-
ఫీల్డింగ్లోనే కాదు.. గుర్రపుస్వారీతోను ఇరగదీశాడు
ముంబై: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదులుతూ ఎన్నోసార్లు అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లు చేశాడు. గతేడాది ఆసీస్తో జరిగిన సిరీస్లో అనూహ్యంగా గాయపడిన జడేజా ఆసీస్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరపున బరిలోకి దిగిన జడ్డూ తన పవరేంటో రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే ఐదు సిక్సులు. ఒక ఫోర్ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. అంతేగాక సీఎస్కే ఆడిన మ్యాచ్ల్లో కొన్నిసార్లు తన మెరుపు ఫీల్డింగ్ కనబరిచాడు. అయితే లీగ్కు కరోనా సెగ తగలడంతో బీసీసీఐ అనూహ్యంగా ఐపీఎల్ 14వ సీజన్ను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. తాజాగా జడేజా తనకు ఇష్టమైన గుర్రపు స్వారీతో సరదాగా గడిపాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జడ్డూ.. '' నా రైడింగ్ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జడేజా వీడియో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ఇక జడేజా త్వరలో జరగబోయే ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజా చోటు సంపాదించాడు. టెస్టు చాంపియన్షిప్ అనంతరం ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లోనూ జడేజా ఆడనున్నాడు. ఇక టీమిండియా జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనుంది. తాజాగా బుధవారం జట్టు మొత్తం 14 రోజుల పాటు కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉండనుంది. అనంతరం ఇంగ్లండ్కు వెళ్లిన తర్వాత మరో 10రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఇక జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, కివీస్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నాయి. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే 'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' View this post on Instagram A post shared by Ravindra jadeja (@ravindra.jadeja) -
వైరల్ : మోడ్రన్ పెళ్లికూతురు
భోపాల్ : ఉత్తరాది పెళ్లి వేడకల్లో సాధారణంగా పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకుంటాడు. అది అక్కడి సాంప్రదాయం కూడానూ. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లి కుమార్తె స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ మండపానికి వచ్చింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు. (ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్) అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. (మాధురీ దీక్షిత్ను ఫిదా చేసిన యువతి ) -
బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!
సాధారణంగా ఈ కామర్స్ నుంచి వచ్చే డెలివరీలు బైక్లపై తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తారు ఏజెంట్లు. ఒక వేళ ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువు పెద్దదైతే వ్యాన్లో తీసుకొస్తారు. ఇది అందరు ఏజెంట్లు చేసే పనే. అయితే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఓ కశ్మిర్ ఏజెంట్ మాత్రం వెరైటీగా ఆర్డర్లు డెలివరీ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. బైక్, వ్యాన్ కాకుండా గుర్రంపై వెళ్లి పార్సిల్ అందజేశాడు. శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్లో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదాలన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లకు సమయానికి పార్సిల్ని అందించాలని భావించిన ఓ అమేజాన్ ఏజెంట్కు ఓ చక్కటి ఉపాయం వచ్చింది. రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ... కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అమేజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. కాగా, తనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని సదరు ఏజెంట్ చెబుతున్నాడు. అలాగే కొందరు అత్యవసరాల కోసం ఆర్డర్లు చేస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ మార్గంలో వెళ్లి సమయానికి వారికి ఆర్డర్లను అందిస్తున్నానని చెప్పారు. Amazon delivery innovation 🐎#Srinagar #Kashmir #snow pic.twitter.com/oeGIBajeQN — Umar Ganie (@UmarGanie1) January 12, 2021 -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్లో పాప్ మ్యూజిక్తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్షాప్లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్బాక్సింగ్లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్క్రీమ్లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
స్కూబా టెస్ట్ పాసయ్యా!
కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు ప్రణీతా సుభాష్. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్కూబా డైవింగ్లో సర్టిఫికేట్ పొందారు. కొన్ని రోజులుగా మాల్డీవుల్లో విహార యాత్రలో ఉన్నారు ప్రణీత. బీచ్ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారామె. స్కూబా డైవింగ్ కూడా చేస్తూ కనిపించారు. అయితే స్కూబా డైవింగ్ను సరదాగా కాదు... సీరియస్గా చేయాలనుకున్నారు. అందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుని స్కూబా డైవింగ్లో సర్టిఫికెట్ కూడా పొందారామె. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించి, స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. -
ఇక స్వారీ షురూ!
‘ఈ పాత్ర చేయడం నీవల్ల అవుతుందా?’ అని సవాల్ విసిరే పాత్ర వచ్చినప్పుడు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి వెనకాడని నటీనటులు ఉంటారు. తాజాగా త్రిష అలాంటి సవాల్నే స్వీకరించారు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం త్రిష ముందు ఉన్న పెద్ద సవాల్. మణితర్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలోని రాణి కుందవై పాత్ర కోసమే ఆమె హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. చెన్నైలోని ఓ హార్స్ రైడింగ్ స్కూల్లో గత నెల 26 నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఐదు రోజుల్లో ‘ఇంట్రో టు హార్స్ బ్యాక్ రైడింగ్’ కోర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్వారీ చేయడానికి ఫౌండేషన్ కోర్స్ మొదలుపెట్టారు. ఈ నెల 3 నుంచి 14 వరకూ ఈ కోర్స్ని కూడా విజయవంతంగా పూర్తి చేశారామె. ‘సర్టిఫికెట్ కూడా వచ్చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు త్రిష. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే.. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు త్రిషను మరచిపోయి తెర మీద కుందవైనే చూస్తున్నట్లుగా భావించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటిస్తున్నారు. -
చల్ చల్ గుర్రం... చలాకీ గుర్రం
గుర్రం చలాకీదే. గుర్రపు స్వారీ కూడా చలాకీయే. రేసులో చురుకుగా ఉంటే రేసుగుర్రం అవ్వొచు. ఇటీవలే కొందరు కథానాయికలు... గుర్రపు స్వారీ మీద శ్రద్ధ పెట్టారు. ఒకరేమో శరీరాన్ని మరింత ఫిట్గా ఉంచుకోవడం కోసం. మరొకరు తన పాత్రను హిట్ చేయడం కోసం. ఆ విశేషాలు. యువరాణి పాత్రకోసం... ఇటీవల తన కొత్త ఫ్రెండ్ బూని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు త్రిష. బూ అంటే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న గుర్రం పేరు. త్వరలో చేయబోయే పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో నటించనున్నారు త్రిష. ఈ పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ అని తెలిసింది. మరింత ఫిట్గా... లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తే ప్రణీతా సుభాష్ ఫిట్నెస్ మీద మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ‘‘మా ట్రైనర్ నేనేదో సినిమాలో పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని అనుకున్నారు. కానీ అదేం కాదని చెప్పాను. హార్స్ రైడింగ్ వల్ల నా ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నానని చెప్పాను. నిజంగానే దీని వల్ల నా శరీరం మరింత చురుకుగా ఉంది. ఇదో సరికొత్త అనుభవం’’ అన్నారు ప్రణీత. పదును పెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్కు గుర్రపు స్వారీ వచ్చు. గతంలోనే ఆమె ఈ స్వారీ నేర్చుకున్నారు. అయితే తాజాగా తన ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. లాక్డౌన్లో మళ్లీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ‘మన భవిష్యత్తు మన దినచర్యలోనే తెలిసిపోతుంది’ అంటూ ఆ ఫోటోలు షేర్ చేశారామె. -
రవీంద్ర జడేజా పోస్ట్ వైరల్
-
ఇక సిద్దం: రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీలో ఎంతటి నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఈ విద్యలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ సర్కు ఆనందం కలిగితే మైదానంలో బ్యాట్తోనే కత్తిసాము చేస్తుండటం ఇదివరకు ఎన్నో సార్లుచూశాం. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జడ్డూ తన ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టిపెడుతూనే ఈ మూడింటిపై ఓ లుక్కేస్తున్నాడు. (కరోనా భయం లేదు: స్టేడియానికి 30,000 మంది) ఇప్పటికే ఇంట్లో కత్తిసాము చేసిన వీడియోలను, తన ఫామ్ హౌస్లో గుర్రపు స్వారీ చేసిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను జడేజా ఇన ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతడు తీసుకున్న కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకుంటూ స్వారీకి సిద్దం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గుర్రపు స్వారీకి సిద్దం అన్నట్లు ఓ కామెంట్ జతచేశాడు. ఇక గుర్రపు స్వారీ చేయడం తన ఆల్టైమ్ ఫేవరేట్ అంటూ గతంలో రవీంద్ర జడేజా పేర్కొన్న విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్) -
గుర్రపు స్వారీ చేసిన ఎమ్మెల్యే కొడుకు
సాక్షి, బెంగళూరు : "ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టది ఓ దారి" అనే సామెత ఇప్పుడు చెప్పుకునే వ్యక్తికి సరిగ్గా సూటవుతుంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, చీటికీమాటికీ వాహనాలు బయటకు తీయొద్దు అంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వమే తనది అనుకున్నాడో లేక తననెవరూ ఏమీ చేయలేరనుకున్నాడో ఏమో కానీ ఓ ఎమ్మెల్యే కుమారుడు అధికారుల మాటలను పెడచెవిన పెట్టాడు. ఈ నిబంధనలన్నీ సాధారణ జనాలకే కానీ, నాబోటి వాళ్లకు కాదని నిరూపిస్తూ నడిరోడ్డుపై గుర్రం స్వారీ చేశాడు. (నిఖిల్ పెళ్లిపై నివేదిక ఇవ్వండి) వివరాల్లోకి వెళితే కర్ణాటక అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ అటు కరోనాను, ఇటు లాక్డౌన్ను ఏమాత్రం లెక్క చేయకుండా మైసూర్ ఊటీ జాతీయ రహదారిపై గుర్రం స్వారీ చేస్తూ కనిపించాడు. స్వారీ చేస్తున్న సమయంలో ముఖానికి కనీసం మాస్కు కూడా ధరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే తనయుడి హంగామా చూసిన జనాలు మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన అతడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (నోట్లో బాటిల్ మెడలో పాము) -
'కరోనా వెళ్లిపోయాకా ఇద్దరం కలిసి హార్స్ రైడ్ చేద్దాం'
కరోనా వైరస్ బారీన పడి ప్రపంచం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తాకిడి క్రీడలపై కూడా పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడు బిజీ షెడ్యూల్తో తీరిక తేకుండా గడిపే టీమిండియా ఆటగాళ్లు కరోనా పుణ్యమాని తమకు నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తనకు ఎంతో ఇష్టమైన హార్స్ రైడింగ్తో రోజులను ఎంజాయ్ చేస్తున్నాడు. జడేజాకు హార్స్ రైడింగ్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీరిక సమయాలలో హార్స్ రైడింగ్లో తన నైపుణ్యతను ప్రదర్శించి ఆ వీడియోనూ ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటాడు. తాజాగా జడ్డూ తన ఇన్స్టాగ్రామ్లో గుర్రాలతో గడిపిన మూమెంట్స్ను షేర్ చేసుకున్నాడు.' నా గురించి తెలుసుకోవటానికి నా గుర్రాలు ఎంతగానో సహయపడుతున్నాయి' అంటూ కాప్షన్ జత చేశాడు. అయితే జడ్డూ పెట్టిన పోస్ట్కు భారత ఓపెనర్ శిఖర్ ధవన్ స్పందించాడు. ' జడ్డూ బాయ్... దేశం కరోనా వైరస్ నుంచి బయటపడ్డాక మనిద్దరం కలిసి జాలీగా హార్స్ రైడింగ్ చేద్దామంటూ' ఫన్నీ పోస్టు షేర్ చేశాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ భారత్లో కూడా విజృంబిస్తోంది. ఇప్పటివరకు 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 110 దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నియమించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తుందా లేదా అనేది సందేహంగానే మిగిలింది. కాగా మార్చి 31నుంచి జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడింది. (లాక్డౌన్: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?) (‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’) -
రెండు దశాబ్దాల తర్వాత...
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు. ఈక్వె్రస్టియన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఫౌద్ మీర్జాకంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వె్రస్టియన్ ఈవెంట్లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇంతియాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్లో ఐజే లాంబా భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో బరిలోకి దిగారు. -
‘కిమ్’ కర్తవ్యం?
సియోల్: కొరియన్లకు పవిత్రమైన స్థలం ఉత్తరకొరియాలోని అత్యంత ఎత్తయిన మంచుకొండల మధ్య శ్వేతవర్ణపు అశ్వంపై రాచరికపు ఠీవీని ఒలకబోస్తోన్న ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ చిత్రాలు మీడియాలో హఠాత్తుగా దర్శనమిచ్చాయి. ఆ దేశపు కీలక నిర్ణయాల సమయంలో గతంలో కూడా కిమ్ ఇలాగే చేయడంతో ఈ చిత్రాల వెనుక మతలబేమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోధుమ రంగు పొడవాటి కోటులో మంచుకొండల మధ్య కిమ్ పోజిచ్చిన స్థలం, ఆయన స్వారీ చేస్తోన్న తెల్లటి గుర్రం కిమ్ కుటుంబ రాచరికపు అధికారదర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచుకొండల ప్రాంతానికి కిమ్ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో దేశ రాజకీయాలను మలుపుతిప్పే అరుదైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఈ స్థలాన్ని సందర్శించే అలవాటు కిమ్కి ఉంది. మౌంట్ పీక్టూ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి నివాస స్థలమే కాకుండా ఉత్తర కొరియా విప్లవంలో ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యత సైతం ఉన్నట్టు బుధవారం విడుదల చేసిన కెసీఎన్ఏ రిపోర్టు వెల్లడించింది. దక్షిణ కొరియాతో దౌత్య సంబం«ధాలపై ప్రకటన చేయడానికి కొన్ని వారాల ముందు 2017లో నూతన సంవత్సరం సందర్భంగా మౌంట్ పీక్టూని కిమ్ సందర్శించారు. ఆ సందర్భంగా దక్షిణకొరియాతో దౌత్యసంబంధాలకు సంబంధించిన అంశాలను సూచనప్రాయంగా చెప్పారు. అలాగే 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ ఇన్తో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన బటన్ ఎప్పుడూ తన టేబుల్పైన సిద్ధంగా ఉంటుందని కిమ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సుదూర లక్ష్యాలను చేరే క్షిపణులను, అణ్వాయుధ పరీక్షలను తలపెట్టబోమన్న కిమ్ వాగ్దానాన్ని ఆయన పునరాలోచించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో ఉత్తరకొరియా చర్చలు ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉన్నవిషయం తెలిసిందే. -
కిమ్ గుర్రపు స్వారీ, కొత్త ఆపరేషన్ కోసమేనా?
సియోల్ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త ఆపరేషన్కు తెర తీసినట్లు కొరియన్ వార్తాసంస్త బుధవారం వెల్లడించింది. కొరియాలోని అత్యంత ప్రమాదకర పర్వతమైన 'మౌంట్ పయేక్టు'లో కిమ్ సాహోసోపేతమైన గుర్రపు స్వారీ చేశారు. మంచుతో కప్పబడిన పయేక్టు ప్రాంతంలో కిమ్ తెల్లటి గుర్రంపై షికారు చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కిమ్ వంశస్తులు ఈ పర్వతాన్ని ఎంతో ఆధ్యాత్మికమైన ప్రదేశంగా చూస్తారు. ప్రమాదకరమైన పర్వతంగా పేరు పొందిన పయేక్టులో కిమ్ ధైర్యంగా గుర్రపు స్వారీనీ ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కిమ్ ఇలాంటి సాహసయాత్రలు చేస్తారని సహాయకులు తెలిపారు. గతంలో అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించడానికి ముందు కిమ్ పయేక్టు పర్వతాన్ని సందర్శించారు. 2018లో దక్షిణ కొరియాతో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్-జే-ఇన్ను పయేక్టు పర్వత శిఖరానికి తీసుకెళ్లారు. మరి ఈసారి కిమ్ దేనిపై ప్రకటన చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంలో అధ్యక్షుడు కిమ్ ఇలాంటి సంకేతాలు ఇచ్చారని ఉత్తర కొరియాకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గుర్రపుస్వారీ.. కత్తిసాము
