-
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
నగరంలో కుండపోత వర్షాలు
-
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్స్
-
ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీగా వరద
-
ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి
-
HYD: మూసీకి భారీగా వరద.. జీహెచ్ఎంసీ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్)లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారిగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే.. నేడు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్ గతేడాది ఇదీ పరిస్థితి.. హిమాయత్ సాగర్: గతేడాది భారీగా వర్షాలు కురవడంతో రెండు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇరు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 జులై 10 న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని బట్టి అక్టోబరు 26 న మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది జులై 21 న మొదటి సారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1200 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్): గతేడాది ఉస్మాన్ సాగర్ జలాశయం రిజర్వాయర్ నీటి మట్టం 1785.80 అడుగులు ఉండగా జులై 10న మొదటి సారి గేట్లు ఎత్తారు. చివరిసారిగా అక్టోబరు 26 వ తేదీ నాటికి మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది ఈ రోజు మొదటిసారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 216 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీలోకి వదులుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఎండీ ఆదేశం: జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్-2, ఉస్మాన్ సాగర్-2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు: (సాయంత్రం 6 గంటల వరకు) పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 17 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు: పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 15 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 -
Yamuna River Waterlogging Images: యమునా ఉగ్రరూపం.. ఢిల్లీ వెన్నులో వణుకు (ఫొటోలు)
-
కర్ణాటకలో భారీ వర్షాలు.. చిత్రావతి, పెన్నా, జయమంగళి నదులకు భారీగా వరద
-
శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద ఉధృతి
-
నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
నిండు కుండల శ్రీశైలం డ్యామ్
-
ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి వరద
-
నాగార్జున సాగర్ కు భారీగా వరద
-
Hyderabad: హుస్సేన్సాగర్లోకి భారీగా వరదనీరు
-
జలదిగ్బంధంలోనే భద్రాచలంలోని పలు కాలనీలు
-
విజయవాడ : ప్రకాశం బ్యారేజీపై సందర్శకుల సందడి (ఫొటోలు)
-
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
-
హైదరాబాద్: జూపార్క్లో చేరిన వరద నీరు
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
-
నిండుకుండలా మారిన హుస్సేన్సాగర్
-
హుస్సేన్సాగర్కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: వరుస వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్సాగర్ దిగువ ప్రాంతంలోని బస్తీలు, మూసీ పరిసర ప్రాంతాల బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఏ క్షణం ఎలాంటి సంఘటన జరగనుందోననే ఆందోళనతో వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్సాగర్ జలాశయం నిండిపోయింది. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్)513.41 మీటర్లుకాగా, సోమవారానికి ఎఫ్టీఎల్ను మించి 513.45 మీటర్లకు చేరుకుంది. మంగళవారం 513.46మీటర్లకు, బుధవారం మధ్యాహ్నానికి 513.49 మీటర్లకు చేరుకోవడంతో తూములద్వారా నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.ట్యాంక్బండ్ కింద ఉన్న తూములు పూడికతో మూసుకుపోవడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు వాటిని తొలగించడం సర్ప్లస్ వెయిర్ (అలుగు)నుంచి సైతం నీరు వెళ్లేలా చెత్తాచెదారాల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు. భయం.. భయంగా.. ♦ఒకేసారి భారీ మొత్తంలో వరదనీరు కిందకు చేరితే దిగువ ప్రాంతాల్లోని కవాడిగూడ, అశోక్నగర్, నాగమయ్యకుంట, సబర్మతీనగర్ తదితర బస్తీల్లోకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళన చేరుతున్నారు. వదలని ముసురుతో సాగర్లో నీటిమట్టం ఏమాత్రం తగ్గలేదు. ఈ బస్తీలే కాక నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లోనూ, మూసీ పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండటంతో దాదాపు 150 బస్తీల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని వణికిపోతున్నారు. ♦ఓవైపు నానిన గోడలు కూలే ప్రమాదాలు పొంచిఉన్నాయి. లోతట్టు బస్తీలైన అంబర్పేట నియోజకవర్గంలోని పటేల్నగర్, ప్రేమ్నగర్, నరసింహబస్తీ, సంజయ్గాంధీనగర్, విజ్ఞాన్పురి, బతుకమ్మకుంట, మలక్పేట పరిసరాల్లోని న్యూశంకర్నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్బాగ్, కాలాడేరా, కమలానగర్, మూసానగర్, మూసారాంబాగ్, ఇందిరానగర్, శంకేశ్వరబజార్, ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ♦ఎప్పుడు వర్షాలొచ్చినా తీవ్రప్రభావం చూపించే పాతబస్తీలోని సిద్దిఖీనగర్, అమన్నగర్, భవానీనగర్, రహ్మత్నగర్, మౌలాకాచిల్లా, ముర్తుజానగర్, ఫరత్నగర్లతోపాటు గోల్కొండ పరిసరాల్లోని తాఖత్బౌలి, సజ్జద్ కాలనీ, నయీం కాలనీ, సాలేహ్నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్మక్తా, సికింద్రాబాద్లోని బ్రాహ్మణవాడి, రసూల్పురా , తదితర ప్రాంతాల్లోని బస్తీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా వివిధ బస్తీల్లోని దినసరి కూలీలు తదితరులు ఓవైపువర్షాల వల్ల కూలి పనుల్లేక, మరోవైపు ముంపు ముప్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తూముల ద్వారా నీరు విడుదల.. హుస్సేన్సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గేట్లు అంటూ లేవని హుస్సేన్సాగర్పై తగిన అవగాహన ఉన్న ఇంజినీర్లు తెలిపారు. వారి సమాచారం మేరకు, హుస్సేన్సాగర్కు నాలుగు ప్రధాన తూములు, రెండు అలుగులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూడుకుపోయాయి. మ్యారియట్ హోటల్ దగ్గర, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ దగ్గర అలుగులున్నాయి. ట్యాంక్బండ్ మధ్యన తూములున్నాయి. మరమ్మతులు లేక సవ్యంగా నీరు పారడం లేదు. మ్యారియట్ హోటల్వైపు ఉన్న తూము నుంచి అవసరమైన సమయాల్లో ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రస్తుత సీఎస్ సోమేశ్కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటునే చాలామంది గేట్లు తెరిచారంటున్నారు. -
నిర్మల్: ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
అల్లూరిజిల్లా విలీన మండలాల్లో వరద బీభత్సం
-
పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం