grain purchase
-
అన్నదాత ఆగమాగం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4,16,600 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 2,20,7 98 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించి వారం రోజులుగా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతోంది. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో «కొనుగోళ్లు పూర్తి కావొస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా ఆలస్యమవుతున్నాయి. మిల్లుల్లో జాగా లేదని... ఖాళీ స్థలం లేదని చెప్పి మిల్లర్లు ధాన్యం లారీలను మిల్లుల్లో అన్లోడింగ్ చేసుకోవడం లేదు. 2022–23 యాసంగి, వానాకాలం, 2024 యాసంగి సీఎంఆర్ 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతోపాటు, ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లతో విక్రయించిన 1.30 లక్షల «మెట్రిక్ టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఈనెల 23వ తేదీలోగా మిల్లుల్లో నుంచి ధాన్యాన్ని కాంట్రాక్టర్ ఖాళీ చేయాలి. ఇంతవరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా బయటకెళ్లలేదు. దీంతో ప్రైవేట్కు కొందరు రైతులు అమ్ముకున్నారు. అయినా ఇంకా జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లవ్యాప్తగా ఆయా మిల్లుల్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. రోడ్డెక్కుతున్న రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బీబీనగర్ మండలం గూడూరులో హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కొనుగోలు కేంద్రానికి 120 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు.8 రోజుల క్రితం 40 మంది రైతుల ధాన్యం కాంటా వేసి మిల్లులకు పంపించారు. అక్కడ ఇంకా దిగుమతి కాలేదు. ఇంకా 30 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి ఉంచారు. ఇంకా 60 మంది రైతులు కాంటా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు గంటల పాటు రైతులు రహదారిపై బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ∙భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన రైతులు తడిసి మొలకెత్తిన ధాన్యంతో మంగళవారం కలెక్టరేట్ ఎదు ట ధర్నాకు దిగారు. ∙అడ్డగూడూరు మండలం చౌళ్లరామా రం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ∙పోలింగ్ రోజు భూ దాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతులు తడిసిన ధా న్యం కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని ఆందోళనకు దిగా రు. ∙ఆలేరు మండలం కొలనుపాకలో ధర్నా చేశారు. ఆయా జిల్లాల్లో ఇలా ∙సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా, ఇప్పటివరకు 63,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ప్రతి 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోలు కోత విధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వచ్చే లారీల సిబ్బంది రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా లో ఈనెల 12న గాలివాన భీభత్సం సృష్టించడంతో కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు చా లా వరకు వరదలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు కల్లాలు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందోళనలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 76,437 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. తాలు, తప్ప ఉందని తిరకాసుతో బస్తాకు మూడు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలరోజులు అవుతోందికొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతోంది. వెంట వెంటనే కాంటాలు వేయడం లేదు. వారం రోజుల క్రితం 3 వేల బస్తాలు కాంటా వేసినా మిల్లుకు తరలించలేదు. దీంతో వానకు తడిసి ఎండకు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నాం. – మాధవరెడ్డి, గూడూరు కొనుగోలు వేగవంతం చేస్తాం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. మిల్లుల్లో వడ్లు దించుకోవడానికి స్థలం లేనందున జాప్యం జరుగుతోంది. టెండర్ ధాన్యం, సీఎంఆర్ ధాన్యం ఇంకా మిల్లుల్లో ఉంది అయితే జనగామ, హనుమకొండలకు 20 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించడానికి చర్యలు తీసుకున్నాం. – గోపీకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్లైన్లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ‘మిచాంగ్’ తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను శరవేగంగా కొనుగోలు చేయనుంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. గంటల్లోనే సేకరణ తుపాను ముప్పు పొంచి ఉండటంతో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ను తప్పించి, ఆఫ్లైన్లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు ఆఫ్లైన్ సేకరణకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలించనుంది. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సైతం సేకరించి డ్రయర్ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనుంది. సదరు జిల్లాల్లోని మిల్లుల్లో డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు పంపించనుంది. అందుకయ్యే అదనపు రవాణా ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించనుంది. అయితే.. నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్ సౌకర్యం మిల్లులున్నాయి. క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి డ్రయర్ మిల్లులకు తరలించేలోగా వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని వ్యవసాయ మార్కెట్ యార్డులు, గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్ చేయనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్ దశల్లో ఉంది. రానున్న 24–36 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇప్పటివరకు 4.66 లక్షల టన్నుల సేకరణ ఇప్పటివరకు 67,837 మంది రైతుల నుంచి రూ.1,017.77 కోట్ల విలువైన 4.66 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రవాణా, కూలి, గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. దీంతో రైతులెవరూ ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించట్లేదు. దీనిని గమనించిన వ్యాపారులు తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులెవరూ అధైర్యపడొద్దు. వీలైనంత వేగంగా ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్ చేసి ట్రాక్ïÙట్ జనరేట్ చేసిన తర్వాత సమీపంలోని మిల్లులకు తరలించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సోమవారం నాటికి అందుబాటులోని మొత్తం ధాన్యం సేకరించేలా సమాయత్తం అవుతున్నాం. ఆలస్యమైతే వర్షాలు కురిసి ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఎఫ్టీవోలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుంది. ఎవరూ కూడా మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ రోడ్లపై ధాన్యాన్ని వదిలేయొద్దు ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరూ కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దు. వెంటనే ఆర్బీకేలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలి. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
రైతు దినోత్సవం రసాభాస!
సాక్షి నెట్వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు. రైతు వేదికపై వడ్లు కుమ్మరించి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్నగర్ మార్కెట్కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు. మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి.. తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు. రైతులకు ఏం చేశారని సంబురాలు? యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి. ఎంపీ కవితను నిలదీసిన రైతులు మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేదెప్పుడు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు. కార్యక్రమాలను బహిష్కరించి నిరసన ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు. నష్టపరిహారం అందేదెప్పుడు? వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు. రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా? రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే? -
చంద్రబాబువన్నీ డ్రామాలే..
సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు. చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం -
AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తిరస్కరించకుండా రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తొలుత తడిసిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొనసాగుతున్న వర్ష సూచనలతో రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటువంటి ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి డ్రయర్ సౌకర్యం, డ్రయర్ ప్లాట్ఫారమ్ ఉన్న మిల్లులకు తరలిస్తున్నాం. అక్కడ ఆరబోత తర్వాత ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం’ అని తెలిపారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి అదనంగా ఆర్బీకేల వద్దకు ధాన్యం తెచ్చే ప్రతి రైతుకూ మద్దతు ధర అందిస్తామన్నారు. ఇప్పటివరకు 5.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 55 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.803 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ధాన్యాన్ని వేగంగా కల్లాల నుంచి మిల్లులకు తరలించేందుకు రవాణా కోసం ఐదు గోదావరి జిల్లాలకు కలెక్టర్ కార్పస్ ఫండ్ కింద రూ.కోటి చొప్పున కేటాయించామన్నారు. కోటా పూర్తవగానే తిరిగి నిధులు అందిస్తామన్నారు. గత ఖరీఫ్లో 6.40 లక్షల మంది రైతుల నుంచి 35.41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.7,208 కోట్లు (99 శాతం) చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు. తొలిసారిగా జయ రకానికి మద్దతు ధర తొలిసారిగా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల బొండాలు (జయ రకం) ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా బయట మార్కెట్లో జయ రకం ధాన్యానికి మంచి ధర పలుకుతోందన్నారు. వేసవి ప్రారంభంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ధాన్యంలో నూక శాతం పెరిగినట్లు తెలిపారు. వీటిని బాయిల్డ్ రైస్ కింద కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచులకు కొరత లేదు వర్షాల నేపథ్యంలో నిత్యం ప్రతి జిల్లాలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ చెప్పారు. ఎక్కడా గోనె సంచులకు కొరత లేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన 31 మిల్లులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 8 వరకు వర్షాలు.. తగ్గగానే పంట నష్టం అంచనా వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను వేగంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు వర్ష సూచన ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనాలు, ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలు ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులుంటే వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్కు ముందే పరిహారం రెండు నెలల క్రితం మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దాదాపు రూ.34.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఖరీఫ్ సీజన్కు ముందుగానే జమ చేస్తామన్నారు. వాటితో పాటే ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పరిహారాన్ని కూడా రైతులకు ఈ నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక ముందే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.1,911 కోట్ల మేర పంట నష్టం పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం -
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్సింగ్తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్సింగ్ కూడా ఉన్నారు. అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్సింగ్తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. -
ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది. 233 ఆర్బీకేల్లో.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ఎకరానికి 53 బస్తాల దిగుబడి రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడులు టాప్.. జిల్లాలో 2021 ఖరీఫ్లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. ప్రతి గింజా కొంటాం:– రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. రూ.1,096.52 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు శుభవార్త! ఆర్బీకేల ద్వారా రైతన్నల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రూ.1,096.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 3.29 లక్షల మంది రైతుల నుంచి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. తాజా చెల్లింపుతో మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లయింది. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వం వేగంగా చెల్లింపులు కూడా జరుపుతోంది. 21 రోజుల్లోపు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం నుంచి పది రోజుల లోపే రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన దాఖలాలున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. తొలిసారిగా అదనపు సాయం.. ధాన్యం సేకరణలో తొలిసారిగా తెచ్చిన ఆన్లైన్ విధానంతో రైతులకు పారదర్శకంగా మద్దతు ధర లభిస్తోంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను సైతం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. వీటి కింద ఇప్పటివరకు రూ.45.91 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు 50 శాతం చెల్లింపులను పూర్తి చేసింది. గత సర్కారు హయాంలో ఇవేమీ లేకపోగా రైతులకు ధాన్యం సొమ్ములను నెలలు తరబడి బకాయిలు పెట్టారు. మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూర్చేందుకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసింది. ఫలితంగా రైతన్నల్లో ఆందోళన రేకెత్తించి నష్టానికే మధ్యవర్తులకు ధాన్యం విక్రయించుకోవాల్సిన దుస్థితి కల్పించింది. ఇలాంటి వాటిని అరికడుతూ రైతులే తొలి ప్రాధాన్యంగా 21 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర జమ చేయాలని నిర్ణయించి సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి ఖరీఫ్ ధాన్యం సేకరణను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించాం. ఆన్లైన్ విధానంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర లభిస్తోంది. పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం ప్రకారం చెల్లింపులు చేస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ, జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వడ్లకు ర'వాన' భయం
సాక్షి, హైదరాబాద్: రోహిణి కార్తె ముగిసి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా.. రాష్ట్రంలో ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సీజన్ మొదలైనప్పటి నుంచి తప్పుల తడక ప్రణాళికలతో సాగిన పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచి్చనా గాడిన పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రెండు మూడుసార్లు కురిసిన అకాల వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడ్డ రైతన్నలు.. రుతుపవనాల ప్రభావంతో కురిసే భారీ వర్షాలను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు. కొత్త గన్నీ బ్యాగులు లేకపోయినా, పాత బ్యాగులతోనే యాసంగి కథ నడిపించిన పౌరసరఫరా శాఖ.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా సౌకర్యాన్ని కలి్పంచేందుకు అపసోపాలు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు మిల్లులూ ఫుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు తన వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏకంగా ఐకేపీ సెంటర్ సీఈవోపైనే పెట్రోల్తో దాడి చేయగా, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాస్తారోకోలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కష్టమేనా? రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 43.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 7.77 లక్షల రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన 6,584 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిన 3,252 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. మరో పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కానీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉంది. కిందటి యాసంగిలో ఇప్పటికే 79 ఎల్ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈసారి అందులో దాదాపుగా సగానికే పరిమితం కావడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడడం అధికారుల అలసత్వాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవాణా లేక ఇబ్బందులు సిద్దిపేట జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. కాంట్రాక్టర్లు వాహనాలు సరిగా ఏర్పాటు చేయక పోవడంతో పాటు రైస్ మిల్లుల్లో స్థలం లేక పోవడంతో అన్ లోడ్ ఆలస్యం అవుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు జోకుతున్నా, మిల్లర్ల వద్ద దించుకోవడం సమస్యగా మారింది. మిల్లులకు వెళ్లిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పటికీ సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఉంది. మరోవైపు కాంట్రాక్టు కుదుర్చుకున్న లారీలు కూడా సమయానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు సొంతంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించినా తీసుకోవడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో 12 ఎల్ఎంటీ వరకు ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదు. మిల్లుల్లోనే వానాకాలం ధాన్యం గత వానాకాలం సీజన్కు సంబంధించిన సుమారు 30 ఎల్ఎంటీల వరకు ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లుల్లోనే ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు 43 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లుల్లో జాగ లేక ప్రైవేటు గోడౌన్లలో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ధాన్యాన్ని పంపించినా, దించుకోకపోవడంతో ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం) లో నమోదు కావడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించినా రికార్డులకెక్కడం లేదు. లారీలు, ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఉంటే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవలసిన పౌరసరఫరాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లుల్లో ఖాళీ లేకనే ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వడ్ల పైసల్ పడుతలెవ్వు .. సాధారణంగా ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము వచ్చి చేరుతుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లిన వెంటనే ఓపీఎంఎస్ ద్వారా రైతు విక్రయించిన ధాన్యం వివరాలు ఆన్లైన్లోకి చేరతాయి. తదనుగుణంగా జిల్లా ఖజానా నుంచి రైతు బ్యాంకుల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ఈసారి రైతులకు ధాన్యం డబ్బులు ఆలస్యం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓపీఎంఎస్లో రైతు వివరాలు చేరకపోవడమే. ఇప్పటివరకు 7.77 లక్షల మంది రైతులు రూ.8,553.79 కోట్ల విలువైన ధాన్యం విక్రయించగా, ఓపీఎంఎస్లోకి నమోదైన రైతుల సంఖ్య కేవలం 5.26 లక్షలే. వారికి చెల్లించాల్సిన మొత్తం 5,789.84 కోట్లు. కానీ 3.47 లక్షల మందికి మాత్రమే రూ.5,233.18 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా ఓపీఎంఎస్ బ్యాలెన్స్ రూ. 556.66 కోట్లు ఉండగా, ఓపీఎంఎస్లోకి ఎంటర్ కాని రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,320.61 కోట్లుగా ఉంది. కొనుగోళ్ల తాజా స్థితి ఇదీ... ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు: 6,584 కొనుగోళ్లు ముగిసి మూతపడ్డ కేంద్రాలు: 3,252 ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం : 43.70 ఎల్ఎంటీ ఇంకా మార్కెట్కు రానున్న ధాన్యం (అంచనా) :12 ఎల్ఎంటీ ధాన్యం విక్రయించిన రైతులు : 7,77,013 విక్రయించిన ధాన్యం విలువ : రూ. 8,553.79 కోట్లు ఓపీఎంఎస్ అయి రైతుల ఖాతాల్లోకి చేరిన మొత్తం : రూ. 5,233.18 కోట్లు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం అంకిరెడ్డి పల్లిలోని కొనుగోలు కేంద్రంలో రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లులకు చేరవేసేందుకు లారీలు, ట్రాక్టర్లను అధికారులు సమకూర్చకపోవడంతో 15 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు అంకిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో జరిపారు. వీరానగర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బస్తాలు ఇక్కడే ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున భయంగా ఉంది. రోజూ ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది. – మన్నె స్వామి, రైతు, వీరానగర్, సిద్దిపేట జిల్లా -
కుప్పలు.. తిప్పలు
10 కేజీలు తరుగు తీస్తూ.. ధాన్యం అంతా కొనుగోలు కేంద్రంలో ఉంది. మబ్బులు కమ్మి ఉన్నాయి. కనీసం పట్టాలను కూడా సరఫరా చేయలేదు. వానొస్తే కష్టమంతా నీటి పాలవుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద 5 కేజీలు తరుగు తీసేందుకు ఒప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా 10 కేజీల తరుగు తీస్తామంటున్నారు. ఇది రైతులను నిలువు దోపిడీ చేయడమే. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. – గడుపుడి వెంకటేశ్వర్లు, రైతు, అనాసాగరం,నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి నిదర్శనమిది. రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు సాగుతూ ధాన్యం కేంద్రాలకు పోటెత్తుతున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. పలుచోట్ల గన్నీ బ్యా గుల కొరత, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇటీవలి అకాల వర్షాలతో ధాన్యం తడిసి తేమ శాతం పెరగడం, రంగు మారడం, అధికారుల అలసత్వం, మిల్లర్ల కొర్రీలు కలిసి కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వడ్ల కుప్పలతో నిండిపోతున్నాయి. సంచులు, లారీల కొరత.. మిల్లర్ల కొర్రీలు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఓవైపు గన్నీ సంచులకు, ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీలకు కొరత.. మరోవైపు సన్నరకాలే తీసుకుంటామంటూ, తరుగు తీస్తూ మిల్లర్లు పెడుతున్న కొర్రీలు సమస్యగా మారాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ఇదే కారణమని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► ఇటీవలి అకాల వర్షానికి యాదాద్రి, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి మొదలైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోలు చేసేందుకు సెంటర్లలో కొర్రీలు పెడుతున్నట్టు విమర్శలున్నాయి. వేస వి ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువనే సమస్య లేకపోయినా.. ధా న్యం రంగుమారి నల్లబడిందని, ఇసుక చేరింద నే సాకులు చెప్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ► సరిపడిన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గన్నీ బ్యాగులు లేక కొనుగోళ్లు చేయలేకపోతున్నామని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► అనేక ప్రాంతాల్లో హమాలీల సమస్య కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. ► చాలాచోట్ల సెంటర్లలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీల కొరత కూడా వేధిస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైతులే ట్రాక్టర్లను సమకూర్చుకొని మిల్లింగ్కు తరలించే పరిస్థితి ఉంది. ► సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకుంటామని, ఆ ధాన్యాన్నే ముందుగా పంపాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడితెస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని తూకం వేసి పంపితే.. దాన్ని దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. లేకుంటే ఎక్కువ తరుగుకు ఒప్పుకొంటేనే ధాన్యం తీసుకుంటామంటూ కొర్రీ పెడుతున్నారు. ఇలా లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం కూడా కొనుగోళ్లలో జాప్యానికి కారణమవుతోంది. ► ఇక ఎఫ్సీఐ మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేపడుతుండటం, వానాకాలంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రస్తుత ధాన్యాన్ని తీసుకోలేక పోతున్నామని కొందరు మిల్లర్లు అంటున్నారు. మిల్లింగ్ నష్టం తేలక! యాసంగిలో రాష్ట్రం నుంచి 40.20 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని.. అందులో 37.60 లక్షల టన్నులు రారైస్, 2.60 లక్షల టన్నులు ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎఫ్సీఐ సూచించింది. తర్వాత మరింత ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడిబియ్యం) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడి బియ్యం)గా మార్చితే నూకలు ఎక్కువ అవుతాయని, ఈ మేర కు ప్రభుత్వం నష్టాన్ని భరించాలని మిల్లర్లు డి మాండ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం దీనిపై సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టెస్ట్ మిల్లింగ్ ఎప్పుడు పూర్తిచే స్తుంది, నష్టాన్ని ఇంకెప్పుడు నిర్ధారిస్తుందని మిల్ల ర్లు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల కూడా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారని అధికారవర్గాలే చెప్తున్నాయి. ∙రాష్ట్రంలో ఇప్పటివరకు ఆదిలాబాద్, వికారా బాద్ మినహా 30జిల్లాల్లో 5,883 కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టు పౌరసరఫరాల శాఖ చెప్తున్నా.. 28 జిల్లాల్లోని 4,068 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. ► ప్రస్తుత సీజన్లో బుధవారం నాటికి 11,20,916 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. గత (2020–21) యాసంగితో పోలిస్తే ఇది మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 31.22 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం. ఎక్కడ చూసినా వరి కుప్పలే.. ► మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడిస్తున్నా పూర్తి స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఈసారి జిల్లాలో 3.77 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 329 సెంటర్లు ఏర్పాటు చేసి 13,274 టన్నులే కొనడం గమనార్హం. జిల్లాకు కోటి గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా.. 20 లక్షల బస్తాలే వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇక సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకొంటామంటూ రైస్మిల్లర్లు మెలిక పెట్టడం వల్ల కూడా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 95 వేల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి ఇంకా 49,911 టన్నులే కొనుగోలు చేశారు. జిల్లాలో 346 కేంద్రాలు ప్రారంభించినా.. 291 చోట్ల మాత్రమే, అదీ మందకొడిగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం కుప్పలు పేరుకుపోతోంది. మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి కొర్రీలు పెడుతున్నారు. ► రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్ జిల్లాలోనే ఓ మోస్తరుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా యి. 449 కొనుగోలు కేంద్రాల్లో కలిపి మూడున్నర లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించారు. అయితే వరికోతలు దాదాపు పూర్తవడంతో.. ధాన్యం రాశులుగా పోసి కనిపిస్తోంది. ► మహబూబాబాద్ జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించారు. ఇప్పటివరకు కొన్న ధాన్యం 13 వేల టన్నులే. మిల్లర్లు కొర్రీలు పెడుతూ ప్రతిబస్తాకు 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. తీవ్ర జాప్యం జరుగుతుండటంతో.. రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కల్లాల వద్దే కాంటాలు పెట్టి ధాన్యం కొంటున్నారు. -
సూర్యాపేట మార్కెట్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం సజావుగా సాగాయి. శనివారం రైతుల ఆందోళనలతో కాంటాలు నిలిచిపోవడం, కలెక్టర్ జోక్యం చేసుకుని రీ టెండర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్ యార్డులో కలెక్టర్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూశారు. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచే కాంటాలు మొదలయ్యాయి. 26,455 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ నుంచి కొనుగోలుదారులు తరలించారు. -
కొట్లాడుడు.. కొనుడు..
సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 11న ఢిల్లీలో వరి దీక్ష కూడా తలపెట్టారు. అయినా కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం.. రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమే అన్న సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు అడుగులు వేస్తోంది. అటు కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మొదలైన వరి కోతలు యాసంగి వరిని బాయిల్డ్ రైస్ చేస్తే తీసుకోబోమని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్రంలో యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్గా మాత్రమే పనికొస్తుందని.. ముడి బియ్యం (రా రైస్)గా మారిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనాలని ఓ వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. వరిసాగు చేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర రైతాంగానికి స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వాతావరణం బాగుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని వ్యవసాయ శాఖ చెప్తోంది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటిచోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్ని పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 25 శాతం పంటను కోయడం, ప్రైవేటుగా విక్రయించడం కూడా జరిగింది. ఈ నెల 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోనున్నాయి. మిల్లర్లు, దళారుల మాయాజాలం షురూ.. కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలపై గందరగోళం నెలకొంది. దళారులు, మిల్లర్లు మద్దతు ధరకన్నా రూ.500 వరకు తక్కువ ఇస్తున్నారు. తరుగు, తేమ అంటూ క్వింటాల్కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ఇస్తున్నట్టు రైతులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ ‘‘తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ఢిల్లీ ధర్నా తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’అని రైతులకు హామీ ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఇదే విషయాన్ని చెప్తున్నా.. సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్గా జనం ముందు నిలబెట్టడంలో విజయం సాధించినట్టు భావిస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. ఇదే ఊపులో తాము మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలమనే సందేశం పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. అంతా హైదరాబాద్కు తిరిగొచ్చాక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొనుగోలు ఇలా..! ► రైతులకు మద్దతుధర కింద సాధారణ ధాన్యాన్ని రూ.1,940 ధరతో, ఏ గ్రేడ్ ధాన్యాన్ని రూ.1,960 ధరతో కొనుగోలు చేసి.. ముడిబియ్యంగా మిల్లింగ్ చేయించాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన. ► గతంలో మాదిరిగా కాకుండా అవసరమైన మేరకే కొనుగోలు కేంద్రాలు తెరిచే అవకాశం. ► మిల్లర్లు ముడిబియ్యం ఎంతమేర కొంటారో చూసుకుని, మిగతా బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలనే యోచన. ► అదనపు నూకలను ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన ► ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. పెరిగే నూకలను ఏం చేద్దాం? ► సాధారణంగా క్వింటాల్ ధాన్యం మిల్లింగ్ చేస్తే.. బియ్యం, నూకలు కలిపి 67 కిలోలు వస్తాయి. ఇందులో 50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు ఉండటాన్ని ఎఫ్సీఐ అనుమతిస్తుంది. ఈ బియ్యం, నూకలను తీసుకుని.. క్వింటాల్ ధాన్యంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మద్ధతు ధర అయిన రూ.1,960 చొప్పున చెల్లిస్తుంది. వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు ఎఫ్సీఐ ప్రమాణాల మేరకు బియ్యం, నూకలు వస్తాయి. దానితో సమస్య ఉండదు. ► యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 17 కిలోల నూకలు అదనంగా వస్తాయి. అంటే సాధారణంగా వచ్చే 17 కిలోలు, ఈ 17 కిలోలు కలిపి 34 కిలోలు నూకలే వస్తాయి. మిగతా 33 కిలోలు మాత్రమే బియ్యం ఉంటాయి. ఈ క్రమంలోనే అదనపు నూకలను ఏం చేసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తగ్గిపోయే ఒక్కో కిలో బియ్యానికి రూ.30 చొప్పున లెక్కిస్తే.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.400 నుంచి రూ.500 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కారు భరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందని మిల్లర్లు కూడా చెప్తున్నారు. సర్కారు కొనడం లేదని దళారులు వస్తున్నరు నేను ఏడెకరాలలో వరి వేసిన. ఎకరానికి 40 బస్తాల లెక్కన వచ్చింది. సర్కారు కొనడం లేదంటూ దళారులు నా దగ్గరికొచ్చి వడ్లు కొనుక్కొనిపోయిన్రు. పెట్టుబడి పోను ఎకరానికి వెయ్యి రూపాయలు కూడా మిగలలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు పెట్టాలి. – శివశంకర్, జకోరా, నిజామాబాద్ జిల్లా -
రైతులకు రూ.1,153 కోట్లు చెల్లించాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే కొన్ని పత్రికలు ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వారిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఖరీఫ్లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కమిషనర్ చెప్పారు. ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించినట్లు గిరిజాశంకర్ తెలిపారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడపలో కూడా ఈ బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జనవరి 18 నుంచి రెండు నెలల (డిసెంబర్, జనవరి) ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వీరపాండియన్ తెలిపారు. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు తమ వాయిస్ను గట్టిగా వినిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఎంపీల ఆధ్వర్యంలో ముఖ్యంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే తాము.. చాలా ఓపిక పట్టామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదీలేదని స్పష్టంచేశారు. కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడంలేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. -
కర్షకుడా... కదలిరా!
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలం టూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ ఆధ్వర్యంలోగురువారం ఇక్కడి పబ్లిక్గార్డెన్స్ నుంచి బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు ‘కర్షకుడా.. కదలిరా’ పేరుతో రైతులతో ప్రదర్శన నిర్వహించ నుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయిం చారు. సమావేశంలో భాగంగా పార్టీ సభ్యత్వంతో పాటు రైతుల సమస్యలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలంటూ మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాలని కూడా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిల నేతృత్వంలో ఎన్నికల అధికారిని కలసి ఫిర్యాదు చేయనున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉన్న అవినీతి, భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్క రించాలని కాంగ్రెస్ కోరనుంది. దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, 30 లక్షలకు తగ్గకుండా ఈసారి సభ్యత్వాన్ని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సమావేశానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, నేతలు హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్ తదితరులు హాజరయ్యారు.