gadikota srikanth reddy
-
కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.» పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడమంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.» పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలుచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. » ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. » ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. » ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వ, స్పిల్వే భాగాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్లే అవుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
టీడీపీపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
చేతనైతే మంచి చేయండి
రాయచోటి/రాయచోటి రూరల్: అధికారాన్ని దక్కించుకున్న వారు చేతనైతే అభివృద్ధితో ప్రజల మనసులను చూరగొనాలే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఏమిటని అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలోకి వచి్చన వారు అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సచివాలయాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడి బోర్డులు ధ్వంసం చేయటాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీకి చెందిన అల్లరి మూకలు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్పై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామ సచివాలయాల్లో సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు అనునిత్యం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకవైపే ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. దాడులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.హోదా ఇస్తేనే మద్దతివ్వాలి కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సువర్ణావకాశమని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు దీన్ని సది్వనియోగం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మద్దతు ఇస్తామని గట్టిగా చెబితే కచి్చతంగా సాధించే వీలుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు నలుగురు లోక్సభ ఎంపీలు అండగా నిలబడతారని చెప్పారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని వివరించారు. -
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన దరిద్రుడు
-
చరిత్రలో ఎన్నడూలేని విధంగా 10 లక్షల మంది తరలి వస్తున్నారు
-
‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
జగనన్న సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
-
‘రాష్ట్ర నిధులు దోచేసి నిప్పు అని చెప్పుకుంటే సరిపోతుందా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు నాయుడు.. తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి. ఈరోజు(గురువారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి.. క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధుల్ని దోచేసి నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన స్కాములు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ‘అసెంబ్లీలో స్కిల్ స్కామ్పై సుదీర్ఘ చర్చ జరిగింది. మరి ఆ సమావేశాల్ని నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్లను సంబంధిత అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అంటూ మాట్లాడటం సరికాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించింది. చంద్రబాబు తప్పు చేయకపోతే కోట్లు పెట్టి లాయర్లను ఎందుకు పెట్టుకుంటాడు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు’ అని తెలిపారు. గడికోట శ్రీకాంత్రెడ్డి ఏమన్నారంటే.. ►చంద్రబాబు అవినీతి ప్రపంచమంతా తెలిసిపోయింది ►దీనిపై అసెంబ్లీలో చర్చకు రాకుఙడా టీడీపీ నేతలు పారిపోయారు ►తమ బండారం బయట పడుతుందని తెలిసి టీడీపీ వారు వెళ్లిపోయారు ►పైగా స్పీకర్ పై దాడి చేయటం, విజిల్స్ వేయటం, తిడ కొట్టటం వంటి అరాచకాలు చేశారు ►వారి అరాచకం అంతా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవటానికే ►టీడీపీ వారు అడిగిందే మొదట టేకప్ చేయమని ముఖ్యమంత్రి చెప్తారు ►అందుకే బిఎసీలో కూడా పాల్గొనకుండా పరారయ్యారు ►రెండో రోజు కూడా బాలకృష్ణతో సహా టీడీపీ వారంతా అడ్డగోలుగా వ్యవహరించారు ►ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పరు ►వారు ఇచ్చిన వాయిదా తీర్మానం మీదనే చర్చిద్దామన్నా కూడా రాలేదు ►విజిల్స్ వేసిన ముగ్గురినే సస్పెండ్ చేస్తే మిగతావారు కూడా ఎందుకు సభ నుండి పారిపోయారో ప్రజలకు చెప్పాలి ►స్పీకర్ మీద పేపర్లు వేశారు, టేబుల్ మీద అద్దం పగులకొట్టారు ►బయటకు వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంటూ హడావుడి చేశారు ►అదే చర్చ సభలో పెడితే మేము సమాధానం చెప్పేవాళ్లం ►చంద్రబాబు అరెస్టు అయ్యాక ఎల్లోమీడియా పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లింది ►దీన్ని ఎల్లో ఇజం అనాలో ఏమనాలో కూడా అర్థం కావటం లేదు ►నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే మరి సభలో ఎందుకు చర్చించలేదు? ►మా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయని తెలిసి మూడో రోజు నుండి ఇక సభకు రాలేదు ►దేవాలయంలాంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ►సీఐడీ కూడా కోర్టు ముందు ఇవే అంశాలను చెప్పింది కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించింది ►చంద్రబాబు చేసిన తప్పులన్నీ సీఐడీ బయట పెట్టింది ►షెల్ కంపెనీలకు డబ్బు ఎలా మళ్లించారో వాస్తవాలు ప్రజలకు తెలిశాయి ►చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ►కోట్లకొద్దీ డబ్బు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చినా కోర్టు వాస్తవాలనే గ్రహించి రిమాండ్ వేసింది ►18 బిల్లులపై చర్చించాం ►ప్రజలజు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చిస్తుంటే ఎందుకు పారిపోయారు? ►కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నా ఎల్లోమీడియాకు కనపడలేదు ►మహిళా స్వాబలంబన గురించి సుదీర్ఘ చర్చ జరిగినా టీడీపీ వారు పట్టించుకోలేదు ►పదవుల నుండి పథకాల వరకు అన్నిటిలోనూ మహిళలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం ►దీనిపై చర్చించటానికి రమ్మంటే టీడీపీ వారు రాలేదు ►కోర్టులపైనే దూషణలు చేస్తున్నారు ►జైల్లో నుండే చంద్రబాబు అరాచకాలకు ఆదేశాలు ఇస్తున్నారు ►జగన్ గురించి టీడీపీ సభ్యులు చులకనగా మాట్లాడారు ►అలాంటి సమయంలో మావాళ్లు ఎంతో సంయమనం పాటించాం ►కానీ చంద్రబాబు మాత్రం తన భార్యను ఎవరో ఏదో అన్నారని మీడియా ముందు ఏడ్చారు ►అప్పుడే మేము వివరణ కూడా ఇచ్చాం ►కానీ భువనేశ్వరి మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని రాజకీయ లబ్ది కోసం మాట్లాడారు ►ఇది తప్పు అని భువనేశ్వరి గుర్తించాలి ►ఫైబర్ నెట్, రింగ్ రోడ్లో ఎలాంటి స్కాంలు జరిగాయో అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది ►చంద్రబాబు మేనేజ్ పాలిటిక్స్ మానుకోవాలి చదవండి: నారా లోకేష్ యువగళం వాయిదా!.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్! -
రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చం: శ్రీకాంత్ రెడ్డి
-
కేవలం రెచ్చగొట్టి గొడవలు సృష్టించడమే చంద్రబాబు పని
-
ఆ దమ్ము లేని పవన్కు రాజకీయాలు ఎందుకు?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ట్రైనింగ్లో బలిపశువు కాబోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తనకు పోటీ లేకుండా ఉండేందుకు పవన్ను బాబు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీతో చంద్రబాబు పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి సంగతి ఢిల్లీలోని పెద్దలకు కూడా బాగా తెలిసొచ్చిందని, అందుకే దూరం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగుచేస్తున్నారు. హుందాతనానికి ఆయన ఇచ్చే విలువలు అందరికీ ఆదర్శం. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు హుందాగా ఎప్పుడూ వ్యవహరించలేదు. వెన్నుపోటు, వ్యవస్థల మేనేజ్మెంట్కే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఓటమి చెందినా దాన్ని అంగీకరించలేడు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చనుకుంటున్నారు. పవన్ ఉన్మాదిలాగ మాట్లాడుతున్నారు ప్రజలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా.. చంద్రబాబును విమర్శించే వారినే ప్రశ్నిస్తానంటూ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప సొంతంగా పవన్ ఏమీ చేయటం లేదు. ఆయనకు మహిళలంటే ద్వేషం. మహిళా సీఐ అనే గౌరవం లేకుండా ఆ పార్టీ నేతలు విమర్శిస్తే వారిని పవన్ వెనుకేసుకు వచ్చారు. వ్యక్తిగతంగా దూషించటం వలనే ఆ సీఐ అలా వ్యవహరించారు. పవన్కు చిత్తశుద్ధి ఉంటే మహిళా సీఐకి క్షమాపణలు చెప్పాలి. ఆమెని దూషించిన జనసేన నాయకుడిని హెచ్చరించాలి. చదవండి: టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా? ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ చెప్పే ధైర్యం లేని పవన్కు రాజకీయాలు ఎందుకు?. రాయలసీమలో ఒక ప్రాజెక్టునైనా చంద్రబాబు కట్టలేదు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట.. అన్నీ దివంగత వైఎస్ఆర్, సీఎం జగనే చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గూండాలు అంటూ మమ్మల్ని విమర్శిస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. రాయలసీమలో అభివృద్ధి చేయని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. రాజకీయాల్లో హుందాతనాన్ని దిగజార్చవద్దు. ఊగిపోవటం, తిట్టటం, సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేయటం రాజకీయాలు కాదు. మేనిఫెస్టో అమలు చేశామా లేదా అనేది చూడాలి. 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల ముంగిట పెడదామా?. 30 లక్షలకుపైగా ఇళ్లు కట్టిస్తుంటే అడ్డుకుంటున్న నీచులు చంద్రబాబు బ్యాచ్. రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదని అడ్డుకుంటున్నదీ వారే. ఏ అంశం మీదనైనా చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు 14 ఏళ్ల పాలన , వైఎస్ జగన్ 4 ఏళ్ల పాలనపై చర్చకు రాగలరా?. కనీసం శ్వేతపత్రమైనా విడుదల చేయగలరా?. టీడీపీ, జనసేనలు తోడుదొంగల పార్టీలు. వేదికల మీద చెప్పులు చూపించటం రాజకీయమా? చంద్రబాబు శృతి మించి మాట్లాడుతున్నారు. కాలమే వారికి తగిన బుద్ది చెప్తుంది. హిందూ మతం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు. పవన్, చంద్రబాబు ఏ సభలకు వెళ్లినా వారి గురించి మాట్లాడుతూ పక్కవారిని కించపరచటం అలవాటు. కులం, మతతత్వాలను రెచ్చగొట్టటం అలవాటు. బాబు హయాంలో పడగొట్టిన గుళ్లను వైఎస్ జగన్ కట్టిస్తున్నారు. పురంధేశ్వరి చేసే విమర్శలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. మాది సెక్యులర్ పార్టీ. యూసీసీ గురించి మేము త్వరలోనే ప్రకటిస్తాం’అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు కొత్త ట్విస్ట్.. పార్టీ నేతనే ఓడిస్తానని సవాల్! -
‘సీమ’కు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పండి
కడప కార్పొరేషన్ : రాయలసీమకు చేసిన ద్రోహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాలని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలతో మమేకం కాకుండా 19 గంటలు టెంట్లో ఉంటూ, ఐదు గంటలు మాత్రమే బయట తిరుగుతున్నారని, అందులో ఒక గంల సెల్ఫీలకే సరిపోతోందని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. మొత్తం మీద అది పాదయాత్రలా కాకుండా ఒంటిపూట యాత్రలా ఉందన్నారు. కడప పర్యటనలో లోకేశ్ ‘రాయలసీమ డిక్లరేషన్’ అని మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గత 27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇన్నేళ్లలో రాయలసీమకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పకుండా, మళ్లీ అధికారవిుస్తే చేస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. రాయలసీమ ప్రజలను రౌడీలు, గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకుండా కాలయాపన.. తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ఎన్టీఆర్ చేపడితే వైఎస్సార్ పూర్తిచేశారని శ్రీకాంత్ తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వాటిని తాగునీటి ప్రాజెక్టులుగా మార్చి, శంకుస్థాపనలతోనే కాలయాపన చేశారన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాకే వాటిని సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి పూర్తిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి వాటాలు దక్కేవన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ పెంచుతుంటే కృష్ణా బ్యారేజీపై ధర్నా చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా వారితో లేఖ రాయించారన్నారు. మరోవైపు.. రాయలసీమలో హైకోర్టు పెడతామంటే అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడం దారుణమన్నారు. ఇన్ని విధాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న తండ్రీకొడుకులు ఏ ముఖం పెట్టుకుని ‘రాయలసీమ డిక్లరేషన్’ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు మూడుసార్లు అవకాశవిుస్తే కుప్పానికి నీళ్లివ్వలేని మీరు రాయలసీమకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పంకు రెవెన్యూ డివిజన్ తెచ్చారని, మున్సిపాలిటీగా మార్చారని శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తూ, కాంట్రాక్టు కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తున్నారన్నారు. కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో నాలుగేళ్లలో వెయ్యి కోట్ల కేంద్ర నిధుల్ని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. బాబు బాధ్యతారాహిత్యం.. సామాన్యుడికి ఎలా మేలు చేయాలో ఆలోచించకుండా కర్ణాటకలో ఇచ్చిన హామీలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో చేర్చారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. అన్నిదేశాలు, రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషిచేస్తుంటే చంద్రబాబు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఎంతమందినైనా కనండి అంటూ రివర్స్లో చెబుతున్నారని మండిపడ్డారు. -
‘ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాలో ప్రచారం కోసం ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘‘పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి పేరిట యాత్ర చేయించారు. హైకోర్టు ఆధార్ కార్డులు అడిగితే యాత్ర ఎత్తేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరగాలని ప్రభుత్వం పరితపిస్తోంది. సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక దూషణలకు దిగుతున్నారు. ఆదినారాయణరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని శ్రీకాంత్రెడ్డి అన్నారు. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నా
రాయచోటి: ప్రజా సేవే ధ్యేయంగా తాను పనిచేస్తానని, ప్రజల వద్ద తలదించుకునే పనిని ఎప్పుడూ చేయనని, ఆరోజు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాయచోటిలో మంగళవారం తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ భూముల విలువ బాగా పెరిగి, భూ దందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అంతకు ముందే తాను ప్రభుత్వ భూములు కాపాడాలని అధికారులకు సూచించానన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరిగింది తప్పేనని, ఈ స్థలం కబ్జాకు గురైందన్న విషయం పత్రికల ద్వారానే తనకు తెలిసిందని అన్నారు. రిజిస్ట్రేషన్లను ఎక్కడైనా చేసుకోవచ్చన్న చట్టం వల్ల రాయచోటికి సంబంధించిన 938 రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాల్లో జరిగాయని చెప్పారు. వీటిలో 275 రిజెక్ట్ అయ్యాయన్నారు. ఇలా వేరే ప్రాంతాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిని చేయించుకున్న వారికే ఎరుక అన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎస్సీల భూ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేపైన కూడా తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని అన్నారు. ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరానన్నారు. -
రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
-
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పా?
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పెలా అవుతుందని శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ విధానంపై కొన్ని నెలలుగా ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజధానిని ఎప్పుడు ప్రకటించారు, వీరంతా భూములు ఎప్పుడెప్పుడు కొన్నారనే విషయాలను సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో తాము బయటపెట్టామని ఆయన గుర్తుచేశారు. బౌన్సర్లను పెట్టుకుని యాత్రలో అసభ్యకరంగా నృత్యాలు చేయడం విచారకరమన్నారు. పద్నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయంటే అది వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్ ఘనతేనన్నారు. కర్నూలులో హైకోర్టును ద్వేషించడం దారుణం ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటుంటే చంద్రబాబు ద్వేషించడం దారుణమని.. దానిని అడ్డుకుంటే ఉపేక్షిం చేదిలేదని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని తీర్మానించిన బీజేపీ నాయకులు ఇప్పుడు నోరెందుకు మెదపడంలేదని నిలదీశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయం, సోమశిల ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాల భూములు, ఊర్లను కోల్పోయిన రైతులే త్యాగధనులని, ఆకుపచ్చ కండువా వేసుకున్నంత మాత్రాన రైతులు అయిపోరని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణవల్ల ఏ ఆఫీసు ఎక్కడికి తరలిపోకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలాంటి వారు 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్ను ప్రశంసించకుండా, అమరావతి రైతుల కోసం పోరాటం చేయడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ ఎన్నిసార్లు తన వైఖరి మార్చుకున్నారో లెక్కేలేదన్నారు. త్వరలో రాయలసీమ జేఏసీ ఏర్పాటు రాయలసీమలోని ప్రజా ప్రతినిధులు, మేధావులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి రాయలసీమ జేఏసీ ఏర్పాటుచేయనున్నట్లు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు, టీజీ వెంకటేష్ లాంటివారు రాయలసీమ ద్రోహులన్నారు. రాజీనామాలు తమకు కొత్త కాదని, తమ నాయకుడు ఆదేశిస్తే రాయలసీమ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. -
ఆర్బీకేలు ఆధునిక దేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఆధునిక దేవాలయాలుగా మారాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బుధవారం ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను వ్యవసాయాన్ని పండుగ చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. డ్యాములు కళకళలాడుతున్నాయి. కరువు లేదు. చంద్రబాబు హయాంలో కరువు తప్ప ఇంకోటి లేదు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సీఎం జగన్ రైతుకు భరోసా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టేందుకు అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి మార్కెట్కంటే ఎక్కువ రేటుకే కల్లాల వద్దే ధాన్యం కొంటోంది. కోళ్ల పరిశ్రమ, ఆక్వా, సెరీకల్చర్ ఇలా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటోంది. వ్యవసాయం అంటే బాబుకు నిర్లక్ష్యం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నాడు వైఎస్సార్ వ్యవసాయానికి ఊపిరి పోస్తే.. ఆయన తనయుడిగా సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టారు. ఎంతో మంది పల్లెలను వదిలి వలస వెళ్లిపోయారు. వారిని వైఎస్సార్ వెనక్కి తీసుకొచ్చి వ్యవసాయం చేయించారు. ఆయన ఆశయ సాధనకు సీఎం జగన్ రైతులపై రూపాయి భారం పడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారు. 30 ఏళ్ల పాటు ఆటంకం లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగును పెంచాలి. ప్రకృతి వ్యవసాయంపైనా దృష్టి సారించాం. బాబు ఐదేళ్లలో ఒక్క గింజ కూడా కొనలేదు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రైతును మోసం చేసే వాడు భూమిపై బతికి బట్టకట్టలేడు. ఆనాడు చంద్రబాబు రైతులను బషీర్బాగ్లో కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అందువల్లే ఆయనకు ఈ దుర్గతి పట్టింది. సీఎం జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మా దగ్గర ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు. ఇప్పుడు మా ప్రాంతంలో రైసు మిల్లులు లేకపోయినా ధాన్యం కొని, రాయదుర్గం నుంచి చిత్తూరుకు ప్రభుత్వమే తరలిస్తోంది. మా దగ్గర ఆదర్శ భారత కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. వాటికి వడ్డీ రాయితీ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్ సొసైటీలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. రైతుల సంక్షేమం ఆగదు మాజీ ఉప సభాపతి కోన రఘుపతి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఆగలేదు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఒక చరిత్ర. ఒక్క రూపాయికే పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు ఇవ్వడం వంటివి రైతుల గురించి ఆలోచించే వారే చేస్తారు. కోవిడ్ సమయంలోనూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు రూ.88 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారు. మా సీఎం జగన్ రైతు భరోసాతో వ్యవసాయానికి ఊపిరి పోశారు. ఆర్బీకేల ద్వారా 98 శాతం పంట నమోదు, విక్రయం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు వచ్చి మన ఆర్బీకేల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆర్బీకేలను బ్యాంకులతో అనుసంధానం చేసి రైతులకు ఆర్థిక సపోర్టును మరింత పెంచాలి. ఉచిత విద్యుత్ రైతులకు వరం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైఎస్సార్ హయాంలోనే రైతుల స్వర్ణ యుగం ప్రారంభమైంది. వైఎస్సార్ తర్వాత రైతులను పట్టించుకున్న నాయకుడు సీఎం జగన్. రైతుల కోసం ఈ మూడేళ్లలో చరిత్రలో లేనన్ని పథకాలు తెచ్చారు. ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఆధునిక దేవాలయాలుగా మారాయి. పశువులకు అంబులెన్సులు వచ్చాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏరా>్పటు చేసి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. గతంలో కంటే ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. -
వైఎస్సార్ గొప్పతనం భావితరాలకూ తెలియాలి
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు సంబంధించిన బిల్లును మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పేంటి? ఎన్టీఆర్ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. (2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు) చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాటలు చంద్రబాబువి కాదా? ‘ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా.. అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు’ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడారు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో ఇది కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్ మీదున్న గౌరవం. (ఆ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు) సీఎం వైఎస్ జగన్కు ఎన్టీఆర్ మీద అపార గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని చెప్పారు. ప్రజలతో విడదీయలేని బంధం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు విడదీయలేని ఒక బంధం.. ఒక భావోద్వేగం అని మంత్రి రజిని చెప్పారు. ‘వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన 800 మంది అందుకు సాక్ష్యం. ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. వైఎస్సార్ గొప్ప మానవతావాది. పరిపాలన దక్షుడు. ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 మెడికల్ కాలేజీలు ఉంటే.. వైఎస్సార్ 3 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ ఎన్నో గొప్ప పనులు చేసినందున మనం క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు’ అని చెప్పారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం చంద్రబాబు, ఔరంగజేబు ఒక్కటే. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడిని కూడా మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశాడు. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు రావాలి. పేద వారిని దగ్గరకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా? సత్య హరిశ్చంద్రుడిని వైఎస్ జగన్ రూపంలో చూశాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంది పలుకుతుంది. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంతో గౌరవం. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నాం. రాజకీయంగా ఏమీ లేక, టీడీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అధికారంలో లేనప్పుడే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ‘ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా, వాడి పేరు కనబడకుండా చేస్తా, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను’ అని చెప్పింది చంద్రబాబే. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్పై ప్రేమ ఉన్నట్లు నటించడం తగదు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు. ఎన్టీఆర్ను మా పార్టీ గౌరవించింది. హెల్త్ వర్సిటీకి ఎందుకు వైఎస్సార్ పేరు పెట్టాలనుకున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం తగదు. వైఎస్సార్ పేరు ఆమోదయోగ్యం మంత్రి, మేరుగు నాగార్జున దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్గా వైఎస్సార్కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైఎస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహా్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం. ఇక టీడీపీ వాళ్ల బాగోతం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, రామానాయుడులు సెక్యూరిటీ ఇన్చార్జ్ను బహిరంగంగానే కొట్టారు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసు వల్ల విజయవాడ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు కూడా చేయి చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ సభలో రౌడీలా ప్రవర్తించారు. ఎన్టీఆర్ పట్ల బాబుకు గౌరవం లేదు మంత్రి, అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసరడం ఏమిటీ? ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చ కాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడి మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. ఎన్టీఆర్కు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. మా ప్రభుత్వం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరును హెల్త్ వర్సిటీకి పెట్టాలని భావిస్తున్నాం. ఎన్టీఆర్ను అవమానించింది చంద్రబాబే. ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. -
వాళ్ల కన్నా మాకే ఎక్కువ గౌరవం: గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
ఆ వ్యాఖ్యల వెనుక బాబు రహస్య అజెండా
సాక్షి, అమరావతి: ‘రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం‘ అంటూ అమరావతి యాత్రికులు చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు రహస్య అజెండా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. అమరావతి యాత్ర పేరుతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు బండారాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అమరావతి పాదయాత్రలో వారు మాట్లాడిన మాటలు సీమ వాసిగా, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, తాము మధ్యాంధ్రప్రదేశ్ పేరిట ఉద్యమించాల్సి ఉంటుందన్న వారి మాటల వెనుక కచి్చతంగా చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోందన్నారు. శ్రీకాంత్రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పసుపు కండువాలతో యాత్ర చేయండి ► కృష్ణా నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం మేము త్యాగం చేసి, మీకు నీళ్లు ఇస్తుంటే, రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం అని విద్వేషాలు రెచ్చగొడతారా? రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదు. ► చంద్రబాబుకు అధికారమే పరమావధి. రాష్ట్ర విభజనకు మూల కారకుడయ్యారు. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలంటే చంద్రబాబుకు ద్వేషం. రైతుల ముసుగులో గ్రీన్ కండువాలు ఎందుకు.. పచ్చ కండువాలతో యాత్ర చేయండి. ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క హోటల్ కట్టావా బాబూ? అక్కడ టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా దిక్కు లేదు. రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం. చంద్రబాబు కాలంలో నక్సలిజం, కరువు కాటకాలు ► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని కరువు ఆంధ్రప్రదేశ్గా మార్చారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయన పాలన తొలి నాళ్లలో నక్సలిజం, కరువు కాటకాలు, క్షీణించిన శాంతిభద్రతలతో రాష్ట్రం తల్లడిల్లింది. ► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అధికారం చేపట్టాక, వాటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రానికి సరికొత్త దశ, దిశ నిర్ధేశిస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారు. వ్యవసాయం దండగ అని బాబు అంటే.. కాదు పండుగ అని నిరూపించారు. ► రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి తప్పించుకునేందుకు అమరావతి బాట పట్టారు. సినిమా సెట్టింగులు మాదిరిగా గ్రాఫిక్స్ చూపించి, డల్లాస్, సింగపూర్, మలేషియా చేస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు. నిపుణుల మాటలను లెక్క చేయకుండా ఇక్కడి రైతులనూ మోసం చేశారు. ప్రజలు 2019లో అధికారం ఊడగొట్టినా బుద్ధి రాలేదు. ► హైదరాబాద్లో రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, సాఫ్ట్వేర్ అన్నీ తన ఘనతేనని చెప్పుకుంటారు. అవుటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన నేత వైఎస్సార్. నేదురుమల్లి జనార్దనరెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులు ప్రారంభించారు. ► శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని హక్కుగా రావాల్సి ఉన్నా దానికీ బాబు అడ్డుపడుతున్నారు. రాయలసీమ అంటే విషం కక్కుతున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఇతరత్రా అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా పారిపోతారు. -
‘ఆడి కార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా?’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలోనే సంపద సృష్టించాలా? మిగతా ప్రాంతాలకు అర్హత లేదా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆడికార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా? అని దుయ్యబట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడైన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ‘రాజధాని పేరుతో సెలెక్ట్.. ఎలెక్ట్.. కలెక్ట్ యాత్ర’ సంక్షేమం, అభివృద్ధితో దివంగత మహానేత వైఎస్సార్ ప్రజలకు ధైర్యం కల్పించారు. చంద్రబాబు తనకు తాను విజన్ ఉన్న వ్యక్తిగా ప్రచారం చేయించుకుంటారు. అమరావతికి వ్యతిరేకంగా మేం ఏ రోజూ మాట్లాడలేదు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖ రాజధానులుగా ఉండాలని ఆలోచిస్తున్నాం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేదే మా అభిమతం అని’’ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు: ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి
-
‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్యకుమార్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సత్యకుమార్ కాదు.. అసత్యకుమార్ అని పేరు పెట్టుకోవాలంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: 'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో స్కాం జరిగిందన్న బీజేపీ విమర్శలు వాస్తవం కాదా అని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు. ఈనెల 8, 9వ తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ల సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సీఎం జగన్ మేలు చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్దేనని గుర్తు చేశారు. చిరస్థాయిగా వైఎస్సార్సీపీ: సజ్జల వైఎస్సార్సీపీని ప్రజలు తమ హృదయాలలో చిరస్థాయిగా పదిలపరుచుకున్నారని ప్లీనరీ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ కన్వీనర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రజలు ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను అంచనాలకు మించి విజయవంతం చేయాలని సూచించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను ఆయన పూర్తిస్థాయిలో సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకం: వైవీ సుబ్బారెడ్డి ప్లీనరీ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతో భరోసాగా ఉన్నారని గుర్తు చేస్తూ వారి అంచనాలకు అనుగుణంగా ప్లీనరీ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టను ఇనుమడించేలా ప్లీనరీ సమావేశాలు జరగాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో విజయసాయిరెడ్డితోపాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున, మంత్రి విడదల రజని, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకం: గడికోట అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ చరిత్రాత్మకమైందని ప్లీనరీ వాలంటీర్స్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ ప్లీనరీ అపురూపమైన పండుగలా నిలుస్తుందన్నారు. గత ప్లీనరీలో పార్టీ అజెండాను వివరించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం? భవిష్యత్లో ఏం చేయబోతున్నామనేది ఈ ప్లీనరీ ద్వారా వివరిస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. -
పాలనలో నూతన ఒరవడి: శ్రీకాంత్రెడ్డి
కడప సెవెన్ రోడ్స్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సరికొత్త ఒరవడి సృష్టించారని వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమబోర్డు చైర్మన్ పులి సునీల్కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత శ్రీరంజన్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. మూడేళ్లలో 1.14 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చి దాదాపు రూ.2 లక్షల కోట్లను పారదర్శకంగా ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తలకిందులైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. విద్యారంగాన్ని తీర్చిదిద్ది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► బీసీ నేత కృష్ణయ్యకు మేం రాజ్యసభ టిక్కెట్ ఇస్తే తప్పుబడుతున్న బాబు గతంలో నిర్మలా సీతారామన్, సురేష్ప్రభుకు ఎలా ఇచ్చారు? ► కరువు ప్రాంతాలకు నీరందించేలా 40 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేసిన హంద్రీ–నీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా? ఆయన హయాంలో నక్సలిజం పేట్రేగి పోయి శాంతి భద్రతలు క్షీణించాయి. ► ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఇల్లూ నిర్మించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు మా వెంట వస్తే నిజం నిరూపిస్తాం. ► దివంగత వైఎస్సార్ హయాంలోనే హైదరాబాద్లో రింగ్రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇతర అభివృద్ధి జరిగింది. అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదు.