-
వొడాఫోన్ ఐడియా టారిఫ్లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్లో ఎటువంటి మార్పు చేయలేదు. -
ఎయిర్టెల్ కూడా పెంచేసింది! జియోను మించి..
టెలికం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ప్రత్యర్థి రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్లను 10-21 శాతం పెంచింది.దేశంలో టెల్కోలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. "ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రంలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం" అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.పెంచిన మొబైల్ టారిఫ్లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉండేలా చూశామని టెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే..» గతంలో రూ.179గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.199» గతంలో రూ.455గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.509» గతంలో రూ.1799గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.1999» గతంలో రూ.265గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299» గతంలో రూ.299గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.349» గతంలో రూ.359గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.409» గతంలో రూ.399గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.449» గతంలో రూ.479గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.579» గతంలో రూ.549గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.649» గతంలో రూ.719గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.859» గతంలో రూ.839గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.979» గతంలో రూ.2999గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.3599 -
బాదుడే బాదుడు..
-
ఈ కంపెనీ వాహనాలు ఇప్పుడే కొనేయండి.. లేటయితే..
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ వాహనాలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా తమ వాహనాల రేట్లను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ బుధవారం తెలిపింది.టాటా మోటార్స్ ప్రస్తుతం కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. జెన్ నెక్ట్స్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియాల్లో ఈ వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ వాహనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ చివరిసారిగా మార్చిలో తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచింది.2024 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఆదాయం 52.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టాటా మోటార్స్ షేరు కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. 26.6 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేరు ప్రస్తుతం (బుధవారం మధ్యాహ్నం) రూ.983 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా ఇది నిరంతరాయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పలుమార్లు రూ.1000 మార్కును దాటింది. -
పెరగనున్న చక్కెర ధర
ఇకపై తీపి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల మధ్య చక్కెర మిల్లల నిర్వహణ వాటి యజమానులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు కనీసం రూ. 42కి పెంచాలని నేషనల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ (ఎన్ఎఫ్సీఎస్ఎఫ్)ప్రభుత్వాన్ని కోరింది.మరోవైపు అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే 2024-25 సీజన్కు చక్కెర కనీస అమ్మకపు ధర (ఎంఎస్పీ) ను పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎఫ్సీఎస్ఎఫ్ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చక్కెర ధరను పెంచినట్లయితే, దాని ప్రభావం రిటైల్ మార్కెట్లో కనిపిస్తుంది. దీంతో చక్కెర ధర పెరిగేందుకు అవకాశముంది. చక్కెర ధర కిలోకు రూ.3 నుంచి 4 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.2019 నుండి చెరకు కనీస అమ్మకపు ధర కిలోకు రూ. 31 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరకు రైతులకు చెల్లించే న్యాయమైన,లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని పెంచింది. ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చెరకు కనీస అమ్మకపు ధరను సర్దుబాటు చేయడం అవసరమని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.42కి పెంచితే చక్కెర పరిశ్రమ లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. -
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? లిమిట్ దాటితే బాదుడే!
క్యాష్ విత్డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది.వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది.ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి. -
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు శుభవార్త. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈ వారంలో వరుసగా తగ్గుముఖం పడుతుండడం కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని, పసిడి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఇక తాజాగా, ఆదివారం (మే 26) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే..మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శనివారం (మే 25) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే.. మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శుక్రవారం (ఏప్రిల్ 24) పసిడి ధరల్లో అత్యంత స్వల్పంగా కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.67,290 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 73,410 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,440 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,560గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.67,290 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,490 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,630కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,410గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం రోజు దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు .. ఎలా ఉన్నాయంటే?
గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (మే 20) పసిడి అత్యంత స్వల్పంగా తగ్గింది.ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటేహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390 వద్ద ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 74,610 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.74,760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,610గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,490 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,7200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,610 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది. -
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది -
పెట్రోల్, డీజిల్ @ రూ.125
-
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
గత కొద్ది రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండో రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో పెరిగిపోతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ అంశాలు,పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి విపరీమైన డిమాండ్ పెరుగుతోంది. ఒకానొక దశలో 10 రోజుల వ్యవధిలో రూ.10 వేలు పెరగడంపై బంగారం వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే కొద్ది కొనుగోలు శక్తి తగ్గిపోవడం..ఫలితంగా వ్యాపారం సైతం కుంటుపడుతుందని అంటున్నారు. ఈ తరుణంలో పసిడి ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలు, అమ్మకం దారులకు ఊరటనిచ్చినట్లైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
పసిడి.. వెండి పోటాపోటీ
న్యూఢిల్లీ: పసిడి పరుగు వరుసగా రెండవ రోజూ కొనసాగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం రూ.350 పెరిగి, రూ.71,700కు చేరిన 10 గ్రాముల ధర, మంగళవారం మరో రూ.140 జతచేసుకుని రూ.71,840 రికార్డు హైకి చేరింది. ఇక వెండి ధర కూడా సరికొత్త రికార్డులు చూసింది. కేజీ ధర ఒకేరోజు రూ.500 పెరిగి రూ.84,500కు చేరింది. సోమవారం వెండి ధర మొదటిసారి రూ.84,000కు చేరిన సంగతి తెలిసిందే. కారణాలు ఇవీ.. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి, వెండి పరుగునకు కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ఈ మెటల్స్ సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. దేశీయంగా రూపాయి బలహీన ధోరణి కూడా బులిష్ ధోరణికి దోహదపడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో మెరుపులు... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర మంగళవారం జూన్ కాంట్రాక్ట్ సరికొత్త రికార్డు 2,384 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 16 డాలర్ల పెరుగుదలతో 2,368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎస్లో పసిడి జూన్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.523 పెరిగి రూ.71,435 రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.71,739ని సైతం తాకింది. వెండి విషయానికివ వస్తే, క్రియాశీలక మే కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.366 ఎగసి రూ. 82,241 సరికొత్త రికార్డుల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.83,000 దాటింది. -
పసిడి ధరలు పైపైకి.. త్వరలో తులం బంగారం లక్ష
ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదారబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730 ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880 బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? సాధారణంగా బంగారం, స్టాక్ మార్కెట్లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. యుఎస్లో బంగారం ధరలు (ఏప్రిల్2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి. ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డ్లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది. -
దేశంలో బంగారం ధరలు.. పెరిగాయా? తగ్గాయా?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి గత కొన్ని రోజులు నుంచి తగ్గుముఖం పడుతూ వస్తుంది. నేటి బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,850 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,470గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,970గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,280గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 17న పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100గా ఉంది -
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదేనా?
దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం రూ.70వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పసిడి ధరల మార్పులకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు నిపుణులు. మార్చి నెల ప్రారంభం నుంచి గత గురువారం వరకు పసిడి ధర రూ. 2,700 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,298కి ఎగబాకింది. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు పెరగడానికి ఈ ఏడాది జూన్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మదుపుర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. లాభాల్ని గడిస్తున్నారు. ఈ అంచనా ప్రకారం..జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మదుపర్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది ఇది బంగారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సందర్భంగా .. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక రంగంలో అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం బంగారం పెరుగుదల ధోరణి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా ఖరీదైనవిగా మారుతున్నందున పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లించవచ్చు అని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అన్నారు. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
రానున్న రోజుల్లో పసిడి ధరలు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.66,270 ఉండగా రానున్న కాలంలో అది కాస్త 70వేలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ప్రకారం, కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను రాబోయే సంవత్సరంలో 10 గ్రాముల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి రూ.70వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో మార్చి 10న దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,100గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,420గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 2న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరగగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,410 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,720గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,060 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,320గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది