-
నిజమైన మాంత్రికులతో సినిమా.. కథ కూడా అలాంటిదే
దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు తదితర అంశాలతో ఈ మధ్య కాలంలో పలు సినిమాల వస్తూనే ఉన్నాయి. 'పొలిమేర 2', 'విరూపాక్ష' లాంటివి ఈ జానర్లోకే వస్తాయి. సరిగా తీయాలే గానీ వీటికి ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే నిజమైన మాంత్రికులతోనే సినిమా తీసి, విడుదలకు సిద్ధం చేయడం హాట్ టాపిక్గా మారిపోయింది. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు గురించి పరిశోధించి తీసిన సినిమా 'డెవిల్ హంటర్స్'. రుద్రేశ్వర్ పతాకంపై ప్రజిత్ రవీంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మరణించిన వారి మూఢ నమ్మకాలని చర్చించే కథతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు హారర్ చిత్రాల్లో రానటువంటి ఎలిమెంట్స్తో దీన్ని తీశారట. 25 ఏళ్లుగా తంత్ర శాస్త్రాలను నిర్వహిస్తున్న దర్శకనిర్మాత.. పలు యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఇందులో నటించిన వారందరూ మాంత్రికం చేయగలిగిన వారేనని చెప్పడం అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా నిజమైన మాంత్రికులతో సినిమా తీయడం ఏంట్రా బాబు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
Pindam Movie Success Meet Pics: పిండం మూవీ హారర్ హిట్ మీట్ (ఫోటోలు)
-
అక్టోబర్ 6న విడుదలకానున్న ది ఎక్సార్సిస్ట్: బిలీవర్
డేవిడ్ గోర్డాన్ గ్రీన్ దర్శకత్వం వహించిన అమెరికన్ చిత్రం 'ది ఎక్సార్సిస్ట్: బిలీవర్' అక్టోబర్ 6న విడుదల కానుందని సినిమా మేకర్స్ ప్రకటించారు. ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో హాలీవుడ్లో ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. విలియం పీటర్ రాసిన ది సమె నేమ్-నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సార్సిస్ట్ (1973) చిత్రం వచ్చిందని పేర్కొన్నారు. తాజాగా ది ఎక్సార్సిస్ట్ : బిలీవర్ - అక్టోబర్ 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుందని వివరించారు. ప్రసిద్ధ హాలోవీన్ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్ గోర్డాన్ గ్రీన్ (హాలోవీన్,2018), (హాలోవీన్ కిల్స్, 2021) చిత్రాలు వరుసగా విజయం సాధించాయని వివరించారు. 10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్ చేయబడిన మొదటి భయానక (హార్రర్ చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. 1973లో ది ఎక్సార్సిస్ట్కు 50 సంవత్సరాల తర్వాత సీక్వెల్గా ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ విడుదల కానుందని వివరించారు. ఈ సినిమాకు దర్శకత్వం డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్, సంగీతం డేవిడ్ వింగో వ్యవహరించారని చెప్పారు.ఈ సినిమాకు దర్శకత్వం- డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్ సంగీతం- డేవిడ్ వింగో -
దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టాలన్నా.. థ్రిల్లింగ్కు గురిచేయాలన్నా హాలీవుడ్ చిత్రాలకే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను కొల్లగొట్టేవి ఇలాంటి చిత్రాలే. ది కంజూరింగ్ అనే చిత్రాన్నే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా హాలీవుడ్లో ది నన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) తాజాగా దానికి సీక్వెల్గా వస్తోన్న చిత్రం నన్ -2. ఇది ది కంజూరింగ్ ఫ్రాంచైజీలో రూపొందిన 9వ చిత్రం కావడం మరో విశేషం. మైఖేల్ ఛావ్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ చిత్రంలో బోలి ఆరోన్న్స్, తెలుసా ఫార్మికా, స్టీమ్ రెయిడ్, ప్రధాన పాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా ఆటోమిక్ మాన్స్టర్, ది సఫ్రాన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్–2 తెరకెక్కించారు. ఈ చిత్రం కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: గోపీచంద్ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) On September 8th, the greatest evil in the conjuring universe returns #TheNun2. pic.twitter.com/zYdo2dzwVR — Warner Bros. Pictures (@wbpictures) July 6, 2023 -
హారర్ థ్రిల్లర్
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సీవీ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీపై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్ అండ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. -
సూపర్ హిట్ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది!
