-
వివాహేతర సంబంధం.. యువకుడు దారుణ హత్య
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోకబత్తిని వంశీ (23) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి చంద్రమోహన్ భార్యతో వంశీ కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రమోహన్ యువకుడిని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తున్న వంశీపై చంద్రమోహన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల, ఛాతిపై దాడిచేశాడు. వంశీ అరుపులు విన్న తల్లి ప్రమీల అడ్డుకోబోగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడ్డ వంశీని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి నిందితుడు చంద్రమోహన్ను అరెస్టు చేసినట్టు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ప్రియుడి కోసం.. బాబును, భర్తను చంపేసింది
వేలూరు : ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్లు వారి కాపురం సాఫీగా సాగిపోయింది. ఏడాది క్రితం కుమారుడు జన్మించడంతో సంబరపడ్డారు. అయితే వివాహేతర సంబంధం వారి మధ్య చిచ్చుపెట్టింది. రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాలు.. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్పుర మందవేలి గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రిషియన్. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దీపిక (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ప్రనీష్(1) ఉన్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని దీపిక ఆర్కాడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సెల్ నంబర్ చెబితే వెంటనే కనిపెడతామని పోలీసులు ఆమెకు తెలిపారు. అయితే తన భర్త సెల్ఫోన్ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడడంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారణ చేశారు. ఆ సమయంలో దీపిక తన భర్త రాజా, కుమారుడు ప్రనీష్లను హత్య చేసి ఇంటి సమీపంలోని భూమిలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకుంది. అవాక్కైన పోలీసులు గురువారం రాత్రి మృతదేహాలు పూడ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయం కావడంతో దీపికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి శుక్రవారం ఉదయం మృతదేహాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం తహసీల్దార్ వత్సల, డీఎస్పీ కలైసెల్వన్, వేలి ముద్ర నిపుణులను రప్పించి మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో రాజా బంధువులు దీపికపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు దీపికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం పాతి పెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. వారిని చూసి రాజా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో దీపిక భర్త రాజా తలపై రాతితో కొట్టి హత్య చేసి అనంతరం కుమారుడిని హత్య చేసినట్లు తెలిసింది. దీపికకు భర్త రాజా స్నేహితుడు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
భార్యపై అనుమానంతోనే హత్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపినట్లు పోలీసుల వద్ద నిందితుడు హరీశ్ అంగీకరించినట్లు పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 24న గట్టెపల్లిలో గన్నిసంచిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. కరీంనగర్లో ఫ్యాషన్ డిజైనర్గా రమ పని చేసిన సమయంలో శ్రీరాం చిట్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న రేవెళ్లి హరీశ్తో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కరీంనగర్లోని హజ్మత్పురాలో ఆరీఫ్ ఇంట్లో అద్దెకు జాడి రమ అలియాస్ లక్కీఅలియాస్ సిరివెన్నెలతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ రమ తరచూ ఫొన్లో మాట్లాడడాన్ని హరీష్ గమనించి తప్పుబట్టాడు. ఏప్రిల్ 7వ తేదీన తన భర్త వేధిస్తున్నాడని 100కి ఫోన్చేసి రమ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీన్ని మనుసులో పెట్టుకొని హత్య చేసినట్లు హరీశ్ ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ఈనెల 21న అద్దెకుంటున్న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి తన ద్విచక్ర వాహనంపై గట్టెపల్లిలో గన్నిసంచిలో పడేసినట్లు అంగీకరించాడని వివరించారు. సోషల్ మీడియాలో, పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు మృతురాలి కుటుంబసభ్యులు అక్క రాధా, అన్న భానేశ్, ఇంటి యజమాని ఆరీఫ్ సుల్తానాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండురోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. రమది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నార్వ స్వగ్రామం. నిందితుడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ నివాసి అని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ మహేందర్రెడ్డి, ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
