Haryana governor
-
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు. వారిని హైదరాబాద్ లో మహా సభల సమన్వయకర్త శ్రీ కేశిరాజు రామప్రసాద్ ,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. 6 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు జరిగే తెలుగు తోరణం సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రముఖులకు "రాజరాజ నరేంద్ర విశిష్ట పురస్కారాలను" ప్రదానం చేసి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, 9849013697 -
అస్వస్థతకు గురైన హర్యానా గవర్నర్...
ఛండీఘర్ః 70వ స్వాతంత్ర వేడుకల సందర్భంలో హర్యానా గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి కొద్దిపాటి అస్వస్థతకు గురయ్యారు. ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరుగుతుండగా సోలంకి సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సోలంకి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఆయన అస్వస్థత చెందినట్లు చెప్పారు. అవసరమైతే ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తామని, ప్రస్తుతం సోలంకి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. జెండా వందనానికి అనంతరం దేశాన్ని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగానికి సిద్ధమైన సందర్భంలో గవర్నర్.. పోడియంలో కొద్ది సెకన్ల పాటు కదలకుండా ఉండిపోవడంతో.. సిబ్బంది అలర్ట్ అయ్యి... సొమ్మసిల్లిన సోలంకిని కుర్చీలో కూర్చోబెట్టి, మంచినీళ్ళు అందించినట్లు అధికారులు వెల్లడించారు. . -
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వనం
న్యూఢిల్లీ: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ సోలంకి బీజేపీని ఆహ్వానించారు. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, బీజేపీ 47 సీట్లు గెలుచుకుని మెజార్టీ సాధించింది. హర్యానా బీజేపీ శాసన సభ పక్ష నాయకుడిగా ఖట్టర్ను ఎన్నుకున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటం ఇదే తొలిసారి.