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న పాయల్ రాజ్పుత్ ప్రస్తుతం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకుంటున్నారు. ఇదంతా ఆమె లీడ్రోల్లో రూపొందనున్న ‘అరుంధతి 2’ సినిమా కోసం. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కోటి తూముల మాట్లాడుతూ– ‘‘చారిత్రాత్మక, యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పెద్ద బడ్జెట్తో, భారీ గ్రాఫికల్ చిత్రంగా రూపొందనుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ పనులు హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో పాయల్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్కి చెందిన ప్రముఖ తారలు నటిస్తారు. కథాంశంలో భాగంగా పాయల్ గుర్రపుస్వారీ, కత్తిసాము శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’’ అన్నారు. -
ప్రభాస్ గుర్రం.. పరుగు తీస్తే పతకమే
సంధించిన బాణంలా దూసుకుపోతుంది. పరుగుల వేట ప్రారంభిస్తే పతకాలు కొల్లగొట్టి తీరుతుంది. అభినందనల నీరాజనాన్ని అందుకుంటుంది. ఆ పంచకల్యాణి కోసం జన సందోహం తరలి వస్తుంది. గుర్రాలంటే అమితాసక్తి ఉండేవారు కొందరు.. గుర్రాలను సాకుతూ పోటీల్లో విజేతగా నిలిచేవారు ఇంకొందరు. రెండో కోవకు చెందుతాడు అలమండ సంతకు చెందిన పి.శ్రీనివాసరాజు పోటీకెళ్తే బహుమతి ఖాయం చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మక్కువ ఉన్న శ్రీనివాసరాజు.. వాటిని కొనుగోలు చేసి పెంచడం ప్రారంభించాడు. గుర్రాల స్వారీ కూడా నేర్చుకున్నాడు. గ్రామాల్లో జాతరలు, తీర్థాలు జరిగితే గుర్రాపు పందాలు నిర్వహిస్తున్నాడు. ఏ పందాలకు వెళ్లినా అతని గుర్రాలు మొదటి, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. గుర్రాలపై మక్కువతోనే రాజస్థాన్, కర్ణాటక, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్రాలను కొని పెంచుతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద 5 గుర్రాలున్నాయి. బాహుబలి గుర్రం కొనుగోలు బాహుబలి చిత్రంలో ప్రభాస్ స్వారీ చేసిన గుర్రాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బాహుబలి గుర్రం కూడా అతని వద్దే ఉంది. ఒక్కొక్క గుర్రాన్ని రూ.లక్ష నుంచి రూ.లక్ష 50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరలు, తీర్థ మహోత్సవాలు, గ్రామదేవత ఉత్సవాలకు గుర్రాపు పందాలపై ఆసక్తి పెరిగింది. దీంతో గుర్రపు పందాలను తిలకించడానికి భారీగా వస్తున్నారు. శ్రీనివాసరాజు గుర్రాలు ఏ పోటీలకు వెళ్లినా ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. అతని గుర్రాలు సుమారు 30 పోటీల్లో పాల్గొని విశాఖ, తూర్పుగోదావరి, విజయగనరం జిల్లాల్లో జరిగిన గుర్రపు పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద రాణి, చెర్రీ, బాహుబలి, విజిలి, బుల్లెట్రాజా పేర్లున్న గుర్రాలున్నాయి. గుర్రాలకు రోజూ ఉదయం, సాయంత్రం స్వారీపై తర్ఫీదు ఇస్తాడు. రోజు తప్పించి రోజు ఈత కొట్టిస్తాడు. ఎండాకాలంలో రోజూ చల్లని నీటితో స్నానం చేయిస్తాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ వినియోగించిన గుర్రం గుర్రాల ఆహారం రోజూ గుర్రాలకు క్యారెట్, బీట్రూట్, నల్ల ఉలవలు, నువ్వులతో తయారుచేసిన అరిసెలు, కర్జూరం, తాటిబెల్లం, గోధుమలు, పచ్చగడ్డివి పెడతాడు. వాటితోపాటు కాల్షియం టానిక్ ఇస్తాడు. ప్రత్యేక గుర్రపు వైద్య నిపుణుడితో ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తాడు. – జామి (శృంగవరపుకోట) బాల్యం నుంచి మక్కువ చిన్నప్పటి నుంచి గుర్రాలంటే చాలా మక్కువ. ప్రస్తుతం నావద్ద అయిదు గుర్రాలున్నాయి. ఇటీవలే బాహుబలి చిత్రంలో ఉపయోగించిన గుర్రాన్ని కొనుగోలు చేశాను. వీటి పెంపకానికి అధిక వ్యయం అవుతుంది. ఒక్కొక్క గుర్రానికి నెలకు సుమారు రూ.8వేలు అవుతుంది. నా అభిరుచి పదిమందికి ఆనందాన్నివ్వడం సంతోషంగా ఉంది. – పి.శ్రీనివాసరాజుఅలమండ సంత గుర్రపు స్వారీలో నాకు సుమారు 15 ఏళ్ల అనుభవం ఉంది. గుర్రపుస్వారీలపై శిక్షణ కూడా ఇస్తాను. అనేక పందాలకు వెళ్లాను. స్వారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్రపు స్వారిలో కళ్లెం అతి ప్రధానమైనది. వాహనాలకు గేర్లు మాదిరిగానే కళ్లెం పనిచేస్తుంది.– బద్రీనాథ్, గుర్రపుస్వారి శిక్షకుడు -
వచ్చాడయ్యో సామీ.. గుర్రమెక్కి!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. అందరిలా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడంలో కొత్తదనం ఏముందని అనుకున్నాడో ఏమో ఉత్తరప్రదేశ్లో బాజా భజంత్రీలతో పెళ్లి దుస్తులు వేసుకొని గుర్రమెక్కాడు ఓ అభ్యర్థి. బ్యాండు మేళం.. పెళ్లి ఊరేగింపూ.. దానికి ముందు దుమ్మురేపుతోన్న కుర్రకారు డాన్సులు.. ఇంత హంగామాతో యూపీలోని షాజహాన్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతోన్న సంయుక్త్ వికాస్ పార్టీ అభ్యర్థి వైద్ రాజ్ కిషన్ని అధికారులు అడ్డుకున్నారు. సిటీలో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ అభ్యర్థి వెళుతుండడంతో అధికారులు అడ్డగించి గుర్రం నుంచి దింపేశారు. ‘ఏమిటీ వేషం?’ అని అడిగితే, ఈ రోజు తన పెళ్లి రోజు కావడం వల్ల పెళ్లి దుస్తులైన షేర్వాణీ,తలపాగా ధరించి, గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్లానని చెప్పారు. ఈ ఊరేగింపుని సదర్బజార్లో అడ్డుకున్న అధికారులు మధ్యలోనే గుర్రం దించేయడంతో, సదరు అభ్యర్థి కలెక్టరేట్కి నడిచి వెళ్లి, నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే కిషన్ ఇలా సరికొత్తగానామినేషన్ దాఖలు చేయడం ఇదే కొత్త కాదనీ, 2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఈయన గారు ఇలాగే ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే, అప్పుడు చావు ఊరేగింపు మాదిరిగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారట. -
వారెవ్వా.. గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి!
తిరువనంతపురం: ఒకప్పుడు ఆడవారు ఇంటినుంచి అడుగు బయట పెట్టడమే పాపంగా భావించేది సమాజం. కాని ప్రస్తుతం.. కాలం మారింది. తాము ఏ విషయంలోనూ పురుషులకంటే తక్కువ కాదని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు నేటితరం మహిళలు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. పరీక్ష రాయకుంటే సంవత్సరమంతా పడ్డ కష్టం వృథా అవుతుందని భావించిన ఓ బాలిక ఏకంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కేరళలోని త్రిశూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి ఒక బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర ట్విటర్ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘త్రిశూర్లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మోబైల్ స్క్రీన్ సేవర్గా ఆమె స్వారీ చేసిన గుర్రం ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది’ అని ట్వీట్ చేశాడు. ‘బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావల్సిన అవసరం ఉంది’ అని మరో ట్వీట్లో ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. -
గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి..
