితీవేత్తలందరం కలిసి ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని వెల్లడించారు. కొంటె చిత్రాలు, చలన చిత్రాలను రాబోయే తరాలకు అందించినప్పుడే ఆయనకు నిజమైన అశ్రునివాళి అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కందా మాట్లాడుతూ తెలుగు భాషకు బాపు కొత్త రూపం తెచ్చారని కీర్తించారు. ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తన వంతుసాయం అందిస్తానన్నారు. సినీ నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ బాపుతో సాన్నిహిత్యం లభించినందుకు తన జీవితం ధన్యమైందని చెప్పారు. ఇప్పటి వరకు దేవతామూర్తుల చిత్రాలను కార్టూన్లుగా వేసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని తెలిపారు. సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రకారుడిగా బాపు లెజెండ్ అన్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ బాపు నిర్యాణ సభను చలోక్తులు, చమత్కారాలతో జరుపుకోవడం విశేషమన్నారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపును తలచుకొని నవ్వుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ రమణ, సన్షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్) ఎం.డి.డాక్టర్ గురువారెడ్డి, కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్, కార్టూనిస్ట్లు సుధామ, ఎస్వీ రామారావు, రచయిత ఎంబీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాకు పారిశ్రామికవేత్తకు బెదిరింపులు
విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కు మావోయిస్ట్ల పేరుతో బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయి. భారీ మొత్తంలో నగదు తమ బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ఆగంతుకులు బెదిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో ఆగంతకులు ఫోన్ చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. ఈ ఫోన్ కాల్స్ వరంగల్, కరీంనగర్ నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. ఆంగతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.