-
ఇతగాడి విన్యాసాలు చూస్తే ఔరా అనాల్సిందే..!
ఓ వ్యక్తి అసాధారణ విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడయోలోని వ్యక్తి మెడను ఆధారంగా చేసుకుని అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్నాడు. మెడతో తన శరీర బరువునంతా మోస్తున్నాడు. Bro a superhuman😭 pic.twitter.com/7HRtlSVvJw— vids that go hard (@vidsthatgohard) June 26, 2024ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇతగాడిని సూపర్ హీరో అని పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సదరు ఫీట్లు ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. దయచేసి ఇలాంటి విన్యాసాలను చేయడానికి ఎవరు ప్రయత్నించకండి. ఇలాంటివి కేవలం ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పిండి. -
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్తో, హారర్ లుక్తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
#Dipa Karmakar: ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో...
భారత మహిళా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో పోటీపడనుంది. జనవరి 2 నుంచి భువనేశ్వర్లో ఈ టోర్నీ జరుగుతుంది. 30 ఏళ్ల దీపా 2016 రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంతో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. పునరాగమనం తర్వాత డోపింగ్ పరీక్షలో పట్టుబడి 21 నెలలపాటు నిషేధానికి గురైంది. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె మళ్లీ బరిలోకి దిగుతోంది. -
అత్యంత అరుదైన పిల్లి.. అక్కడ మాత్రమే నివసిస్తాయట
ఇవి మీకు తెలుసా? ► ఐస్ల్యాండ్లో క్రిస్మస్ పండగ కానుకలుగా పుస్తకాలను ఒకరికి ఒకరు పంచుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రచురణ కర్తలు అత్యధిక సంఖ్యలో పుస్తకాలు అమ్ముతారు కాబట్టి దీనికి ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అని పేరు వచ్చింది. ►‘జిమ్నాస్టిక్స్’ అనేది పురాతన గ్రీకు పదం ‘జిమ్నాజీన్’ నుంచి పుట్టింది. దీని అర్థం నగ్నంగా వ్యాయామం చేయడం. యువకులకు యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చే విధానం ‘జిమ్నాజీన్’ కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ► ‘బే క్యాట్’ అనేది అత్యంత అరుదైన పిల్లి జాతి. ఇవి ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపంలో మాత్రమే నివసిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల వీటి సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదపు అంచున ఉన్నాయి. అంతరించి పోతున్న జాతుల జాబితాలో వీటిని చేర్చారు. -
సుకుమారి సూపర్ స్టంట్స్
పాపులర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్స్టాగ్రామ్లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి. ‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్. -
నిష్కా అగర్వాల్కు స్వర్ణం
ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో నగరంలోని గాడియం స్కూల్ విద్యార్థి అయిన నిష్కా టేబుల్ వాల్ట్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. కోచ్ మనోజ్ రాణా వద్ద శిక్షణ తీసుకుంటున్న నిష్కా గత ఏడాది కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ జూనియర్ పోటీల్లోనూ పసిడి పతకం గెలిచింది. సిఫ్ట్ కౌర్కు ఐదో స్థానం బకూ: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా ఐదో స్థానంలో నిలిచి ంది. దాంతో భారత్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లభించింది. ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 429.1 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
14 ఏళ్ల వయసులోనే సంచలనాలు.. ఆల్టైమ్ గ్రేట్గా..!
1976 మాంట్రియల్ ఒలింపిక్స్.. జిమ్నాస్టిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అన్ ఈవెన్ బార్స్ విభాగంలో జిమ్నాస్ట్లు పోటీ పడుతున్నారు. తీవ్రమైన పోటీ మధ్య ఆటగాళ్లంతా సత్తా చాటారు. పోరు ముగిసింది. అయితే నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన.. ఉత్కంఠత.. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి. అది ఎవరూ ఊహించలేనిది.. అందుకే తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. అసలేం జరిగిందంటే స్కోరు చూపించే ఎలక్ట్రానిక్ బోర్డుపై గరిష్ఠంగా మూడు అంకెలు మాత్రమే ప్రదర్శించే వీలుంది. కానీ ఆ అమ్మాయి సాధించిన స్కోరు 10 పాయింట్లు! అంటే 10.00గా రావాలి. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు ‘1.00’గా మాత్రమే కనిపించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలి సారి ‘పర్ఫెక్ట్ 10’ స్కోర్ చేసి సంచలనం సృష్టించిన ఆ అమ్మాయి పేరే నాదియా కొమనెచ్. కేవలం 14 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనతతో మొదలు పెట్టి ఆల్టైమ్ జిమ్నాస్టిక్ గ్రేట్లలో ఒకరిగా నిలిచింది. రొమేనియాకు చెందిన నాదియా ప్రస్థానం ఆసక్తికరం. టీనేజర్గా ఒలింపిక్స్లో సంచలనాలు నమోదు చేయడం మొదలు సొంత దేశంలోనే పరాయిదానిలా ఆంక్షల మధ్య బతకడం, ఆపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహస్యంగా మరో దేశానికి వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, అనంతరం అక్కడే వర్ధమాన జిమ్నాస్ట్లను తీర్చిదిద్దడం వరకు ఎన్నో మలుపులు ఉన్నాయి. మాంట్రియల్ ఒలింపిక్స్లో అన్ ఈవెన్ బార్స్లో ‘పర్ఫెక్ట్ 10’తోనే ఆమె ఆగిపోలేదు. ఆ మెగా ఈవెంట్లో మరో ఆరు సార్లు ఆమె ‘పర్ఫెక్ట్ 10’ను సాధించగలిగిందంటే ఆ అద్భుత ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. రొమేనియా దేశం తరఫున ‘ఒలింపిక్ ఆల్రౌండ్’ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్గా నాదియా నిలిచింది. సహజ ప్రతిభతో.. శరీరాన్ని విల్లులా వంచుతూ ఎన్నెన్నో విన్యాసాలతో కనువిందు చేసే జిమ్నాస్టిక్స్కు క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒలింపిక్ క్రీడల్లోనైతే జిమ్నాస్ట్ల ప్రదర్శన ప్రతిసారీ విశేషమైన ఆసక్తే. అలాంటి పోటీలకు నాదియా అదనపు ఆకర్షణను తెచ్చింది. అపార ప్రతిభ, బ్యాలెన్సింగ్, క్లీన్ టెక్నిక్తో ఆమె ఈ పోటీల్లో శిఖరాలను అందుకుంది. ఒక్కసారి బరిలోకి దిగితే కేవలం సాంకేతికాంశాలు, పాయింట్లు మాత్రమే కాదు, నాదియా ఆట కొత్త తరహాలో అందంగా మారిపోయేది. ఆమె చేసిన విన్యాసాలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. బీమ్పై ఏరియల్ వాకోవర్ చేసిన తొలి జిమ్నాస్ట్ నాదియానే! కళ్లు తిప్పుకోలేని ఏరియల్ కార్ట్వీల్ బ్యాక్ హ్యాండ్స్ప్రింగ్ను, డబుల్ ట్విస్ట్ డిస్మౌంట్ను, ఫ్లోర్పై డబుల్ బ్యాక్ సాల్టోను ప్రదర్శించిన తొలి జిమ్నాస్ట్గా ఘనత వహించింది. వరుస విజయాలు సాధించి.. ‘చిన్నప్పుడు అత్యంత చురుగ్గా ఉండేది. ఎగరడం, గెంతడం, దూకడం, ఇలా అన్నింటా నేను ఆమెను అదుపు చేయలేకపోయేదాన్ని, అందుకే ఆమెను జిమ్నాస్టిక్స్లో చేర్పించాను’ నాదియా గురించి ఆమె తల్లి చెప్పిన మాట అది. అయితే ఆ అల్లరి పిల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తల్లి కూడా ఊహించలేకపోయింది. ఆరేళ్ల వయసులో పాఠశాల స్థాయిలో ఆటలో ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్ల వయసులో కోచింగ్ అకాడమీలో అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు, 9 ఏళ్ల వయసు వచ్చే సరికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాదు రొమేనియా జాతీయ చాంపియన్గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలనే రికార్డ్ కూడా నమోదు చేసేసింది. అదే ఏడాది తొలి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నాదియా వరుస విజయాలతో సత్తా చాటింది. 