-
రొనాల్డోకే సవాల్ ఈ సూపర్ గోల్: ఆనంద్ మహీంద్ర హర్షం
సాక్షి, ముంబై: ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్రా లేటెస్ట్గా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ట్విటర్లో చాలా యాక్టివ్గా వుండే ఆయన ట్వీట్ల ఖాతాలోకి మరో అర్థవంతమైన వీడియో చోటు సంపాదించుకుంది. కార్లోంచి ఖాళీ వాటర్ బాటిల్ బైటికి విసిరేసిన కారు డ్రైవర్ అక్కడ ఉన్న ఒకమ్మాయి ఇచ్చిన చెంప దెబ్బలాంటి రిటార్ట్కు సంబంధించిన వీడియో ఇది కారులోంచి విసరిన బాటిల్ ని అంతే వేగంతో కాలితో తన్నింది. దీంతో అది నేరుగా కారు విండోలోంచి డైరెక్ట్గాలోకి దూసుకుపోయింది. ఈ ఉదంతంపై మురిసిపోయిన ఆయన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పగా గోల్ చేసిందంటూ ప్రశంసలు కురిపించారు. చూస్తే ఇలాంటి ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచుల్ని చూడాలనుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ‘‘ఆ కారు డ్రైవర్ ఆ అమ్మాయి మీద కోర్టుకెక్కరని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆనంద్ మహీంద్ర పేర్కొనట్టు ఫుట్బాల్ లెజెండ్ రోనాల్డ్కే సవాల్ విసురుతున్న జపాన్ గాల్ ఈ సూపర్ గోల్ను మీరూ ఒకసారి చూసేయండి... అలాగే నాలుగు అడుగుల లోతు వర్షపు నీటిలో కూడా మీ వాహనం టీయూవి 300లో సేఫ్గా డ్రైవ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసిన సౌమిత్ర జోషికి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. జాగ్రత్తగా వెళ్లండి.. మీ అదృష్టాన్ని మరీ ఎక్కువ సేపు పరీక్షించుకోకండి .. ఆ వాహనం ఉభయచరం కాదంటూ చిన్న హెచ్చరిక కూడా చేశారు. Now she ‘bent’ that ball into the ‘goal’ even better than Ronaldo.. This is the kind of World Cup I want to watch... (and let’s hope the driver doesn’t file a suit against her!😊) #whatsappwonderbox pic.twitter.com/aJxNqf2PRe — anand mahindra (@anandmahindra) June 26, 2018 -
అమ్మాయిలంటే ఇలా ఉండాలి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్వాల్. క్లాస్లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్లో సీటు సాధించింది! వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్వీస్కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఆంచల్కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె. పెద్దింటమ్మాయి కాదు! ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్స్టాండ్లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్. ఇది ఆరో ప్రయత్నం రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్లో. నీముచ్లోని మెట్రో హెచ్ఎస్ స్కూల్లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్కు ఎంపికైంది. బాస్కెట్బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది. – మంజీర ఆ వరదలే కారణం! నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను. – ఆంచల్, ఐఎఎఫ్ -
సూపర్ ‘స్విస్’
మొదట్లోనే ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్నా... తర్వాత పట్టు జారకుండా చూసుకుంటూ... అవకాశాలు సృష్టించుకున్న స్విట్జర్లాండ్... సెర్బియాను బోల్తా కొట్టిస్తూ విజయాన్ని ఒడిసిపట్టింది! గ్రానిట్ జాకా, జెర్డాన్ షకీరి రెండు అద్భుత గోల్స్తో తమ జట్టును గట్టెక్కించగా... చివరి నిమిషంలో మ్యాచ్ను చేజార్చుకుని సెర్బియా నిస్సహాయంగా మిగిలింది! కలినిన్గ్రాడ్: మొదటి మ్యాచ్లో బ్రెజిల్ను నిలువరించిన స్విట్జర్లాండ్... కీలకమైన రెండో మ్యాచ్లో సెర్బియాను ఓడించి నాకౌట్కు మార్గం సిద్ధం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో సెర్బియాను కంగుతినిపించింది. స్విట్జర్లాండ్ తరఫున జాకా (53వ నిమిషం), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షకీరి (90వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు. అద్భుతం అనదగిన రీతిలో చాలా దూరం నుంచే బంతిని గోల్ పోస్ట్లోకి పంపిన వీరు... తమ జట్టు ఆశలు నిలిపారు. అంతకు ముందు సెర్బియా తరఫున మిట్రోవిక్ (5వ నిమిషం) గోల్ కొట్టాడు. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న స్విస్ జట్టు... ఈ నెల 27న కోస్టారికాతో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇదే రోజున బ్రెజిల్తో జరగనున్న పోరులో గెలిస్తేనే సెర్బియా తదుపరి దశకు వెళ్తుంది. మొదట్లోనే సెర్బియా షాక్... స్విస్కు మ్యాచ్ ఆరంభంలోనే సెర్బియా షాకిచ్చింది. డాసన్ టాడిక్ నుంచి అందిన క్రాస్ను చక్కగా సమన్వయం చేసుకున్న అలెగ్జాండర్ మిట్రోవిక్ 5వ నిమిషంలో తలతో బంతిని గోల్పోస్ట్లోకి పంపి ఖాతా తెరిచాడు. దీంతో మొదటి భాగంలో 1–0తో సెర్బియాదే పైచేయి అయింది. రెండో భాగంలో స్విస్ జోరు... మొదటి భాగంలో కోల్పోయిన ఆధిక్యాన్ని స్విట్జర్లాండ్ రెండో భాగం ప్రారంభంలోనే సమం చేసింది. ఈ ఘనత షకీరి, జాకా ఇద్దరికీ చెందుతుంది. 53వ నిమిషంలో షకీరి కొట్టిన బలమైన షాట్కు బంతి సెర్బియా ఆటగాడికి తగిలి వెనక్కు వెళ్లింది. దీనిని దొరకబుచ్చుకున్న జాకా అంతే వేగంగా స్పందించాడు. ‘డి’ బాక్స్ ముందు ఉన్న అతడు... ఐదుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ నేరుగా గోల్ కొట్టాడు. మరోవైపు సెర్బియా పోటీగా ఆడటంతో మ్యాచ్ ‘డ్రా’వైపు సాగేలా కనిపించింది. అయితే... 90వ నిమిషంలో షకీరి అద్భుతం చేశాడు. దాదాపు మైదానం మధ్యలో బంతిని అందుకున్న అతడు ప్రత్యర్థి ఆటగాడికి చిక్కకుండా వేగంగా పరిగెడుతూ గోల్పోస్ట్ ముందు కీపర్ను ఏమారుస్తూ స్కోరు చేశాడు. ఈ ఆనందంలో అతడు చొక్కా విప్పి ఎల్లో కార్డుకు గురయ్యాడు. ఇంజ్యూరీ సమయం పెద్దగా మెరుపులేమీ లేకుండానే సాగిపోవడంతో స్విస్ జట్టునే విజయం వరించింది. ఈ ప్రపంచకప్లో తొలిగా గోల్ ఇచ్చి... మ్యాచ్లో గెలిచిన జట్టుగా స్విట్జర్లాండ్ నిలిచింది. గోల్ సంబరాలపై అభ్యంతరం మ్యాచ్లో గోల్స్ అనంతరం జాకా, షకీరి చేసిన ‘డబుల్ ఈగల్’ సంకేతాలు చర్చకు తావిచ్చాయి. వీరిద్దరితో పాటు మరో ఆటగాడు బెల్రామి సెర్బియాలోని ఒకప్పటి రాష్ట్రమైన కొసావో మూలాలున్న వారు. స్వయంప్రతిపత్తి అంశమై సెర్బియాతో కొసావో గతంలో పెద్ద ఎత్తున ఘర్షణ పడింది. ఇదే అంశమై పోరాడినందుకు 1980ల్లో షకీరి తండ్రిని సెర్బియా జైల్లో పెట్టింది. ప్రపంచ కప్లో అదే దేశానికి ప్రత్యర్థిగా ఆడే సందర్భం రావడంతో నాటి శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న షకీరి... కొసావో గుర్తు ఉన్న బూట్లతో మ్యాచ్ ఆడేందుకు ఫిఫా అనుమతి కోరాడు. అయితే, దీనికి అంగీకారం రాలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్లో అతడిని సెర్బియా అభి మానులు పలుసార్లు ఎగతాళి చేశారు. అయితే, గోల్ చేసిన అనంతరం జాకా, షకీరి వీటికి సమాధానంగా... సెర్బియా పతాకంలో ఉండే రెండు గద్దల గుర్తును ఎద్దేవా చేస్తున్నట్లు సంకేతాలు చేశారు. షకీరి ఏకంగా చొక్కానే విప్పేశాడు. వీటిపై స్విస్ కోచ్ పెట్కోవిక్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ఫుట్బాల్–రాజకీయాలు వేర్వేరని, రెండింటినీ ముడి పెట్టవద్దని వ్యాఖ్యానించి వాతావరణాన్ని శాంతింపజేశాడు. అటువైపు షకీరి కూడా ఇందులో వేరే ఉద్దేశం లేదన్నాడు. -
అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!
అబ్దుల్ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే. గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు. ‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది. ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం. ‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు. గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి. ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇందుకోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమే సాక్షాత్కరంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 35 మంది యువత పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, ఐదవ వార్డు అధ్యక్షుడు ఇప్పిలి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పార్టీలో ఆదివారం చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు పిళ్లా విజయ్కుమార్ వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, హక్కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద వారి స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారన్నారు. పార్టీలో చేరిన వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయటం ద్వారా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జె.రమణమూర్తి, జె.గురువులు, బి.గంగరాజు, జి.జైరామ్, ఎం.ధనరాజ్ తదితరులు ఉండగా... కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్వివి.రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, మార్రోజు శ్రీనివాసరావు, రెడ్డి గురుమూర్తి, పూసర్ల చిన్ని, 5వ వార్డు నాయకులు డి.పద్మావతి, ఇప్పిలి త్రినా«ధ్, జె.కామేష్, బి.భాస్కరరావు, సింహాద్రి, ప్రసాదరావు, ఆడారి శ్రీను, పి.కృష్ణ, చందక పైడిరాజు, ఇప్పలి శ్రీను, పిట్ట శ్రీను కన్ని కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ సెంచరీ నా లక్ష్యం కాదు: కోహ్లి
బెంగళూరు: బ్యాటింగ్తో పాటు ఫిట్నెస్లో కొత్త ప్రమాణాలు సృష్టించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు. ‘నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు’ అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... ‘బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని. ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం’ అని పేర్కొన్నాడు. తొలి సారి భారత జట్టులో చోటు దక్కిన రోజులను గుర్తు చేసుకుంటూ... ‘టీమిండియాకు ఎంపికైన సమయంలో అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా. ఫ్లాష్ న్యూస్లో నా పేరు చూసి తప్పుడు ప్రచారమేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత బోర్డు నుంచి ఫోన్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’ అని అన్నాడు. -
కలలకు కాళ్లొచ్చాయి!
తూనీగలా పరిగెట్టే చురుకైన విరాళికి అకస్మాత్తుగా జ్వరం. 23 రోజులు కోమాలోకి తీసుకెళ్లిన ఆ జ్వరం... 24 గంటలూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యేలా చేసింది. వైకల్యం కాళ్లకే గానీ... మనసుకూ, మనిషికీ కాదని గ్రహించాక ఇక వెనుదిరిగి చూడలేదు. మోడలింగ్ చేయాలన్నది ఆమె కల. మనసుకు రెక్కలు మొలిచి... పట్టుదలను చేతుల చేతలకు ఆవాహన చేసుకుంటే... కలలకు కాళ్లొచ్చి లక్ష్యం దాకా తీసుకెళ్తాయని తెలిసింది విరాళికి. అదెలా...? ‘మిస్ ఇండియా వీల్చైర్ పాజెంట్’కు ఎంపిక కావడం ద్వారా!! ‘‘నీకు నువ్వు ముఖ్యం. ముందు నీ మీద నువ్వు దృష్టిపెట్టడం మొదలుపెట్టు. సమాజాన్ని మెప్పించాలని ప్రయత్నించకు. అందులోపడి నీ సంతోషాన్ని దూరంచేసుకోకు. శారీరక వైకల్యం నిజంగా వైకల్యమే కాదు. కరుణ, దయ, ప్రేమ లేకపోవడమే అసౖలైన వైకల్యం! కలల మజిలీ చేరడానికి, లక్ష్యసాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదు. ఆత్మస్థయిర్యం ఎంతదూరాన్నైనా నడిపిస్తుంది. ఎన్ని అడ్డంకులనైనా ఎదిరిస్తుంది. ఎన్ని సమస్యలనైనా జయిస్తుంది. నీ హక్కును పొందే వరకు పోరాడుతూనే ఉండు!’’ తన రైటప్ పూర్తి చేసి మళ్లీ ఒక్కసారి చదువుకుంది. సంతృప్తి, ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆ ముఖంలో! తను పంపించాల్సిన వెబ్సైట్కు పోస్ట్ చేసింది. పర్సనల్ కంప్యూటర్ను టర్నాఫ్ చేసి వీల్చైర్ని వెనక్కి తిప్పింది తన గదిలోకి వెళ్లడానికి ఆమె. పేరు విరాళి మోది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటోంది. కాని అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెరిగింది. నేపథ్యం: విరాళి వాళ్ల కుటుంబం ప్రతి యేడాది అమెరికా నుంచి ముంబై (స్వస్థలం) వచ్చేది సెలవులు గడపడానికి. అలా తనకు పధ్నాలుగేళ్ల వయసు (2006)లో కూడా ఒకసారి వచ్చింది. అది వర్షాకాలం. సెలవులు గడిపింది. మళ్లీ అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. అక్కడికెళ్లాక ఆమెలో అనారోగ్యం బయటపడింది. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పితో జ్వరం మొదలైంది విరాళికి. పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు.‘‘ఏం పర్వాలేదు.. సీజనల్ చేంజ్ వల్ల ఇలా అయింది. నాలుగు, ఆరు గంటలకు ఒకసారి ఈ మాత్రలు వాడండి. అంతా నార్మల్ అయిపోతుంది. భయపడొద్దు’’ అని చెప్పి పంపేశాడు డాక్టర్. ఇంటికెళ్లాక విరాళి పరిస్థితి ఇంకా దిగజారింది. అప్పుడే ఒళ్లంతా కొలిమిలా కాలిపోయేది. ఇంకో రెండుగంటలకు మంచులా చల్లబడేది. విరాళి తల్లిదండ్రులకు భయమేసింది. డాక్టర్ దగ్గరకు మళ్లీ పరిగెత్తారు. పాప కండిషన్ సీరియస్గా ఉంది. ఆసుపత్రిలో హడావిడి మొదలైంది. అమ్మాయి స్పృహ తప్పింది. పల్స్ పడిపోతోంది. గుండె ఆగింది. మూడు ఎలక్ట్రక్ షాక్స్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. కాని శ్వాస తీసుకోలేకపోతోంది. హార్ట్ మానిటర్స్ను అమర్చారు. బ్లడ్ప్రెషన్ మెషీన్ పెడుతూనే ఐసీయూలోకి మార్చారు. స్పృహ లేదు. అలా 24 గంటలు గడిచాయి. అయినా ఈ లోకంలోకి రాలేదు విరాళి. కోమా అన్నారు డాక్టర్లు. 23 రోజులు కోమాలోనే ఉంది. 24వ రోజు విరాళి బర్త్డే. కళ్లు తెరవకపోయినా కూతురికి పుట్టినరోజు జరపాలనుకుంది. భర్తతో చెప్పింది. సరే అన్నాడు. డాక్టర్ల అనుమతీ తీసుకుంది. అమెరికాలోని తన దగ్గరి స్నేహితులను, బంధువులను పిలిచింది. ఆ రోజు..: విరాళికి ఇష్టమైన వంటలను వండింది. కేక్ తెచ్చారు. ఆసుపత్రిలో విరాళి గదిని డెకరేట్ చేశారు. నర్సుల సహాయంతో విరాళికి స్పాంజింగ్ చేసి కొత్త బట్టలు వేసింది. కరెక్ట్గా పధ్నాలుగేళ్ల కిందట ఆమె పుట్టిన సమయానికి విరాళితో కేక్ కట్ చేయించారు. విరాళిలో చిన్న కదలిక. ఆ తల్లి దృష్టిలో పడ్డా... 23 రోజుల్నించి ఇలాంటి భ్రమలు ఆమెను చాలా ఆశపెట్టాయి. అందుకే పట్టించుకోలేదు. కాని పడుకున్న ఆ శరీరంలో మళ్లీ చిన్న కదలిక. ఈసారి ఆ తల్లి మనసు ఆత్రంగా కళ్లు చేసుకొని చేసుకొని చూసింది. హ్యాపీ బర్త్డే టూ యూ విరాళీ అని పాడుతున్న స్నేహితులు, బంధువులను ‘హుష్... ’ అంటూ నోటి మీద వేలేసి చూపిస్తూ ఆపింది. అందరూ ఒక్కసారిగా ఆపేసి ఆమెనే చూశారు. ఆమె విరాళిని చూసింది. విరాళి తల తిప్పింది కుడి నుంచి ఎడమవైపు. ‘బేటా... ’ ఆనందోద్వేగంతో కేక విరాళి తల్లిది. అందరి దృష్టి అటువైపే. బిడ్డ కదిలింది. వెంటనే కళ్లూ తెరిచింది. కనుబొమలు ముడి వేసింది. ‘‘నేనురా.. అమ్మను.. ’’ ఆమెను తోసేస్తూ.. ‘‘బేటా.. మై పాపా’’వాళ్ల నాన్నా.. ఆయనను తోసేస్తూ ‘‘వీరూ బేటా.. మై చాచా’’ ఇలా అందరూ ఒకర్ని కాదని ఇంకొకరు. విరాళిని ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విరాళీకి అలసటగా ఉంది. మళ్లీ కళ్లు మూసుకుంది. అందరిలో కంగారూ. డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు. చకచకా టెస్ట్లు మళ్లీ. తల్లిదండ్రుల్లో ఆందోళన ఏం చెప్తారో డాక్టర్లు అని. ‘‘అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది. కానీ... ’ అని ఆగారు. ‘‘కానీ ఏంటీ’’ భయంగా పేరెంట్స్. మెడ నుంచి కింద వరకు పారలైజ్ అయిపోయింది. కదల్లేదు. దాదాపు జీవితాంతం వీల్ చెయిరే’’ చెప్పారు డాక్టర్లు. కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలియని విరాళి తన బర్త్డేకు వచ్చిన వాళ్లందరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తోంది. కలల నడక ఆగలేదు: విరాళికి మోడల్ కావాలని, సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచీ కల. దానికోసం స్కూలింగ్ అయిపోగానే ట్రైనింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. తల్లిదండ్రులూ ఆమె కోరికను కాదనలేదు. కాని ఇప్పుడు తను అసలు నడవలేదని తెలిస్తే బిడ్డ తట్టుకుంటుందా? అయినా చెప్పక తప్పలేదు. చెప్పారు.తను నడవలేదు. జీవితమంతా వీల్చైర్ ఆసరానే అనే నిజాన్ని విరాళీకీ చెప్పారు. షాక్ అయింది. ఆ షాక్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. డిప్రెషన్తో కుంగిపోయింది. మళ్లీ దానికి ట్రీట్మెంట్ / మాత్రలు... హాస్పిటల్.. విసుగొచ్చింది విరాళికి. ఇది కాదు తన జీవితం! ఇలా బతకాలని అనుకోలేదు! మారాలి! ఇంకొకరి సానుభూతితో ఎన్నాళ్లు బతుకీడుస్తుంది? కాళ్ళు లేకపోతే ఏం? మనసుకు రెక్కలున్నాయి. మెదడుకు శక్తి ఉంది! ఎక్కడికైనా వెళ్లగలుగుతుందీ... ఏమైనా చేయగలుగుతుంది. ఆ ధైర్యం తను ఉన్న స్థితిని అంగీకరించేలా చేశాయి. తర్వాత ట్రీట్మెంట్కు శరీరాన్ని సిద్ధం సింది. కొంత కొంతగా మార్పు వచ్చింది. కాని చక్రాల కుర్చీ వీడేంతగా కాదు. మోడలింగ్.. నటన.. తన లక్ష్యం! తిరిగి ముంబైకి వచ్చేసింది. మోడలింగ్ అవకాశాలకోసం ఫోటో షూట్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇండియాలో వికలాంగులకోసం సరైన ప్రయాణ వసతి లేదని ప్రాక్టికల్గా అనుభవించి, అర్థం చేసుకుంది. వాళ్ల హక్కులకోసం పోరాడ్డం ప్రారంభించింది. ఆ పోరాట ఫలితం కేరళలోని ఎర్నాకులంలో వికలాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ స్టార్టవడం. ఇంకోవైపు తన కలల సాధన పట్టాలెక్కింది. 2014లో ‘మిస్ ఇండియా వీల్చైర్ పాజెంట్’గా కూడా ఎన్నికైంది. అందుకే అంటుంది.. వైకల్యం శరీరానికి ఉండదు అని! -విరాళి -
మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం.. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌతంరెడ్డి, బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నైతిక విలువలు కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే జగన్మోహన్రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయించకుండానే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్సీపీ పక్షమేనన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ఖాదర్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. పార్టీ తల్లిలాంటిదని, గెలిపించిన పార్టీని వదలి మరో పార్టీలోకి చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. పత్తికొండ నేత, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల్లో నుంచే నాయకుడు పుడతాడన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, సంయుక్త కార్యదర్శి బి.జహీర్అహ్మద్ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.మద్దయ్య, జిల్లా నాయకురాలు విజయకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శ్రేణుల నాయకులు టి.వి.రమణ, కటారి సురేశ్కుమార్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, మహమ్మద్ తౌఫిక్, రాఘవేంద్రరెడ్డి, హరినాథ్రెడ్డి, ఆదిమోహన్రెడ్డి, సాంబశివారెడ్డి, మల్లికార్జున, జాన్, లతీఫ్, బోదేపాడు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. ఛేదించలేకపోయారు...
ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేసి జనాభానియంత్రణకు తన వంతు ప్రయత్నంలో భాగంగా జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల్లో అవగాహన కల్గించివారే ఆపరేషన్లు చేయించుకునేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు కృషిచేయాల్సి ఉన్నప్పటికీ తమకు కేటాయించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. తమకు ఉన్న గడువులో లక్ష్యాన్ని సాధించడం అధికారులకు కష్టమే... ► సంక్షేమ శస్త్రచికిత్సల టార్గెట్ సాధించడంలో విఫలం ► 15 వేలకు కేవలం 8969మాత్రమే పూర్తిచేసిన అధికారులు విజయనగరంఫోర్ట్: కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స లక్ష్యం సాధించడానికి నిర్ధేశిత గడువు కేవలం 10 రోజులే ఉంది. అయితే సాధించాల్సిన లక్ష్యం మాత్రం వేలల్లో ఉంది. 11 నెలల్లో సాధించలేనిది కేవలం 10 రోజుల్లో సాధిస్తారనేది సందేహంగా నిలిచింది. 2016–17 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమ లక్ష్యం 15వేలు ఇచ్చింది. అయితే ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 8969 చికిత్సలు చేశారు. ఇంకా 6031 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా కేవలం 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో లక్ష్యాన్ని సాధించడం అంత సులవు కాదు. జనాభా నియంత్రణకు అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాల్లో కుటుంబ సంక్షేమ చికిత్సల లక్ష్యాన్ని సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. కాని అది అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో జిల్లా వెనుకపడడమే ఇందుకు నిదర్శనం. జిల్లా జనాభా ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనాభాను నియంత్రించడం చాలా అవసరం. కానీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. జనాభాను అరికట్టకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా స్థల సమస్య, నిరుద్యోగసమస్య, ఆహార సమస్య ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారమే కు.ని. చికిత్స. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సల లక్ష్యాన్ని సాధించడానికి కృషిచేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తి చేస్తాం. ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్ఓ, విజయనగరం -
పట్టుదలతోనే లక్ష్యసాధన సాధ్యం
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కల్లూరు: పట్టుదలతోనే లక్ష్య సాధన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ కాలేజ్లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా అవార్డ్స్డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, క్విజ్ తదితర అంశాల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు. కళాశాల కోశాధికారి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఉత్తమ మార్గాలను అన్వేషించి అవసరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. గాయకులు సాయిశిల్ప, సుమంత్ ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ రెడ్డి, ఈడీలు రమేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ టీఎస్ఎస్ బాలాజీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గిరీష్ రెడ్డి, వివిధ శాఖాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కోల్కతా 1, నార్త్ ఈస్ట్ 1
కోల్కతా: నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసిన అట్లెటికో డి కోల్కతా డ్రాతో గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ ఐదో నిమిషంలోనే నార్త్ఈస్ట్ కు వెలెజ్ గోల్ అందించాడు. ఆ తర్వాత దాదాపు మ్యాచ్ చివరి వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈ జట్టుకు ఇయాన్ హ్యుమే షాకిచ్చాడు. ఇంజ్యూరీ (90+) టైమ్లో అత్యంత సమీపం నుంచి బంతిని గోల్పోస్టులోకి పంపి సొంత గడ్డపై అభిమానులను మురిపించాడు. -
మత్స్య సంపదను పెంచడమే లక్ష్యం
నకిరేకల్ : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పశు, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామ శివారులోని మూసీ జలాశయంలో 18.50 లక్షలకు 6లక్షల చేప పిల్లలను గురువారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి వదిలిపెట్టారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చండీయాగం ప్రతిఫలంగా ఈ ఏడాది తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలాశయాలు నిండాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 45 నుంచి 50 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్య సంపదపై ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజ్లు, బెస్త వృత్తుల కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీమాంద్ర ప్రభుత్వాల హయాంలో మత్స్యశాఖకు రూ.1కోటి బడ్జెట్ ఉండగా నేడు తెలంగాణలో రూ.100కోట్లకు పెంచామన్నారు. సొసైటీ సభ్యులతో సభ్యత్వం లేని వారు కూడా ఆ జాతి కోసం జరిగే ఈ మేలులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ వర్గానికి చెందిన వారందరికి సభ్యత్వం ఇస్తామన్నారు. పెరిగిన చేపలపై సభ్యులందరికి హక్కు ఉంటుందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న చిన్న చేప మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గంగ పుత్రుల కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గంగ పుత్రుల కోసం జీపులు, ద్విచక్రవాహనాలు కూడా 75శాతం సబ్సిడీపై అందిస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సార థ్యంతో 15 కమ్యూనిటీ హాల్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. మూసీ రిజార్వాయర్లో కూడా కేజి కల్చర్ 10 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మత్స్యకారులలో ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మత్స్య సంపద దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగు నింపేందుకే ఈ చేప పిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రావు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, పశు సంవర్థక శాఖ జేడీ నర్సింహ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఓయూ జేఏసీ ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ ఆర్డీ ఓ వెంకటాచారి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి సుజాతయాదయ్య, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి, మూసీ మత్స్యకార సంఘం చైర్మన్ అల్వాల వెంకటస్వామి, డైరెక్టర్ సాదుల నర్సయ్య, వల్లభాపురం సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులు, వీర్లపాటి రమేష్, మంగినపల్లి రాజు, ఎల్లపురెడ్డి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం /పాల్వంచ : కొత్తగూడెం జిల్లా సమ గ్రాభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. తొలుత కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాద యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పాల్వం చలోని నవ భారత్ చేరుకుంది. అక్కడి నుంచి ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నవభారత్, పాత పాల్వంచ, దమ్మపేట సెంటర్, అంబేడ్కర్, బస్టాండ్ సెంట ర్, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో నాయకులు, మహిâýæలు బతుకమ్మలతో ఎదురెళ్లి స్వాగ తం పలికారు. దమ్మపేట సెంటర్లో సభలో జల గం మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు, విమానాశ్రయం, టూరిజం హోటâýæ్ల ఏర్పాటుకు, పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాగా.. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. రాత్రి పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, కాల్వ భాస్కర్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, మురళి, దాసరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
‘ఒక్కటే’ లక్ష్యం
కివీస్తో సిరీస్ కీలకం రోహిత్ శర్మ వ్యాఖ్య ముంబై: ప్రస్తుత సీజన్లో భారత జట్టు సరైన దిశలో సాగుతోందని స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘మా లక్ష్యం నంబర్వన్. ఇటీవల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రోజుల వ్యవధిలోనే చేజార్చుకున్నాం. మళ్లీ ఈ సీజన్లో సాధిస్తాం’ అని రోహిత్ చెప్పాడు. ముంబై స్పోర్ట్స జర్నలిస్టుల సంఘం స్వర్ణోత్సవ వేడుక అవార్డుల కార్యక్రమానికి రోహిత్తో పాటు అజింక్యా రహానే, మాజీ బౌలర్ జహీర్ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘వెస్టిండీస్తో చివరి టెస్టు వర్షం వల్ల జరగకపోవడం వల్లే టెస్టు ర్యాంకింగ్సలో నంబర్వన్ స్థానాన్ని కోల్పోయాం. ఏకంగా 13 టెస్టులు జరగనున్న ఈ సీజన్లో రాణించి టాప్ ర్యాంకుకు చేరుకుంటాం. ముందుగా న్యూజిలాండ్ సిరీస్నుంచే మా జైత్రయాత్ర ప్రారంభిస్తాం’ అని అన్నాడు. రహానే మాట్లాడుతూ కివీస్తో త్వరలో జరిగే సిరీస్ కీలకమైందని. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. తదుపరి జరిగే టెస్టులన్నీ స్వదేశంలోనే ఉండటంతో ఈ సీజన్ మొత్తం ముఖ్యమైందని అన్నాడు. జహీర్ మాట్లాడుతూ ‘ఇలాంటి పెద్ద సీజన్తో క్రికెటర్ల టెస్టు కెరీర్ గ్రాఫ్ అమాంతం మారుతుంది. గెలిచినా... ఓడినా... ఫలితమేదైనా కానివ్వండి... ఆటగాళ్ల కెరీర్కు ఇది మేలే చేస్తుంది’ అని అన్నాడు. ఆశావహ దృక్పథంలో సీజన్ను మొదలు పెట్టాలని అతను సూచించాడు. -
పట్టణాభివృద్ధే ధ్యేయం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలెబోయిన రాధిక, ఆకుల లవకుశ, డీఈ వెంకటేశ్వర్రావు, సూర్గి శంకర్, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యసాధకులు సింగరేణీయులు
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం విడిభాగాల తయారీకి చిన్నతరహా పరిశ్రమల స్థాపన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుదాం స్వాతంత్య్ర వేడుకల్లో సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం(ఖమ్మం) : యాజమాన్యం నిర్దేశించే ఎంతటి లక్ష్యాన్నైనా సింగరేణీయులు సమష్టి కృషితో సాధిస్తారు.. ఈ విషయాన్ని గతంలోనే రుజువు చేశారని సింగరేణి సీఎండీ నడిమట్ల శ్రీధర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి ప్రకాశం స్టేడియంలో సింగరేణి నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడా రు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వా తంత్య్ర లభించిందని, వారి ఆశయాలు సిద్ధించేలా భారతావనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ భారతీయుడికీ అం దాలని ఆకాంక్షించారు. దేశ, రాష్ట్ర అవసరాల కోసమే ఈఏడాది సింగరేణి 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్ప త్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, దీనిని సాధించాలంటే రోజుకు కనీసం 2లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల న్నారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్కాస్టులలో ఉత్ప త్తి వెనుకబడిందని, రానున్న కాలంలో సమష్టి కృషితో లోటును పూడ్చాలని కోరారు. రాష్ట్ర ఇంధన అవసరాల కు కావలసిన బొగ్గును అందిస్తూనే విద్యుత్ అవసరాల ను తీర్చడానికి కంపెనీ జైపూర్లో నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఈనెల 7న ప్రధా న మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేసినట్లు గుర్తుచేశారు. సౌకర్యాల మెరుగుకు మరిన్ని నిధులు సంక్షేమ కార్యక్రమాల్లో సైతం యాజమాన్యం ఎల్లప్పు డూ ముందుంటుందని, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు 75 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని కేవలం 24 రోజుల్లో నే పూర్తి చేశామని సీఎండీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు 60,369 మందితో సామూహిక యోగా నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించామని తెలిపారు. మీ కోసం–మీ ఆరోగ్యం కోసంలో భాగంగా ఇంటింటికీ యోగా, సింగరేణి ఆణిముత్యాలులో భాగంగా 1200 మంది నిరుద్యో యువతీ యువకులకు పోలీస్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాలనీలు, గనుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి నిధులు ఇప్పటి కే మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని మంజూ రు చేస్తామన్నారు. సమీప గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, సీఎస్ఆర్ కింద రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అన్ని ఏరియాల్లో చిన్నతరహా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, మరో 242 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపా రు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కంపెనీకి అవసరమైన విడిభాగాల తయారీకి స్థానిక యువకులతో చిన్నతర హా పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తున్నామని, అన్ని ఏరియాల్లో ఆసక్తిగల యువకులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సింగరేణిలో ఉత్తమ కార్మికులు, ఉద్యోగులుగా ఎంపికైన వారిని సీఎండీ ఎన్.శ్రీధర్, ఆయన సతీమణి, డైరెక్టర్ల చేతులమీదుగా సత్కరించారు. డైరెక్టర్లు ఎ.మనోహర్బాబు, బి.రమేష్కుమార్, జె.పవిత్రన్కుమార్, రమేష్బాబు, జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్ జి.మురళీసాగర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సమ సమాజ నిర్మాణమే లక్ష్యం’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమన్నారు. మార్క్సిజం, తాత్విక నేపథ్యం ద్వారా పేదలవైపు నిలబడి సాహిత్యాన్ని సృష్టించేదే అభ్యుదయ సాహిత్యమన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు దళితులు 90 శాతం అభ్యుదయ సాహిత్యం వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిలుకూరి దేవపుత్ర, మల్లెల నరసింహమూర్తి, రాజారెడ్డి, నాగేంద్రగౌడ్ పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
గుంటూరు వెస్ట్: స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగమయ్యేలా చూడడంతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా పాటుపడాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ పి.పాండురంగారావు కోరారు. ఆర్థిక అక్షరాస్యత, ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్పై గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జిల్లా రీసోర్సుపర్సన్లు (డీఆర్పీ), కమ్యూనిటీ ఆర్గనైజర్లకు (సీవో) మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న మెప్మా సిబ్బంది అర్హులైన గ్రూపులకు రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర మిషన్ కోఆర్డినేటర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల గ్రూపులు ఉండగా అందులో 18 లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని అన్నారు. శిక్షణకు హాజరైన జిల్లా రోసోర్సు పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఇక్కడ బోధించే అంశాలపై పట్టుసాధించి, జిల్లాలకు వెళ్లిన తర్వాత గ్రూపుల వారీ సమావేశాలు నిర్వహించి వ్యాపార ప్రణాళికలపై అవగాహన పెంచాలని కోరారు. ఎపీట్కో టీమ్ లీడర్ డి.శ్రీనివాసరఘు, మిషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ రాజ్కుమార్, వివిధ జిల్లాల నుంచి సుమారు 45 మంది డీఆర్పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
గూగుల్ లక్ష్యం @ 100 కోట్లు..
-
గూగుల్ లక్ష్యం @ 100 కోట్లు..
ముంబై: భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరిం చారు. రైల్టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఆనందన్ ఉదహరించారు. -
కేన్సర్ నివారణే ప్రధానం
దేవరకొండ : కేన్సర్ వ్యాధి నివారణే ప్రధానమని, వ్యాధి లక్షణాలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద కేన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కేన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని మొదట దశలోనే గుర్తిస్తే మేలు జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్సకు కావాల్సిన సహాయాన్ని తన వంతుగా అందిస్తానని అన్నారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్రెడ్డి, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్యాదవ్, పాశం రాంరెడ్డి, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, తాళ్లపల్లి రఘు, రాంబాబు, సుజాత, శ్రీకాంత్రెడ్డి, విజయ్కాంత్, కౌన్సిలర్లు ఆసిఫ్, వడ్త్య దేవేందర్, నాయకులు బండారు బాలనర్సింహ, చింతపల్లి సుభాష్, పొన్నెబోయిన సైదులు, చిత్రం ఏసోబు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు. -
లక్ష్యాన్ని చేరుకోవాలి
రాంనగర్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున జిల్లాలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభివృద్ధే ధ్యేయం: పిడమర్తి
కలకోవ(మునగాల): తెలంగాణలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కారర్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని కలకోవలో దళితులకు మూడు ఎకరాల భూమి సేకరణలో భాగంగా ఆయన గ్రామాన్ని సందర్శించి దళితులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిర్రా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పిడమర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి దళితునికి మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పది వేల ఎకరాల భూమిని మూడువేల రెండు వందల మంది దళితులుకు పంపీణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.361కోట్లు వెచ్చించిదన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు అవసరమైన భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ఒక్కో ఎకరాకు రూ.ఏడు లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చైతన్యవంతులను చేసి భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తం మవుతున్నారన్నారు. తొలుత కలకోవకు చేరుకున్న పిడమర్తి రవికి టీఆర్ఎస్ గ్రామశాఖ, మండల శాఖ ఆ«ధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గ్రామశివారులో గల అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ నియోజక వర్గ ఇన్చార్జ్ కె.శశిధర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గరిణె కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కోదాటి అరుణ, ముస్కుల సైదిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, విద్యార్థి జేఏసీ నాయకులు కందుల మధు, స్థానిక నాయకులు కాసాని మల్లయ్య, అమరగాని వీరభద్రం పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవిని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రొనాల్డో గర్జించాడు
యూరో ఫైనల్లో పోర్చుగల్ 2-0తో వేల్స్పై విజయం రొనాల్డో గర్జించాడు. అవును.. క్లబ్కు మాత్రమే బాగా ఆడతాడనే అపవాదును తునాతునకలు చేస్తూ ఇదిగో ఇదీ నా సత్తా అంటూ విమర్శకులకు తన కిక్ పవర్ ఏమిటో చూపాడు. ఇప్పటిదాకా ఆడిందేమిటని ఆడిపోసుకున్న వారే వహ్వా.. రొనాల్డో అని మనస్ఫూర్తిగా అనేలా సింహగర్జన చేశాడు. వేల్స్తో జరిగిన సెమీఫైనల్లో అతడి విశ్వరూపం చూసి మ్యాచ్ ఆద్యంతం ఈ స్టార్ నామస్మరణతో స్టేడియం మోతెక్కింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతా తననెందుకు కీర్తిస్తారో చాటుకుంటూ... కీలక సమయంలో గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే రెండో గోల్ అందేలా కృషి చేసి జట్టును ఫైనల్కు చేర్చాడు. అటు గ్యారెత్ బేల్ ఎంత ప్రయత్నం చేసినా తన జట్టు వేల్స్ అద్భుత ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. లియోన్: సూపర్స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈసారి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరైన సమయంలో జూలు విదిల్చి స్థాయికి తగ్గ ఆటతీరుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. యూరో కప్లో భాగంగా బుధవారం వేల్స్తో జరిగిన సెమీఫైనల్లో 2-0తో నెగ్గిన పోర్చుగల్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నిర్ణీత సమయంలో పోర్చుగల్కు దక్కిన తొలి విజయమిదే. ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం పోర్చుగల్ టైటిల్ కోసం పోరాడుతుంది. జట్టు తరఫున రొనాల్డో (50వ నిమిషంలో), నాని (53వ ని.) గోల్స్ చేశారు. యూరో కప్లో పోర్చుగల్ ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2004లో ఫైనల్కు చేరి గ్రీస్ చేతిలో ఓడింది. మరోవైపు మ్యాచ్లో పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా వేల్స్ ఫలితం సాధించలేకపోయింది. స్టార్ ఫుట్బాలర్ గ్యారెత్ బేల్ తన ప్రయత్నాలను గోల్స్గా మలచలేకపోవడంతో వేల్స్ సూపర్ జర్నీ సెమీస్లో ముగిసింది. మిడ్ఫీల్డర్ ఆరోన్ రామ్సే నిషేధం కారణంగా మ్యాచ్కు దూరమవడం కూడా ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 16వ నిమిషంలోనే పోర్చుగల్ తొలి గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. వేల్స్ పెనాల్టీ ఏరియాలో కుడివైపు నుంచి మరియో ఆడిన షాట్ గోల్పోస్ట్కు కాస్త దూరం నుంచి వెళ్లింది. మరోవైపు బేల్ 23వ ని.లో సెంటర్లైన్ కుడివైపు నుంచి గోల్ పోస్ట్లోకి బంతిని షూట్ చేసినా అది నేరుగా గోల్కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 44వ ని.లో ఎడ్రియన్ సిల్వా ఎడమ వైపు నుంచి వేల్స్ గోల్ పోస్ట్ ముందుకు క్రాస్ షాట్ ఆడగా.. రొనాల్డో బంతిని హెడర్ చేశాడు. అయితే బంతి గోల్పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లడంతో గోల్రాలేదు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో పోర్చుగల్ బోణీ చేయగలిగింది. రఫెల్ గురేరో అందించిన కార్నర్ షాట్ను పెనాల్టీ ఏరియాలో మెరుపులా పైకి ఎగిరిన రొనాల్డో హెడర్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే సాంచెస్ ఇచ్చిన పాస్ను రొనాల్డో గోల్ పోస్ట్వైపు ఆడగా.. అక్కడే ఉన్న నాని డైవ్ చేస్తూ ఎడమ కాలితో బంతిని నెట్లోకి పంపాడు. దీంతో పోర్చుగల్కు 2-0 ఆధిక్యం లభించింది. తర్వాత 63వ ని.లో రొనాల్డో ఫ్రీకిక్ గోల్పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లింది. చివర్లో వేల్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పోర్చుగల్ కీపర్ పాట్రికియో వమ్ము చేయడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. యూరో కప్ల్లో అత్యధిక గోల్స్ (9) చేసిన ఆటగాడు రొనాల్డో. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం మైకేల్ ప్లాటిని సరసన నిలిచాడు. -
జర్మనీ, పోలాండ్ ముందుకు...
గ్రూప్ ‘సి’ నుంచి మాజీ చాంపియన్ జర్మనీ, పోలాండ్ జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో జర్మనీ 1-0తో నార్తర్న్ ఐర్లాండ్పై గెలుపొందగా... పోలాండ్ 1-0తో ఉక్రెయిన్ను ఓడించింది. జర్మనీ, పోలాండ్ ఏడేసి పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందాయి. మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా జర్మనీ గ్రూప్ టాపర్గా నిలువగా... పోలాండ్కు రెండో స్థానం దక్కింది. నార్తర్న్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆట 30వ నిమిషంలో మారియో గోమెజ్ జర్మనీకి ఏకైక గోల్ అందించాడు. ఉక్రెయిన్తో జరిగిన పోటీలో 54వ నిమిషంలో బ్లాస్జికౌస్కీ చేసిన గోల్తో పోలాండ్ విజయం ఖాయమైంది. యూరో టోర్నీ చరిత్రలో పోలాండ్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే తొలిసారి.