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రం 'డిమాంటీ కాలనీ'. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హార్రర్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా అదే దర్శకుడు దానికి సీక్వెల్గా డిమాంటీ కాలనీ– 2 చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులోనూ అరుళ్ నిధి కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్!) కాగా ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత బాబీ బాలచందర్ భాగస్వామిగా చేరారు. ఈయన తాజాగా చిత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా డిమాంటీ కాలనీ –2 చిత్ర నిర్మాతలు నైట్ నైట్ ఎంటర్టైన్మెంట్ అధినేత విజయ్ సుబ్రహ్మణిన్, జ్ఞానముత్తు పట్టరై సంస్థ అధినేత ఆర్సీ రాజ్ కుమార్తో భాగస్వామి అయ్యారు. దీనిపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. బాబి బాలచంద్రన్ తమ చిత్రానికి భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో టైకూన్ బిజినెస్ మెన్ అయినా ఆయన చిత్ర నిర్మాణ రంగంపై గౌరవంతో దీన్ని అదనపు వ్యాపారంగా భావించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఎందుకు స్ఫూర్తిదాయకమైన ఆయన తమ చిత్రానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, దీంతో డిమాంటీ కాలనీ– 2 చిత్రం గ్లోబస్ స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) -
ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!
హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఈ తరహా చిత్రాలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఉండదు. అలాంటి విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం కల్లరై. గుడ్న్యూస్ ఫిలిమ్స్ పతాకంపై పొన్నేరి రతి జవగర్ నిర్మించిన ఈ చిత్రంలో సకో రమేష్, దీప్తి దివాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఏపీఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) ఏపీఆర్ తెలుపుతూ కొడైక్కెనాల్లో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఒక యువతపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేస్తారన్నారు. ఆ జ్యోతి దెయ్యంగా మారి ఎవరైతే తనను మానభంగం చేసి చంపేశారో వారిపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో రూపొందిన చిత్రమే కల్లరై అని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించి ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయని చెప్పారు. హార్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే తాము ఈ చిత్రా న్ని నిర్మించినట్లు నిర్మాత రతి జవహార్ పేర్కొన్నారు. చిత్రం కచ్చితంగా వారి ఆదరణను పొందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూ ర్తయ్యాయని.. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రతి జవహార్, టి.జవహార్ జ్ఞానరాజ్, వి.యశోద, ప్రేమ ప్రియా, రోషిలా భారతీ మోహన్, సురేందర్ హరిహరన్, సురేష్, రామ్ రంజిత్, నందకుమార్, అజయ్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇది చదవండి: పవన్కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్పై రాజు రవితేజ కామెంట్) -
దెయ్యం సినిమాలు నా వల్ల కాదు
-
టాప్ 10 హర్రర్ సినిమాలు ఇవే..
-
డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
హారర్ జానర్ కు మల్లి మంచి రోజులు?
-
భయపెట్టేందుకు సిద్ధమైన గ్లామర్ బ్యూటీ!
గ్లామరస్ నటిగా ముద్ర వేసుకున్న సంచలన నటి యాషికా ఆనంద్. ఈమె ప్రధాన పాత్రలో దెయ్యంగా నటించిన హార్రర్ చిత్రం 'చైత్ర'. మార్ప్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మనోహరన్, టి.కన్నన్ సంయుక్తంగా నిర్మించారు. అవితేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్, మొసకుట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఎం.జెనిత్కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన బొట్టు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 24 గంటల్లో జరిగే హార్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందులో నటి యాషిక ఆనంద్ దెయ్యం పాత్రలో భయపెడుతుందన్నారు. అందుకు కారణాలు ఏమిటి అన్నదే చిత్ర కథ అని అన్నారు. ఈ చిత్రానికి ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించారని చెప్పారు. ఇప్పటికే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా చిత్ర టైలర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు జెనిత్కుమార్ అన్నారు. -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్డ్రాప్లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
బాలీవుడ్ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్గా బుల్లితెరపై కెరీర్ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్లోకి గ్రాండ్గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్ను లీడ్ రోల్కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లా ల్లోరోనా.. రాత్రి వేళ చూస్తే పగబడుతుంది..!