సాక్షి, చిత్తూరు రూరల్ : వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు. కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని
తలకొండపల్లి(కల్వకుర్తి): బావిలో పడి వృద్ధురాలు మరణించిన కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని వృద్ధురాలిని బావిలోకి తోసి చంపేశారని సీఐ నర్సింహారెడ్డి చెప్పారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పడకల్ గ్రామానికి చెందిన చెవిటి మైసమ్మ (66) వృద్ధురాలు జనవరి 14న గ్రామ శివారు ప్రాంతంలోని బావిలో పడి మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య చేసినట్లుగా వెల్లడైంది. పడకల్ గ్రామానికి చెందిన బురిగళ్ల దుర్గయ్య, బురిగళ్ల సంతోష వరుసకు వదిన, మర్దిలు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. మైసమ్మ ఇంటి సమీపంలోనే సంతోష ఇల్లు ఉంది. దీంతో దుర్గయ్య తరచూ సంతోష ఇంటికి వస్తుండేవాడు. విషయం గమనించిన మైసమ్మ మంచి పద్ధతి కాదని ఇరువురిని మందలించింది. వీరి మధ్య తరచుగా వాగ్వాదం కొనసాగుతుండేది. మృతురాలు మైసమ్మ అడ్డు తొలగించుకోవాలని దుర్గయ్య, సంతోషలు పథకం పన్నారు. ఇదిలా ఉండగా సంతోష బంగారు నగలు కొనివ్వమని తన ప్రియుడైన దుర్గయ్యను అడుగుతుండేది. దీంతో దుర్గయ్యకు ఒంటరిగా ఉన్న మైసమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది. మైసమ్మను చంపి ఆభరణాలను తస్కరించి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మైసమ్మ అడ్డుతో పాటు, బంగారు ఆభరణాలు సొంతం అవుతాయని, ఈ విషయాన్ని సంతోషకు చెప్పాగా ఆమె హత్యచేసేందుకు అంగీకరించింది. నగలు వస్తాయి.. అడ్డు తొలగుతుందని.. పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. జనవరి 9వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో దుర్గయ్య, సంతోష ఇద్దరూ కలిసి మైసమ్మ ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మైసమ్మ గొంతు నులిమి చంపేశారు. మైసమ్మ ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్ఫోన్ను దొంగలించారు. సాక్ష్యం దొరక్కుండా మృతదేహాన్ని గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న పాడుబడిన బావిలో పడేశారు. 14వ తేదీన గ్రామస్తులు బావిలో తేలాడుతున్న మైసమ్మ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పదస్థితి మృతి కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు దుర్గయ్య, సంతోషలను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసుల సహకారంతో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు నిందితులు దుర్గయ్య, సంతోషలను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సురేష్యాదవ్, తదితరులు ఉన్నారు. -
వివాహిత హత్య.. భర్తే నిందితుడు
ధన్వాడ(నారాయణపేట): మండలంలోని కిష్టాపూర్ పంచాయతీలోని మూలతండాలో మంగళవారం ఉదయం అనిత(23) హత్యకు గురైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు... మూలతండాకు చెందిన బాల్యనాయక్కు అనితతో ఆరేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను నానమ్మ వద్ద ఉంచి వీరు బతుకుదెరువు కోసం పూణె వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. పిల్లలను చూసేందుకు నాలుగు రోజుల క్రితం తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో అనిత తన మేనల్లుడి(4)ని తీసుకొని పక్కనే ఉన్న తమ పొలంలో కంది కట్టెల కోసం వెళ్లింది. కొద్దిసేపటికే మేనల్లుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9గంటలైనా ఇంకా అనిత ఇంటికి రాకపోవడతో మరదలు వరసైన చిట్టెమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే అనిత మృతిచెందింది. స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. భార్యను కడతేర్చిన భర్త మృతదేహం వద్దకు చేరుకున్న ధన్వాడ ఇన్చార్జ్ ఎస్ఐ జానకిరాంరెడ్డి, అనిత మృతి విషయమై ఆమె భర్త బాల్యనాయక్ను అడిగారు. పొంతన లేకుండా మాట్లాడడంతో అనుమానం వచ్చి, విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య పూణెలో మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతోందని తెలిపాడు. అందుకే చంపానని విచారణలో వెల్లడించాడు. కర్చిఫ్ గొంతుకు బిగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తండాకు వెళ్లిపోయాడని ఎస్ఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
వివాహేతర సంబంధం.. తల, మొండెం...
