-
కోడలిపై దాడి ఘటనలో హెడ్ కానిస్టేబుల్పై కేసు
బోనకల్: గుండె కుడివైపు ఉందనే కారణంతో మహిళను ఆమె భర్త వేధించగా, ప్రశ్నించినందుకు ఆమైపె దాడి చేసిన మామ, హెడ్కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్లు, అత్త అన్నపూర్ణపై కేసు నమోదు చేసినట్లు బోనకల్ ఎస్ఐ మధుబాబు తెలిపారు. బోనకల్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు భాస్కరాచారికి ఖమ్మంకు చెందిన భవానీతో 2018లో వివాహం జరిగింది. అయితే, భవానీకి గుండె కుడివైపు ఉందనే కారణంతో భర్త, అత్తామామలు వేధిస్తున్నారు. ఈనేపథ్యాన భవానీ బోనకల్లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగా ఈనెల 14న వెళ్లగా మాటామాట పెరగడంతో ఆమైపె అత్తామామలు దాడి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
హైబీపీతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మృతి
కల్వకుర్తి టౌన్: విధి నిర్వాహణలో పోలీస్స్టేషన్ వాచ్ ఇన్చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ వివరాల ప్రకారం.. పట్టణ పోలీస్స్టేషన్లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్ (51) వాచ్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్ స్వస్థలం నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది. పోలీసుల నివాళి డ్యూటీలో శ్రీనివాస్ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్ చిత్రపటానికి సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూతురు అదృశ్యంపై ఫిర్యాదు... తల్లిపై కానిస్టేబుల్ అకృత్యం!
సాక్షి ప్రతినిధి, కడప: కాపాడాల్సిన రక్షకభటుడే కాటేయజూశాడు. అండగా వచ్చాడనుకుంటే అవకాశం తీసుకోవాలనుకున్నాడు. పుట్టెడు వేదనలో ఉన్న బాధితురాలిపై లైంగికదాడికి విఫలయత్నం చేశాడు. చాలారోజులు ఎవ్వరికీ చెప్పుకోలేక ఆవేదనను అణచిపెట్టుకుంది. తనలా మరో మహిళ ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకుంది. హెడ్కానిస్టేబుల్ నిర్వాకాన్ని బహిర్గతం చేసింది. సోషల్ మీడియా కేంద్రంగా ఇప్పుడా వీడియో హల్చల్ చేస్తోంది. ఆమె ఆరోపించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడు భద్రావతి కాలనీకి చెందిన పేరూరు దుర్గమ్మ మైనర్ కుమార్తె సెప్టెంబర్ నెల 23న గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి బాలికను వెతికేందుకు హెడ్కానిస్టేబుల్ భాస్కర్, మహిళా పోలీసు రేవతిలను దుర్గమ్మతో పాటు అక్టోబర్ 6వ తేదీన హైదారాబాదుకు పంపించారు. అక్కడ ఓలాడ్జిలో హెడ్ కానిస్టేబుల్ దుర్గమ్మతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఎంత వారించినా చెయిపట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించి బూతులు మాట్లాడాడు. ఇందుకు మహిళా పోలీసుల కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక ఫోన్ చేయడంతో అందరూ వెనుతిరిగి వచ్చారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ దుర్గమ్మ వీడియో తీసింది. అందులో కొద్ది రోజుల తర్వాత తన కుమార్తె మళ్లీ అదే అబ్బాయితో వెళ్లింద, తమకు న్యాయం చేయలేదని కూడా పేర్కొంది. ఈ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయంపై ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని వివరణ కోరగా రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అమెతో మాట్లాడించారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారు, ఇంత జరిగితే స్థానికంగా లేదా ఉన్నతాధికారులకు గానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయ సందేహం వ్యక్తం చేశారు. హెచ్సీ భాస్కర్ సస్పెన్షన్ ఓబులవారి పల్లి హెడ్ కానిస్టేబుల్ అయిన డి.భాస్కర్ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.రామకృష్ణ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. అతడిని తక్షణమే విధుల నుండి తొలగించినట్లు రాజంపేటీ డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోని రామ్గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం కేటీఆర్ పర్యటనకు బందోబస్తు వచ్చిన కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం దగ్గర ఉన్న నాలాలో పడి మృతి చెందింది. గోదావరి కరకట్ట స్లూయిస్ల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్కి వాతావరణం అనుకూలించకపోవడంతో కేటీఆర్ పర్యటన రద్దయ్యింది. చదవండి: మర్రిగూడ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.2 కోట్ల నగదు గుర్తింపు -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి
హొసపేటె: గుండెపోటుతో పోలీస్ హెడ్కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా కమలాపుర పోలీసు స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా ఉన్న రాఘవేంద్ర(46) రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోతుండగా అర్ధరాత్రి ఉన్నఫళంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనిని నగర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేంద్ర 2005 బ్యాచ్కు చెందిన పోలీసు కానిస్టేబుల్. గత 18 ఏళ్లుగా పోలీసు శాఖలో విధులు నిర్వహించారు. ఇటీవలే బళ్లారి లోకాయుక్త కార్యాలయం నుంచి రాఘవేంద్ర పదోన్నతిపై కమలాపుర పోలీసు స్టేషన్కు హెడ్కానిస్టేబుల్గా బదిలీ అయ్యారు. కాగా విజయనగర జిల్లా ఎస్పీ శ్రీ హరిబాబు, డీఎస్పీ మంజునాథ్ తళ్వార్, హంపీ సీఐ కే.శివరాజ్ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ అయి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ (పీసీ–1769) శ్రీకాంత్ (29) హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో ఖబూతర్ఖానా ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. 2018 బ్యాచ్కు చెందిన శ్రీకాంత్ రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉండి..ఔట్ పోస్టులో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గన్ మిస్ఫైర్ కావడంతో గొంతుకు గాయమైంది. దీంతో శ్రీకాంత్ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారులు ఉస్మానియాకు చేరుకొని వివరాలను సేకరించారు. మూడు నెలల క్రితం కోదాడ ప్రాంతానికి చెందిన యువతితో శ్రీకాంత్కు వివాహం నిశ్చయమైందని, వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగాల్సి ఉందని, అంతలోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు. -
హెడ్ కానిస్టేబుల్కు రివార్డు
కొరుక్కుపేట: శంకరాపురం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను పరిష్కరించిన హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కళ్లకురిచ్చి జిల్లా, శంకరాపురం సమీపంలోని రౌతనల్లూర్ గ్రామం వద్ద మారియమ్మన్ ఆలయానికి కందులు పోసే విషయంలో పంచాయతీ కౌన్సిల్ చైర్మన్ భర్త కదిరవన్న, అదే గ్రామానికి చెందిన మాయవన్ మధ్య వాగ్వాదం జరిగింది. కదిరవన్ దాడిలో మాయవన్ తీవ్రంగా గాయపడడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. బందోబస్తులో ఉన్న వడపొన్న్పరప్పి హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆయనకు రివార్డు అందించి అభినందించారు. -
హెడ్ కానిస్టేబుల్పై టీడీపీ నేతల జులుం!
కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు. టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
Hyderabad: కూతురితో అసభ్య ప్రవర్తన..హెడ్ కానిస్టేబుల్పై కేసు
సాక్షి, బంజారాహిల్స్: వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏపీకి చెందిన హెడ్కానిస్టేబుల్ మహేశ్వర్రెడ్డి(41) యూసుఫ్ గూడ ఎల్ఎన్నగర్లో ఓ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురు(17) బ్యూటీషియన్గా పని చేస్తోంది. ఏడాది క్రితం తనకు పెళ్లి కాలేదని నమ్మించి బాధితురాలి తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె ఇంటిని తన పేరుతో రాయించుకున్నాడు. ఆమె కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!! -
ఇలాంటి పోలీస్ ఒక్కడున్నా చాలు! సొంత డబ్బులతో..
సాక్షి,పార్వతీపురంటౌన్(శ్రీకాకుళం): ఆయన ఓ హెడ్ కానిస్టేబుల్. ఏ స్టేషన్లో పనిచేసినా ఆయనకో ప్రత్యేక గుర్తింపు. జీతం డబ్బులతో పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం చేస్తారు. స్టేషన్కు వచ్చే పేద ఫిర్యాదుదారులకు కడుపునిండా భోజనం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటారు. సమస్యను ఫిర్యాదు రూపంలో నమోదు చేస్తారు. పేదవృద్ధులకు అండగా నిలుస్తున్నారు. సేవలతో అందరికీ సుపరిచితుడై, సేవక భటుడిగా పేరు పొందారు. ఆయనే.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కొమిరి కృష్ణమూర్తి. ఆయన దాతృత్వాన్ని ఓ సారి పరికిస్తే... కృష్ణమూర్తిది వీరఘట్టం మండలం కొట్టుగుమడ గ్రామం. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్నది ఆయన కోరిక. పోలీస్ ఎంట్రన్స్ పరీక్షలో ప్రతిభ కనబరచడంతో 1993వ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పేద వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు తన వంతుగా ఆర్థికసాయం చేస్తున్నారు. ఆయన పేరుకే పోలీస్.. కానీ మృధుస్వభావి, మానవతావాది. సమస్యలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆపై వారి సమస్యలను సానుకూలంగా తెలుసుకొని రైటర్గా తనపనిని పూర్తిచేస్తారు. సమయానికి అనుగుణంగా వారికి భోజనం పెడతారు. తన సేవలను గుర్తించిన అప్పటి ఎస్పీ పాలరాజు ఆయనను వృద్ధమిత్ర, కోఆర్డినేటర్గా నియమించారు. మేము నాయీ బ్రాహ్మణులం. మా తండ్రి వ్యవసాయంతో పాటు కులవృత్తిచేసేవారు. ఆ రోజుల్లో వచ్చిన నెలసరి ఆదాయంలో ఇంటి అవసరాలకు పోను మిగిలిన మొత్తాన్ని పేదలకు దానంచేసేవారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనకు తోచిన సహాయాన్ని చేసేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నెలజీతంలో కొంతమొత్తాన్ని పేదలకు వెచ్చిస్తున్నాను. అబ్దుల్ కలాం రచించిన పుస్తకాలను, ఆయన జీవిత చరిత్రను చదివాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఉద్యోగవిరమణ పొందిన తరువాత వచ్చిన మొత్తంతో పేద పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మిస్తాను. పేదలకు సహాయం చేయడంలో ఉన్న సంతృప్తిని లెక్కించలేను. – కృష్ణమూర్తి, హెడ్కానిస్టేబుల్, పార్వతీపురం టౌన్ స్టేషన్ మానవసేవే మాధవ సేవగా... ఆయన తన నెలవారీ జీతంలో సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సేవలకు వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, నిఘంటువులు, దేశ నేతల జీవితగాథల పుస్తకాలు, పెన్నులు కొనుగోలు చేసి అందజేస్తున్నారు. పేద వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు సమకూర్చుతున్నారు. కొంత ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవా నిరతిపై అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వృద్ధమిత్ర కో ఆర్డినేటర్గా అందిస్తున్న సేవలను ఆర్యవైశ్య ధర్మశాలలో పార్వతీపురం గత ఆర్డీఓ సుదర్శన్ దొర, సీఐ సంజీవరావు, వయో వృద్ధుల సంక్షేమ ప్రతినిధి జె.సీతారాములు ఘనంగా సత్కరించారు. 2010 నుంచి 2021వరకు ఏటా ఆయనను పలువురు పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. -
స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో..
ఎచ్చెర్ల క్యాంపస్: ఆయన ఒకప్పుడు స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగం. కుమారుడు కూడా పోలీసే. కొడుకు కూతురికి వివాహాలు అయిపోయాయి. బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు. బయట నుంచి చూసే వారికి ఏ సమస్యలు లేని జీవితం ఆయనది. కానీ ఏం జరిగిందో గానీ ఒక్కసారిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎందరివో సమస్యలు చూసిన హెడ్ కానిస్టేబుల్ ఏ కష్టం గురించి మదనపడ్డారో గానీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమ వారం ఎచ్చెర్ల పోలీస్క్వార్టర్స్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుబ్బారావు సోమవారం ఉదయం 5.45 సమయానికి ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ప్లంబర్ విధుల్లో భాగంగా పోలీస్ క్వార్టర్సులో వాటర్ స్కీమ్ ద్వారా నీరు విడిచిపెట్టారు. అనంతరం రోల్ కాల్కు వెళ్లారు. దాని తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో పోలీస్ క్వార్టర్సులో 8వ లైన్లో శిథిల క్వార్టర్లోకి వెళ్లి తాడుతో శ్లాబ్ హుక్కు ఊరి పోసుకున్నారు. డ్యూటీ నుంచి బయటకు వెళ్లిన సుబ్బారావు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి సిబ్బంది అనుమానంతో పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానిక సిబ్బంది ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులకు విషయం తెలుపగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఎస్పీ జీఆర్ రాధిక, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు మృతదేహాన్ని తరలించారు. మానసిక ఆందోళనే కారణమా..? సుబ్బారావుకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అ యితే ఇటీవల కుటుంబ కలహాలు సమస్యగా మారినట్టు సమాచారం. భార్య వీరమ్మకు అనారోగ్యం చేసి మంచానికే పరిమితం కావడం, మద్యం అలవాటు వంటివి ఆయనలో మానసిక ఆందోళనకు దారి తీశాయి. ఇవే ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయని సహచరులు భావిస్తున్నారు. ఈయన రాష్ట్రస్థాయి బాక్సింగ్ క్రీడాకారుడు. క్రీడా కోటాలో 1992లో ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. మెళియాపుట్టి మండలం బండపల్లి సొంత ప్రాంతం కాగా, తోటపాలేం పంచాయతీ తవిటయ్య నగర్లో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాజారావు సైతం ప్రస్తు తం ఎస్టీటీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. అల్లుడు కూడా ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tamil Nadu: విద్యార్థుల గ్రూపు వివాదాలు.. ఏకంగా కత్తులతో.. -
ఫొటోలు తీశాడని హెడ్ కానిస్టేబుల్పై దాడి
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాలని చెప్పిన హెడ్ కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఎస్సీ వీధికి చెందిన బోస్ రాంబాబు, బోస్ కుమార్లు పూటుగా మద్యం తాగి ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించగా.. అటుగా వెళ్తున్న కాశీబుగ్గ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. అక్కడి పరిస్థితిని అధికారులకు తెలియజేసేందుకు ఫొటోలు తీస్తుండగా యువకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని నియంత్రించారు. గురువారం ఇద్దరినీ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. -
మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని
సాక్షి, మైసూరు(కర్ణాటక):నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే సి.కృష్ణపై కేసు నమోదైంది. వివరాలు.. నిందితుడు టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్లో పనిచేసే సమయంలో ఒక మహిళ భర్తతో గొడవలతో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కృష్ణ ఆమెను లోబర్చుకుని మైసూరు నగరంలో కాపురం పెట్టాడు. ఆమె పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను కొట్టారు. దీంతో బాధితురాలు హుల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. పెళ్లయి ఏడాది.. ఆత్మహత్య హోసూరు: డెంకణీకోట తాలూకా తళి జయంతి కాలనీకి చెందిన తిరుమలప్ప భార్య భూమిక (19). వీరికి గత ఏడాది క్రితం పెళ్లి జరిగింది. భూమిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుపడక పోవడంతో విరక్తి చెందిన ఆమె గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: భర్త కర్కశత్వం..భార్య విడాకుల నోటీసులో సంతకం చేయలేదని.. -
హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం.. చీకటిలో యువతిని చూస్తూ..
బెంగళూరు: కర్ణాటకలోని యలహంక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. వివరాలు.. కర్ణాటకలోని యలహంక ప్రాంతంలో ఒక 26 ఏళ్ల యువతి అర్దరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి చీకట్లో నిలబడి యువతిని చూస్తూ అసభ్యకరరీతిలో ప్రవర్తించాడు. అంతటిలో ఆగకుండా.. అతని సెల్ఫోన్ టార్చ్లైట్ను ఆన్చేసి యువతి దుస్తులపై పడేలా చేశాడు. దీన్ని చూసిన యువతి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. వెంటనే గట్టిగా అరించింది. దీంతో భయపడిపోయిన చంద్రశేఖర్.. తాను పోలీసు కానిస్టేబుల్ అని, అమృతహళ్లి పోలీస్స్టేషన్లో పనిచేస్తానని తెలిపాడు. అతని విపరీత చర్యను ఒక బాటసారి కూడా వీడియో తీశాడు. ఈ క్రమంలో భయపడిపోయిన కానిస్టేబుల్ ఆ వీడియో తొలగించాలని కోరాడు. ఇది బయటకు వస్తే తన ఉద్యోగం పోతుందని ప్రాధేయ పడ్డాడు. కాగా, ఘటన జరిగిన రెండు రోజులకు బాటసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్గా మారింది. దీంతో గమనించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో కలకలంగా మారింది. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
నిత్యపెళ్లికొడుకు లీలలు; నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోలీస్ శాఖలో నిత్య పెళ్లికొడుకు ఆరాచకాలు బట్టబయలయ్యాయి. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అప్పలరాజు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికి నలుగురు మహిళలను పెళ్లిచేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని అయిదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. తాజాగా మరో మహిళ కానిస్టేబుల్తో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన పద్మ నిత్య పెళ్లిళ్ల నిర్వాకంపై కానిస్టేబుల్ అప్పలరాజును నిలదీసింది. కానిస్టేబుల్ అప్పలరాజుపై దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులతోపాటు మహిళ చేతన స్వచ్చంధ సంస్థ కూడా స్పందించింది. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు బండారం బయటపెట్టి, మోసపోయిన మహిళాలకు అండగా ఉంటామని మహిళ చేతన చైర్పర్సన్ కత్తి పద్మ తెలిపారు. కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. -
రైలు డ్రైవర్కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం
తాడేపల్లి రూరల్: విధుల్లో ఉన్న డ్రైవర్కు గుండెపోటు రావడం, అదే సమయంలో సిగ్నల్ పడడం, సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పడమే కాకుండా డ్రైవర్ ప్రాణాలు సైతం నిలిచాయి. శుక్రవారం కృష్ణాకెనాల్ జంక్షన్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న గూడ్స్ రైలు కృష్ణా కెనాల్ జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫామ్ మీద సిగ్నల్ కోసం వేచి ఉంది. ఆ రైలు నడుపుతున్న డ్రైవర్ జె.హరికుమార్కు గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. మరో డ్రైవర్ గూడ్స్రైలు కిందకు దిగి చెక్ చేసుకుంటూ ఆ విషయాన్ని గమనించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ డి.రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా డ్రైవర్ను రైలులో నుంచి దించి రెస్ట్రూమ్కు తీసుకెళ్లారు. 108 రాకపోవడంతో ఆటోలో వెంటనే అతడిని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు. అతడికి గుండెపోటు వచ్చిందని, మరో 30 నిమిషాలు ఆలస్యమైతే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్ కానిస్టేబుల్ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్ విధుల్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ మహ్మద్రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్కానిస్టేబుల్ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ నరసింహారావు ఫోన్లో అభినందించారు. ఇది మా స్టేషన్కే గర్వకారణమని ఎస్సై ఎమ్.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇవీ చదవండి: హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
భార్యకు అడ్డంగా దొరికిన ‘హెడ్డు’ .. ఏంచేశాడంటే..
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): మరో మహిళతో కలిసి ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ను భార్య పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పాల్వంచలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగూడెం 6వ బెటాలియన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ గడ్డం రాజేష్ పాల్వంచ బొల్లేరుగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం స్వప్నతో వివాహం జరగగా, ఆరేళ్ల పాప ఉంది. అనంతరం వీరి నడుమ విబేధాలు తలెత్తడంతో కేసులు కోర్టు పరిధిలో నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజేష్ వేరే మహిళతో ఉంటున్నాడనే సమాచారంతో గురువారం స్వప్న మహిళా సంఘం నాయకులతో కలిసి బొల్లేరుగూడెంలోని ఇంటికి చేరుకోగా..ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకుంది. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ..గతంలో తనను చిత్రహింసలు పెట్టగా అధికారులు సస్పెండ్ చేశారని తెలిపింది. అయినా ఇప్పుడు మరో మహిళతో ఉన్నాడని తెలుసుకుని వచ్చానని చెప్పింది. ఈమేరకు స్వప్న ఫిర్యాదుతో రాజేష్తో పాటు ఆయనతో కలిసి ఉన్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.ప్రవీణ్ తెలిపారు. -
దొంగోడి అవతారమెత్తిన మహిళా హెడ్ కానిస్టేబుల్..!
ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు ఏది లేకున్నా.. ఫైన్ కట్టు లేదా బండిని సీజ్ చేస్తామంటారు పోలీసులు. తర్వాత సీన్ సీజ్ చేసిన బండికి రక్షణ.. గాల్లో దీపం పెట్టి.. దేవుడా నీవే దిక్కు అన్న చందంగా తయారవుతుందనేది తెలిసిన సంగతే. ముంబై: మహారాష్ట్రలోని వసాయి పోలీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్గా పని చేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ సీజ్ చేసిన వాహనాలను అమ్ముకుంటూ పట్టుపడింది. దీనికి సంబంధించి వసాయి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. వివరాల్లోకి వెళితే.. మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ వసాయి పోలీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్గా పని చేస్తోంది. అయితే వివిధ కారణాలపై సీజ్ చేసిన వాహనాలను, వస్తువులను, నగదుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవడం ఆమె బాధ్యత. కానీ ఓ డీలర్తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను, వస్తువులను భేరానికి పెట్టి విక్రయిస్తోంది. ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు రెక్కీ నిర్వహించి, స్క్రాప్ డీలర్ ముస్తాక్కు విక్రయించే సమయంలో గైక్వాడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు రూ. 26 లక్షల విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. స్క్రాప్ డీలర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలపై మార్చి 12న హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఆమెపై వసాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ కార్పే తెలిపారు. -
కేబీఆర్ పార్క్ వద్ద విషాదం.. మార్నింగ్ వాక్కు వచ్చి
సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వచ్చిన ఓ కానిస్టేబుల్ హఠాత్తుగా మరణించాడు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కోసం పార్క్కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. సూర్యనారాయణ సీఆర్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
పోలీస్ కంట్రోల్ రూమ్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ను విజయ్ కుమార్గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. -
రైతు భూమిపై ధర్మవరం హెడ్కానిస్టేబుల్ కన్ను.. కాదనడంతో
ధర్మవరం టౌన్(అనంతపురం): పొలం అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్న రైతు కుటుంబం పట్ల ఓ హెడ్ కానిస్టేబుల్ కర్కశంగా వ్యవహరించాడు. ఆ పొలం తనకే అమ్మాలంటూ జులుం చేశాడు. కాదన్న పాపానికి తండ్రీకొడుకులను నిర్బంధించి హింసించాడు. వేధింపులు తాళలేక చివరకు రైతు కుటుంబం ‘సాక్షి’ ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురానికి చెందిన రైతు రవీంద్రరెడ్డికి దర్శినమల గ్రామ పరిధిలో 10 ఎకరాల పొలం ఉంది. గతంలో తీవ్ర వర్షాభావంతో బోరుబావి ఎండిపోయి, చీనీ చెట్ల సాగులో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తనకున్న పొలంలో 3.58 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎకరాకు రూ.3.58 లక్షలు బేరం కుదిరి వేరొకరికి పొలం విక్రయించాడు. హెడ్కానిస్టేబుల్ కన్ను రైతు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ధర్మవరం రూరల్ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ పూజారి పుల్లప్ప... ఆ పొలాన్ని ఎకరా రూ.2 లక్షలతో తనకే అమ్మాలని రైతుపై ఒత్తిడి తీసుకెళ్లాడు. తనకు కాకుండా ఇతరులకు పొలం అమ్మితే కేసులు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు రైతు రవీంద్రరెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీరెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని చావబాదాడు. చివరకు బయటకు విడుదల చేసేందుకు రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్ద ఉన్న రూ.5వేలను అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా కానిస్టేబుల్ ఖాతాకు మార్చి, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ తండ్రీకొడుకులు బయటకు వచ్చారు. కానిస్టేబుల్ బారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ బాధిత రైతులు వాపోయారు. కాగా, రైతు ఆరోపణలు అవాస్తమంటూ హెడ్ కానిస్టేబుల్ పుల్లప్ప కొట్టిపాడేశారు. అయితే ఘటనకు సంబంధించి బాధిత రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ రమాకాంత్ స్పష్టం చేశారు.