Illegal liquor
-
6 లక్షల మద్యం బాటిళ్లను.. రోలర్తో తొక్కించిన మంత్రి
గువాహటి (అసోం) : అక్రమంగా మద్యం తయారు చేస్తున్నవారిపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అందరూ చూస్తుండగానే రూ.168.5 కోట్ల విలువ చేసే మద్యాన్ని అసోం ప్రభుత్వం రోడ్ రోలర్తో తొక్కించింది. ఏకంగా ఎక్సైజ్ మంత్రి పరిమళ్ శుక్లబైద్యనే శుక్రవారం రోడ్ రోలర్ నడిపి 6 లక్షల లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేశారు. 2016లో ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరిపిన దాడుల్లో కర్బీ జిల్లాలోని కాట్కాటీలోని నాలుగు ప్రాంతాల్లో 14 ట్రక్కుల మద్యాన్ని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేసిన ఈ మద్యాన్ని గువాహటికి సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 మందిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సీజ్ చేసిన మద్యాన్ని గోర్చుక్లో అందరూ చూస్తుండగానే రోడ్రోలర్తో తొక్కించి ధ్వంసం చేశామని మంత్రి పరిమళ్ శుక్లబైద్య తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తయారు చేసి, సరఫరా చేయాలనుకున్న వారికి ఇదొక హెచ్చరిక వంటిదని పేర్కొన్నారు. అసోం ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 39, 085 లీటర్ల విదేశీ మద్యం ప్రతి రోజు అమ్ముడవుతోంది. అసోం వ్యాప్తంగా 1,448 లైసెన్స్లు కలిగిన వైన్ షాపులు ఉన్నాయి. -
రూ.168 కోట్ల మద్యాన్ని రోడ్ రోలర్తో తొక్కించేశారు
-
ఐదుగురిపై బైండోవర్ కేసులు
రంగారెడ్డి జిల్లా: మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ధారూరు మండలానికి చెందిన కిషన్, బాబూనాయక్, కమానాయక్, తారాబాయి, తిర్మలయ్యలు సమీప తండాలలో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. తహశీల్దార్ శ్రీనివాస్ సమక్షంలో వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. తహశీల్దార్ శ్రీనివాస్ నిందితులకు రూ.లక్ష చొప్పున పూచీకత్తు తీసుకుని విడుదల చేశారు. -
600 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం
కొండపల్లి (విజయవాడ) : ఆటోలో అనధికారికంగా తరలిస్తున్న మద్యం సోమవారం మధ్యాహ్నం పోలీసులకు చిక్కింది. విజయవాడ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలో తరలిస్తున్న 12 కేసుల్లో ఉన్న 600 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆటోతోపాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. -
అక్రమ మద్యం పట్టివేత
భీమిని (ఆదిలాబాద్): అక్రమంగా రవాణా చేస్తున్న రూ.1.50 లక్షల విలువైన మద్యాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. భీమిని మండలం వీగామ్ గ్రామం వద్ద ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న మద్యం వెలుగు చూసింది. అనుమతి లేకపోవడంతో మద్యాన్ని సీజ్ చేసి బెల్లంపల్లి జూనియర్ సివిల్జడ్జి కోర్టుకు స్వాధీనం చేశారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత
చెన్నూరు (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా కిరాణ దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి కిరాణ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కిరాణ దుకాణంపై సోమవారం దాడి చేసి 66 బాటిళ్ల లిక్కర్, 14 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుడుంబా స్థావరాలపై దాడి: నలుగురు అరెస్ట్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాలుగొండలో గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 వేల లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. అందుకు సంబంధించి నలుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు చెందిన నాలుగు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. -
వారిపై మీ ప్రతాపమేంటి?
సంగారెడ్డి క్రైం: జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోన్నా, ఊరూరా బెల్ట్షాప్లు కొనసాగుతున్నా పట్టింపు లేదా? అని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ... మద్యంపై ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోని వారు మారుమూల గ్రామాలు, తండాల్లోని గిరిజనులపై గంజాయి సాగు చేస్తున్నారంటూ కేసులు బనాయించి జైళ్లకు పంపడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. గంజాయి సాగు చట్ట విరుద్ధమే అయినా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఎక్సైజ్ అధికారులు ఏనాడైనా గిరిజనులకు కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మానిటరింగ్ కమిటీ సభ్యుడు రవీందర్ నాయక్ మాట్లాడుతూ... అనవసరంగా గిరిజనులపై కేసులు నమోదు చేయడం మానుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ వంటి గ్రామీణప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కల్హేర్, సిర్గాపూర్ పీహెచ్సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సంబంధం లేని వారిని సైతం పోలీసులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పందిస్తూ... గిరిజన తండాల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా గంజాయి, సారా తయారీకి వ్యతిరేకంగా చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టే అంశం పరిశీలిస్తామన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఆర్ రోడ్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే పనులు చేపడతామని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకంలో బ్యాంకుల్లో జీరో అకౌంట్ ఉంటే ప్రోత్సాహక డబ్బులు రావడం లేదని సభ్యుడు వెంకటేశ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్రెడ్డి స్పందిస్తూ జీరో అకౌంట్లను సేవింగ్ అకౌంట్లుగా మారుస్తున్నామని చెప్పారు. పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ : ఎస్పీ సుమతి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, ఇతర కేసుల విషయమై పోలీస్ స్టేషన్కు వచ్చిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎస్పీ సుమతి తెలిపారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడంతోపాటు చట్టపరిధిలో విచారణ, పారదర్శకంగా దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు శాఖ తరఫున ఎస్సీ, ఎస్టీలకు చట్ట పరిధిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ దయానంద్, ఆర్డీఓలు, డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.