Gold
-
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
జనవరి 30, 31 తేదీల్లో యూఎస్ ఫెడ్ పాలసీ మీటింగ్ జరగనుంది. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మదుపర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు..పెరిగాయా?.. తగ్గాయా?
దేశంలో తగినంత బంగారం లేదంటే అవసరాల కోసం విదేశాలకు మనదేశానికి దిగుమతి చేసుకుంటుంటాం. ఇలా దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇటీవల ఆ సుంకాలను పెంచింది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగా కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న మన దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
చైన్ స్నాచింగ్కు మహిళ బలి
గజ్వేల్రూరల్: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్ తీసి బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్ రూమ్ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు. ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది. -
రెండో రోజు మళ్ళీ తగ్గిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..
ఈ నెల 19, 20 తేదీల్లో పెరిగిన బంగారం ధరలు 21, 22, 23 తేదీల్లో ఎలాంటి పెరుగుదలకు లోను కాకుండా ఉన్నప్పటికీ, గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. నిన్న, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర మీద రూ. 100 వరకు తగ్గింది. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడల్లో తులం బంగారం ధర రూ. 57700 (22 క్యారెట్స్), రూ. 62950 (24 క్యారెట్స్) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు 10 గ్రాముల మీద రూ. 50 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు రూ. 50 వరకు తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం విలువ రూ. 58300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63600 వద్ద ఉంది. ఢిల్లీలో నేడు 10 గ్రామ్స్ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు వరుసగా రూ. 57850, రూ. 63100గా ఉంది. వెండి ధరలు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 700 పెరిగినట్లు సమాచారం. వెండి ధర నిన్న, ఈ రోజు మాత్రం ఏకంగా రూ. 1000 పెరిగింది. -
బంగారం కొనుగోలుదారులకు కేంద్రం భారీ షాక్!
బంగారం,వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండితో పాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతం ఉండగా.. దాన్ని 15శాతానికి పెంచింది. పెంచిన దిగుమతి సుంకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో పదిశాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ , మరో ఐదుశాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ఉంటుంది. తాజాగా సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జి నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండిలో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు ఈ సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జి కిందకు వస్తాయి. కాగా, కేంద్రం నిర్ణయంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. -
మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో స్వల్ప పెరుగుదలను నమోదు చేసి.. ఆ తరువాత వరుసగా తగ్గిన పసిడి ధరలు, గత మూడు రోజులుగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్నాయి. ఈ రోజు గోల్డ్ రేటు ఏ రాష్ట్రంలో ఎలా ఉందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం రేటు రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్)గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాజ్, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతుంది. చైన్నైలో కూడా ఈ రోజు పసిడి ధరలు ఏ మాత్రం పెరగలేదు, కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 58300, రూ. 63600గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: భారత్కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. -
ది బోమ్ జీసస్: ఎడారిలో ఓడ... బోలెడంత బంగారం!
