-
మరచిపోయారేమో.. నా భర్త గొప్పదనం ఇదీ: వార్నర్ భార్య
‘‘మా దేశం తరఫున మేము ఇంతకు ముందెన్నడూ చూడని అత్యత్తుమ క్రికెటర్లలో ఒకడైన డేవిడ్ వార్నర్కు అభినందనలు. ప్రతి విషయంలోనూ ముందు వరుసలో కూర్చోగలిగే గౌరవం దక్కడం పట్ల గర్వంగా ఉంది.ఇక ముందు నువ్వు ఆస్ట్రేలియా తరఫున ఆడవంటే బాధగా ఉంది. ఆసీస్ ప్లేయర్గా కచ్చితంగా నిన్ను మిస్సవుతాము.అయితే, ఇకపై నీతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపవచ్చు కాబట్టి ఓ పక్క సంతోషంగానూ ఉంది. లవ్ యూ’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ వార్నర్ భావోద్వేగానికి లోనైంది.అదే విధంగా ఆటగాడిగా తన భర్త సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ రికార్డుల విశేషాలు షేర్ చేసింది. వార్నర్ను విమర్శించిన వాళ్ల నోళ్లు మూతపడేలా అతడి అరుదైన ఘనతల గురించి చెబుతూ అతడి గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేసింది.నా భర్త గొప్పదనం ఇదీ‘‘ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్లు ఆడిన ఏకైక ప్లేయర్. ప్రపంచంలో మూడో వ్యక్తి.మూడు ఫార్మాట్లలో కలిపి 49 శతకాలు సాధించిన క్రికెటర్. ఓపెనర్గా అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్.అంతర్జాతీయ స్థాయిలో 18995 పరుగులు చేసిన క్రికెటర్. రెండుసార్లు వన్డే వరల్డ్కప్, ఒకసారి టీ20 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.టెస్టు చాంపియన్షిప్ గెలిచిన టీమ్లో మెంబర్. వరల్డ్కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఘనత. మూడుసార్లు అలెన్ బోర్డర్ మెడల్ విజేత.టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్.. ఒకవేళ ఎవరైనా మర్చిపోతారేమో.. అందుకే ఈ నిజాలు చెబుతున్నా’’ అంటూ కాండిస్ వార్నర్ ఉద్వేగపూరిత నోట్తో పాటు భర్త, కూతుళ్లతో కలిసి ఉన్న ఫొటోలు పంచుకుంది.ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంఓపెనింగ్లో బ్యాటింగ్కు దిగి ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారి కంగారు పెట్టించిన ఈ కంగారూ క్రికెటర్ వార్నర్ అంతర్జాతీయ ఆటకు సంపూర్ణంగా టాటా చెప్పేసిన విషయం తెలిసిందే. తాజాగా టీ20లకు గుడ్బై చెప్పడం ద్వారా 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు 37 ఏళ్ల వార్నర్ వీడ్కోలు పలికాడు.ఆస్ట్రేలియా ఆల్టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడైన వార్నర్ ఇన్నింగ్స్కు అర్ష్దీప్ సింగ్ తెరదించాడు. అతని చివరి ఇన్నింగ్స్ స్కోరు 6. నిరాశగా వెనుదిరగడం మినహా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ గానీ స్టాండింగ్ ఒవేషన్ గానీ అందుకోలేకపోయాడు. అతని అంతిమ స్కోరు నిరాశపరచిందేమో కానీ... అతనే ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల (3277) వీరుడు. అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకున్న అతను చేసిందేమాత్రం తక్కువ కాదు. టెస్టు, వన్డే, టి20లు కలిపి దాదాపు 19 వేల పరుగులు (18,995) సాధించాడు. 49 సెంచరీలు బాదాడు. 98 అర్ధశతకాలు చేశాడు. సొంతగడ్డపై 2009 జనవరిలో సఫారీతో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థిపై వన్డే కెరీర్ మొదలుపెట్టాడు. కానీ ఈ విధ్వంసకారుడు సంప్రదాయ టెస్టులు ఆడేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. 2011 డిసెంబర్లో కివీస్పై ఐదు రోజుల ఆటకు శ్రీకారం చుట్టాడు. ముగింపు ఇలా... ఓపెనర్గా విజయవంతమైన వార్నర్ ఆట భారత్తోనే ముగిసింది. గత నవంబర్లో భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో భారత్పై ఆడాకా ఆసీస్ విజేతగా నిలువడంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ ప్రస్తుత టి20 ప్రపంచకప్లో సూపర్–8 దశలో భారత్తోనే (మొత్తం అంతర్జాతీయ) కెరీర్కు మంగళం పాడాడు. మరక పడిందలా... ఆటలో మేటి, ఓపెనింగ్లో ఘనాపాటి. మైదానంలో చిన్నచిన్న స్లెడ్జింగ్ ఉండేదేమో కానీ బాల్ టాపంరింగ్ కంటే ముందు వార్నర్ పక్కా జెంటిల్మేనే! 2018లో సఫారీ పర్యటనలో మూడో టెస్టు (కేప్టౌన్లో) సందర్భంగా వైస్ కెప్టెన్గా ఉన్న వార్నర్, కెప్టెన్ స్మిత్, బౌలర్ బ్యాంక్రాఫ్ట్తో కలిసి బాల్ టాంపరింగ్ (బంతి ఆకారం మార్చడం)కు పాల్పడంతో ఏడాది పాటు నిషేధానికి, కెరీర్ అసాంతం కెప్టెన్సీకి దూరమయ్యాడు. 👉ఆడిన టెస్టులు: 112 👉చేసిన పరుగులు: 8786 👉సెంచరీలు: 26 👉అర్ధ సెంచరీలు: 37 👉అత్యధిక స్కోరు: 335 నాటౌట్ 👉ఆడిన వన్డేలు: 161 👉చేసిన పరుగులు: 6932 👉సెంచరీలు: 22 👉అర్ధ సెంచరీలు: 33 👉అత్యధిక స్కోరు: 179 👉ఆడిన టీ20లు: 110 👉చేసిన పరుగులు: 3277 👉సెంచరీలు: 1 👉అర్ధ సెంచరీలు: 28 👉అత్యధిక స్కోరు: 100 నాటౌట్ . -
టీమిండియా బాల్ టాంపరింగ్కు పాల్పడింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్కప్లో టీమిండియా బాల్ టాంపరింగ్కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.అర్ష్దీప్ తన సెకెండ్ స్పెల్లో (16వ ఓవర్లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. -
ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్, సూపర్-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్ సేన సెమీ ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.సెయింట్ లూసియా వేదికగా గురువారం(జూన్ 27) ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లోనే రోహిత్ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్కప్. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్ ట్రోఫీ ఉండాలి.ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్ అక్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తాడు.కాగా సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.మరోవైపు.. దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024 -
David Warner: డేవిడ్ వార్నర్ గుడ్బై
డేవిడ్ వార్నర్ ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అంతే! అంతేనా అంటే కచ్చితంగా కాదు... మనకు బాగా తెలిసిన వ్యక్తి... మనల్ని మైదానంలో (ఐపీఎల్) ఆటతో, వెలుపల సతీసమేతంగా రీల్స్తో తెలుగు వాళ్లకు సుపరిచితుడు. అతని గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓపెనింగ్లో విధ్వంసం, జట్టులో కీలకం, విజయాల్లో సంబరం! కానీ అతని బ్యాటింగ్ మెరుపులు ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో కనిపించవు. ఆరు నెలల క్రితం టెస్టు, వన్డే ఫార్మాట్లకు గుడ్బై చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా టీ20లకూ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని విధ్వంసరచన ఇకమీదట ఫ్రాంచైజీ ప్రైవేట్ టీ20 లీగ్లకే పరిమితం కానుంది. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో ఈ స్టార్ బ్యాటర్ ఇంటర్నేషనల్ కెరీర్కు తెరపడింది.కాగా ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్కప్-2024 తన అంతర్జాతీయ కెరీర్లో చివరి టోర్నీ అని ప్రకటించాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తాను వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.ఈ క్రమంలో మంగళవారం నాటి ఉత్కంఠ మ్యాచ్లో అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్ను ఓడించడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నాకౌట్ అయింది. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.టీమిండియాతో ఆడిన మ్యాచ్ చివరిదిఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ కెరీర్కు ఇక్కడితో ఫుల్స్టాప్ పడినట్లయింది. ఆసీస్ తరఫున అతడు టీమిండియాతో సోమవారం ఆడిన మ్యాచ్ చివరిది కానుంది. కాగా టీమిండియాతో మ్యాచ్లో వార్నర్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు.భారత యువ పేసర్ అర్ష్దీప్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా 37 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు.తొలుత టీ20.. తర్వాత అదే ఏడాది వన్డేల్లో అడుగుపెట్టిన వార్నర్.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్ టెస్టుల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కచ్చితంగా తనను మిస్ అవుతాంటీమిండియాతో మ్యాచ్లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అతడిని కచ్చితంగా మిస్ అవుతాం. చాలా ఏళ్లుగా అతడితో మా ప్రయాణం కొనసాగుతోంది.మూడు ఫార్మాట్లలో తను అద్భుతంగా రాణించాడు. తొలుత టెస్టులు.. తర్వాత వన్డేలకు.. ఇప్పుడు టీ20లకు ఇలా దూరమయ్యాడు. అతడు జట్టుతో లేకుండా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: ఆసీస్పై టీమిండియా విజయం.. హిట్మ్యాన్ ఖాతాలో రికార్డుల వెల్లువ
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హిట్మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో రోహిత్ సాధించిన రికార్డులు..అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఒకే ప్రత్యర్థిపై (ఆస్ట్రేలియాపై) అత్యధిక సిక్సర్లు (132 సిక్సర్లు) కొట్టిన బ్యాటర్గా రికార్డుబాబర్ ఆజమ్ను (4145) అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (4165)టీ20 వరల్డ్కప్లో అత్యధిక స్కోర్ (92) సాధించిన భారత కెప్టెన్గా రికార్డుపొట్టి ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్గా రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు (529)అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్గా రికార్డుటీ20 వరల్డ్కప్లో ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు (8) బాదిన భారత బ్యాటర్గా రికార్డుప్రస్తుత ప్రపంచకప్ (2024)లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి (19 బంతుల్లో) రికార్డు -
T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 24) జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హిట్మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం హిట్మ్యాన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తిని, ఉత్సాహాన్నిచ్చింది. ప్రత్యర్ధి ఎంత ప్రమాదకమైందో తెలుసు. కలిసికట్టుగా ఆడాలకున్నాం. అలాగే చేశాం. 200 చాలా మంది స్కోర్. ఇక్కడ గాలి చాలా బిగ్ ఫాక్టర్. ఏమైనా జరిగి ఉండవచ్చు. అయితే మేము అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకున్నాం. వ్యక్తిగతంగానూ అందరూ రాణించారు. సరైన సమయాల్లో వికెట్లు పడగొట్టడం ప్లస్ పాయింట్ అయ్యింది. కుల్దీప్ బలం గురించి బాగా తెలుసు. అతన్ని సరైన సమమంలో వినియోగించుకోవాలి. అమెరికా ఫేస్లో పిచ్లు పేసర్లకు అనుకూలించేవి. అందులో కుల్దీప్కు అక్కడ అవకాశాలు దక్కలేదు. వ్యక్తితంగా నా బ్యాటింగ్ విషయానికొస్తే.. చాలా సంతృప్తినిచ్చిన ఇన్నింగ్స్ ఇది. సెంచరీ గురించిన ఆలోచనే లేదు. మొదటి నుంచి ఎలా ఆడానో (వేగంగా) అలాగే ఆడాను. స్టార్క్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. సెమీస్ విషయానికొస్తే.. కొత్తగా ఏమీ ట్రై చేయాలని అనుకోవట్లేదు. టోర్నీ ఇప్పటివరకు ఎలా ఆడామో అలాగే ఆడతాం. ఎవరేమీ చేయాలో ప్లాన్ చేసుకుంటాం. మున్ముందు ఏం జరుగుతుందో పెద్ద ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడతాం. ప్రత్యర్ధి గురించి పెద్దగా ఆలోచన లేదు. జట్టుగా ఇదే మా ప్రణాళిక. -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..సెమీస్కు టీమిండియా (ఫొటోలు)