-
గుర్రపు స్వారీపై ముచ్చటపడ్డ గబ్బర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల అనంతరం విశ్రాంతి లభించడంతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ముచ్చట పడ్డాడు. అనుకున్నదే తడువుగా గుర్రపు స్వారీలోని మెళకువలు తెలుసుకున్నాడు. దీనిలో భాగంగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన గబ్బర్.. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ధావన్ బ్యాటింగ్లో మెరిసిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో రెండు మ్యాచ్లే జరగ్గా, ధావన్ మొత్తం 117 పరుగులు సాధించాడు. తొలి టీ20లో 76 పరుగులు సాధించిన ధావన్.. మూడో టీ20లో 41 పరుగులు సాధించాడు. కాగా, ఆసీస్తో వన్డే సిరీస్లో ఆకట్టులేకోపోయాడు. మూడు మ్యాచ్ల్లో 18.33 సగటుతో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇక న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో ధావన్ గాడిలో పడ్డాడు. దాదాపు 47.00 సగటుతో 188 పరుగులు సాధించాడు. ఆ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా ధావన్ నిలిచాడు. త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఇరు దేశాల మధ్య సిరీస్ ఆరంభం కానుంది. ఇందులో రెండు టీ20ల సిరీస్తో పాటు, ఐదు వన్డేల సిరీస్ జరుగనుంది. Jatt Shaunkiyaa tey Shaunk poore karda. #horsebackriding #horseriding #learninghorseriding #tuesdaythoughts #TuesdayMotivation pic.twitter.com/bbGiRmM3ku — Shikhar Dhawan (@SDhawan25) 19 February 2019 -
న్యూ ఇయర్.... న్యూ లెర్నింగ్స్
... అంటున్నారు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ చిత్రం ‘పానిపట్’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతీసనన్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ వేశారు టీమ్. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు అర్జున్. ‘‘గతేడాది డిసెంబర్ చాలా సంతోషంగా గడిచింది. ‘పానిపట్’ సినిమా షూటింగ్లో మళ్లీ పాల్గొంటున్నాను. ఇప్పుడీ సినిమా కోసం గుర్రపుస్వారీని మరింత బాగా నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అర్జున్ కపూర్. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అర్జున్ కపూర్ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్తో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. -
బెట్టింగ్లో ఓటమి.. గుండెపోటుతో మృతి
సాక్షి, గుంటూరు(పెదకాకాని) : గుంటూరులో పెదకాకాని రోడ్డులోని హెచ్ఆర్సీ క్లబ్లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందేల నిర్వహణ క్లబ్లో బెట్టింగ్ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి పెదకాకాని వెళ్లే రోడ్డులో గత కొన్నేళ్లుగా గుర్రపు పందేలు (హార్స్ రేసింగ్ క్లబ్) ఆడుకునే సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రధాన నగరాలలో నిర్వహించే గుర్రాల పందేలు ఈ క్లబ్లో ఏర్పాటు చేసిన డిస్ప్లేపై కనిపిస్తుంటాయి. తమ డబ్బులను కాయిన్లుగా మార్చుకుని పందేలు కాసుకుంటూ ఉంటారు. తెనాలి తాలూకా చినరావూరు గ్రామానికి చెందిన శ్రీదర్ అలియాస్ రమేష్ గుర్రుపు పందేంలో రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి పెదకాకాని ఎస్ఐ కె. ఆరోగ్యరాజు సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
స్లో అండ్ స్టడీ
ఉదయాన్నే ఖాళీ ప్లేస్లో రౌండ్స్ కొడుతున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. రన్నింగ్ రౌండ్సా? డ్రైవింగ్ రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్ స్పీడ్ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా. సడన్గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్. -
ఛీ.. జీవితం! ఏంది భయ్యా ఇది..
బెంగళూరు: ‘‘ఉద్యోగవేటలో భాగంగా ఎనిమిదేళ్ల కిందట సిటీకి వచ్చాను. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్వేర్ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. చాలా విసుగెత్తిపోయా. ఏందీ జీవితం? అనిపించేది. అందుకే నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చా. లైఫ్లో ఇంకెప్పుడూ మల్టీనేషన్ కంపెనీలో పనిచేయను...’’ అంటోన్న ఈ టెకీ.. తన వెరైటీ నిరసనతో సోషల్ మీడియా నయా సంచలనంగా మారాడు. పేరు రూపేశ్ కుమార్ వర్మ. బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రాఫిక్ రద్దీని నిరసిస్తూ ఇలా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. మరి సంస్థ ఊరుకుందా? గుర్రానికి పార్కింగ్ ప్లేస్ కల్పించిందా? అని అడగొద్దు! లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనోడిలా వెరైటీ చర్యకుదిగాడు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్.. తానీ పనిచేసింది సెన్సెషన్ కోసం కాదని, అయినాసరే పాపులర్ అయిపోవడంతో థ్రిల్ అయ్యానని చెప్పాడు. అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్మైండెడ్ ఫ్రెండ్స్తో కలిసి స్టార్టప్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఉద్యోగం చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు! -
గుర్రపు స్వారీ...రెడీ
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ.