High returns
-
అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్) భారత్కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మూమెంటమ్ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. పెరిగే ధరతో ప్రయోజనంపెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్ విధానం ఉంటుంది. మూమెంటమ్ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్కి అందుబాటులో ఉన్న స్టాక్స్కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్కేర్కి 18 శాతం, క్యాపిటల్ గూడ్స్కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్ సర్వీసెస్ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్ను ఏటా జూన్, డిసెంబర్లో సమీక్షిస్తారు.సాధారణ బెంచ్మార్క్కు మించి రాబడులుధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్మార్క్ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్కేర్ స్టాక్స్కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్ ఇండెక్స్.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్ అకౌంటు లేని వారు ఇండెక్స్ ఫండ్ మార్గం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 ఏడాది 3 ఏళ్లు 5 ఏళ్లు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టీఆర్ఐ 70.0% 28.6% 23.6% నిఫ్టీ 200 టీఆర్ఐ 38.3% 18.4% 16.5% -
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్లోనూ రెగ్యులర్ ప్లాన్తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్లో ఎంట్రీలోడ్ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్కు చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్లో ఎంట్రీలోడ్ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్కు చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల కోసం పెరటికోళ్ల పెంపకం(లైవ్స్టాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గొర్రెల పంపిణీ మాదిరగా మేలుజాతి పెరటి కోళ్లను ఈ పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లాలో వెలుగు కార్యాలయాల వద్ద లైవ్స్టాక్ యూనిట్ల పంపిణీ సైతం ప్రారంభమైంది. పెరట్లోనే ఆదాయం.. పెరటి కోళ్ల పెంపకం అనేది మహిళలకు తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే వారు నెలకు రూ.10వేలు వరకు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి వద్ద తినిపడేసే వ్యర్థ పదార్థాలతో పాటు పథకం కింద అందజేసే దాణాను కోళ్లకు ఆహారంగా వేస్తే సరిపోతుంది. బాయిలర్ కోడి గుడ్డు రూ.5 ధర పలుకుతుంటే, ఈ దేశవాళీ పెరటి కోడి గుడ్లు ఒక్కొక్కటి రూ.10 వరకు పలుకుతుంది. సాధారణ కోళ్ల కంటే రెట్టింపు బరువుతో మాంసం అమ్మకానికి ఉపయోగపడతాయి. కుక్కల బెడద నుంచి కాపాడుకుంటే సరిపోతుంది. యూనిట్ల కోసం దరఖాస్తు ఇలా.. పెరటి కోళ్ల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీటిని సబ్సిడీపై సమకూరుస్తుంటే వాటి రక్షణ, వ్యాక్సినేషన్ ఇతర బాధ్యతలు పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ చూస్తోంది. మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంలకు గ్రామాల్లోని సీఎఫ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులకు వాహనం ద్వారా కోళ్లు సరఫరా చేస్తారు. సంరక్షణ నియమావళి, ఇతర సౌకర్యాలను అధికారులే వివరిస్తారు యూనిట్ ధర రూ.3970. ఇందులో ఎనిమిది కోడిపెట్టలు, మూడు కోడి పుంజులు ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి బట్టి 160 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. వీటితో పాటు 30 కేజీల దాణా అందించనున్నారు. మార్కెట్లో కిలో దాణా రూ.240 వరకు పలుకుతుంది. కోళ్లు ఎటువంటి అనారోగ్యం కాకుండా నలభై రోజులు వరకు పనిచేసే డీ వార్మింగ్– ఎండీ వ్యాక్సినేషన్ చేయించి అందిస్తారు. మెడికల్ కిట్లు సైతం సరఫరా చేస్తారు. ఇందులో లివర్ టానిక్, బి–కాంప్లెక్సు వంటి యాంటి బయాటిక్లు ఉంటాయి. చదవండి: ‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ చురుగ్గా గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని 25 మండలాలకు గాను 2500 యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. మండలానికి తొలిదశలో భాగంగా 100 యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 1530 యూనిట్లకు సరఫరా చేసేందుకు లబ్దిదారుల గుర్తింపు జరిగింది. పలాస మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనం వద్ద పథకం తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఏపీఎంలను సంప్రదించాలి పెరటికోళ్ల పెంపకం ఇటీవలే ప్రారంభమైంది. మండలాల వారిగా కోళ్ల పంపిణీ జరుగుతోంది. యూనిట్ల కోసం వెలుగు కార్యాలయంలో ఉన్న ఏపీఎంలను సంప్రదించాలి. – డాక్టర్ మోతిక సన్యాసిరావు, డీఆర్డీఏ డీపీఎం, శ్రీకాకుళం -
రాబడి కోసం కొత్త మార్గం..!
కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు. సంప్రదాయ డెట్ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ఇన్వాయిస్ ఫైనాన్స్ / డిస్కౌంటింగ్ అంటే... ఇన్వాయిస్ ఫైనాన్స్, డిస్కౌంటింగ్ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్ను నోట్బుక్ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్బుక్ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను రూ.90వేలకే ఒక ప్లాట్ఫామ్లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ డీల్లో పేపర్ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్ తయారీ కంపెనీ నోట్ బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు. ఎలా పనిచేస్తుంది..? ఇది స్టార్టప్ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్ఇన్వెస్ట్, క్రెడ్ఎక్స్ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తుంటాయి. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్బీఎఫ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు ‘ఇన్వాయిస్ ఫైనాన్స్/ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్వాయిస్ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్వాయిస్లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి. సౌకర్యవంతం... ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్లైన్ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్ఫామ్లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్ఫామ్పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్ చేసే ఇన్వాయిస్లను ఆయా ప్లాట్ఫామ్లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్తో సంయుక్తంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల అవకాశాలు జిరాఫ్ ప్లాట్ఫామ్.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్కు సంబంధించి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్ డీల్ను లిస్ట్ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఏర్పడితే... డిఫాల్ట్ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్ను క్లోజ్ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్ ప్లాట్ఫామ్పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ డీల్ కూడా ఉంది. క్రెడ్ఎక్స్ ప్లాట్ఫామ్లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తోంది. సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్వాయిస్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది. ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం. రిస్క్లు ఏమిటంటే.. ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్ఫామ్లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్ఫామ్లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు. కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్ఫామ్లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్లో 7%, ఎఫ్డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది. ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్ తదితర అంశాల ఆధారంగా రిస్క్ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్వాయిస్లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్వాయిస్లపై రిస్క్ తక్కువగా ఉంటుంది. -
చిన్న పెట్టుబడి.. చిగురించేనా..?
‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’.. కాదని ఎవరూ అనరు. చిన్నారుల పట్ల ఎంతో శ్రద్ధ, సంరక్షణ, ముద్దు చూపిస్తాం. వారు భవిష్యత్ తరాలకు ప్రతిరూపాలు. అందుకే ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. అలాగే, విరామం అన్నది లేకుండా కష్టపడి సంపాదించుకుని, మిగుల్చుకున్న కొద్ది మొత్తంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే ముందు శ్రద్ధ అవసరం లేదా..? కచ్చితంగా ఉండాలి. చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ ఇన్వెస్టర్లకు అంతే శ్రద్ధ, పరిశీలన, జాగ్రత్త అవసరం. పెద్ద కంపెనీలతో పోలిస్తే.. ఒక నిర్ధేశిత కాలంలో చిన్న కంపెనీలు అధిక రాబడులు ఇస్తాయన్నది కాదనలేని నిజం. 2020 ఏప్రిల్ నుంచి చూసుకుంటే లార్జ్క్యాప్ కంపెనీలు నూరు శాతం వరకు రాబడులను ఇవ్వగా.. మిడ్క్యాప్ కంపెనీలు రెండు రెట్లు, అంతకంటే ఎక్కువ, స్మాల్క్యాప్లో ఐదు రెట్లు, పది రెట్ల లాభాలను కురిపించిన స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి చిన్న కంపెనీలంటే అంత ఆకర్షణ. కార్పొరేట్ ప్రపంచంలో ఎస్ఎంఈలు అంటే చాలా చిన్న కంపెనీలని అర్థం చేసుకోవాలి. పెద్ద కంపెనీలతో పోలిస్తే వేగంగా ఎదిగే సామర్థ్యం వీటికి సహజంగానే ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని సమయాల్లో ఇవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే.. ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక పెద్ద కంపెనీ డివిడెండ్ ఆపేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక చిన్న కంపెనీ ఏకంగా మూతపడిపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బీఎస్ఈ ‘ఎస్ఎంఈ’, ఎన్ఎస్ఈ ‘ఎమర్జ్’ ప్లాట్ఫామ్లు ఎస్ఎంఈల కోసం ఉద్దేశించినవి. ఇక్కడ సుమారు 380 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.25,600 కోట్లు. ఒక మిడ్క్యాప్ కంపెనీ మార్కెట్ విలువకు సమానం. మార్కెట్ విలువ విషయంలో నక్కకి, నాగలోకానికి అన్నట్టు ఈ కంపెనీల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,000 కోట్లుగా ఉంటే, మరొక కంపెనీ మార్కెట్ విలువ కేవలం కోటి రూపాయలే. ఈ కంపెనీలన్నింటి టర్నోవర్ 2021 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లు. లాభం రూ.280 కోట్లుగానే ఉంది. ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో ఒక వారంలో నమోదు చేసిన లాభంతో ఇది సమానం. కరోనా సంవత్సరంలో ఈ కంపెనీల రుణ భారం రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు పెరిగింది. ప్రతీ నాలుగు కంపెనీల్లో ఒకటి నష్టాలను నమోదు చేసింది. ఇంత చిన్నవి కావడం, ఆర్థిక బలం తక్కువగా ఉండడం వల్ల సంక్షోభాల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వాటిని ఎదుర్కొనే శక్తి కొన్నింటికే ఉంటుంది. ... ఇక లాభాలను పరిశీలిస్తే.. సగటు లాభాల మార్జిన్ ఎస్ఎంఈలకు ఒక శాతంగానే ఉంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇది సగటున 10 శాతం, మిడ్క్యాప్ కంపెనీలకు 5 శాతం, స్మాల్క్యాప్ కంపెనీలకు 3.4 శాతం చొప్పున ఉంది. వ్యాపార విస్తరణ అవకాశాలు, సరైన వ్యాపార నమూనాలు వీటికి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్వోసీఈ) ఎస్ఎంఈ స్టాక్స్కు 8.5 శాతంగా ఉంటే, రిటర్న్ ఆన్ నెట్వర్త్ (ఆర్వోఎన్డబ్ల్యూ) 6.5 శాతం చొప్పున ఉంది. లార్జ్క్యాప్ కంపెనీలకు 12–16 శాతం మధ్య, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీలకు 11–16 శాతం మధ్య ఈ రేషియోలు ఉన్నాయి. పైగా చాలా వరకు ఎస్ఎంఈ కంపెనీలు టెక్నాలజీ, వినూత్న వ్యాపారాల్లోనివి కావు. ఇప్పటికే వేలాది కంపెనీలు పనిచేస్తున్న సంప్రదాయ వ్యాపారంలోనివే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఈ కంపెనీల వ్యాపారానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ కంటే పెద్ద కంపెనీలతో పోటీపడేంత సామర్థ్యం తక్కువ వాటికే ఉంటుంది. రాళ్లలో రత్నాన్ని గుర్తించినప్పుడే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు రాలతాయి. ఇందుకోసం లోతైన అధ్యయనం కావాల్సిందే. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే... చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్ఎంఈ)ల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్లాట్ఫామ్ల గురించి వినే ఉంటారు. ఈ విభాగంలో ఐపీవోల గురించి తెలిసింది తక్కువే. ఇటీవలి కాలంలో ఈ విభాగంలోనూ చాలా కంపెనీలు ఐపీవోల ద్వారా లిస్ట్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు స్వల్పకాలంలోనే కాసులు కురిపిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లు ఇటువైపు చూస్తున్నారు. కొన్ని భారీ రాబడులను తెచ్చిపెడుతున్నది నిజమే. కానీ, నష్టాలు ఇచ్చేవీ ఉంటాయి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే ముందు.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి, పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తగిన రక్షణ చర్యలతో ప్రయాణం ఆరంభిస్తే.. మధ్యలో ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డగలరు. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని చేరుకోగలరు. అధ్యయనం చేస్తే లాభాలే.. అన్నింటినీ పరిశీలించి సరైన కంపెనీని ఎంపిక చేసుకుంటే లాభాలు ఖాయమనడానికి ఉదాహరణగా బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రివెస్ట్ డెన్ప్రో, ఓమ్ని పొటెంట్, ఫోకస్ బిజినెస్ సొల్యూషన్స్ లిస్టింగ్ నాడే 50–125 శాతం మధ్య లాభాలను ఇచ్చాయి. 