-
అదానీ - హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం!
అదానీ - హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదికపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు ఆరుగురు ప్యానెల్ సభ్యులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్యానల్ సభ్యులు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మే 12న దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం విచారించింది. అయితే నిపుణుల ప్యానెల్ విచారణ నిమిత్తం మరింత గడువు కోరిందా? లేదంటే నివేదికను అందించిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ దేశీయ స్టాక్ మార్కెట్ చట్టాల్ని ఉల్లంఘించిందో? లేదో? దర్యాప్తు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను అంచనా వేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనలను పటిష్టం చేయడానికి, భారతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు సుప్రీం కోర్టు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సీల్డ్ కవర్లో ఏముందో? తాజాగా, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు తమకు మరో 6 నెలలు పొడిగించాలని సెబీ సుప్రీంను కోరినట్లు సమాచారం. దీనిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఆరుగురు ప్యానెల్ సభ్యులు సుప్రీంకు నివేదిక అందివ్వగా.. ఆ సీల్డ్ కవర్ నివేదికలో ఏముందో అన్న చర్చ వ్యాపార వర్గాల్లో మొదలైంది విమర్శలు.. ఖండించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సుప్రీం కోర్టు విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. చదవండి👉 హిండెన్బర్గ్పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! -
రుణ చెల్లింపుపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: ఇటీవల రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తాజాగా 13 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,066 కోట్లు) రుణాలను ముందస్తుగా చెల్లించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని బిలియనీర్.. గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ కొద్ది రోజులుగా రుణాలను ముందుగానే చెల్లిస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో 2024 జూలైలో గడువు తీరనున్న 13 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేసేందుకు అదానీ పోర్ట్స్ టెండర్కు తెరతీసింది. ఈ బాటలో మరో 4 రుణాలను తిరిగి చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టెండర్కు 41.27 కోట్ల డాలర్ల విలువైన బాండ్లు దాఖలైనట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. -
శరద్ పవార్ ఇంటికి గౌతమ్ అదానీ
ముంబై: మహారాష్ట్రలో ఇవాళ(గురువారం) ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani), యూపీఏ మిత్రపక్షం అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్షులు శరద్ పవార్తో భేటీ అయ్యారు. సౌత్ ముంబైలోని పవార్ సిల్వర్ ఓక్ ఇంటికి వెళ్లిన అదానీ.. రెండు గంటలపాటు అక్కడే గడిపారు. దీంతో ఈ భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ పరిశోధన నివేదిక ఆధారంగా అదానీపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలన్నీ ఏకం కాగా, పవార్ మాత్రం జేపీసీని విభేదించారు. అంతేకాదు.. హిండెన్బర్గ్ నివేదిక వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారయన. ఈలోపు పవార్ తీరుపై విపక్షాల్లో అసహనం పెరిగిపోవడంతో జేపీసీకి బదులు.. సుప్రీం కోర్టు కమిటీని సమర్థిస్తూ తన అభిప్రాయం వెలిబుచ్చారాయన. జేపీసీలో మెజార్టీ సభ్యులు బీజేపీవాళ్లే ఉంటారని, కాబట్టి సుప్రీం ఆధారిత కమిటీనే ఈ వ్యవహారంలో విచారణకు మేలని విపక్షాలకు గుర్తు చేశారాయన. అయితే అంతలో మరోసారి స్వరం మార్చిన ఆయన.. విపక్షాల జేపీసీ విచారణ డిమాండ్కు తాము(ఎన్సీపీ) గళం కలపబోమని, అలాగని ఆ డిమాండ్ను వ్యతిరేకరించబోమని ప్రకటించారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. అయితే.. అదానీ విషయంలో పవార్ మొదటి నుంచి మెతక వైఖరి ప్రదర్శిస్తుండడంపై పలు విమర్శలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల కిందట వీళ్లద్దరికీ మంచి స్నేహం ఉండేది. కోల్ సెక్టార్ విస్తరణలో ఈ వ్యాపారవేత్తకు, రాజకీయనేత అయిన పవార్కు మధ్య బంధం ఏర్పడింది. అంతేకాదు.. పవార్ తన ఆటోబయోగ్రఫీ లోక్ మజే సాంగతి(2015)లో.. అదానీ హార్డ్వర్కర్ అని, సాదాసీదాగా, డౌన్ టు ఎర్త్ ఉంటారని పవార్ పేర్కొనడం గమనార్హం. Amid the Opposition's demand for a Joint Parliamentary Committee probe into the Adani-Hindenburg issue, industrialist #GautamAdani on Thursday met NCP supremo #SharadPawar at the latter's Silver Oak residence in Mumbai. The meeting reportedly lasted for over two hours. pic.twitter.com/ZivU9Q2KNF — Abhinay Deshpande (అభినయ్ देशपांडे) (@iAbhinayD) April 20, 2023 ఇదీ చదవండి: పారిపోయే యత్నం.. అమృత్పాల్ భార్య అరెస్ట్! -
Adani Row: ఆయన స్వరం మారింది
ముంబై: హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపై విపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్వరం మార్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ)ని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలను సైతం విపక్షాలు స్తంభింపజేశాయి. అయితే.. విపక్షాల జేపీసీ డిమాండ్కు తాము అంగీకరించబోమని, కాకుంటే విపక్షాల ఐక్యత కోసం వాళ్ల డిమాండ్ను వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారాయన. ఈ విషయంలో(జేపీసీ డిమాండ్) మా మిత్ర పార్టీలతో మేం విబేధిస్తున్నాం. మద్దతు ఇవ్వం. కానీ, మేం ఐక్యంగా కొనసాగాలనుకుంటున్నాం. అందుకే విపక్షాల డిమాండ్ను వ్యతిరేకించకూడదని నిర్ణయించుకున్నాం అని ఓ మరాఠీ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు. అంతకు ముందు ఇదే ఎన్సీపీ చీఫ్ హిండెన్బర్గ్-అదానీ అంశంపై జేపీసీ విచారణకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని పేర్కొన్నారాయన. ఈ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు ప్యానెల్ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కొన్నిరోజులకే ఆయన స్వరం మార్చారు. గత వారం ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్నకు అనుకూలంగా మాట్లాడారు. హిండెన్బర్గ్ నివేదిక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా, కేవలం విమర్శనాత్మకంగా ఉందంటూ పేర్కొన్నారు పవార్. ‘‘గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పవార్ 2015లో తన ఆటోబయోగ్రఫీలో అదానీనీ పొడుగుతూ.. రాసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అదానీతో బంధం వల్లే ఆయన విమర్శించలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపైనా ఈ అంశం ప్రభావం చూపెట్టవచ్చని, 2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకు పోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఇది.. అడ్డుపుల్లాలాంటి ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రాహుల్ గాంధీకి గౌతమ్ అదానీ కౌంటర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిలియనీర్ గౌతమ్ అదానీ కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అంతా పారదర్శకమేనని, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుపుతూ అదానీ గ్రూప్ నివేదికను విడుదల చేసింది. అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ..అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ గ్రూప్ కౌంటర్గా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిపింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ 2019 నుండి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియన్ డాలర్ల వాటా విక్రయాల వివరాలు, అలాగే 2.55 బిలియన్ డాలర్లు గ్రూప్ కంపెనీల వ్యాపారాల్లోకి ఎలా వచ్చాయన్న విషయాలనూ వివరించింది. కాగా, అదానీ గ్రూప్లో విదేశీ పెట్టుబుడులపై ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. ఇది గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘ఉద్దేశపూర్వక’ ప్రయత్నమని పేర్కొంది -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్బర్గ్ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
బ్లాక్ కంపెనీని టార్గెట్ చేసిన హిండెన్బర్గ్.. జాక్ డార్సీకి షాక్!