-
T20 World Cup 2024: బాబర్ ఆజమ్ రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత కెప్టెన్లలో అతి తక్కువ మ్యాచ్ల్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా రోహిత్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్తో సమానంగా నిలిచినప్పటికీ.. మ్యాచ్ల పరంగా బాబర్ కంటే తక్కువ మ్యాచ్ల్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. హిట్మ్యాన్ కేవలం 60 మ్యాచ్ల్లో 48 విజయాలు సాధించగా.. బాబర్కు ఈ మార్కును తాకేందుకు 85 మ్యాచ్లు అవసరమయ్యాయి. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ ఈ రికార్డును సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శివాలెత్తిపోవడంతో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హిట్మ్యాన్ వీరవిహారం (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ (31), శివమ్ దూబే (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విరాట్ కోహ్లి (0) మరోసారి నిరాశపరిచాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. హెడ్కు జట్టులో మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (37), మ్యాక్స్వెల్ (20), టిమ్ డేవిడ్ (15), కమిన్స్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్.. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. -
T20 WC 2024: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. సెమీస్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓ దశలో ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్దే విజయమని అంతా భావించారు. కానీ 17 ఓవర్ వేసిన బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్ను బోల్తా కొట్టించడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. అంతకుముందు ఓవర్ అర్ష్దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మార్ష్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఒక్క వికెట్ సాధించారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ ఫలితం కోస ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిముఖం పడుతోంది. గ్రూపు-1 నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సెమీస్కు చేరుతోంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో రోహిత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా హిట్మ్యాన్ సిక్స్ల వర్షం కురిపించాడు. రోహిత్ను ఆపడం కంగారుల తరం కాలేదు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో 200 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 157 మ్యాచ్లు ఆడిన రోహిత్ 203 సిక్స్లు బాదాడు. హిట్మ్యాన్ తర్వాత మార్టిన్ గప్టిల్(173), జోస్ బట్లర్(137), గ్లేన్ మ్యాక్స్వెల్(133), నికోలస్ పూరన్(132), సూర్యకుమార్ యాదవ్(131) ఉన్నారు.అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ప్రత్యర్ధిపై అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాపై 132 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఇంగ్లండ్పై 130 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్తో గేల్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.టీ20 వరల్డ్కప్లో ఒకే మ్యాచ్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత ప్లేయర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై యువీ 7 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్లో 8 సిక్స్లు కొట్టిన హిట్మ్యాన్ యువరాజ్ రికార్డును బ్రేక్ చేశాడు.టీ20 వరల్డ్కప్-2024లో ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన ప్లేయర్గా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను రోహిత్ అందుకున్నాడు. -
రోహిత్ శర్మ విధ్వంసం.. జస్ట్ సెంచరీ మిస్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా హిట్మ్యాన్ చెలరేగాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డారెన్ సామీ క్రికెట్ స్టేడియం రోహిత్ సిక్సర్ల వర్షంతో తడిసి ముద్ద అయింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రోహిత్ తృటిలో తన ఆరో టీ20 సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రోహిత్ సెంచరీ చేయకపోయినప్పటకి తన బ్యాటింగ్తో ఫ్యాన్స్ను మాత్రం ఖుషీ చేశాడు. వన్డే వరల్డ్కప్లో ఫైనల్లో ఓడించారన్న కసిని ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ చూపించేశాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. శెభాష్ హిట్మ్యాన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. No true " Rohit Sharma " Fan Will Pass without liking this post 🔥Rohit hitting Starc in IND vs AUS match is the peak beauty#INDvsAUS #Rohit #RohitSharma pic.twitter.com/UDtsfdyw4Q— WORLD CUP FOLLOWER (@BiggBosstwts) June 24, 2024 -
రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు.కాగా గ్రూప్-1లో టాప్లో ఉన్న భారత జట్టు సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆసీస్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ విరాట్ కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్నాడు. ధనాధన్ దంచికొడుతూ 19 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఐదో భారత బ్యాటర్గా నిలిచాడు.హిట్మ్యాన్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకుంటూ పరుగుల వరద పారించాడు. రోహిత్ శర్మ దెబ్బకు పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు సాధించింది.ఇక మూడో ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఏకంగా29 పరుగులు పిండుకున్నాడు రోహిత్. 6, 6, 4, 6, 0, 6తో అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఆసీస్తో మ్యాచ్లో రోహిత్ శర్మ 41 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయి సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతర్జాతీయ టీ20లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్లు12 యువరాజ్ సింగ్- 2007లో ఇంగ్లండ్ మీద18 కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద18 సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద19 గౌతం గంభీర్- 2009లొ శ్రీలంక మీద19 రోహిత్ శర్మ- 2024లో ఆస్ట్రేలియా మీద. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2024 IND vs AUS: ఆసీస్పై ఘన విజయం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్
India vs Australia match live updates and highlights:ఆసీస్పై ఘన విజయం..టీ20 వరల్డ్కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఇక ఈ విజయంతో 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.వారెవ్వా బుమ్రా..భారత బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న హెడ్.. బుమ్రా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 153/5ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..135 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్టోయినిష్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 148/4. క్రీజులో ట్రావిస్ హెడ్(75), డేవిడ్(2) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. మార్ష్ ఔట్128 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మాక్స్వెల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.13 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 128/213 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(63), మాక్స్వెల్(20) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. మార్ష్ ఔట్87 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. 10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 99/2. క్రీజులో ట్రావిస్ హెడ్(54), మాక్స్వెల్(0) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆసీస్6 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(26), మిచెల్ మార్ష్(31) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(15), హెడ్(0) ఉన్నారు.రోహిత్ శర్మ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు.18 ఓవర్లకు భారత్ స్కోర్: 181/418 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(12), శివమ్ దూబే(28) పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్.. సూర్య ఔట్టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), హార్దిక్ పాండ్యా(2) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్127 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రోహిత శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్లో 8 సిక్స్లు, 7 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత్.. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(92), సూర్య(17) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. పంత్ ఔట్93 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రిషబ్ పంత్.. స్టోయినిష్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(76), సూర్య ఉన్నారు.రోహిత్ శర్మ ఫిప్టీ.. 6 ఓవర్లు భారత్ స్కోర్: 60/16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 6 సిక్స్లు ఉన్నాయి. క్రీజులో రోహిత్ శర్మ(51), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నాడు.రోహిత్ జోరుకు వరుణుడు బ్రేక్..సెయింట్ లూసియా వేదికగా జరుగుతున్న ఆసీస్-భారత్ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. 4.1 ఓవర్ల వద్ద భారత్ ఇన్నింగ్స్ వర్షం కారణంగా అగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ మంచి జోష్లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్స్లు, 2 ఫోర్లతో 41 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్గా 4.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది.రోహిత్ ఆన్ ఫైర్.. 3 ఓవర్లకు బారత్ స్కోర్: 35/1విరాట్ కోహ్లి ఔటైనప్పటకి రోహిత్ శర్మ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మూడో ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రోహిత్ 4 సిక్స్లు, ఒక బౌండరీతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 35/1టీమిండియాకు బిగ్ షాక్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. హాజిల్వుడ్ బౌలింగ్లో డేవిడ్కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.టీ20 వరల్డ్కప్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. ఆస్టన్ ఆగర్ స్ధానంలో పేసర్ మిచెల్ స్టార్క్ వచ్చాడు.తుది జట్లుభారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్ -
T20 World Cup 2024: టీమిండియాతో 'కీ' ఫైట్.. ఆసీస్ గుండెల్లో గుబులు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం జరుగనుంది. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.అయితే ఈ మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సెయింట్ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం.ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్కు చేరుకుంటుంది. ఆసీస్ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్తో మ్యాచ్ రద్దైతే ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి.మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్తో పాటు సెమీస్కు చేరుకుంటుంది. ఆసీస్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్లో ఆస్ట్రేలియా.. భారత్పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.ఇలా జరిగితే మాత్రం భారత్ ఇంటికే..ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నా సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారతపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్ఘనిస్తాన్ 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడిస్తే రన్రేట్లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత క్రికెటర్ మహ్మద్ షమీ.. ఫిట్నెస్పై దృష్టి సారించాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ పేస్ బౌలర్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న షమీ.. ట్రెయినింగ్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ డాక్టర్ నితిన్ పటేల్, కండిషనింగ్ కోచ్ రజినీకాంత్ ఆధ్వర్యంలో పురోగోతి సాధిస్తున్నాడు.అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడువీలైనంత త్వరగా టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల్ రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఏదేమైనా తను ఈ మాత్రం కోలుకోవడం శుభసూచకం’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు.కాగా రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.వికెట్ల వీరుడిగావన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన షమీ.. చీలమండ గాయంతో గతేడాది నవంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 కూడా ఆడలేకపోయాడు. ఇక గాయానికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలా ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. టీమిండియా షెడ్యూల్ ఇదే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు స్వదేశంలో 5 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబరులో భారత్లో బంగ్లాదేశ్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్తో బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడుతుంది.అక్టోబర్ 12న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. విదేశీ టూర్ల వివరాలున్యూజిలాండ్తో సిరీస్ ముగిశాక భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది.ఇక ఈ ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్ను ఆడుతుంది. నవంబర్ 8న డర్బన్లో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. ఆ తర్వాత పోర్ట్ ఎలిజబెత్లో 10న రెండో టి20, 13న సెంచూరియన్లో మూడో టి20, 15న జొహన్నెస్బర్గ్లో జరిగే చివరిదైన నాలుగో టీ20తో పర్యటన ముగుస్తుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్-2024తో బిజీగా ఉంది. సెమీస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.బంగ్లాదేశ్తో తొలి టెస్టు: సెప్టెంబరు 19–23 (చెన్నై) రెండో టెస్టు: సెప్టెంబరు 27–అక్టోబర్ 1 (కాన్పూర్) తొలి టి20: అక్టోబర్ 6 (ధర్మశాల) రెండో టి20: అక్టోబర్ 9 (న్యూఢిల్లీ) మూడో టి20: అక్టోబర్ 12 (హైదరాబాద్) న్యూజిలాండ్తో తొలి టెస్టు: అక్టోబర్ 16–20 (బెంగళూరు) రెండో టెస్టు: అక్టోబర్ 24–28 (పుణే) మూడో టెస్టు: నవంబర్ 1–5 (ముంబై) ఇంగ్లండ్తో తొలి టి20: జనవరి 22 (చెన్నై) రెండో టి20: జనవరి 25 (కోల్కతా) మూడో టి20: జనవరి 28 (రాజ్కోట్) నాలుగో టి20: జనవరి 31 (పుణే) ఐదో టి20: ఫిబ్రవరి 2 (ముంబై) తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్పూర్) రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్) మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్).చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
టీమిండియా సూపర్-8 మ్యాచ్లకు అంపైర్లు వీరే.. విలన్ ఉన్నాడు జాగ్రత్త..!
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలను ఢీకొట్టనుంది. కీలకమైన ఈ మ్యాచ్లకు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించే వారి పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్ 19) ప్రకటించింది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్కు రాడ్నీ టక్కర్, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. జూన్ 22న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్కు మైఖేల్ గాప్, ఆడ్రియన్ హోల్డ్స్టాక్.. జూన్ 24న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు రిచర్డ్ కెటిల్బరో, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.విలన్ ఉన్నాడు జాగ్రత్త..!సూపర్-8లో టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడబోయే కీలకమైన మ్యాచ్కు సీనియర్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించనున్నాడు. కెటిల్బరో పేరు వింటేనే భారత అభిమానులు ఉలిక్కిపడతారు. ఎందుకంటే అతను అంపైర్గా వ్యవహరించిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు అదే కెటిల్బరో సూపర్-8లో ఆసీస్తో కీలకమైన మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించనుండటంతో భారత క్రికెట్ అభిమానులు కలవపడుతున్నారు. భారత్ మరోసారి ఓడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ టీమిండియాను ముందుగానే హెచ్చరిస్తున్నారు. విలన్ ఉన్నాడు జాగ్రత్త అంటూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. -
T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 వరల్డ్కప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్లు జరగాల్సి ఉన్నా.. సూపర్-8కు చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య పోటీ నెలకొంది. గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సూపర్-8కు క్వాలిఫై కాగా.. శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారికంగా సూపర్-8 రేసులో ఉన్నప్పటికీ.. అనధికారికంగా బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకుంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సైపర్-8కు అర్హత సాధించగా.. అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్-8 రేసులో ఉన్నాయి. వీటిలో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేసులో ఉండగా.. ప్రధాన పోటీ యూఎస్ఏ, పాక్ మధ్యలోనే నెలకొంది. ఇవాళ (జూన్ 14) జరుగబోయే మ్యాచ్లో యూఎస్ఏ.. ఐర్లాండ్ను ఓడించినా లేక ఈ మ్యాచ్ రద్దైనా యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!సూపర్-8 బెర్త్లపై ఓ అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆప్ట్రేలియా జట్లతో పోటీడనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.జూన్ 20- భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్జూన్ 22- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు)జూన్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా -
'Super-8' లో ఆసీస్ భారత్ పోరు.. ముందుగానే ఫిక్స్ ! ఎలా అంటే?
టీ20 వరల్డ్కప్-2024 లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 17తో లీగ్ దశ మ్యాచ్లు ముగియునున్నాయి. ఇప్పటికే ప్రతీ గ్రూపు నుంచి ఒక్కో జట్టు తమ సూపర్-8 బెర్త్ను ఖారారు చేసుకున్నాయి. ఈ క్రమంలో సూపర్-8 సమీకరణాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ⇒ఈ మెగా టోర్నీలో బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. గ్రూపు-ఏ నుంచి సూపర్-8కు క్వాలిఫై అయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన భారత్ మూడింట కూడా విజయం సాధించి గ్రూపు-ఏ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచింది. గ్రూపు-ఎ నుంచి మరో సూపర్-8 బెర్త్ కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీ పడతున్నాయి.⇒మరోవైపు నమీబియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా గ్రూపు-బి నుంచి సూపర్ 8 బెర్త్ను ఖారారు చేసుకుంది. ఆసీస్ కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది గ్రూపు-బి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. గ్రూపు-బి నుంచి మరో స్ధానం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు పోటీలో ఉన్నాయి.⇒అదేవిధంగా గురువారం న్యూజిలాండ్ను 13 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్ గ్రూపు-సి సూపర్-8కు అర్హత సాధించింది. విండీస్ కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది గ్రూపు-సి పాయింట్ల పట్టికలో తొలి స్ధానంలో ఉంది. గ్రూపు-సి నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సూపర్-8 క్వాలిఫై అవకాశం ఉంది.⇒ఇక చివరగా గ్రూపు-డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్పై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రోటీస్ తమ సూపర్-8 బెర్త్ను ఖారారు చేసుకుంది. గ్రూపు-డి నుంచి మరో స్ధానం కోసం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి.సూపర్-8లో ఆసీస్ భారత్ పోరు..సూపర్-8 దశ మ్యాచ్లు జూన్ 19 నుంచి ప్రారంభం కాన్నాయి. కాగా ఈ టోర్నీలో భాగమయ్యే ప్రధాన జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందుగానే సీడింగ్(పొజిషిన్) కేటాయించింది. భారత్(A1), పాకిస్తాన్(A2), ఇంగ్లండ్(B1), ఆస్ట్రేలియా(B2), న్యూజిలాండ్(C1), వెస్టిండీస్(C2), దక్షిణాఫ్రికా(D1), శ్రీలంక(D2)గా ఫిక్స్ చేశారు. అంటే గ్రూపు స్టేజిలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిస్తే చాలు స్థానంతో సంబంధం లేకుండా సీడింగ్ ఆధారంగా ఆయా జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఉదాహరణకు గ్రూపు-ఎలో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచినప్పటికి ఏ1 గానే సూపర్-8కు క్వాలిఫై అవుతోంది. అదేవిధంగా సీడింగ్ కెటాయించిన జట్ల లీగ్ స్టేజిలో ఇంటిముఖం పడితే.. ఆ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు ఆయా స్ధానాలను భర్తీ చేస్తాయి. అయితే లీగ్ స్టేజీలో మొత్తం 20 జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. గ్రూపు-ఎ, గ్రూపు-బి, గ్రూపు-సి, గ్రూపు-డిగా కేటాయించారు. ప్రతీ గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8ని కూడా ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో ఎ1, బి2, సి1, డి2.. గ్రూపు-2లో ఎ2, బి1, సి2, డి1 జట్లు సూపర్-8 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సమీకరణాలుప్రకారం సూపర్-8 రౌండ్లో జూన్ 23న గ్రూపు-2లో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. అదేవిధంగా జూన్ 24 గ్రూపు-1లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడన్నాయి. సూపర్-8 గ్రూపు 1లో టీమిండియా(ఎ1), ఆస్ట్రేలియా(బి2) జట్లు ఉన్నాయి. అంతకంటే ముందు జూన్ 20న గ్రూపు స్టేజిలో సి1గా నిలిచిన జట్టుతో భారత్ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న గ్రూపు స్టేజిలో డి2గా నిలిచిన జట్టుతో భారత్ తమ రెండో మ్యాచ్ ఆడనుంది. -
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్ల్యాండ్ వేదికగా జరుగనుంది.రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్బోర్న్ వేదికగా జరుగనుంది.టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్లో జరుగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్లో)రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్లో)మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్లో)నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్బోర్న్లో)ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. -
అతడి దెబ్బకు కన్ను వాచింది.. అలా ప్రతీకారం తీర్చుకున్నా: కోహ్లి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ పోరంటే ఈ రన్మెషీన్ మరింత జోరుగా బ్యాట్ ఝులిపిస్తాడు. ఇక 2014- 15లో తొలిసారిగా కంగారూ గడ్డ మీద భారత కెప్టెన్ హోదాలో ఆడిన కింగ్ కోహ్లి.. 692 పరుగులతో అదరగొట్టాడు. ఆ సిరీస్లో టీమిండియా బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచి సత్తా చాటాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. తదుపరి బ్రిస్బేన్లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఆ సిరీస్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఆఖరి రెండు టెస్టులను డ్రా చేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ టూర్లో మొదటి మ్యాచ్లో తమ మొదటి బంతినే మిచెల్ జాన్సెన్ విసురుగా విసరడంతో.. నా తలకు దెబ్బ తగిలింది. అసలేం జరిగిందో కాసేపటి వరకు నాకేం అర్థం కాలేదు. దాదాపు 60 రోజుల పాటు.. అలా ఆడాలా.. ఇలా ఆడాలా అంటూ షాట్ల విషయంలో తికమకపడ్డా. దెబ్బ అంత గట్టిగా తగిలింది మరి! నా ఎడమ కన్ను వాపు వచ్చేది. కంటిచూపు కూడా కాస్త మందగించింది. అయితే, చాలా రోజుల వరకు నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను. ఇక ఆరోజు లంచ్ సమయంలో.. నా ముందు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఫిక్సయ్యాను. ఒకటి ఫైట్.. రెండోది ఫ్లైట్. పట్టుదలగా నిలబడి ఆడాలి లేదంటే వెళ్లిపోవాలి.. బాగా ఆలోచించి పోరాడాలనే నిర్ణయించుకున్నా. ఇంతలో ఒకరు.. నిన్ను తల మీద కొట్టడానికి అతడికి ఎంత ధైర్యం అని నాతో అన్నారు. అందుకు బదులుగా..‘అతడి(బౌలింగ్)ని ఈ సిరీస్లో ఎంతలా చితక్కొడతానో చూడు’ అని చెప్పాను. అన్నట్లుగా అతడి బౌలింగ్ను తుత్తునియలు చేశాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2014 -15లో ఆసీస్తో సిరీస్లో తొలి టెస్టుకు నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కాగా.. కోహ్లి సారథ్యం వహించాడు. ఇక రెండు, మూడో టెస్టులకు అందుబాటులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించగా.. నాలుగో మ్యాచ్ నుంచి కోహ్లి అధికారికంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ దిగ్గజాలు ఇద్దరూ ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. “Isko mein itna maarunga naa, and that’s exactly what I did” Kohli saab talking about the 2014 Australia tour and his battle against Mitchell Johnson 👑💪🏻 pic.twitter.com/geP35IUz08 — Aani⁷ ★彡 (@wigglyywhoops) April 11, 2024 చదవండి: అంపైర్తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ ఆసీస్ దిగ్గజం -
IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్గా సాగనుంది. పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్.. నవంబర్ 22-26- పెర్త్ డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్) డిసెంబర్ 14-18- గబ్బా డిసెంబర్ 26-30- మెల్బోర్న్ 2025 జనవరి 3-7- సిడ్నీ -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్ల సిరీస్ కాకుండా ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ మ్యాచ్ను కూడా యాడ్ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్ల్లో (BGT) భారత్ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2018-19, 2020-21 సిరీస్లను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్ట్ల్లో భారత్ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. భారత్లో జరిగిన 2016-17 సిరీస్లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్లో కూడా భారత్.. 2-1 తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ లెక్కన టీమిండియా ఆసీస్పై వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్ల్లో 2020-21 గబ్బా టెస్ట్కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. రాబోయే సిరీస్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేదికలను లాక్ చేసినట్లు సమాచారం. తొలి టెస్ట్: పెర్త్ రెండో టెస్ట్: అడిలైడ్ (డే అండ్ నైట్) మూడో టెస్ట్: గబ్బా నాలుగో టెస్ట్: మెల్బోర్న్ ఐదో టెస్ట్: సిడ్నీ -
ఓడినా పర్వాలేదు.. ఛాంపియన్స్లా ఆడారు: ఇషాంత్ శర్మ
అండర్-19 ప్రపంచకప్ టైటిల్ను ఆరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నేరవేరలేదు. ఆదివారం బెన్నోని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తాశారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఒత్తడిలో చిత్తయ్యారు. వరుసక్రమంలో పెవిలియన్కు క్యూ కడుతూ.. ఆసీస్కు నాలుగో సారి వరల్డ్కప్ టైటిల్ను అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(47), మురుగణ్ అభిషేక్(42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుకు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సపోర్ట్గా నిలిచాడు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీ మొత్తం ఛాంపియన్స్లా ఆడిందని ఇషాంత్ కొనియాడాడు. "మన అండర్-19 జట్టు ఛాంపియన్స్లా ఆడింది. ఈ టోర్నమెంట్లో వారు పడిన కష్టాన్ని ఒక్క మ్యాచ్(ఫైనల్)తో పోల్చవద్దు. ఈ రోజు మనది కాదు. ఆటలో గెలుపుటములు సహజం. కానీ టోర్నమెంట్ అంతటా యువ ఆటగాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు, పోరాట పటిమని చూసి యావత్తు భారత్ గర్విస్తోంది. మీరు తల దించుకోండి బాయ్స్.. అంతకంటే బలంగా తిరిగి రండి" అంటూ ఇషాంత్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. -
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్కప్లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్మన్, రాఫ్ మెక్మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయాం. బ్యాటింగ్లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.