13 ఏళ్లకు యూరోపియన్ టోర్నీలో అన్ని టైటిల్స్ సాధించేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మన్ హటన్లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ కప్’లో సత్తా చాటి పతకాలు సాధించడంతో నాదియా పేరు మార్మోగింది. భవిష్యత్తు తారగా ఆమెను క్రీడా ప్రపంచం గుర్తించింది. నిజంగానే ఆపై ఆమె తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవడంలో సఫలమైంది. ఒలింపిక్స్లో జోరు.. మాంట్రియల్ ఒలింపిక్స్లో మొదటినుంచి నాదియా హవా కొనసాగింది. అన్ ఈవెన్ బార్స్ విభాగంలోనే కాకుండా బ్యాలెన్స్ బీమ్, వ్యక్తిగత ఆల్రౌండ్ ప్రదర్శనల్లో కూడా ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఇదే ఒలింపిక్స్లో టీమ్ ఆల్రౌండ్లో రజతంతో పాటు ఫ్లోర్ ఎక్సర్సైజ్లో కాంస్యం కూడా గెలుచుకుంది. హార్ట్వాల్ట్లో మాత్రం త్రుటిలో కాంస్యం చేజారి నాలుగో స్థానం దక్కింది. ఈ విజయాలు, ‘పర్ఫెక్ట్ 10’ప్రదర్శనతో నాదియా ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. పలు అవార్డులు, రివార్డులు వచ్చి పడ్డాయి. అప్పటికే పాపులర్ అయిన పాట ‘కాటన్ డ్రీమ్స్’ను ఆమె గౌరవ సూచకంగా ‘నాదియాస్ థీమ్’ అంటూ పేరు మార్చడం విశేషం. ఆ తర్వాత నాదియా ఫ్లోర్ ఎక్సర్సైజ్ పోటీల సమయంలో ఇదే పాటను బ్యాక్గ్రౌండ్లో వినిపించడం విశేషం. ఒలింపిక్స్ విజయాల తర్వాత కూడా ఆమె జోరు కొనసాగింది. ఈ పోటీలకు, 1980 మాస్కో ఒలింపిక్స్కు మధ్య నాదియా ప్రపంచ చాంపియన్షిప్లు, యూరోపియన్ చాంపియన్షిప్లు, వరల్డ్ కప్లలో కలిపి 7 స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్లోకి అడుగు పెట్టిన ఆమె మరో మంచి ప్రదర్శనను నమోదు చేసింది. ఇక్కడా 2 స్వర్ణాలు, 2 రజతాలు సాధించడంలో ఆమె సఫలమైంది. మోత్తంగా నాదియా గెలిచిన 5 ఒలింపిక్స్ స్వర్ణాలు కూడా వ్యక్తిగత విభాగంలోనివే కావడం విశేషం. దేశం దాటి వెళ్లి.. స్టార్గా ఎదిగిన తర్వాత నాదియా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా క్రీడాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ‘నాదియా 81’ పేరుతో ఆమె, ఇతర కోచ్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రొమేనియాలో కమ్యూనిస్ట్ నికోల్ సీషెస్ నాయకత్వంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో వారి దేశంలో పలు ఆంక్షలు, ఆర్థిక సమస్యలు ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. ఇలాంటి స్థితిలో అమెరికాను చేరిన బృందంలో నాదియా మినహా మిగతావారంతా అక్కడే ఉండిపోయారు. తాను మాత్రం స్వదేశం వెళ్లాలనే నిర్ణయించుకుంది. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత ఆమెకు తెలిసొచ్చింది. ఇతర ఆటగాళ్లు, కోచ్లు అమెరికాలోనే ఉండిపోవడంతో నాదియా పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ‘మా దేశపు జాతీయ సంపత్తి’ అంటూ నాదియాపై ప్రభుత్వం దేశం దాటి వెళ్లకుండా పలు ఆంక్షలు విధించడంతో పాటు ఆమె ప్రతికదలికపై నిఘా పెట్టింది. ‘నా కుటుంబం కోసం కొంత అదనంగా సంపాదించే అవకాశాన్ని నాకు దూరం చేయడంతో పాటు నన్ను ఖైదీగా మార్చారు’ అంటూ ఆమె వాపోయింది. ఎట్టకేలకు 1989 నవంబర్లో కొందరి సహకారంతో ఒక అర్ధరాత్రి నడుస్తూనే రొమేనియా సరిహద్దు దాటింది. ఆపై హంగరీ, ఆస్ట్రియా మీదుగా వెళ్లి మొత్తానికి అమెరికా విమానం ఎక్కింది. అక్కడ ఆమెకు తగిన సహకారం, గౌరవం లభించాయి. తర్వాత కొన్ని వారాలకే రొమేనియా విప్లవంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలి ప్రజాస్వామ్యం రావడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గతంలో తనకు స్నేహితుడిగా ఉన్న అమెరికా జిమ్నాస్ట్, రెండు ఒలింపిక్స్ స్వర్ణాల విజేత బార్ట్ కానర్ను 1996లో వివాహమాడింది. స్వదేశానికి తిరిగొచ్చి రొమేనియా రాజధాని బుకారెస్ట్లోనే ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. రిటైర్మెంట్ తర్వాత కూడా వేర్వేరు హోదాల్లో ప్రపంచ జిమ్నాస్టిక్స్తో నాదియా అనుబంధం కొనసాగుతోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్లో 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
గుంటూరు: జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్నారు ( ఫొటోలు )
-
జిమ్నాస్టిక్స్లో ఏపీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్రెడ్డి (ఆంధ్రప్రదేశ్) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలికల ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు. జిమ్నాస్టిక్స్ అండర్–19 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్)లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్) స్వర్ణం, డి.దేవ్ (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు. కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్–బి రెండో మ్యాచ్లో ఛత్తీస్గఢ్ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్లో తెలంగాణ, రాజస్థాన్ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్–19) పూల్లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్–19) పూల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్కు చెందిన ఆయూష్ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్కు చెందిన హిమ్మత్ ఖాదియా నిలిచారు. 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బసాయ్ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్కు చెందిన హిమ్మత్ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్కు చెందిన రంజిత్ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్కు చెందిన బసాయ్ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది. 226 పాయింట్లతో ఉత్తరాఖండ్కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్కు చెందిన హిమ్మత్ ఖాదియా, అయూష్ చర్పొట, రంజిత్, సునీల్ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్గఢ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ సిమోన్ బైల్స్
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ను ఎంపిక చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్ సమయంలో తాను ‘ద ట్విస్టీస్’తో బాధపడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నాసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది. -
సునిసా లీ ‘స్వర్ణ’ విన్యాసం
టోక్యో: సిమోన్ బైల్స్ లేకపోతేనేమి... సునిసా లీ ఉందిగా! అమెరికా జిమ్నాస్టిక్స్ అభిమానులు గురువారం సరిగ్గా ఇలాగే సంతోషించారు. మహిళల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్లో యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. వరుసగా ఐదోసారి అమెరికా జిమ్నాస్ట్ ఈ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. 18 ఏళ్ల సునిసా లీ అద్భుత విన్యాసాలతో చెలరేగి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆమె మొత్తం 57.433 పాయింట్లు స్కోర్ చేసింది. బైల్స్ గైర్హాజరులో తొలి స్థానంలో నిలవాలని ఆశించిన బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రాడేకు నిరాశ తప్పలేదు. 57.298 పాయింట్లు సాధించిన ఆమె రజత పతకంతో సరిపెట్టుకుంది. ఏంజెలినా మెల్నికోవా (ఆర్ఓసీ) 57.199 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
Simone Biles: మానసిక ఆరోగ్యం బాలేదు.. అందుకే తప్పుకుంటున్నా
టోక్యో: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తన అభిమానులను షాక్కు గురి చేసింది. గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్రౌండ్ ఫైనల్స్ నుంచి బైల్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జిమ్నాస్టిక్స్లో ఆరుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన బైల్స్ ఈసారి కూడా హాట్ ఫెవరేట్గా బరిలోకి దిగింది. కాగా సోమవారం ఆమె ఉమెన్స్ టీమ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్రౌండ్ ఫైనల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఆమె ప్రకటనపై అమెరికా జిమ్నాస్ట్ స్పందించింది. '' బైల్స్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. వైద్యుల సూచన మేరకే ఆమె పోటీ నుంచి తప్పుకుందని'' పేర్కొంది. అయితే ప్రతీరోజు బైల్స్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నామని తెలిపింది. వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని వెల్లడించింది. అయితే క్వాలిఫికేషన్స్ రౌండ్లో 9వ హైయ్యెస్ట్ స్కోర్ వచ్చిన జేడ్ క్యారీ బైల్స్ స్థానంలో ఆల్ రౌండ్ ఈవెంట్లో పాల్గొంటుందని అమెరికా జిమ్నాస్ట్ సంఘం తెలిపింది. కాగా బైల్స్ నిర్ణయం తాము గౌరవిస్తున్నామని మరో ప్రకటనలో పేర్కొంది. -
29 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్లో స్వర్ణం సాధించారు
టోక్యో: ఒలింపిక్స్లో పోటీల నాలుగో రోజు రష్యన్ల పాలిట మరుపురాని రోజుగా మిగిలిపోయింది. విశ్వక్రీడల స్విమ్మింగ్లో ఎదురులేని అమెరికా స్విమ్మర్లకు చెక్ పెట్టిన రష్యన్లు... జిమ్నాస్టిక్స్లో అమెరికాకు షాక్ ఇచ్చారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో మంగళవారం మహిళల టీమ్ విభాగం పతకాల పోటీ జరిగింది. ఇందులో రష్యా మెరుపు విన్యాసాలతో బంగారు పతకం కొల్లగొట్టింది. 1992లో సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్లో రష్యా పసిడి నెగ్గడం ఇదే తొలిసారి. అమెరికా గ్రేటెస్ట్ జిమ్నాస్ట్, ఒలింపిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ పోటీల మధ్యలోనే తప్పుకోవడం జట్టుకు ప్రతికూలించింది. తద్వారా టీమ్ విభాగంలో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించాలనుకున్న అమెరికా ఆశలు ఆవిరయ్యాయి. బైల్స్ ఒక్క వాల్ట్లోనే పోటీ పడింది. తదుపరి అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో పోటీ పడకుండా తప్పుకుంది. మరోవైపు అకయిమోవా, లిస్టునోవా, మెలి్నకొవా, వురజొవాతో కూడిన రష్యా బృందం 169 స్కోరుతో స్వర్ణం గెలిచింది. సిమోన్, చిలెస్, సునిసా లీ, గ్రేస్లతో కూడిన అమెరికా 166 స్కోరుతో రజతం దక్కించుకుంది. 164 పాయింట్లు సాధిం చిన బ్రిటన్ కాంస్యం నెగ్గింది. 1928 తర్వాత టీమ్ విభాగంలో బ్రిటన్కు పతకం రావడం విశేషం. -
ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య!
