Group 1 Mains
-
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు..ఏపీ ప్రభుత్వం భరోసా
-
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి ముఖ్యమైన తేదీలు: అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల -
AP: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ సారి కొత్త విధానం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. పకడ్బందీ చర్యలు.. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి -
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు. జూన్-5: జనరల్ ఇంగ్లిష్(అర్హత పరీక్ష) జూన్-6: పేపర్-I - జనరల్ ఎస్సే జూన్-7: పేపర్-II - హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ జూన్-8: పేపర్-III - ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్ జూన్-9: పేపర్-IV - ఎకానమీ అండ్ డెవలప్మెంట్, జూన్-10: పేపర్-V - సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రెటేషన్ జూన్-12: పేపర్-VI - తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ ప్రతి పరీక్షకు మూడు గంటల సమయం. 150 మార్కులు. -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్ఘాట్కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
గ్రూప్–1 మెయిన్స్కు తండ్రీ తనయుడు
యాదగిరిగుట్ట రూరల్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాలనర్సయ్య (48), ఏలూరు సచిన్ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సాధించారు. బాలనర్సయ్య ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సచిన్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు. -
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ పరీక్ష ప్యాటర్న్ను ఈనెల 18న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 503 గ్రూప్–1 ఉద్యోగాలకు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించిన టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టింది. ప్రాథమిక కీ విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించింది. ఐదు ప్రశ్నలను తొలగించి తుది కీని ప్రకటించింది. తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్–2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్కు ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33% రిజర్వేషన్లు కలి్పస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులను ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు సాధిస్తే.. వారి స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి హయ్యర్ ర్యాంకు ఇచి్చనట్టు వివరించింది. ఓఎంఆర్ పత్రాల్లో కమిషన్ సూచించిన విధంగా కాకుండా ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వివరాలకు.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్: ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn టీఎస్పీఎస్సీ హెల్ప్డెస్క్ నంబర్లు: 040–22445566, 040–23542185, 040–23542187 ఈ–మెయిల్: helpdesk@tspsc. gov. in -
గ్రూప్–1లో తెలుగు అర్హత పేపర్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో తెలుగును అర్హత పేపర్గా ప్రవేశపెట్టాలని గ్రూప్–1 పరీక్ష అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్ను కోరారు. ఈ మేరకు వారు గురువారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వినతి పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాల వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని, దీనివల్ల పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని వారు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నరేందర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, పి.వెంకటేశం తదితరులున్నారు. -
ఏపీ గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ (www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
నెలలో 2011 ‘ఏపీ గ్రూప్ 1’ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ ఈ నెల 14 నుంచి నిర్వహించిన 2011 గ్రూప్ 1 మెయిన్స్ పునఃపరీక్షలు శనివారంతో ముగిశాయి. ఫలితాలు వెల్లడించడానికి నెల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఇంటర్వ్యూలు పూర్తి చేసి నియామకాల జాబితాను ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ సమర్పించనుంది. -
పరీక్ష కేంద్రంలోనే ప్రశ్నపత్రాల ముద్రణ
లీకేజీ నివారణకు ఏపీపీఎస్సీ చిట్కా సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడానికి ఏపీపీఎస్సీ కొత్త విధానాన్ని చేపట్టింది. బుధవారం నుంచి ప్రారంభమైన 2011 గ్రూప్1 మెయిన్స్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. పరీక్ష తేదీలకు చాలా ముందుగా సెట్ల వారీ ప్రశ్నపత్రాలను రూపొందించడం, దరఖాస్తులనుబట్టీ వాటిలో రెండింటిని ముద్రణకు ఇచ్చి, నేరుగా ఆయా కేంద్రాలకు చేర్చడం జరుగుతున్న విధానం. దీనివల్ల ఏదో ఒక సందర్భంలో లీకవుతున్నాయి.ఈ దృష్ట్యా ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి ైవె వీఎస్టీ సాయిలు ఈసారి కొత్త పంథాను ఎంచుకున్నారు. రూపొందించిన నాలుగైదు సెట్ల ప్రశ్నపత్రాలను సాఫ్ట్ కాపీలుగా తమ వద్దే భద్రపరుచుకున్నారు. బుధవారం పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఒక సెట్ ఎంపిక చేసి ఆయా కేంద్రాలకు ఆన్లైన్ ద్వారా పంపారు. పరీక్ష కేంద్రాల్లో వాటిని ప్రింట్ తీయించి అభ్యర్థులకు అందించడానికి సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతతో గదిని కేటాయించారు. హైస్పీడ్ ప్రింటర్ల సాయంతో ప్రింట్ తీసి వాటిని ప్యాక్ చేసి సీల్ వేసి ఆయా గదుల్లోని ఇన్విజిలేటర్లకు పంపిణీ చేయించారు. ప్రశ్నపత్రం ఏదనేది ఏపీపీఎస్సీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.