న్యూఢిల్లీ: షార్ట్సెల్లింగ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ను అతలాకుతలం చేసిన అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా మరో కంపెనీని టార్గెట్ చేసుకుంది. ఈసారి ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీకి చెందిన చెల్లింపుల కంపెనీ బ్లాక్ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లను బ్లాక్ తప్పుదోవ పట్టించిందంటూ నివేదికను ప్రచురించింది. 1 బిలియన్ డాలర్ల పైగా మోసానికి పాల్పడిందంటూ ఆరోపించింది. దాదాపు రెండేళ్ల పరిశోధన తర్వాత ఈ రిపోర్టును రూపొదించినట్లు పేర్కొంది. ఈ నివేదికతో అమెరికా మార్కెట్లో బ్లాక్ షేర్లు ఒక దశలో 20 శాతం పైగా క్షీణించి 58 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో ఆరోపించడం, ఫలితంగా అదానీ సంస్థల షేర్లు భారీగా పతనం కావడం తెలిసిందే. అంతకు ముందు 2020లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్పై కూడా హిండెన్బర్గ్ పలు ఆరోపణలు చేసింది. దీనితో ఆ కంపెనీ షేరు పతనం కావడంతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. -
చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్బర్గ్కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే..
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని అమెరికా మొబైల్ చెల్లింపు సంస్థ ‘బ్లాక్’పై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. అవకతవకలకు పాల్పడిదంటూ ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం.. గతంలో స్వేర్ (Square Inc) అనే పేరుతో ఉన్న ఈ బ్లాక్ (Block Inc) సంస్థ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. బ్యాంక్ ఖాతాలు లేనివారి కోసం ఈ సంస్థ సరికొత్త ఆర్థిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇదీ చదవండి: హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి? అయితే అదే టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులను పెంచుకున్న బ్లాక్ సంస్థ దాన్ని అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాన్ని సులభతరం చేయడం, నియంత్రణను నివారించడం, రుణాలు, ఫీజుల దోపిడీని విప్లవాత్మక సాంకేతికతగా మార్చిందని ఆక్షేపించింది. యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. 40 నుంచి 75 శాతం అకౌంట్లు ఫేక్వే కరోనా సంక్షోభం అనంతరం బ్లాక్ క్యాష్ యాప్ పురోగతి చాలా మంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లాక్ తన యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపిందని, అదే సమయంలో ఖర్చులను తక్కువగా చూపించిందని హిండెన్బర్గ్ నివేదిక పేర్కొంది. బ్లాక్ కస్టమర్ల అకౌంట్లలో 40 నుంచి 75 శాతం ఫేక్వేనని ఆరోపించింది. కోవిడ్ సమయంలో 18 నెలల్లో 639 శాతం పెరిగిన బ్లాక్ స్టాక్కు కొత్త వ్యాపారం ఒక్కసారిగా పెరుగుదలను అందించిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! జాక్ డోర్సీపై ఆరోపణలు జాక్ డోర్సే బ్లాక్లో మోసాన్ని సులభతరం చేశారని హిండెన్బర్గ్ ఆరోపించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే 2015 నుంచి 2021 వరకు దాని సీఈవోగా పనిచేశారు. కోవిడ్ సమయంలో బిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను డంప్ చేయడం ద్వారా ఆయన లాభపడ్డారని హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆరోపించింది. బ్లాక్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్కెల్వే ఇద్దరూ 1 బిలియన్ డాలర్ల స్టాక్ను విక్రయించారని పేర్కొంది. సీఎఫ్వో అమృతా అహుజాతో సహా ఇతర అధికారులు, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా కూడా మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ను డంప్ చేశారని ఆరోపించింది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరుతో కూడా.. బ్లాక్ క్యాష్ యాప్లో జాక్ డోర్సీకి అనేక ఫేక్ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా డజన్ల కొద్దీ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయని వివరించింది. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! -
హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?
న్యూఢిల్లీ:యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్పై వెల్లడించిన రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్ఇంక్ ఏంటి? సహ వ్యవస్థపాకులతోపాటు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ భారతీయ-అమెరికన్ సీఎఫ్వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ ఇంకపై హిండెన్బర్గ్ గురువారం కీలక రిపోర్ట్ను వెల్లడించింది. జాక్ డోర్సే జేమ్స్ మెక్కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్లు "మిలియన్ల డాలర్లను స్టాక్లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో జాక్ డోర్సే , జేమ్స్ మెక్ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ను విక్రయించారు. అలాగే సీఎఫ్వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్పై కూడా విమర్శలు గుప్పించింది. అమృతా అహుజా ఎవరు? ♦ అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి. ♦ 2019లో బ్లాక్లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్బిఎన్బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ♦ ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ♦ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె. ♦ ఫాక్స్లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ♦ "కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్" వంటి పాపులర్ గేమ్ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజారే కంపెనీకి అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్ స్టోర్ బిజినెస్ మోడల్నుంచి,ఆన్లైన్, ఆల్వేస్ ఆన్ లాంటి మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో దుమ్ము రేపేలా సాయపడింది. ♦ ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్లో కనిపించింది. ♦ భర్త హర్ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు. ♦ తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్ల్యాండ్ హైట్స్లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్లో సమ్మర్ క్యాంప్ కౌన్సెలర్ ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే సీఈవో సుందర్ పిచాయ్కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తన నెక్ట్స్ బాంబును ట్విటర్మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బైట పెట్టింది. తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు షార్ట్ సెల్లర్ తన వెబ్సైట్లో ప్రచురించిన నోట్లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న "మాయాజాలం"అని వ్యాఖ్యానించింది. బ్లాక్ సంస్థ "అండర్బ్యాంక్" కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు న్నారని కూడా ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్ల నిమిత్తం ఖాతాలను భారీగా సృష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. NEW FROM US: Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ (1/n) — Hindenburg Research (@HindenburgRes) March 23, 2023 -
త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్..
వివాదస్పద నివేదికతో అదానీ గ్రూప్ను దెబ్బ కొట్టిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను త్వరలో విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా హిండెన్బర్గ్ తెలియజేసింది. అయితే ఈసారి హిండెన్ బర్గ్ ఎవరిని లక్ష్యం చేసుకుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో మొదలయింది. ఏమిటీ హిండెన్బర్గ్ రీసెర్చ్? ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్. ఈ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అక్రమాలు, దుర్వినియోగం, బహిర్గతం చేయని లావాదేవీలను ఈ సంస్థ శోధించి బయటపెడుతుంది. ఇందుకోసం కంపెనీ తన సొంత మూలధనాన్ని ఖర్చు పెడుతుంది. హిండెన్బర్గ్ వెబ్సైట్ పేర్కొన్న దాని ప్రకారం.. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో అవకతవకలను గుర్తించి బయటపెట్టింది. అదానీ గ్రూప్పై ఆరోపణలతో కుదుపు ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిదంటూ గత జనవరి 24న హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ను వెలువరించింది. దాన్ని మరుసటి రోజున ట్విటర్లో షేర్ చేసింది. మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా అదానీ గ్రూప్తో సంబంధం ఉన్న అనేక మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నివేదిక వెలువరించినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక పట్ల చాలా అనుమానాలున్నాయి. కేవలం తాను షార్ట్ సెల్లింగ్ చేసేందుకు గాను, అంటే తనకు ప్రయోజనం కల్పించుకునేందుకు హిండెన్ బర్గ్ ఆరోపణలు గుప్పించిందని పలువురు విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలంటూ SEBI సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : హిండెన్ బర్గ్ పై హరీష్ సాల్వే వ్యాఖ్యలు) ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ ఈ నివేదిక వెలువడిన ఐదు వారాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయాడు. అదానీ గ్రూప్ కూడా ఊహించని విధంగా పూర్తిగా సబ్స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఎఫ్పీవోను ఉపసంహరించుకుంది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
అదానీ గ్రూప్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గుజరాత్లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2021లో అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ గుజరాత్లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు చెందిన స్థలంలో ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బొగ్గు నుంచి పీవీసీ వరకు ఉత్పత్తి చేసేలా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకాన్ని కలిగించేలా రుణాలను తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది. -
వినోద్ అదానీ ప్రమోటర్ల గ్రూప్లో భాగమే: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే. వినోద్కు అదానీ గ్రూప్లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది. -
హిండెన్బర్గ్ - అదానీ వివాదం : అషిమా గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత మార్కెట్లు మరింత బలంగా, వైవిధ్యంగా మారాయని ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఇవి అదానీ గ్రూపు అంశాన్ని సాఫీగా సర్దుబాటు చేసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సంస్థలకు వ్యాపించలేదని లేదా సంక్షోభంగా మారలేదని గుర్తు చేశారు. నియంత్రణ సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్ను కఠినతరం చేశాయని, అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. విడిగా గ్రూపులకు సంబంధించి ప్రభుత్వానికి ఆందోళన లేదన్నారు. జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. విదేశాలకు అక్రమ మార్గాల్లో డబ్బులు తరలించి, షెల్ కంపెనీల ద్వారా ఇక్కడ అదానీ గ్రూపు షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపించింది. ఖాతాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. వీటిని అదానీ గ్రూపు ఖండించింది. భారత్కు చెందిన బడా కార్పొరేట్లు విదేశీ నిధులు సమీకరిస్తుండడంతో, విదేశీ అనలిస్టుల వైపు నుంచి వాటి ఖాతాలపై సునిశిత పరిశీలన ఉంటుందని గోయల్ చెప్పారు. ‘‘భారతీయ సంస్థలు ఇప్పటికీ సంక్లిష్టమైన నిర్మాణాలను కలిగి ఉన్నాయి. దీంతో పారదర్శకత లోపిస్తోంది. ఫలితంగా హిండెన్బర్గ్ వంటి సంస్థలకు అవకాశాలు కల్పిస్తోంది.’’అని గోయల్ అభిప్రాయపడ్డారు. -
రెండో విడత పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి. అదానీ–హిండెన్బర్గ్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. సహకరించండి: ఉపరాష్ట్రపతి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు. -
హిండెన్బర్గ్ ఆరోపణలు.. అదానీకి పెరిగిపోతున్న దేశాధినేతల సపోర్ట్!
అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తోసిపుచ్చారు. రెగ్యులేటర్లు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, తనకు సంబంధించినంత వరకు ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ‘‘ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం కాదు. నేరం రుజువయ్యే వరకు మీరు నిర్దోషే’’ అని చెప్పే న్యాయ సూత్రాల గురించి ప్రస్తావించారు. అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలపై భారత్కు చెందిన ఓ మీడియా సంస్థతో టోనీ అబాట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞుడను. తన దేశంలో బిలియన్ల డాలర్ల విలువైన అదానీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ఆ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు, సంపద సృష్టించామని చెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా నుంచి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు సహాయంతో.. భారత్లో నిరంతరం విద్యుత్తును అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం చేశారని గౌతమ్ అదానీపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి అదానీ గ్రూప్పై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదని, హిండెన్ బర్గ్ చేస్తున్న అసత్య ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు టోనీ అబాట్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హిండెన్బర్గ్పై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! అదానీ అండగా టోనీ అబాట్ కాగా,2015లో అబాట్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆస్ట్రేయాలియాలో అదానీ కార్మైకేల్ సంస్థ బొగ్గు గనుల్ని వెలికితీసేందుకు పూనుకుంది. ఆ బొగ్గు వెలికి తీతపై స్థానిక కోర్టు తీవ్రంగా ఖండించింది. గనుల పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. దీన్ని ఖండించిన అబాట్ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల విస్తృతస్థాయి ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ అదానీ గ్రూప్కు అండగా నిలిచారు. ఎట్టకేలకు 2019లో అదానీ గ్రూప్నకు తుది అనుమతులు లభించాయి. అక్కడి నుంచి వెలికితీసిన బొగ్గునే ఇప్పుడు అదానీ గ్రూప్ భారత్కు సరఫరా చేస్తోంది. -
హిండెన్బర్గ్పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!
అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్బర్గ్ ‘నో గుడ్ స్మార్టానీయన్’.అందుకు పూర్తిగా విభిన్నమైంది. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బుల్ని కొల్లగొట్టడం విచారకరమని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ - అదానీ గ్రూప్ అంశంపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన డిబెట్లో పాల్గొన్న హరీష్ సాల్వే.. హిండెన్ బర్గ్ తీరును విమర్శించారు. హిండెన్ బర్గ్ నో స్మార్టానీయన్. అవకాశావాది. తమకు అనుగుణంగా నివేదికను విడుదల చేయడం, మళ్లీ అదే నివేదికను కనుమరుగు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిండెన్బర్గ్ సంస్థను 'అనైతిక షార్ట్ సెల్లర్'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని అన్నారు. షేర్ వ్యాల్యూని తగ్గించి టన్నుల కొద్ది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల పెట్టబుడుల్ని కాజేసింది ఎవరనేది స్పష్టం చేస్తుందని తెలిపారు. హిండెన్ బర్గ్ స్టాక్ మార్కెట్ను మానిప్యులేషన్ చేయడంలో దిట్ట. ఆ సంస్థ ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించాలి. ఉదాహరణకు కంపెనీలు స్టాక్ మార్కెట్లోని మదుపర్లని మోసం చేస్తున్నాయని నిజంగా అనిపిస్తే.. అందుకు తగ్గ ఆధారాలుంటే వెంటనే భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తే విచారణ జరిపిస్తారు. కానీ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ అలా చేయలేదు. డైరెక్ట్గా రిపోర్ట్లను అడ్డం పెట్టుకొని కంపెనీలపై దాడులకు పాల్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని సెబీ చూస్తూ కూర్చొదుగా. ఎవరు స్టాక్ మార్కెట్లోని అలజడని సృష్టించి తద్వారా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కాజేస్తున్నారో ఇలా అందర్ని వెలుగులోకి తెస్తుందన్నారు. మనదేశంలో ఇదో కొత్త గేమ్. కేపిటల్ మార్కెట్ వృద్ది సాధిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులు మక్కువ చూపుతుంటారు. హిండెన్ బర్గ్ లాంటి రిపోర్ట్లు వెలుగులోకి వచ్చి.. అవి అబ్ధమని రుజువయ్యే సమయానికి సదరు కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింతుందని వెల్లడించారు. కాగా, సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆరుగురు సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే, ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖరన్ సుందరేశన్ ఉన్నారని మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే చెప్పారు. -
‘అదానీ’పై సుప్రీం నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ–హిండెన్బర్గ్ వ్యవహారంపై విచారణ జరపడంతోపాటు మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలను సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేత్వత్వం వహించే ఈ కమిటీలో ఎస్బీఐ మాజీ చైర్మన్ ఒ.పి.భట్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి.దేవధర్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ అధినేత కె.వి.కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మాజీ అధినేత నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారని తెలియజేసింది. స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సెబీని ఆదేశించింది. హిండెన్బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల మదుపరులు భారీగా నష్టపోయారని, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా వారు నష్టపోకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. పెట్టుబడిదారులను చైతన్యవంతంచేయడానికి చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేయాలని కమిటీకి స్పష్టంచేసింది. కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై దర్యాప్తునకు కమిటీని నియమించడానికి తమకు అభ్యంతరం లేదంటూ గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించినసంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని, తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగా, కోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ స్పందించారు. నిర్దిష్ట గడువులోగా ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. సత్యం గెలుస్తుంది అని పేర్కొన్నారు. -
సత్యమే గెలుస్తుంది: గౌతం అదానీ
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు, హిండెన్బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ స్పందించారు. సమయాను కూలంగా నిజాలు నిగ్గు తేలతాయని... సత్యమే గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్బర్గ్ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు) The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail. — Gautam Adani (@gautam_adani) March 2, 2023 హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్పై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా రెగ్యులేటరీ బాడీని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే ఆరుగురు నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఇప్పటికే అదానీ కొట్టిపారేశారు. హిండెన్బర్గ్ నివేదికను ఖండిస్తూ అదానీ గతంలోనే గ్రూపు సమూహం 413 పేజీల ప్రతిస్పందనను కూడా విడుదల చేసింది. హిండెన్బర్గ్ ,వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సెబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఒక పిటిషన్ను దాఖలు చేశారు. హిండెన్బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్లో కోరారు. దీంతోపాటు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, ఒకసామాజిక కార్యకర్త కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. -
అదానీ హిండన్బర్గ్ అంశంపై సెబీ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం
-
అదానీ-హిండెన్బర్గ్ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు - హిండెన్బర్గ్ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలని సెబీని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ న్యాయమూర్తులు జేపీ దేవదత్, ఓపీ భట్తోపాటు కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర సుందరేశన్ ఉన్నారు. ఈ ప్యానెల్కు అన్నివిధాలా సహకారాన్ని అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్పర్సన్ను బెంచ్ ఆదేశించింది. అదానీ-హిండెన్బర్గ్ కేసుపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్ల బ్యాచ్ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు. -
అదానీకి ఊరట:వేల కోట్ల మార్కెట్ క్యాప్ జంప్, ఎందుకు?
సాక్షి,ముంబై: షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో విలవిల్లాడుతున్న అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. బుధవారం నాటి మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా ఎగిసాయి. దీంతో అదానీ గ్రూప్ ఎం-క్యాప్ ఏకంగా రూ. 39 వేల కోట్లు మేర పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు పెరగడం ఇది రెండో రోజు. అదానీకి చెందిన రెండో విలువైన స్టాక్ అదానీ పోర్ట్స్ & సెజ్, ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.4,277 కోట్లు జోడించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం జంప్ చేసి రూ.1,500 స్థాయికి చేరుకున్నాయి. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ jpce గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ. 39,000 కోట్ల నుంచి రూ. 7.50 లక్షల కోట్ల మార్కుకు పెంచిన స్టాక్లలో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం ఎగసింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 29 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ రూ.4,277 కోట్లు ,అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.3,841 కోట్లు , అదానీ పవర్, అదానీ విల్మార్ , అంబుజా సిమెంట్స్ రూ. 2-3వేల కోట్లను గ్రూప్ ఎం-క్యాప్కు జోడించడ విశేషం. ముంద్రా అల్యూమినియం కాగా కంపెనీ అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం, ఒడిశాలోని కుట్రుమాలి బాక్సైట్ బ్లాక్ తవ్వకాలకు ప్రాధాన్య బిడ్డర్గా నిలిచింది. ఒడిషాలోని కలహండి ,రాయగడ జిల్లాల్లో ఉన్న ఈ బ్లాక్లో మొత్తం 128 మిలియన్ టన్నుల భౌగోళిక వనరులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పొందింది. మరోవైపు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్లలో ఫిక్ట్స్డ్ ఇన్కం రోడ్షోను నిర్వహిస్తోంది. దీనికి తోడు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 800 మిలియన్ల డాలర్లు రుణ సదుపాయాన్ని పొంద నుందన్న నివేదికలు పాజిటివ్గా మారాయి. -
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్పై ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్లో పలు కౌంటర్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
వరుస నష్టాలు, గ్లోబల్ రిచ్ లిస్ట్లో అదానీ ఎక్కడంటే?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపుపై ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్తో గత ఐదు నెలల్లో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ, ఆటో, ఆయిల్ స్టాక్స్లో నష్టాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి. చివరికి సెన్సెక్స్ 176 పాయింట్లు లేదా 0.30 శాతం క్షీణించి 59,288 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 526 పాయింట్ల మేర కుప్పకూలింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 17,393 వద్ద ముగిసింది. కాగా ఏడు సెషన్లలో, సెన్సెక్స్ 2,031 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించగా, నిఫ్టీ 643 పాయింట్లు లేదా 4.1 శాతం నష్టపోయి 17,400 స్థాయికి దిగువన ముగిసింది. అటు డాలరుమారకంలో రూపాయి 9పైసల నష్టంతో 82.84 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ & టూబ్రో, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోగా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. 40 బిలియన్ డాలర్ల దిగువకు అదానీ మార్కెట్ క్యాప్ మరోవైపు అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల తరువాత బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 బిలియన్ల డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రధానంగా ఫిబ్రవరి 27న అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 12 శాతం క్షీణించి 1107 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో పుంజుకుని 1188 వద్ద ముగిసింది. దీంతో గ్రూప్ వాల్యుయేషన్ ఆగస్టు 2021 తర్వాత మొదటిసారిగా రూ. 7 లక్షల కోట్ల దిగువకు పడిపోయిందని మార్కెట్ వర్గాల అంచనా. జనవరి 24 నాటికి రూ. 19.19 లక్షల కోట్లతో పోలిస్తే 65 శాతం క్షీణించింది. దీంతో గౌతం అదానీ ఇప్పుడు గ్లోబల్ రిచ్ లిస్ట్లో 39వ స్థానానికి పడిపోయారు.