ప్రేమ.. నమ్మకం.. మోసం.. వేదన.. క్షణికావేశం.. పశ్చాత్తాపం.. ఇంచుమించుగా ఇవే ప్రతి కథకు అంశాలు. అయితే అసంపూర్ణంగా, తీరని ఆవేదనతో ముగిసిన కొన్ని జీవితాలు.. చరిత్రనే వణికించిన కథలుగా మారతాయి. అంతులేని మిస్టరీలుగా మిగిలిపోతాయి. ‘లా ల్లోరోనా’ ఈ పేరు వింటే మెక్సికోలో పిల్లలే కాదు పెద్దలు కూడా భయంతో పరుగుతీస్తారు. ‘లా ల్లోరోనా’ అంటే స్పానిష్లో ‘ఏడ్చే మహిళ’ అని అర్థం. ఏళ్ల కిందటి ఓ కన్న తల్లి ఆక్రందనలే ఈ కథకు మూలం. శాంటాఫె నది తీరంలో రాత్రి పూట నేటికీ ఆమె ఏడుపు వినిపిస్తుందనేది స్థానికుల నమ్మకం. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా ఏడుస్తుంది? మెక్సికన్లు.. ఆమె పేరు విన్నా, ఆమె ఏడుపు విన్నా ఎందుకు భయపడుతుంటారు? ఈ వారం మిస్టరీలో చూద్దాం. కొన్ని శతాబ్దాల క్రితం.. మెక్సికోలో ఓ పేద కుటుంబంలో మారియా అనే ఓ అందగత్తె ఉండేది. పొడవాటి జుట్టు, చక్కటి మోము, ఆకట్టుకునే చిరునవ్వుతో అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె వీధిలో అలా నడిచి వెళ్తుంటే దేవకన్య వెళ్తుందని అంతా పొగిడేవారు. ‘కనీసం రోజుకు ఒక్కసారైనా ఆమెను చూస్తే చాలు’ అన్నట్లు కుర్రాళ్లు ఆమె రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసేవారు. దాంతో మారియా.. పని లేకున్నా ఆ పొగడ్తల కోసమే ఎక్కువ సార్లు వీధుల్లో తిరిగేదట. ఆమె తెల్లటి గౌన్లే ఎక్కువగా ధరించేదట. ఓ రోజు మారియా అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు గుర్రం మీద వచ్చిన ఓ యువకుడు. పొగడ్తలతో మాటలు కలిపి.. ఆమెను తన ప్రేమలో పడేసుకున్నాడు. అబ్బాయి అందగాడూ ఆస్తిపరుడూ కావడంతో పేదవాళ్లైన మారియా తల్లిదండ్రులు.. ‘తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది’ అని ఎంతగానో సంతోషించారు. అతడితోనే అంగరంగవైభవంగా మారియా పెళ్లి జరిపించారు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అప్పుడే మారియా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రోజూ ఇంటికి రావాల్సిన భర్త.. మూడు నాలుగు రోజులకోసారి రావడం మొదలుపెట్టాడు. ‘ఎందుకు ఈ మార్పు?’ అంటూ ఓ రోజు మారియా భర్తను నిలదీసింది. ‘నువ్వు గతంలో మాదిరిగా లేవు.. వీలైతే పెళ్లికి ముందులా మారు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు భర్త. మారియా గుండె ముక్కలైపోయింది. ‘అందం శాశ్వతం కాదుగా’ అని వాదించింది. ఎన్నో విధాలుగా భర్తని మార్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. పైగా తన భర్తకు అందంగా ఉండే స్త్రీలంటే మోజనీ, కోరుకున్న అమ్మాయిలకు డబ్బును ఎరగా వేసి.. మోజు తీరాక వదిలించుకుంటాడనీ తెలుసుకుంది. దాంతో మరింత కుమిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. భర్త రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. భార్యపై ప్రేమ తగ్గినంత సులభంగా.. పిల్లలపై మమకారాన్ని చంపుకోలేకపోయాడు మారియా భర్త. కేవలం పిల్లల కోసమే ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. దాంతో మారియా మరింత రగిలిపోయింది. భర్తపై కోపం పిల్లలకు శాపంగా మారింది. క్రమంగా పిల్లలపై పగ పెంచుకుంది మారియా. వాళ్లను చంపి.. భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే పిల్లల్ని లాక్కెళ్లి సమీపంలోని శాంటాఫె నదిలో ముంచేసింది. అయితే నదిలో కొట్టుకుపోతున్న పిల్లల అరుపులు.. మారియాలోని తల్లిప్రేమను గుర్తు చేశాయి. ‘అమ్మా కాపాడు..’ అనే పసివాళ్ల ఏడుపులు మాతృ హృదయం తల్లడిల్లేలా చేశాయి. వెంటనే పిల్లల్ని కాపాడాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే నీటి ఉధృతి ఎక్కువ కావడటంతో పిల్లలు నదిలో కొట్టుపోయారు. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పటి నుంచి ఆ నది ఒడ్డునే పిల్లల్ని వెతుక్కుంటూ.. ఏడుస్తూ.. అరుస్తూ.. ఉండిపోయింది మారియా. అదే బెంగతో కొన్ని రోజులకు ఆ నది ఒడ్డునే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆత్మగా మారి... ఇప్పటికీ పిల్లల కోసం వెతుకుతూ కనిపిస్తుందనేది మెక్సికో అంతటా వినిపించే కథ. ఇక్కడి దాకా సెంటిమెంట్ యాంగిల్లోనే నడిచిన ‘లా ల్లోరోనా’కు.. హారర్ ట్విస్ట్లను జోడించి కథలు కథలుగా చెబుతుంటారు మెక్సికన్స్. తన పిల్లలు తనకు దూరమయ్యారు కాబట్టి మారియా ప్రేతాత్మలా మారిందని, ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా మాయం చేస్తుందని, ఆమెను రాత్రివేళ చూస్తే పగబడుతుందని, ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదనీ ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ చాలా మంది మెక్సికన్లు.. ‘మేము ఆమె ఏడుపుని విన్నాం’ అని చెబుతుంటారు. అక్కడి ప్రజలు రాత్రి వేళ నదులు, సరస్సుల దగ్గరకు వెళ్లాలంటే నేటికీ భయపడతారు. 2019లో, ఆమె ఆచూకీ కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో.. పారానార్మల్ ఫైల్స్ బృందం ప్రయోగాత్మకంగా కొన్ని వీడియోలు చేసింది. అందులో ఘోస్ట్ ఫైండర్ సాయంతో.. ఆమె స్వరాన్ని గుర్తించామంటూ కొన్ని భీకరమైన అరుపుల్ని వినిపించారు. ఇదే కోణంలో చాలా హారర్ మూవీస్ వచ్చినప్పటికీ.. 2019లో వచ్చిన ‘ది కర్స్ ఆఫ్ లా ల్లోరోనా’ అనే సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో వణికించింది. ఇప్పటికీ మెక్సికోలో కొందరు చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి.. నది సమీపంలో నివాసం ఉండే సాహసం చేయరు. మొత్తానికి ‘లా ల్లోరోనా’ కథ మెక్సికో చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన హరర్ చిత్రం
సాక్షి,చెన్నై(తమిళనాడు): మరోసారి భయపెట్టడానికి సీవీ–2 చిత్రం సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సీవీ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దెయ్యం ఒక వ్యక్తి మెడపై కూర్చొని ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా సీవీ–2ను తులసి సినీ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. కేఆర్ సెంథిల్నాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీఎల్ సంజయ్ చాయాగ్రహణను, ఎస్పీ అహ్మద్ సంగీతాన్ని అందించారు. ఇందులో దివంగత నటుడు తేంగాయ్ శ్రీనివాసన్ మనవడు యోగి, చరణ్రాజ్ కొడుకు తేజ చరణ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. నటి స్వాతిషా, సంతోష్, క్రిస్టియన్, దాడి బాలాజీ, శ్యామ్స్, కోదండం, గాయత్రి కుమరన్ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
Maranam Telugu Movie: ఆత్మలను బంధిస్తే...
వీర్సాగర్, శ్రీ రాపాక, మాధురి ప్రధాన పాత్రల్లో వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణం’. ‘కర్మ పేస్’ అనేది ఉపశీర్షిక. బి. రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. వీర్ సాగర్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్తో, గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుందంటే మా ‘మరణం’లా ఉంటుంది’’ అన్నారు. ‘‘వీర్ సాగర్ ఈ చిత్రంలో డెమనాలజిస్ట్ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ వరం, సంగీతం: మనోజ్ కుమార్. ఓ అమ్మాయి నేర కథ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్స్టోరీ’. జి. సురేందర్ రెడ్డి దర్శకుడు. సాధిక, ఆదీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నిళల్గళ్ రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏబీ శ్రీనివాస్, ఆర్. సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన ఏబీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. ఓ అమ్మాయి నేర కథాంశంతో నిర్మించాం. హారర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, రొమాంటిక్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఎన్ రూట్ హారర్ రూట్!
పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు సినిమాల్లో వేగం తగ్గుతుంది అంటారు. అవకాశాలు తగ్గుతాయంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లికి ముందులానే పెళ్లయ్యాక కూడా బిజీగా ఉంటున్నారు నాయికలు. అందుకు తాజా ఉదాహరణ కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత డీకే దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ హారర్ చిత్రం అంగీకరించారు కాజల్. ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. తాజాగా తమిళంలో రెండో సినిమా అంగీకరించారు. ‘గోస్టీ’ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రం కూడా హారర్ జానరే. ఇలా వరుసగా హారర్ చిత్రాలు ఒప్పుకుంటూ ‘ఎన్ రూట్ హారర్ రూట్’ (నా రూట్ హారర్ రూట్) అని కాజల్ అంటున్నారని అనుకోవచ్చు. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గోస్టీ’లో హారర్ ఎంత ఉంటుందో వినోదం కూడా అంతే ఉంటుందని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమాలో సుమారు 25మంది కమెడియన్లు నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ హీరో కూడా అతిథి పాత్రలో కనిపిస్తారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో చిరంజీవి ‘ఆచార్య’, కమల్హాసన్ ‘భారతీయుడు 2’, దుల్కర్ సల్మాన్ ‘సినామిక’ ఉన్నాయి. -
అంతకు మించి
నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు సమంత. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కామెడీ, లవ్ స్టోరీలు.. ఇలా అన్ని జానర్లలో ఆడియన్స్కి వినోదం పంచారామె. కానీ పూర్తి స్థాయి హారర్ సినిమాలో కనిపించలేదు సమంత. తాజాగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది హారర్ సినిమా అని సమాచారం. తమిళ నటుడు, స్నేహ భర్త ప్రసన్న ఇందులో కీలక పాత్ర చేస్తున్నారట. ‘‘ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి’’ అని పేర్కొన్నారు సమంత. మార్చి నెలలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ బాలీవుడ్ దర్శకుడు ఇక లేరు
సాక్షి, ముంబై : బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్సే(67) బుధవారం ముంబైలో మరణించారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూసారని ఆయన మేనల్లుడు అమిత్ రామ్సే బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. శ్యామ్ రామ్సే అంత్యక్రియలు ఈ రోజు విల్లే పార్లే శ్మశానవాటికలో జరుగనున్నాయని తెలిపారు. హారర్ సినిమాలు అనగానే బాలీవుడ్లో మొదట గుర్తుకు వచ్చేది రామ్సే ఏడుగురు సోదరులే. తులసీ రామ్సే, కుమార్ రామ్సే, శ్యామ్ రామసే, కేశు రామ్సే, గంగు రామ్సే, కిరణ్ రామ్సే సోదరులు 1980-90 మధ్య కాలంలో లోబడ్జెట్ హారర్ చిత్రాలు తీసి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రధానంగా శ్యామ్ తన సోదరుడు తులసితో కలిసి 1993 నుండి 2001 వరకు ప్రసారమైన ది జీ హర్రర్ షో అనే భారతీయ టెలివిజన్లో మొదటి భయానక ధారావాహికకు దర్శకత్వం వహించారు. అలాగే స్టార్ ప్లస్, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో హారర్ డ్రామా షోలకు కూడా దర్శకత్వం వహించారు. ఇవి అటుప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో బుల్లితెరపై భారీ విజయాన్ని సాధించాయి. శ్యామ్ మృతిపై పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇతరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. కాగా పురానా మందిర్, వీరానా, దో గాజ్ జమీన్ కే నీచే, బ్యాండ్ దర్వాజా, పురానీ హవేలి, అంధేరా, డాక్ బంగ్లా, సబూత్, ఖేల్ మొహబ్బత్ కా, గెస్ట్ హౌస్ వంటి చిత్రాలు రామ్సే సోదరుల ప్రత్యేక ప్రతిభకు నిదర్శనం. వారు నిర్మించిన చివరి చిత్రం 2017లో వచ్చిన కోయి హై. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రసారమైన జీ హారర్ షోకు శ్యామ్, అతడి సోదరుడు తులసి రామ్సే దర్శకత్వం వహించారు. తులసి గత ఏడాది డిసెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. -
నో బ్రేక్
ఈ రోజుల్లో సినిమా పూర్తి కావాలంటే 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల వరకూ పడుతుంది. చిన్న సినిమాల షూటింగ్ కూడా చాలా రోజులు పడుతోంది. కానీ తమిళంలో తమన్నా నటించనున్న ఓ హారర్ సినిమా నలభై రోజుల్లోనే పూర్తి కానుందని తెలిసింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ముఖ్యపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ రూపొందనుంది. యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం 42 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎటువంటి బ్రేక్స్ తీసుకోకూడని ఫిక్స్ అయ్యారట. మొదటి పది రోజులు చెన్నైలో మిగతా పోర్షన్ మొత్తం కారైకుడిలో షూట్ చేస్తారట. తమన్నా నటించిన హారర్ చిత్రాలు ‘దేవి 2’, కామోషీ’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి. -
‘కాంచన 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్లుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఏప్రిల్ 18న సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు. ముని సిరీస్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో కాంచన 3పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
క్లైమాక్స్ ముందే చెప్పేస్తే..!
ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు స్నేహితులతో కలసి వెళ్లామనుకోండి. అందులో ఎవరో ఒకరు ఆ సినిమాను ముందే చూసి ఉంటారు. ముందు చూడటంలో తప్పు లేదు కానీ కొందరు మాత్రం ఆ సినిమాలోని సీన్ రాకముందే ‘ఇలా జరుగుతుంది... ఇలా జరుగుతుంది’ అంటూ అన్నీ చెప్పేస్తుంటారు. అప్పుడు భలే చిరాకేస్తుంది కదా.. మరీ కోపం వస్తే కొట్టాలని కూడా అనిపిస్తుంటుంది. అచ్చు మీలాగే రష్యాకు చెందిన ఓ పెద్దాయనకు కూడా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా తాను చదివే పుస్తకాల్లోని క్లైమాక్స్ను ముందే చెప్పేస్తున్నాడనే కోపంతో తన సహోద్యోగిని ఏకంగా కత్తితో పొడిచేశాడట. రష్యాకు చెందిన 55 ఏళ్ల సెర్గెయ్ సవిస్కీ అనే శాస్త్రవేత్తకు పుస్తకాలు చదవడం అలవాటు. ఆయనతో పాటు 52 ఏళ్ల ఒలెజ్ బెలెగుజోవ్ నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఒలెజ్కు కూడా పుస్తకాలు చదవడం అంటే మహా పిచ్చి. టైం పాస్ అయ్యేందుకు ఇద్దరూ వందల కొద్దీ పుస్తకాలు చదివారు. చదువుతూ ఉన్నారు. సెర్గెయ్ చదివే పుస్తకాల్లోని కథ ముగింపును సరదాగా ఒలెజ్ ముందే చెప్పేస్తూ ఆయనను ఆట పట్టిస్తుండే వాడు. అయితే ఇది సెర్గెయ్కు నచ్చలేదు. పుస్తకంలోని థ్రిల్ను కోల్పోతున్నానని ఫీల్ అయ్యేవాడు. అంతే... కోపం పట్టలేక ఓ రోజు ఒలెజ్ను సెర్గెయ్ ఏకంగా కిచెన్లోని చాకుతో ఛాతీలో పొడిచాడు. అయితే వెంటనే ఒలెజ్ను హాస్పిటల్కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందనుకోండి. మీరు కూడా సినిమా చూసేటప్పుడు వచ్చే సీన్లను చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్త సుమా!