సుమారు 500 సంవత్సరాల క్రితం బంగారం , ఇతర సంపదతో భారతదేశానికి వెళుతుండగా అదృశ్యమైన పోర్చుగీస్ ఓడ అవశేషాలు నమీబియా ఎడారి తీరప్రాంతంలో గుర్తించారు. నైరుతి ఆఫ్రికాలోని ఎడారిలో బంగారు నాణేలతో ఉన్న ఓడను గుర్తించడం పురావస్తు పరిశోధనల్లో వెలుగు చూసిన అద్భుతంగా భావించారు. రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణేలు 44 వేల పౌండ్ల రాగి కడ్డీలు దాదాపుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. బోమ్ జీసస్ అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశ్చిమ తీరంలో గుర్తించిన అత్యంత పురాతనమైన , అత్యంత విలువైన ఓడ. బోమ్ జీసస్ (ది గుడ్ జీసస్) ఓడ పోర్చుగల్లోని లిస్బన్ నుండి 1533న మార్చి 7 శుక్రవారం బయలుదేరిన పోర్చుగీస్ నౌక. కానీ 2008లో నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినపుడు మాత్రమే ఈ ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది. నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ పనుల్లో నామ్దేబ్ డైమండ్ కార్పొరేషన్లోని కార్మికులు దీన్ని గుర్తించారు. బంగారం, రాగితో వంటి విలువైన సంపదతో ఇండియాకు వెళుతుండగా భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఉంటుందని భావించారు.నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చినపుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా. దీని వలన ఓడ ముందు భాగం రాయితో ఢీకొని బోల్తా కొట్టింది. అయితే తీరప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో, బోమ్ జీసస్ అవశేషాలు బయల్పడ్డాయి. అయితే చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వీటిల్లో గుర్తించకపోవడంతో ఓడలోని సిబ్బంది శిధిలాల నుండి బయటపడటమో లేక మరణించడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్కి చెందిన చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నోలీ దీనిపై మరింత పరిశోధన చేశారు. బంగారు, వెండి, రాగి కడ్డీల నిధిని గుర్తించారు. దీనిపై బ్రూనో వెర్జ్ అనే సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తను సంప్రదించారు డా. నోలీ. ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు. -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భారీగా పడిపోతున్న బంగారం ధర
-
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్
ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డిసెంబర్లో వార్షికంగా 8.14 శాతం తగ్గి రూ. 18,281.49 కోట్లకు ( 2,195.23 మిలియన్ డాలర్లు) చేరుకున్నాయని జెమ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) పేర్కొంది. గత ఏడాది ఇదే నెల్లో ఈ ఎగుమతుల విలువ రూ.19,901.55 కోట్లని (2,413.46 మిలియన్ డాలర్లు) వివరించింది. కీలక ఎగుమతి మార్కెట్లలో మందగమన పరిస్థితులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, భారత్, అమెరికాసహా 60 దేశాల్లో ఎన్నికల వంటి అంశాలు ఈ విభాగం ఎగుమతుల రంగంపై ప్రభావం చూపుతున్నట్లు మండలి చైర్మన్ విపుల్ షా చెప్పారు. ఇక కట్ అండ్ డైమండ్ మొత్తం ఎగుమతులు డిసెంబరులో 31.42 శాతం తగ్గి రూ. 7,182.53 కోట్లకు (862.48 మిలియన్ డాలర్లు) చేరాయి. గత సంవత్సరం ఇదే నెల్లో ఈ విలువ రూ. 10,472.93 కోట్లు ( 1,270.36 మిలియన్ డాలర్లు). అయితే డిసెంబర్లో బంగారు ఆభరణాల ఎగుమతులు 47.32 శాతం పెరిగి రూ.7,508.05 కోట్లకు ( 901.52 మిలియన్ డాలర్లు) చేరాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ రూ. 5,096.25 కోట్లు ( 618.27 మిలియన్ డాలర్లు). -
‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో మెరిసిన జీఆర్టీ కస్టమర్లు
బెంగళూరు: అతిపెద్ద గోల్డ్ షాపింగ్ పండుగ ‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు మెరిశారు. పండుగ సీజన్లో ‘జ్యుయెలర్స్ ఆసోసియేషన్ బెంగళూర్’ నిర్వహించిన బంపర్ ప్రైజ్, లక్కీ డ్రా పోటీల్లో 177 మంది జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు 20 గ్రాముల బంగారం నాణేల నుంచి 1 కేజీ వెండి వరకూ బహుమతులు గెలుపొందినట్లు కంపెనీ తెలిపింది. విజేతలందకీ జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ ఎండీలు జీఆర్ ఆనంద్ అనంతపద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఒకటిన్నర కేజీల బంగారు కంకణంతో తిరుమలలో కనిపించిన భక్తుడు.. ఫోటోలు వైరల్
-
నాలుగు రోజుల తరువాత మళ్ళీ తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు
జనవరి 3 నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు 12వ తేదీ నుంచి పెరుగుదల వైపు అడుగులు వేసాయి. అయితే ఈ రోజు మళ్ళీ తులం గోల్డ్ మీద రూ. 100 నుంచి రూ. 110 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు తగ్గాయి. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 63330గా ఉన్నాయి. చెన్నై ఈ రోజు పసిడి ధరలు వరుసగా రూ. 200 నుంచి 220 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63820కు చేరింది. ఢిల్లీలో ఈ రోజు ధరలు రూ. 100 నుంచి రూ. 110 తగ్గి తులం బంగారం ధరలు వరుసగా రూ. 58200 (22 క్యారెట్స్), రూ. 63480 (24 క్యారెట్స్)కు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద రూ. 300 తగ్గింది. -
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు రేట్లు పెరుగుదల వైపు పయనించాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో పాటు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి కంటే కూడా ఈ రోజు ధరలు రూ.100, రూ.120 పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 పెరిగింది.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 తగ్గి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేట్లు ఢిల్లీలో రూ. 57850 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63100 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. చెన్నైలో కూడా నేడు బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ మీద రూ. 100, 24 క్యారెట్ ధర మాత్రం రూ. 110 పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన తులం పసిడి ధరలు రూ. 58200, రూ. 63490కు చేరింది. ఇదీ చదవండి: గుజరాత్ సమ్మిట్లో కనిపించని 'ఎలోన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి? వెండి ధరలు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో కూడా వెండి ధరలు ఈ రోజు పెరలేదు. -
గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు ఇన్వెస్టర్ల నుంచి చక్కని ఆదరణ లభించింది. 2023లో ఇన్వెస్టర్లు రూ.2,920 కోట్లను ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేశారు. 2022లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గతేడాది ఆరు రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, అనిశి్చతుల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022లో గోల్డ్ ఈటీఎఫ్లలోకి రూ.459 కోట్లు రాగా, 2023లో రూ.2,920 కోట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతేడాది ఆగస్ట్ నెలలోనే రూ.1,028 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. 16 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ‘‘భౌతిక బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ వందల సంవత్సరాల నుంచి ఉంది. దాంతో గోల్డ్ ఈటీఎఫ్లు మాదిరి పెట్టుబడి సాధనాలకు ఆమోదం తక్కువగా ఉండేది. కానీ, గడిచిన కొన్నేళ్లలో బంగారం డిజిటైజేషన్ పట్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్ చేయడం, సౌకర్యంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు గోల్డ్ ఈటీఎఫ్ను ఆమోదించడానికి కారణం. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో బంగారం తప్పకుండా ఉండాలి’’అని జెరోదా ఫండ్ హౌస్ సీఈవో విషాల్ జైన్ పేర్కొన్నారు. నిర్వహణ ఆస్తులు పైపైకి బంగారం ఈటీఎఫ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది 27 శాతం పెరిగి రూ.27,336 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.21,445 కోట్లుగానే ఉండడం గమనించాలి. గత కొన్నేళ్లలో బంగారం అద్భుతమైన పనితీరు చూపించడాన్ని కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణగా నిలిచింది. గతేడాది గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.73 లక్షలు అధికంగా ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఫోలియోలు 49.11 లక్షలకు చేరాయి. 2023 మాత్రమే కాకుండా, 2020, 2021లోనూ బంగారం ఈటీఎఫ్లు మంచి రాబడులను ఇచ్చాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.4,814 కోట్లు, 2020లో రూ.6,657 కోట్ల చొప్పున పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో బంగారం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. చక్కని వైవిధ్యాన్ని ఇవ్వడంతోపాటు, ఆర్థిక పతనాలు, కఠిన మార్కెట్ పరిస్థితుల్లో నష్టాలను తగ్గిస్తుంది. అందుకే దీనికి సురక్షిత సాధనంగా గుర్తింపు ఉంది’’అని మారి్నంగ్స్టార్ ఇండియా రిసెర్చ్ విభాగం చీఫ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు, ఆకర్షణీయమైన అవకాశాల నేపథ్యంలో ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు స్టాక్స్ను వెతుక్కుంటూ వెళ్లాయి. అయినా కానీ, బంగారం ఈటీఎఫ్లు చెప్పుకోతగ్గ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానంగా స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవుతుంటుంది. షేర్ల మాదిరే సులభంగా కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు. -
కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..
2024 జనవరి 3 నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పటి వరకు కూడా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5760.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6283గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57600, రూ. 62830గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గి తులం రేటు రూ.58100 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63380 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. ఢిల్లీలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గినప్పటికీ.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 పెరిగి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 57750 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63980 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. వెండి ధరలు వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న వెండి రేటు రూ. 500 వరకు తగ్గి కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. -
బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు!
గత వారం రోజుల నుంచి ఎలాంటి పెరుగుదల లేకుండా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 100 తగ్గినట్లు స్పష్టమవుతోంది. చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ.100, రూ.110 తగ్గి తులం రేటు రూ.58200 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63490 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63100గా ఉంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ.. వెండి ధరలు బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి తగ్గుతుంటే.. వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రూ. 200 తగ్గినా వెండి ఈ రోజు మళ్ళీ రూ.200 పెరిగింది. -
ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
గత ఏడాది చివరలో భారీగా పెరిగి.. న్యూ ఇయర్ ప్రారంభంలో కూడా కొంత భయపెట్టిన బంగారం ధరలు.. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది. ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ రోజు బంగారం ధరలు రూ.57,800 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63050 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాముల మీద వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో నేటి గోల్డ్ ధరలు రూ. 58,300 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,600 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63200గా ఉంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ.. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు కేజీ మీద రూ. 200 తగ్గింది. దీంతో ఒక కేజీ గోల్డ్ రేటు రూ. 76400కి చేరింది. న్యూ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి వెండి ధర ఇప్పటివరకు ఏకంగా రూ. 2500 తగ్గిందని తెలుస్తోంది. -
నీరు.. బేజారు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు. దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఒకప్పటి నుంచి బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్పా.. భారీగా తగ్గుముఖం పట్టిన రోజులు చాలా తక్కువ. అయినా కొనే వారు కొంటూనే ఉన్నారు, ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో ప్రపంచములో బంగారం ఎవరి దగ్గర ఎక్కువగా ఉంది? ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటనే వివరాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం అనేది ఈ రోజు వాడుకలో వచ్చింది కాదు, శతాబ్దాల ముందు నుంచి ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా వరకు బంగారం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్నట్లు సమాచారం. నిజానికి భారతీయులు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారాన్ని భారీగా ఉపయోగిస్తారు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం దాదాపు 25000 టన్నుల కంటే ఎక్కువని సమాచారం. ఇదీ చదవండి: ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే? ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం బంగారం భారతీయుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలకంటే ఎక్కువ. భారత్ తరువాత అత్యధిక బంగారం ఉన్న దేశీయులలో సౌదీ అరేబియా, అమెరికా, కెనడా మొదలైనవి ఉన్నాయి. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
2023లో పరుగులు తీసిన బంగారం ధరలు కొత్త ఏడాది సైతం అదే జోరును కొనసాగిస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65 వేలు ఉండగా.. 2024లో రూ.70వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. దీంతో పాటు 10 గ్రాముల వెండి రూ.65 వేలు ఉండగా వచ్చే ఏడాది నాటికి అది కాస్త రూ.70 వేలకు చేరుకోవచ్చని అంచనా ఇక ఈ ఏడాది చివరి రోజున నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే. 10 రోజుల తర్వాత దిగివచ్చని బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,470గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,870గా కొనసాగుతోంది. ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్లో కిలో వెండిపై రూ. 300 పెరిగి.. రూ. 78,600లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,000గా ఉంది. -
అమీర్పేట మెట్రో స్టేషన్లో గోల్డ్ ఏటీఎం
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు గోల్డ్ ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్ధం ‘గోల్ట్ సిక్కా’ కంపెనీ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో శుక్రవారం మొదటి గోల్డ్ ఏటీఎం కంపెనీ సీఈఓ తరుజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వెర్షన్తో ఏటీఎం నుండి కొనుగోలుదారు వీలును బట్టి గోల్డ్ లేదా సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. డెబిట్, క్రెడిట్, యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకునే వీలుందని చెప్పారు. త్వరలో మన దేశంతో పాటు విదేశాల్లో 2 వేల నుంచి 3 వేల ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రష్యా, అమెరికా వంటి దేశాల నుండి ఆర్డర్లు వస్తున్నాయని వివరించారు. వైజాగ్లోని బ్యూటీ వరల్డ్ ఏ సంస్థతో మొదటి ఏటీఎంకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, సినీ నటుడు అనంత్, సంస్థ ప్రతినిధులు అంబికా బర్మన్, ఫణి ప్రతాప్, యుగ టెక్నాలజీ ప్రతినిధి డా.ప్రవీణ్ పాల్గొన్నారు. – అమీర్పేట -
ఏటీఎంలో బంగారం..!
నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్డ్రా చేసుకునేందుకు వీలుగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్పేట మెట్రోస్టేషన్లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. దీని ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఏటీఎంలో మాదిరిగానే నిర్దేశించిన ఆప్షన్లను పాటిస్తూ లావాదేవీ పూర్తి చేసిన వెంటనే కాయిన్లు బయటికి వస్తాయి. ఈ ఏటీఎం ద్వారా బంగారం, వెండి కాయిన్లు కొనుగోలు చేయొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఏ కాయిన్ కావాలో స్క్రీన్పై ఎంచుకుని అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: గుజరాత్ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్లో మాత్రం.. ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక్కో మిషన్లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. -
బంగారం కొంటారా.. బ్యాంకుల్లో దాచుకుంటారా?
న్యూఢిల్లీ: భారతీయులు తమ ఆదాయాలను పరిరక్షించుకోడానికి ఏ మార్గాలను అన్వేషిస్తున్నారన్న అంశంపై మనీ9 నిర్వహించిన 2023 వార్షిక వ్యక్తిగత ఫైనాన్స్ పల్స్ సర్వే ఆసక్తికర అంశాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది బ్యాంక్ డిపాజిట్లు ఇందుకు తగిన మార్గమని పేర్కొంటే, 21 శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించారు. బీమా రంగంపై కూడా సానుకూల ధోరణి నెలకొంది. గతేడాది కన్నా 27 శాతం మంది అధికంగా జీవిత బీమా పాలసీలవైపు మొగ్గుచూపారు. 2022 సర్వేలో ఇది 19 శాతమే కావడం గమనార్హం. దాదాపు 20 రాష్ట్రాల్లో 35,000కుపైగా కుటుంబాల నుంచి ఈ సర్వే జరిగింది. రిసెర్చ్ ట్రయాంగిల్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఐ) ఇంటర్నేషనల్ సహకారంతో జరిగిన ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిఉండకపోవడం ఆందోళన కలిగించే అంశం. స్టాక్ మార్కెట్ కూడా క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. 2022లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కేవలం 3 శాతం ఉంటే, 2023లో ఇది 9 శాతానికి ఎగసింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కూడా ఇదే సమయంలో 6 శాతం నుంచి 10 శాతానికి ఎగశాయి. దక్షిణ భారత నగరాలైన బెంగళూరు (69 శాతం), తిరువనంతపురం (66 శాతం) బంగారం పొదుపులో అగ్రగామిగా ఉండడం గమనార్హం. బీమా వ్యాప్తిలో మదురై (84 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అమరావతి (79 శాతం), ఔరంగాబాద్ (76 శాతం) ఉన్నాయి. విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తున్న భారతీయ కుటుంబాల శాతం 2022లో 3 శాతం ఉండగా, 2023లో 5 శాతానికి పెరిగింది. లగ్జరీ ప్రధానంగా మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఈ ధోరణి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొద్ది కాలంగా కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభంతో పెరిగిపోతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..అంతర్జాతీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 26) స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,055 డాలర్ల పైన కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధర రూ. 63,490గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,150గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా.. వెండి ధర మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం పెరిగింది. మంగళవారం దేశీయ మార్కెట్లో కిలో వెండిపై రూ. 200 పెరిగి.. రూ. 79,200లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,200గా ఉంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,750గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700 వద్ద కొనసాగుతోంది.