వాషింగ్టన్: అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్ గెడ్డార్ట్ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ కోచ్గా పని చేసిన గెడ్డార్ట్ మిచిగన్లో మహిళా జిమ్నాస్ట్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్ డాక్టర్గా పని చేస్తున్నాడు. అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్ శిక్షణ కోసం ఈ సెంటర్కు తరలి వచ్చేవారు. అయితే గెడ్డార్ట్, నాసర్ అక్కడి మహిళా జిమ్నాస్ట్లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నాసల్ చేసిన ఆరోపణల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్ అటార్నీజనరల్ డెనా నిసెల్ తెలిపారు. గెడ్డార్ట్, నాసర్లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా గెడ్డార్ట్ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్హోలాండర్ 2000 సంవత్సరంలోనే సోషల్ మీడియా వేదికగా ఆరోపించించిన విషయం తెలిసిందే. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
'నేను రిషబ్ పంత్.. కొత్త ఉత్సాహంతో ఉన్నా'
చెన్నై: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ యమ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్తో సిరీస్ తర్వాత పంత్ తన జోష్ను మరింత పెంచాడు. టీమిండియా తొలి టెస్టులోఓటమి పాలైనా పంత్ దూకుడైన ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. 97 పరుగులు చేసిన పంత్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ కావడం నిరాశపరిచింది. తాజాగా పంత్ జిమ్సెషన్కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పంత్ తీవ్రమైన కసరత్తులు చేసినట్లుగా కనిపించింది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు మరింత ఉత్సాహంగా సన్నద్దమవుతున్నట్లు సూచిక పంపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేసింది. 'నేను మీ రిషబ్ పంత్.. కొత్త ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నా' అంటూ క్యాప్షన జత చేశాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ ఓలి బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ .. వన్డౌన్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 8ఓవర్లలో వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్ 23, పుజారా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: పాక్ వికెట్ కీపర్ ఖాతాలో అరుదైన రికార్డులు -
ప్రపంచంలోనే బలమైన బాలిక
అమెరికాలోని ఒట్టోవా నగరానికి చెందిన రోరి వ్యాన్ ఉల్ఫిట్కు సరిగ్గా ఏడేళ్లు. ఏకంగా 80 కిలోల బరువును తేలిగ్గా లేపుతుంది. ఇటీవల జరిగిన అమెరికా జాతీయ చాంపియన్ షిప్ అండర్ 11, అండర్ 13 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఛాంపియన్షిప్ను గెలుచుకోవడంతోపాటు 80 కిలోల బరువును ఎత్తే అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. ఆ పాప 61 కిలోల బరువుతో స్క్వాట్స్ (మోకాళ్ల మీద కూర్చొని లేవడం) చేయగలదు. రోరి వ్యాన్ తన ఐదవ ఏటనే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి క్లాస్లకు వెళ్లింది. ఓ పక్క జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూనే మరో పక్క వెయిటిలిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికీ ఆ పాప వారానికి తొమ్మిది గంటలపాటు జిమ్నాస్టిక్స్, నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ రెండు క్రీడల ప్రాక్టీస్, పోటీల సందర్భంగా పాపకు ఎలాంటి గాయాలు కాకుండా కోచ్లతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. -
ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్కు అరుణా రెడ్డి
హైదరాబాద్: వచ్చే నెలలో జర్మనీలో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు స్టుట్గార్ట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణా రెడ్డితోపాటు ప్రణతి నాయక్, ప్రణతి దాస్లకు చోటు లభించింది. పురుషుల విభాగంలో ఆశిష్ కుమార్, ఆదిత్య సింగ్ రాణా (రైల్వేస్), యోగేశ్వర్ సింగ్ (సర్వీసెస్) భారత జట్టులోకి ఎంపికయ్యారు. 2018లో అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా గుర్తింపు పొందింది. -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’
తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్ వీడియోలు, ఫిట్నెస్కు సంబంధించిన విషయాల గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్లో దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి ‘మళంగ్’ చిత్రంలో నటిస్తున్నారు. -
జిమ్మాస్టిక్స్.. పాపం సమంత!
జిమ్నాస్టిక్స్ అంటేనే వ్యాయామ సంబధితమైన క్రీడ. ఈ ఆటకు బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పుతో పాటు నియంత్రణ చాలా ముఖ్యం. కొంచెం పట్టుతప్పినా ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి జిమ్నాస్టిక్స్ను ప్రాణంగా భావించే ఓ క్రీడాకారిణి తన రెండు కాళ్లను విరగొట్టుకొని కేరిర్కే గుడ్బై చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్.. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ పోటీల్లో పాల్గొంది. ఫస్ట్ పాస్ చేస్తున్న సందర్భంలో ఆమె ఎగిరి మ్యాట్పై ల్యాం డ్ అయ్యింది. కానీ, ఆ ల్యాండింగ్ అదుపుతప్పడంతో రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పి తో ఆమె విలవిల్లాడిపోయింది. కొద్ది సేపటిదాకా ఎవరికీ ఏం అర్థం కాలేదు. తీవ్రమైననొప్పి తో ఆమె ఏడ్చే వరకూ కాళ్లు విరిగిన సంగతి అక్కడి వారికి తెలియలేదు. డాక్టర్లు వచ్చి ఆమెను స్ట్రెచర్పై అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆమె గుడ్డిగా హ్యాండ్స్ప్రింగ్ ఫ్రంట్ ఫ్లిప్ చేయడం వల్లే రెండు కాళ్లు విరగిపోయాయని జిమ్నాస్టిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ తీవ్ర గాయంతో సమంత ఆరోజే తన జిమ్నాస్టిక్స్ కెరీర్కు గుడ్బై చెబుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. గత18 ఏళ్లుగా తన కెరీర్కు జిమ్నాస్టిక్స్ ఎంతగానో తోడ్పడిందని, అదే కష్టపడేతత్వాన్ని, గౌరవాన్ని, సమగ్రత, అంకితభావాన్ని నేర్పిందని చెబుతూ.. తనకు ఇష్టమైన ఆటకు దూరం అవుతున్నందుకు బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం సమంత గాయానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. View this post on Instagram Never let fear overpower you passion #SEC #ItJustMeansMore A post shared by Samantha Cerio (@sam_cerio) on Mar 23, 2019 at 8:30am PDT -
జిమ్మాస్టిక్స్.. పాపం సమంత!
-
దీపా విఫలం
బాకు (అజర్బైజా¯Œ ): ప్రపంచకప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత పొందిన ఆమె బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో మాత్రం తడబడింది. త్రిపురకు చెందిన 25 ఏళ్ల దీపా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్లో 10.633 పాయింట్లు స్కోరు చేసి 25 మందిలో 20వ స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా నెదోవ్ (ఆస్ట్రేలియా–13.466 పాయింట్లు) అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. నేడు జరిగే వాల్ట్ ఫైనల్లో దీపా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. -
ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లోకి దీప
బాకు (అజర్బైజాన్): భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్లో ఫైనల్ రౌండ్కు అర్హత సంపాదించింది. వాల్ట్ ఈవెంట్లో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ బరిలోకి దిగిన భారత జిమ్నాస్ట్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత పొందింది. 25 ఏళ్ల దీప రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో వరుసగా 14.466, 14.133 పాయింట్లు సాధించింది. మొత్తంమీద 14.299 సగటును నమోదు చేసి ఫైనల్ చేరింది. అమెరికాకు చెందిన జేడ్ క్యారీ (14.70 పాయింట్లు), మెక్సికో మెరిక అలెక్సా మోరెనో (14.533 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలు పొందారు. ఈ క్వాలిఫయింగ్లో టాప్–8 జిమ్నాస్ట్లు ఫైనల్ చేరతారు. రేపు (శనివారం) వాల్ట్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. రియో ఒలింపిక్స్లో భారత అమ్మాయి తృటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ (జర్మనీ)లో దీప కాంస్యం గెలిచింది. గాయం వల్లే అంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె పోటీపడలేకపోయింది.