కేవీబీపురం: యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ(19) దారుణ హత్యకు గురవడం విదితమే. అతడి తల, మొండెం, చేయి, కాలు నరికి వేసి, తలను మరొక చోట పూడ్చి పెట్టడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ను గురువారం పుత్తూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరు రూరల్ సీఐ దైవప్రసాద్ కేవీబీపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు వెల్లడించిన వివరాలు...మండలంలోని దిగువపూడికి చెందిన వంశీ(19) అదే గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(నాగేష్) స్నేహితులు. నాగేష్ తిరుమలలో టీ అమ్ముకుంటూ, వారానికోసారి భార్యాపిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తన భార్యతో వంశీ చనువుగా ఉండడాన్ని గమనించాడు. భార్యను మందలించినా ప్రయోజనం లేకపోవడంతో ఎలాగైనా వంశీని అంతమొందించాలని నాగేష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు. గత గురువారం కట్టెల కోసమని అడవికి వెళుతున్న వంశీకి తోడుగా వస్తానని నమ్మబలికాడు. అడవికి వెళ్లిన తరువాత వంశీని నాగేష్ ప్రశ్నించాడు. తన భార్యతో చనువుగా ఉండటంపై నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరూ కలియబడ్డారు. వంశీ కింద పడిపోవడంతో అతడు కట్టెలను నరికేందుకు తెచ్చుకున్న కత్తిని తీసుకుని నాగేష్ వంశీ మెడను నరికాడు. ఆపై వంశీ తలను మొండెం నుంచి వేరు చేశాడు. అలాగే కుడి చెయ్యి భుజం వరకూ, ఎడమకాలును వేరుచేసాడు. మొండాన్ని పొదలచాటున పడేసి, తలను మొండెం ఉన్నచోటుకు 20 మీటర్ల దూరంలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని రాళ్ల నడుమ ఆకులతో కప్పెట్టి, యథావిధిగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యను విజయపురం మండలం ఎస్ఆర్ కండ్రిగలోని అత్తగారి ఇంటికి పంపించి నాగేష్ పరారయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులు కేసు దర్యాప్తుకు కీలక ఆధారమయ్యాయి. వాటి ఆధారంగా వంశీని నాగేష్ హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడిని పుత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు చెప్పారు. కేసును ఛేదించిన కేవీబీపురం ఎస్ఐ గోపి, సిబ్బంది ప్రభాకర్, రాజా, బాలాజి ,రాధాకృష్ణను సీఐ అభినందించారు. -
న్యాయం కోసం... భర్త ఇంటి ఎదుట ధర్నా
జూబ్లీహిల్స్: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెం దిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివా హం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్లోని సీ 83బ్లాక్లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడ ని ఆమె ఎస్సార్నగర్లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్స్టేషన్లో కేసు పెట్టా లని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకురన్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వా లేదు... చేతిలో చిల్లిగవ్వా లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. బాధితురాలు లక్ష్మి -
వివాహేతర సంబంధం.. ప్రియురాలు దారణ హత్య
చంద్రగిరి: తనతో కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వీఆర్వో ఎందుట లొంగిపోయాడు. స్థానికుల కథనం మేరకు..మండలంలోని మల్లయ్యపల్లికి చెందిన చెంచు మునికి మండపంపల్లికి చెందిన గిరిజ(33)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిరిజ అదే గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు గిరి(38)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గిరిజ అదే గ్రామానికి చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గిరి అనుమానించాడు. ఈ విషయంపై గిరిజతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన గిరిజ, గిరి వ్యవసాయ బావి వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన గిరి పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గిరిజ అక్కడికక్కడే మృతిచెందింది. గిరి తన ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లి మృతదేహాన్ని మూటకట్టి బావిలో పడేసి వెళ్లిపోయాడు. భర్త ఫిర్యాదుతో సంఘటన వెలుగులోకి.. 10 రోజులుగా తన భార్య కనిపించడంలేదని గిరిజ భర్త చెంచు ముని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన గిరిపై తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. తన భార్య సెల్ఫోన్ కూడా అతని వద్దే ఉన్నట్టు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిందితుడు గిరి చంద్రగిరి వీఆర్వో మునస్వామి ఎదుట లొంగిపోయాడు. గిరిజను తానే హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించాడు. అతన్ని వీఆర్వో పోలీసులకు అప్పగించారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు మల్లయ్యపల్లి బావి వద్దకు వెళ్లి గిరిజ మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. సీఐ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఎస్ఐ చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతులు నరికి.. మెడపై కోసి
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి, చేతులు నరికి, మెడపై కోసి పాశవికంగా హింసించారు. తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సూర్యనారాయణతో విభేదించి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్కుమార్ విక్టర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్థానిక తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండు రోజుల కిందట పద్మ, నూతన్కుమార్ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్ స్విచాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ఆమె కుమార్తె.. తండ్రి సూర్యనారాయణకు ఈ విషయం చెప్పింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. బయట నుంచి పిలవగా ఎవరూ పలకపోవడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి లోపలికి వెళ్లిన సూర్యనారాయణ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి, రెండు చేతులు తెగిపోయి, ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మను 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో ప్రియుడు నూతన్కుమార్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘అక్రమ సంతానంలో భారతీయులు కూడా ఉన్నారు’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్పై ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, చేతబడులు వంటి వాటిని నమ్ముతాడని, అతనికి ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ గురించి అతని మాజీ భార్య రేహమ్ ఖాన్ రచించిన పుస్తకం గురువారం విడుదలయ్యింది. ఈ పుస్తకంలో ఆమె వారి పది నెలల వైవాహికి జీవితానికి సంబంధించిన అంశాలనే కాక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ, వ్యక్తిగత అంశాలను తెలియజేసారు. కొన్నాళ్లుగా ఈ బుక్లోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె.. మొత్తానికి ఇవాళ బుక్ రిలీజ్ చేసింది. ఇందులో ఇమ్రాన్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. గురువారం విడుదలైన ఈ పుస్తకంలో ఇమ్రాన్కు భారత ప్రధాని మోదీలాగా ప్రధాన మంత్రి కావాలనే కోరిక ఉందని తెలియజేసారు. అంతేకాక ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని వెల్లడించింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్కు శారీరక సంబంధం ఉందని చెప్పింది. మోబీకి అప్పటికే పెళ్లి అయినట్లు తెలిపింది. ఇక ఇమ్రాన్ఖాన్కు చాలా మందితో అక్రమ సంతానం ఉన్నారని కూడా ఆ పుస్తకంలో రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్కు మొత్తం ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారని ఆమె చెప్పింది. తనకు కాకుండా ఇమ్రాన్ తొలి భార్య జెమీమా గోల్డ్స్మిత్కు మాత్రమే ఆయన అక్రమ సంతానం గురించి తెలుసని రేహమ్ తెలిపింది. ఇమ్రాన్తో సంతానం పొందిన భారత మహిళల గురించి ‘వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ చెప్పేవార’ని రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉన్నట్లు ఆ పుస్తకంలో ఆయన మాజీ భార్య స్పష్టంచేసింది. ఆయన బాత్రూమ్లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు చెప్పింది. ఇక చేతబడుల్లాంటి వాటిని కూడా ఇమ్రాన్ నమ్ముతాడని వెల్లడించింది. తనకున్న దోషం పోవడానికి నల్లటి కందులతో ఇమ్రాన్ తన శరీరమంతా రుద్దుకోవడాన్ని తాను చూసినట్లు రేహమ్ ఆ బుక్లో తెలిపింది. పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. -
పెళ్లైన కొద్ది రోజులకే భర్త వివాహేతర..
బంజారాహిల్స్ : భర్త వివాహేతర సంబంధం ఓ నవ వధువు ఉసురు తీసింది. వివాహమై రెండున్నర నెలలు గడవకముందే భర్త వేధింపులు భరించలేక చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని అల్లుడే ఉరేసి చంపాడంటూ మృతురాలి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కూరేళ్లగూడెం అంబర్పేటకు చెందిన సుజాత వివాహం యూసుఫ్గూడ చెక్పోస్టులోని తిరుమల అపార్ట్మెంట్స్లో నివసించే సత్యనారాయణతో ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగింది. సత్యనారాయణకు వివాహానికి ముందే సత్యవతి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే సుజాతను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. సత్యవతిని నేరుగా ఇంటికే తీసుకొచ్చి భార్య ముందే ఆమెతో పరాచకాలాడుతూ గడిపేవాడు. ఇదేమిటని నిలదీస్తే సుజాతను తీవ్రంగా కొట్టేవాడు. హింసించేవాడు. ఈ నెల 24వ తేదీన తన తల్లికి ఫోన్ చేసి సత్యవతి ముందే తనను తీవ్రంగా కొట్టాడని సమస్యను పరిష్కరించాలని రోధిస్తూ చెప్పింది. తల్లి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం తల్లి కుమారికి శివకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరేసుకుందని, స్టార్ ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. దీంతో కుమారి అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చింది. విచారించగా తన కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరేసుకోలేదని అల్లుడు సత్యనారాయణ హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా కూతురిని బాగా కొడుతున్నాడని వివాహేతర సంబంధం ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై కన్నేసి.. భారీ స్కెచ్
బంజారాహిల్స్ : ఇబ్బందుల్లో ఉన్న ఓ వివాహిత అవసరాలను ఆసరాగా చేసుకొని ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె భర్తను హతమార్చేందుకు సైతం కుట్రపన్ని పోలీసులకు చిక్కిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14 వెంకటేశ్వరనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో స్పెషల్ క్వాలిటీ మెయింటెనెన్స్ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీకృష్ణానగర్కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన మాల్యాద్రి అంబులెన్స్తో పాటు అక్కడికి వచ్చాడు. అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్ను క్రియేట్ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు. నాలుగు రోజుల క్రితం తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసిపోయిందని వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శాశ్వతంగా ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న అతను నందినగర్కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి గత శుక్రవారం ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేసినట్లు చెప్పాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు అంగీకరించాడు. ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. అతని పాచిక పారకపోవడంతో పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), 469, 506, 509 కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ కోసం స్నేహితుడి హత్య
డోన్ టౌన్ : చెడు వ్యసనాలే అతడి ప్రాణం తీశాయి. పర స్త్రీ వ్యామోహంలో పడిన అతడు చివరకు స్నేహితుడి చేతిలోనే హతమయ్యాడు. బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురంలో ఆరు నెలల క్రితం జరిగిన హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. డీఎస్పీ బాబాఫకృద్దీన్ బుధవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన డేగల శేషు ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. దీంతో అతడు తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన బోయసుదేపల్లె మధుతో స్నేహంగా మెలిగేవాడు. ఇద్దరు తాగుడుతోపాటు చెడు తిరుగుళ్లు తిరిగేవారు. ఈ క్రమంలో ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మధు శేషును ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన బంధువులు వెంకటేశ్వర్లు, సాంబశివుడుతో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించాడు. గతేడాది ఆగస్టు 17న శేషు తన ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంపై నిద్రిస్తుండగా ముగ్గురూ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మధునే హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు నిందితులను మంగళవారం సాయంత్రం రంగాపురం పొలిమేరల్లో అరెస్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కంబగిరిరాముడు, ఎస్ఐ తిరుపాల్ పాల్గొన్నారు. -
అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య
♦ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య ♦ మహిళను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు చిత్తూరు అర్బన్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య భర్తను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. చిత్తూరులో ఇటీవల జరిగిన కె.శ్రీనివాసులు హత్య కేసులో అతని భార్య లక్ష్మి(45)ని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ సుబ్బారావు, సీఐ వెంకటప్ప విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న నగరంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన లారీ యజమాని శ్రీనివాసులును తానే సుత్తితో కొట్టి చంపేశానని భార్య లక్ష్మి పోలీసుల కు లొంగిపోయింది. విచారణలో మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రొంపిచెర్ల మండలం మొరవపల్లెకు చెందిన ఎస్.బాబూలాల్ శ్రీనివాసులు లారీలో క్లీనర్గా పనిచేస్తూ తరచూ చిత్తూరులోని అతని ఇంటికి వెళ్లేవాడు. లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై శ్రీనివాసులు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. దీంతో శ్రీనివాసులును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న తెల్లవారుజామున శ్రీనివాసులు నిద్రిస్తుండగా అప్పటికే పథకం ప్రకారం వచ్చిన బాబూలాల్, లక్ష్మితో కలిసి సుత్తితో కొట్టి చంపేశారు. బాబూలాల్ను ఊరికి పంపేసి తానే హత్య చేసినట్లు లక్ష్మి పోలీసులకు లొంగిపోయింది. అసలు విషయం గుర్తించిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాబూలాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. -
అక్రమ సంబంధంతోనే ఆ హత్య
హైదరాబాద్సిటీ: కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలోని సమతానగర్లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఊబూతి శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించి టేకు మల్లేశం, భూషి మహిపాల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. శంకర్ భార్యతో మల్లేశం కొంతకాలంగా వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. శంకర్ను అడ్డు తొలగిస్తే తన కార్యకలాపాలకు అడ్డు ఉండదని భావించి మల్లేశం ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇందుకు మహిపాల్ సహకారం తీసుకున్నాడని తెలిపారు. -
భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది
హిమాయత్నగర్: ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్తే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్కు చెందిన ఓ మహిళను సంతోష్కుమార్ అనే వ్యక్తి 2009లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె పెళ్లికి ముందు ఎంబీఏ చదువుతున్న సమయంలో తన కళాశాల స్నేహితుడు విజయశేఖర్రెడ్డిని ప్రేమించింది. ప్రియుడ్ని కాదని, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆమె అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే భర్తతో కాపురం పెట్టింది. మరోవైపు ప్రియుడితో రహస్య సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న భర్త సంతోష్ నిఘా వేసి, శనివారం నారాయణగూడలోని ఓ ఇంట్లో తన భార్య ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండగా పోలీసులకు పట్టించాడు. పోలీసులు శేఖర్రెడ్డిపై కేసు నమోదు చేసి, అతడ్ని రిమాండ్కు తరలించారు.