2021లో 45 ఎస్ఎంఈ ఐపీవో లు రాగా ఇందులో లిస్టింగ్ రోజు 17 కంపెనీలు లాభాలను ఇవ్వలేకపోయాయి. కానీ, ఈకేఐ ఎనర్జీ, రంగోలి ట్రేడ్కామ్, నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్, బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రోమ్యా క్స్ పవర్ అండ్ ప్లాటినమోన్ బిజినెస్ 100 శాతం నుంచి 5,000 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. 48 ఐపీవోల్లో 24 కంపెనీలు ఇప్పటికీ ఇష్యూ ధరకు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. విలువ, లభ్యత బుల్ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగానే ఉంటాయి. ఆ సమయంలో కంపెనీల స్టాక్ వ్యాల్యూషన్లు గరిష్టాలకు చేరడం సహజం. ఎస్ఎంఈ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టే వారు బుల్ ర్యాలీల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ఇతర కంపెనీలకు సంబంధించి ఒక్క షేరును అయినా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, ఎస్ఎంఈ స్టాక్స్లో ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు ఈకేఐ ఎనర్జీ స్టాక్నే తీసుకోండి. నెల క్రితం వరకు 1200 లాట్ సైజుగా ఉండేది. అప్పుడు ఒక్కో షేరు ధర రూ.3,000కుపైమాటే. అంటే రూ.36 లక్షలు పెడితేనే ఒక లాట్ను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఆ తర్వాత లాట్సైజ్ 50కు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.5,800గా ఉండడంతో 50 షేర్లను కొనుగోలు చేయాలంటే పెట్టుబడిగా సుమారు రూ.3లక్షలు కావాల్సిందే. సాధారణ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక్క లాట్ కోసం రూ.15వేల పెట్టుబడి చాలు. కానీ, ఎస్ఎంఈ ఐపీవోలో పాల్గొనాలంటే సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. పీఈ రేషియో ఆధారంగా ఎస్ఎంఈ స్టాక్స్ ఎంపిక కాకుండా, ఇతర వ్యాల్యూషన్ అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ(ఈవీ) టు ఎబిట్డా, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ, అమ్మకాలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ మేరకు ఉంది.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి ఆధారంగా దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ఈ చిన్న కంపెనీలు చౌకగా ఉన్నాయా లేక ఖరీదుగా ట్రేడవుతున్నాయా అన్న అవగాహనకు రావచ్చు. ఎస్ఎంఈ విభాగంలోని క్వాలిటీ ఫార్మా ఏకంగా 55 పీఈలో ట్రేడవుతోంది. అంటే ఫార్మాలో దిగ్గజాలైన దివిస్, గ్లాండ్ ఫార్మా, జీఎస్కే ఫార్మా, అబ్బాట్ ఇండియా, నాట్కో కంపెనీల పీఈ వ్యాల్యూషన్లలో ఈ కంపెనీ ఉంది. ఎస్ఎంఈ విభాగంలోని బ్రోకరేజీ స్టాక్ ఈస్ట్ ఇండియా సెక్యూరిటీస్ అయితే 7 పీఈలోనే చౌకగా అందుబాటులో ఉంది. బ్రోకరేజీలో దిగ్గజాలదే ఎప్పుడూ మార్కెట్ ఆధిపత్యం ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలకు పోర్ట్ఫోలియోలో ప్రాధాన్యం ఇస్తారు. ఆటుపోట్లు అధికం పెద్ద కంపెనీలు అయితే మార్కెట్ల పతనాల్లో నష్టాల పరంగా రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ, స్మాల్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీలు ఎక్కువగా అస్థిరతలకు లోనవుతుంటాయి. ఎస్ఎంఈ విభాగంలో అయితే ఆటుపోట్లు మరింత అధికం. 2020 మార్చి సమయంలో ఈ విభాగంలోని ప్రతీ మూడు కంపెనీల్లో రెండు 25 శాతానికి పైనే నష్టపోయాయి. ఎస్ఎంఈ స్టాక్స్లో లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల సమయాల్లో, మార్కెట్ అస్థిరతల్లో విక్రయించుకోవడం కష్టంగా మారొచ్చు. ముఖ్యంగా డౌన్సర్క్యూట్లోకి వెళితే మరింత నష్టాలకు విక్రయించుకోవాల్సి రావచ్చు. చిన్న కంపెనీలు కావడంతో అందుబాటులో (ప్రీ ఫ్లోట్) షేర్లు కూడా పరిమితంగానే ఉంటుంటాయి. దీంతో ఒక సర్కిల్ ఆపరేటర్ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల వల్ల కొంత కొనుగోలు మద్దతు రాగానే ధరలు అప్పర్ సర్క్యూట్కు వెళ్లడం.. కొంచెం విక్రయాల ఒత్తిడికే డౌన్ సర్క్యూట్ను చూడడం కనిపిస్తుంది. ఇది వ్యయాలను పెంచుతుంది. పైగా అన్ని స్టాక్స్ రోజువారీగా ట్రేడ్ అవుతాయని అనుకోవద్దు. బీఎస్ఈ ఎస్ఎంఈ విభాగంలో 201 స్టాక్స్కు గాను 90 స్టాక్స్లోనే రోజువారీగా ట్రేడింగ్ నమోదవుతుంటుంది. బీఎస్ఈలో ఎస్ఎంఈ షేర్లు ‘ఎం’ గ్రూపు కింద ట్రేడవుతుంటాయి. ఎస్ఎంఈలోని 21 కంపెనీలు గత 12 నెలల్లో రెట్టింపునకు పైగా పెరిగాయంటే.. సత్తానా లేక డిమాం డ్ వల్లనా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కవరేజీ తక్కువ ఎస్ఎంఈ కంపెనీలకు బ్రోకరేజీ సంస్థలు, విశ్లేషకుల కవరేజీ అన్నది ఏదో ఒకటి రెండు కంపెనీలు మినహా దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. దీంతో ఆయా కంపెనీలు, వాటి వ్యాపార వ్యూహా లు, భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలు, పోటీతత్వం, యాజమాన్యం సామర్థ్యం గురించి తెలుసుకునే అవకాశాలు ఉండవు. ఇదే పెద్ద ప్రతికూలత. అయితే, బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లు కొన్ని ఎస్ఎంఈ స్టాక్స్కు సంబం ధించి పరిశోధన నివేదికలను అందుబాటు లో ఉంచుతున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు ఈ నివేదికలను చదివి కంపెనీల గురించి తెలుసుకోవాలి. కంపెనీల సామర్థ్యాలు తెలియనప్పుడు కేవలం డిమాండే ఆయా స్టాక్స్ ధరలను నిర్ణయిస్తుంటుంది. కనుక కవరేజీ ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కాస్తంత సురక్షితం. దీనివల్ల ఆయా కంపెనీల గురించి ఎక్కువ మందికి సమాచారం వెళుతుంది. పెట్టుబడులూ వస్తాయి. చిన్న కంపెనీలకు మద్దతుగా.. పెద్ద కంపెనీలకు నిధుల సమీకరణ పెద్ద కష్టమైన పని కాదు. కానీ, అతి చిన్నవైన కంపెనీలకు నిధులను రాబట్టుకోవడం ఎంతో కష్టం. వీటికి మద్దతుగా నిలిచేందుకే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రత్యేక ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశాయి. మెయిన్ ప్లాట్ఫామ్లతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగంలోని కంపెనీలకు నిబంధనల పరంగా కొంత వెసులుబాటూ ఉంది. ఇతర కంపెనీలకు మాదిరిగా ఎస్ఎంఈల ఐపీవోలకు సెబీ అను మతి అక్కర్లేదు. ఎక్సే్ఛంజ్లే అబ్జర్వేషన్ లెటర్ను మంజూరు చేస్తాయి. మెయిన్ ప్లాట్ఫామ్ల్లోని కంపెనీలు ప్రతీ మూడు నెలలకోసారి ఖాతాలను ఆడిటింగ్ చేయించుకోవాలి. ఎస్ఎంఈలకు ఇది ఆరు నెలలుగా అమలవుతుంది. సత్తా ఉన్న కంపెనీలు చిన్నవైనా సరే నిధుల సమీకరణతో మరింత ఎదిగేందుకు అనుకూలమైన వేదికలుగా ఇవి ఉపయోగపడతాయి. కనుక ఈ వేదికలు పెట్టుబడులకే కానీ, ట్రేడింగ్కు అనుకూలంగా ఉండదు. -
రాబడులకు రక్షణ!
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా ర్యాలీ చేసిన తర్వాత దిద్దుబాటుకు గురికావడం సహజం. అమ్మకాల ఒత్తిడికి పడిపోయినా.. కనిష్ట ధరల వద్ద కొనుగోళ్లు మార్కెట్లను ఎప్పుడూ ఆదుకుంటుంటాయి. దీంతో బలంగా తిరిగి ముందుకు ర్యాలీ చేస్తుంటాయి. మార్కెట్ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై అధిక రాబడులు ఆశించే వారు ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు పడినాకానీ.. పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా డెట్ విభాగం ఆదుకుంటుంది. షేర్ల ధరలు గణనీయంగా పడిపోతుంటే రిటైల్ ఇన్వెస్టర్లు భావోద్వేగాలకు గురికావడం సహజంగా చూస్తుంటాం. దీంతో నష్టాలకు కూడా విక్రయించేస్తుంటారు. అదే మాదిరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీల క్షీణతను చూసి విక్రయించే తప్పిదం చేయకూడదు. అందుకనే భావోద్వేగాలపై నియంత్రణ లేని వారు, రిస్క్ అంతగా వద్దనుకునేవారికి హైబ్రిడ్ ఫథకాలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కొంత భాగం పెట్టుబడులు డెట్ సాధనాల్లో ఉంటాయి కనుక.. ఈక్విటీ కరెక్షన్లలోనూ ఎన్ఏవీ పెద్దగా పడిపోవడం జరగదు. ఈ పథకం ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ రూపంలో ఈ విధంగా రెండు రకాల ప్రయోజనాలను పొందొచ్చు. ఈ విభాగంలో ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ఈ పథకం ప్రిన్సిపల్ బ్యాలన్స్డ్ ఫండ్గా కొనసాగేది. రాబడులు ఈ పథకం పనితీరు అన్ని కాలాల్లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 48 శాతం రాబడులను అందించింది. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షిక రాబడులు 13.36 శాతం చొప్పున ఉన్నాయి. అదే విధంగా ఐదేళ్లలో 13.51%, ఏడేళ్లలో 12.77 శాతం, పదేళ్లలో 14.85 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. డెట్తో కూడిన పథకం దీర్ఘకాలంలో సగటున 12 శాతంపైనే రాబడులను అందించడం అన్నది మంచి విషయమే. పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.1,120 కోట్లున్నాయి. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. 2017 బుల్ మార్కెట్, 2018 బేర్ మార్కెట్ సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 75 శాతం ఈక్విటీల్లోనే ఉన్నాయి. డెట్ పెట్టుబడులు 20 శాతంగా ఉంటే, మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. మొత్తం 60 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ 24 శాతం పెట్టుబడులను వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ, ఇంధనం, ఆటోమొబైల్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పోర్ట్ఫోలియో ఇలా అయితే బెటర్!
కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించి ఇప్పటికే ఒక మాసం ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ప్రధాన సూచీలు 70 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 సూచీలో 200కు పైగా స్టాక్స్ రెట్టింపునకు పైగా పెరిగాయి. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లోనూ అదే మాదిరి లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడులంటే ఒక్క లాభాలే కాదు. మీ పెట్టుబడికి రక్షణ కూడా అవసరం. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా పోర్ట్ఫోలియో నిర్మాణం ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళికకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, ఈక్విటీల్లో అధిక రాబడులను చూసి లేదా బిట్కాయిన్ పరుగులు చూసి భారీగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఈక్విటీలతో పాటు ఇతరత్రా సాధనాలకు ఇన్వెస్టర్లు ఏ మేరకు పెట్టుబడులను కేటాయించుకోవాలన్న అంశంపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి... ఎకానమీ పుంజుకుంటుంది ప్రతీ ఇన్వెస్టర్ జీవితంలో ఏ దశలో ఉన్నారు.. లక్ష్యాలు, వాటికి ఎంత వ్యవధి ఉందనే అంశాల ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక అవరోధాలు ఏర్పడినప్పటికీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుంది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి చక్రంలోకి భారత్ ప్రవేశించనుంది. కంపెనీలు బలమైన లాభాల ఆర్జనకు ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్లు మంచి పనితీరు చూపించేందుకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభాలు పెరగనున్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఈక్విటీలు సా«ధారణం కంటే ఎక్కువే రాబడులను ఇస్తాయి. కరోనా సెకండ్వేవ్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, వాటిని భారత్ తట్టుకోగలదన్న విశ్వాసం ఉంది. – నీరజ్ కుమార్ ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్ /ఈటీఎఫ్లు మెరుగైనవి.. 2020 మార్చిలో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ 78 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఈక్విటీల పరిమాణం పెరిగి ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి సంపదను సమకూర్చుకునేందుకు సరైన పోర్ట్ఫోలియో నిర్మాణం ఎంతో అవసరం. పెట్టుబడుల లక్ష్యాలకు ఇది కీలకం. ఆయా అంశాలను పరిశీలిస్తే... ► ఈక్విటీలు: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ వ్యయాలకే మార్కెట్ ఆధారిత రాబడులను అందుకోవచ్చు. ► స్థిరాదాయం: స్థిరమైన, మంచి వృద్ధికి అవకాశం ఉన్న ఎన్సీడీలు ఇప్పటికీ ఉన్నాయి. మార్కెట్ అస్థిరతలను తట్టుకునేందుకు, పోర్ట్ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు హెడ్జింగ్ కోసం ఈ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: దేశీయ మార్కెట్లలో ఉండే అస్థిరతలకు హెడ్జ్ (రక్షణగా)గా అంతర్జాతీయ ఈక్విటీలు ఉపయోగపడతాయి. అంతేకాదు బలమైన వృద్ధి అవకాశాలున్న అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ► బంగారం: ఈక్విటీ మార్కెట్ల తీరు ప్రతికూలంగా మారిన సందర్భాల్లో బంగారం పథకాల్లో పెట్టుబడులు.. స్థిరత్వాన్నిస్తాయి. పెట్టుబడుల కేటాయింపులు.. ► ఈక్విటీలు: 70 శాతం (నేరుగా స్టాక్స్లో 40 శాతం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు 20 శాతం, ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్కు 10 శాతం) ► ఫిక్స్డ్ ఇన్కమ్: 15 శాతం (డెట్ మ్యూచువల్ ఫండ్స్కు 10 శాతం, ఏఏఏ రేటెడ్ కార్పొరేట్ ఎన్సీడీలకు 5 శాతం). డెట్ ఫండ్స్లో అల్ట్రా షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్ లేదా డైనమిక్ బాండ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: 10 శాతం (ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్కు 5 శాతం, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్కు 5 శాతం) ► బంగారం: 5 శాతం (గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లు) – దినేష్ రోహిరా, 5నాన్స్ డాట్కామ్ సీఈవో ఇక ముందూ ఈక్విటీల ర్యాలీ 2021–22లో అంతర్జాతీయంగా అధిక ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి, ప్రధానంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. దేశీయ ఈక్విటీలకు 50–60 శాతం మధ్య, అంతర్జాతీయ ఈక్విటీలకు 20–30 శాతం మధ్య కేటాయించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. వ్యాల్యూ స్టాక్స్పై దృష్టి సారించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలో ఇవి మంచి పనితీరు చూపిస్తాయి. బంగారం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 10 శాతం చొప్పున కేటాయించుకోవాలి. నిపుణుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. కేటాయింపులు.. ► బంగారం, ఫిక్స్డ్ఇన్కమ్: 10 శాతం ► అంతర్జాతీయ ఈక్విటీలు: 20–30% దేశీయ ఈక్విటీలు: 50–60% – దివమ్ శర్మ, గ్రీన్ పోర్ట్ఫోలియో సర్వీసెస్ 60/40 ఫార్ములా.. ఇన్వెస్టర్ వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. సాధారణంగా 60/40 సూత్రాన్ని మేము సూచిస్తుంటాం. అంటే 60 శాతం కేటాయింపులు ఈక్విటీలకు, మిగిలిన 40 శాతం స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు, బంగారం కలయికగా ఉండాలి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు భారీ ర్యాలీ చేసినప్పటికీ 2021–22లోనూ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడులను ఇస్తాయని భావిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లు, సరిపడా ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం, కార్పొరేట్ లాభాలు పుంజుకోవడం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగుతుంది. వచ్చే రెండేళ్లపాటు ఈక్విటీలు రెండంకెల రాబడులను ఇస్తాయన్నది అంచనా. కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని దేశం అధిగమించడానికి తగిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇది ఈక్విటీలకు సానుకూల అంశం. కేటాయింపులు ► ఫిక్స్డ్ ఇన్కమ్: 40 శాతం (ఇందులో బంగారం, వడ్డీ ఆదాయాన్నిచ్చేవి, స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు ఉండాలి) ► ఈక్విటీలు: 60 శాతం కేటాయించుకోవాలి. – గౌరవ్దువా, షేర్ఖాన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ -
ఫండ్స్ ఎంపిక ఇలా కాదు..!
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ప్రతి నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ.. ఎంపిక విషయంలో పట్టిపట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. జీవనశైలి, అవసరాలు, రిస్క్ తీసుకునే సా మర్థ్యం ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉం టుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్లో పెట్టుబడులకు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన. డివిడెండ్ డివిడెండ్ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్ డివిడెండ్ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలో చన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్ అయితే 10% పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10% పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది. డెట్ ఫండ్స్లో అయితే డివిడెండ్ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ(ఎస్డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్ అవుతుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్ ఫండ్స్లో డివిడెండ్ ఆశిస్తే, డివిడెండ్ పంపిణీ పన్ను కింద 29.12% పడుతుంది. ఇన్వెస్టర్ ఆదాయం ఏ స్లాబ్లో ఉందన్నదానితో సంబం ధం ఉండదు. కానీ, ఎస్డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్ ఫండ్స్లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వీలూ ఉంది. ఫండ్స్ సంస్థ తెలియక్కర్లేదు.. మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్ ఫండ్ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది. నికర విలువ స్టాక్స్లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను ఫండ్స్కు అన్వయించడం çసరి కాదు. స్టాక్స్లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ ఫండ్స్ యూనిట్ల నికర విలువ 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్ఏవీ పడిపోతుంది. ఇక మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు. ఫండ్ సైజు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలోఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్క్యాప్ ఫండ్కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు. వ్యయ భారం ఎక్స్పెన్స్ రేషియో... ఓ మ్యూచువల్ ఫండ్ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. ఫండ్స్ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతి రోజూ ఏఎంసీలు ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్పెన్స్ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్మార్క్, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్పెన్స్ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. డెట్ ఫండ్స్లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్ నాణ్యత, రిస్క్ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్పెన్స్ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్లో ఏడాది కాల పాయింట్ టు పాయింట్ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం. -
ప్రకతి సాగు.. పంటలు బాగు
సేంద్రియ ఎరువులతో చెరకు ఉత్పత్తి ఆదాయం.. అధిక దిగుబడి లక్ష్యం మహారాష్ట్ర కమతాల సందర్శనతో అవగాహన త్వరలో 15 మండలాల రైతుల శిక్షణ ఏర్పాట్లు చేస్తున్న ఎన్సీఎస్ కర్మాగారం సీతానగరం: రైతులు అధికాదాయం పొందాలి. మంచి దిగుబడినిచ్చే పంటలు పండించాలి.. ఇదే లక్ష్యంతో ఎన్సీఎస్ కర్మాగారం రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో నేర్చుకున్న పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. కర్మాగారం ఎమ్డీ ఎన్.నాగేశ్వరరావు సూచనల మేరకు డైరెక్టర్ దీక్షితులు ఆధ్వర్యంలో కర్మాగారం పరిధిలోని చెరకు ఉత్పత్తిదారులు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించడానికి చర్యలు చేపట్టారు. రసాయనాల రహిత ఎరువులను ఉత్పత్తి చేసి పంటలను పండించేందుకు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రకతి వ్యవసాయ నిపుణుడు, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత పాలేకర్ విధానాలను లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోని 15 మండలాల చెరకు రైతులకు గ్రామసభలు నిర్వహించి వివరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇటీవల మహారాష్ట్రలో చెరకు సాగు చేస్తున్న ప్రాంతాలకు రైతులు, సిబ్బంది, అధికారులను తీసుకెళ్లింది. అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్ సూచనల మేరకు కత్రిమ ఎరువుల రహిత పంటల సాగు, సేంద్రియ ఎరువుల తయారీ, మిశ్రమ పంటల సాగు విధానంపై 36 మంది సభ్యుల ప్రతినిధి బందం మహారాష్ట్రలో శిక్షణ పొందింది. ఆగస్టు నెలలో బారామతి, సోలాపూర్, షల్టాన్, ఇందాపూర్ తదితర ప్రాంతాల్లోని రైతుల కమతాలను సందర్శించి వారి అనుభవాలను తెలుసుకుంది. అక్కడి రైతులు సేంద్రియ ఎరువుతో పండిస్తున్న పంటలపై పొందిన అవగాహనతో ఎన్సీఎస్ యాజమాన్యం 2016–17 సీజన్లో ప్రతి రైతు ఎకరా విస్తీర్ణంలో పాలేకర్ విధానంలో చెరకు సాగు చేపట్టేలా రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ నెల నుంచి రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం డ్రిప్ విధానంతో నీరందిస్తూ చెరకు పండిస్తే ఎకరం విస్తీర్ణంలో 50 నుంచి 70 టన్నుల చెరకు పంట దిగుబడి వస్తుంది. రసాయనిక ఎరువైతే 5 రోజుల్లో, సేంద్రియ ఎరువైతే మూడు నెలల్లో ఫలితాలనిస్తుంది. పాడిపశువుల పేడ, మూత్రంతో ఎరువును తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నారు. సోలాపూర్లో 27 ఎకరాల విస్తీర్ణంగల కల్యాణీ ఫామ్లో 30 ఆవులు, గేదెలు, 10 నాటు పశువులు పెంచుతున్నారు. వాటì పేడ, మూత్రంతో ద్రవ జీవామతం, ఘన జీవామతం తయారుచేసి పంటపొలాలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ఫోనెక్స్ విధానంతో గడ్డి ఉత్పత్తి పాడిపశువులకు పచ్చిగడ్డి లభించకపోవడంతో నీడలో ఫొనెక్స్ పచ్చగడ్డి ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. మూడు కేజీల గడ్డి విత్తనాలను నాటితే పదిహేను రోజుల్లో 30 పాడిపశువులకు సరిపడే పచ్చిగడ్డి సిద్ధమవుతుంది. మహారాష్ట్రలో చెరకు సాగుచేస్తున్న పంటభూముల్లో మిశ్రమ పంటలుగా అల్లం, వెల్లుల్లి, నీరుల్లి, బీట్రూట్, వేరుశనగ, మినుము, మిరప, చిక్కుడు, మునగ పంటలు పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులను పండ్ల తోటల పెంపకానికి కూడా వినియోగిస్తున్నారు. రైతులు పండించే చెరకు విధానంలో తారెల వెడల్పు 5 నుంచి 8 అడుగుల దూరంలో చెరకు నాటినా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో అదే విధానాన్ని ఇక్కడి రైతులకు వివరించాలని నిర్ణయించారు.