-
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్లోని ఫర్నిచర్పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ జగన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. -
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్గా ప్రచారం చేసే ప్లైవుడ్కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ భవన సముదాయం ‘వల్లభ భవన్’లోని మూడో అంతస్తులో మొదలైన మంటలు 4, 5 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఆయా అంతస్తుల్లోని ఫైళ్లు, ఇతర ఫరి్నచర్ పూర్తిగా కాలిపోయాయి. నీళ్ల ట్యాంకర్లతోపాటు సుమారు 50 అగ్ని మాపక శకటాలతో వచ్చిన సిబ్బంది దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తెచ్చారు. శనివారం సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవన సముదాయంలో దాదాపుగా ఎవరూ లేరని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సవివర దర్యాప్తు కోసం సీఎం మోహన్ యాదవ్ అదనపు చీఫ్ సెక్రటరీ మహ్మద్ సులెమాన్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వల్లభ్ భవన్ జరిగిన అయిదో అగ్ని ప్రమాదమని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి సాక్ష్యాలు బయటపడకుండా చేసేందుకే సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం అంటూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ నేతలు సెక్రటేరియట్ వెలుపల రెండు గంటలపాటు నిరసన చేపట్టారు. -
పాత ఫర్నిచర్ మినియేచర్
కాలంతో పాటు ఫర్నిచర్లో కూడా మార్పు వస్తోంది. పాత ఫర్నిచర్ ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంది. అలనాటి ఫర్నిచర్ను కళ్లముందుంచేలా వశిష్ట్ రజని తయారుచేసిన పాత ఫర్నిచర్ మినియేచర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. చికాగాలోని ఆర్ట్ మ్యూజిక్యంకు వెళ్లి వచ్చిన తరువాత వశిష్ట్కు పాత ఫర్నిచర్ మినియేచర్లు తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. 30 సంవత్సరాల వశిష్ట్ చికాగోలో ఇండస్ట్రియల్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. -
స్థిరాస్తి, ఫర్నిచర్ రంగాల్లో అపార అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తి, ఫర్నిచర్, వినియోగదారుల ఉత్పత్తుల రంగాల్లో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను పరిశీలించాల్సిందిగా గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీకి సీఎం రేవంత్రెడ్డి సూచించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంసింగ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్రోవెట్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన ఆయిల్ పామ్, పాడి వ్యాపారాన్ని విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కంపెనీ.. మలేసియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సరీ్వసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
-
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఎయిమ్స్లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. #WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services (Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ — ANI (@ANI) January 4, 2024 -
తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో మిస్సవుతున్న ఫర్నీచర్
-
హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం (ఫొటోలు)
-
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం..
గుజరాత్ : రాజ్ కోట్ లోని ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారమందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. రాజ్ కోట్ లోని ఆనంద్ బంగ్లా చౌక్ సమీపంలో ఉన్న ఒక ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గాని ఆస్తినష్టం ఎంత వరకు జరిగి ఉండవచ్చన్న వివరాలు తెలియాల్సి ఉంది. Fire breaks out at furniture godown near Anand Bangla Chowk in Rajkot. Fire tenders are at the spot. More details are awaited. pic.twitter.com/d9aA1x7sgF — Press Trust of India (@PTI_News) June 22, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రమే!
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ సోఫా, మ్యాట్రెసెస్, టేబుల్స్, చైర్స్ ఇలా చాలా రకాల ఫర్నీచర్ ఉంటుంది. వీటిని శుభ్రం చేయకపోతే దుమ్ము, ధూళీ పేరుకుని పోయి చాలా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటివల్ల డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటిలో దాగి ఉండే సూక్ష్మక్రిముల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల ఫర్నీచర్ శుభ్రంగా కనిపించడంతోపాటు ఎక్కువకాలం మన్నుతుంది కూడా. ఫర్నీచర్ను శుభ్రం చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. సోఫా: ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. ఈ పొడికి కప్పు వేడి నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఈ ద్రావణం చల్లబడిన తర్వాత దానిని బాగా కలపండి. దీంతో నురగ వస్తుంది. ఒక క్లాత్ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురగతో సోఫా పై భాగంలో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తుంది. లెదర్ సోఫా: లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్తో శుభ్రం చేయడమే. ఇందు కోసం ఎప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్ను ఉపయోగించాలి. శుభ్రం చేయడానికి నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుళ్లు, చెక్క కుర్చీలు తదితర ఉడెన్ ఫర్నీచర్ని తుడిచేందుకు పొడి వస్త్రాన్ని వాడండి. వీటిని మరింతగా మెరిసేలా చేయాలంటే వ్యాక్స్, పాలిష్ కూడా చేయొచ్చు. అదే విధంగా దుమ్ముని క్లీన్ చేయాలంటే డిష్ వాష్ని నీటిలో కలిపి అందులో మెత్తటి బట్టను ముంచి బయటికి తీసి పిండి దానితో ఫర్నీచర్ని రుద్దాలి. తర్వాత పొడిబట్టతో చక్కగా తుడవండి. ఇలా క్లీన్ అయిన ఫర్నీచర్ని పూర్తిగా ఆరబెట్టండి. కొన్ని వస్తువులు పాత పాలిష్తో చూడ్డానికి అంత బాగుండవు. వీటిని క్లీన్ చేయాలంటే.. ముందుగా కొద్దిగా టీ బ్యాగ్స్ తీసుకుని వేడినీటిలో వేసి డికాషన్ చేయాలి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచి గుడ్డపై దీనిని పోస్తూ కొద్దికొద్దిగా తుడవాలి. టీ డికాక్షన్లోని యాసిడ్ ఉడ్ని క్లీన్ చేస్తుంది. మరకలు దూరమవ్వాలంటే.. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్పై ఫుడ్ ఐటెమ్స్ మూలాన మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించాలంటే... మరకలు పడ్డ చోట కాస్తంత టూత్పేస్ట్ అప్లై చేసి దానితో రుద్దాలి. ఆరిన తర్వాత ఒక తడిబట్టతో శుభ్రంగా తుడిచెయ్యండి. మరకలు మొండిగా ఉంటే బేకింగ్ సోడా, టూత్పేస్ట్లను సమానంగా కలిపి వాటితో రుద్దండి. కాసేపయ్యాక తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి. గోడలపై ఇంక్ మరకలు, పెన్ను గీతలు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా చేయండి. ఈ పేస్ట్ని మరకలపై పట్టించి రుద్ది తడిగుడ్డతో తుడిచెయ్యాలి.దీనికి మరో పద్ధతి ఉంది. అదేంటంటే... గిన్నెలో కాసిన వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల షాంపూ వేసి బాగా కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో ఒక క్లాత్ను ముంచి మరకలు పడ్డ చోట రుద్దండి. ఆరిన తర్వాత తడిబట్టతో తుడవండి. మరకలు పలచబడతాయి. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. ఇలా ఒకటి రెండుసార్లు చేయడం మంచిది. ఉడెన్ ఫర్నిచర్: చెక్కతో చేసిన గృహోపకరణాలు పాడు కాకుండా ఉండాలంటే టీ డికాషన్లో మెత్తటి క్లాత్ను నానబెట్టి పిండి దాంతో తుడవండి. ఇలా చేస్తే రంగు వెలిసిన ఫర్నీచర్కు కూడా తిరిగి మెరుపు వస్తుంది. చెక్కపై నీటి మరకలు దాని అందాన్ని పాడు చేస్తాయి. నీటి మరకలు పడినచోట వైట్ టూత్ పేస్ట్ (జెల్ పేస్ట్ కాదు) రాయండి. తర్వాత మెత్తని బట్టతో రుద్దాలి. అప్పుడు టూత్పేస్ట్ను తీసివేసి.. తడిబట్టతో తుడిచేయాలి. చెక్క ఫర్నిచర్పై మసి ఉంటే.. టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో వేసి కరిగించండి. మసి ఉన్న ప్రాంతంపై దీన్ని అప్లై చేయండి. తర్వాత మెత్తని పొడిబట్టతో తుడవండి. సీలింగ్ ఫ్యాన్లు సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల ముందుగా మీరు టేబుల్ పైకి ఎక్కి ఫ్యాన్ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్ బ్లేడ్ని తీసి విడిగా శుభ్రం చేయండి. రెక్కలను కూడా సబ్బుతో రుద్ది శుభ్రంగా కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. రెండో విధానం.. పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఒకదానిని కవర్ చేయాలి. ఇప్పుడు కవర్ పైనుంచి చేతులతో రుద్దాలి. అదేవిధంగా మూడు రెక్కలను శుభ్రం చేయాలి. రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బూజు అంతా కవర్ లోపల పడిపోతుంది. తర్వాత దాన్ని పారవేసి పిల్లో కవర్ను ఉతుక్కుంటే సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరవాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కళ్లకి ప్లెయిన్ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ ధరిస్తే కంట్లో దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి లేదంటే డస్ట్ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాన్ని క్లీన్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. -
Hyderabad: పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు చేసిన వరుడు..
మరికొద్ది గంటల్లో మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడనుకునే వరుడు ఉన్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మండపం వద్దకు వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే వరుడికి పెట్టుపోతలు కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది. దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. వధువు తరపు బంధువులు అంతా వచ్చేశారు. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
ఫర్నిచర్ మాటున గంజాయి రవాణా
కాకినాడ క్రైం: వ్యాన్లో ఫర్నిచర్ మాటున దాచి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చింతూరు పరిధిలో ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో శనివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాన్ను తనిఖీ చేయగా ఫర్నిచర్ కనిపించింది. వ్యాన్ను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఫర్నిచర్ అడుగున 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీన్ని ఒడిశాలోని మల్కన్గిరి నుంచి కూలీలు కాలినడకన సుకుమామిడి ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి వ్యాన్లో ఫర్నిచర్ మాటున దాచి, అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సరుకును ఉత్తరప్రదేశ్లోని ముజఫరాబాద్కు తరలిస్తున్నట్లు తేల్చారు. నిందితులు గౌరవ్ రాణా (23), నౌశద్ (19), ఆరిఫ్ (23)లను అరెస్టు చేశారు. గంజాయితో పాటు, వ్యాన్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్’ పేరిట ఫర్నిచర్ కార్నివాల్ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్ సేల్ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్లైన్ (బాంటియా.ఇన్)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్, బుక్షెల్ఫ్, బెడ్రూమ్ సెట్స్, ఆఫీస్ కురీ్చలు, టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది. ఎక్స్ఛేంజ్పై 20–30 శాతం రాయితీ.. బాంటియాలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్ టేబుల్స్ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్డోర్ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి. విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగాం బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగింది. పండుగ షాపింగ్లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్ సేల్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – సురేందర్ బాంటియా, ఎండీ, బాంటియా బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ నాణ్యమైన ఫర్నిచర్కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్ను బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్లను కూడా అందిస్తాం. – అమిత్ బాంటియా, డైరెక్టర్, బాంటియా -
మీ అభిరుచికి తగిన గృహాలంకరణ డిజైన్లు
ఉల్లాసరకమైన ఇంటి అలంకరణ ఆ గృహస్తుల అభిరుచిని తెలియజేస్తుంది. కానీ, ‘మరీ ఇంతటి అలంకరణా’ ఆశ్చర్యపోయే ఇంటి లోపలి డిజైన్లు ఇవి. లిథువేనియా వెబ్సైట్ బోర్డ్పాండా ప్రపంచంలో ఉన్న కొన్ని విచిత్రమైన గృహాలంకరణ డిజైన్లను ఇటీవల మన ముందుంచింది. వంటగదిలో కంచె ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా వంటగది అలంకరణ వింతగానే అనిపిస్తుంది. పొయ్యి గట్టును కూడా అలాగే డిజైన్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ, ఎంత శుభ్రం చేసినా వంటగది గజిబిజిగా ఉన్నట్టు కలలోకి వస్తే మాత్రం ఎవరూ బాధ్యులు కారండోయ్. ఇంతకీ ఈ కిచెన్ ఎక్కడ అనేది మీ సందేహమా అమెరికాలోని ఓ గృహస్తుడి ఐడియా ఇది. బాస్కెట్ బాల్ నెట్ ఇంటి హాలులో అందమైన షాండ్లియర్ని వేలాడదీయడం ఒక హంగుగా చూస్తూనే ఉంటాం. అరుదైన క్రిస్టల్స్తో బాస్కెట్బాల్ నెట్ను రూపొందించి, ఇలా హ్యాంగ్ చేశారు. ఇది నిజంగానే అరుదైన షాండ్లియర్గా మార్కులు కొట్టేసింది. ఇంట్లో జూ పార్క్ సెంటర్ టేబుల్ పక్కనే మూలన అలంకరించిన షో పీస్ చూస్తే ఆ ఇంటి యజమాని గుండె ఎంత గట్టిదో ఇట్టే తెలిసిపోతుంది. మొసలి తన బలాన్నంతా ఉపయోగించి కూర్మాన్ని నోట కరచుకున్నట్టుగా ఉన్న ఈ షో పీస్ జూ పార్క్లో ఉంటే ఉండచ్చు గాక. కానీ, ఇంటి అలంకరణలో చోటు ఇవ్వడం అనేది అతి పెద్ద విశేషమే. కమోడ్పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్పైన క్రాకరీ ఐటమ్స్పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. స్నానపు తొట్టె కుర్చీలు పాత బాత్టబ్ను తీసుకొని, దానిని రెండు కుర్చీలు, ఒక సెంటర్ టేబుల్ చేయడం అనేది ఒక సృజనాత్మక డిజైన్గా మెచ్చుకోకుండా ఉండలేం. అంత సౌకర్యంగా లేకపోవచ్చు కానీ, ఈ డిజైనర్కి మాత్రం పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. పాడైపోయిన వస్తువులను తిరిగి వాడుకునేలా ఎలా చేయచ్చో ఈ డిజై¯Œ చూస్తే తెలిసిపోతుంది. గడ్డి కుర్చీలు పార్కులో గడ్డిలో కూర్చోవడం మనందరికీ అనుభవమే. కానీ, ఇంటి లాన్లో పచ్చటి గడ్డి పరచుకున్న కుర్చీల మీద కూర్చోవడం ఒకింత తెలియని అనుభూతే. టేబుల్, కుర్చీల మీద ఇలా గడ్డిని అందంగా రూపు కట్టారు. ప్రకృతి అంటే ఎంత ప్రేమ ఇలా చాటి చెప్పారు. గగుర్పాటు కప్పులు టీ తాగడానికి అందమైన కప్పుల సేకరణ అందరూ చేస్తారు. కానీ, గగుర్పాటు కలిగించే విధంగా ఉన్న కాఫీ కప్పుల డిజైన్ మాత్రం చూస్తే జడుసుకోకుండా ఉండలేరు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్ను కూడా నైస్గా క్రియేటివ్గా చేస్తున్నారు. కమోడ్పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్పైన క్రాకరీ ఐటమ్స్పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. కాళ్ల కుండీలు ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ఇంటి అలంకరణ కోసం చూస్తున్నారా? అయితే, ఇలా ప్రయత్నించవచ్చు. ఇళ్లలో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ కుండీ మానవ శరీరం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. మానవ కాళ్ల రూపాలతో తయారుచేసిన కుండీల కంటైనర్ ఇది. రాక్షస మంచం భారీ కోరలతో రాక్షస నోరును పోలి ఉన్నట్టు ఉన్న మంచం ఇది. ఈ మంచంలో గాఢమైన నిద్ర కోసం ప్రయత్నించడం అసాధారణ వ్యక్తులకే సాధ్యం అనుకుంటే పొరపాటేమీ కాదు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్ను కూడా నైస్గా క్రియేటివ్గా చేస్తున్నారు. చదవండి: World Alzheimer's Day: మతిమరుపు వల్ల మెదడు బరువు కోల్పోయి.. క్రమంగా.. -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్క్రీమ్గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్ పార్కు
సాక్షి, అమరావతి: దేశీయ అవసరాలకు తోడు ఎగుమతులే లక్ష్యంగా రాష్ట్రంలో భారీ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా ఏటా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్ విక్రయాలు జరుగుతుండగా ఇందులో కనీసం రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్ను భారత్ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపైఐఐటీ) దేశవ్యాప్తంగా ఫర్నిచర్ తయారీకి సంబంధించి పార్కుల ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఫర్నిచర్ తయారీకి అవసరమైన దుంగలు, ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పోర్టులకు దగ్గర్లో ఫర్నిచర్ తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉన్నందున నెల్లూరు జిల్లాలో భారీ యూనిట్ ప్రతిపాదనకు డీపీఐఐటీ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. డీపీఐఐటీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు. (‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్) ప్రధాన భాగస్వామిగా గోద్రేజ్! రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఫర్నిచర్ పార్కులో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ దేశీయ ఫర్నిచర్ తయారీ సంస్థ గోద్రేజ్ ఆసక్తి వ్యక్తం చేసింది. మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్లో గుర్తించిన 20 రంగాలు ఇవే.. ఏసీలు, చర్మ పాదరక్షల తయారీ, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, ఆగ్రో క్లస్టర్, ఆహార పదార్థాలు, వ్యవసాయ కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, వైద్య చికిత్స ఉత్పత్తులు, టెలివిజన్, కెమెరాలు, బొమ్మలు, ఇథనాల్, ఎలక్ట్రానిక్ వెహికిల్ కాంపోనెంట్, స్పోర్ట్స్, జిమ్ పరికరాలు. -
గ్రేటర్ గృహాలంకరణ
కొబ్బరి, కొన్ని కాయగూరలు తురమడానికి వంటింట్లో తురుము పీటను ఉపయోగిస్తాం. వీటిల్లో హ్యాండిల్ ఉన్నవి, గుండ్రటి, పొడవాటి, డబ్బా పరిమాణంలో ఉన్న గ్రేటర్స్ (తురుమేవి) మార్కెట్లో రకరకాల మోడల్స్లో లభిస్తుంటాయి. ముచ్చటపడో, అవసరానికో తెచ్చుకున్నా ఇవి పదును పోయి సరిగ్గా తురమకపోతే పాతసామాన్లలో పడేయాల్సిందే. అయితే అలా కాకుండా వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు! ఇంటికి వచ్చిన వారు.. రూపు మారిన ఈ గ్రేటర్స్ని అబ్బురంగా చూసి మిమ్మల్ని ‘గ్రేట్’ అనాల్సిందే. ►కరెంట్ పోయినప్పుడో.. క్యాండిలైట్ డిన్నర్కో గాలికి కొవ్వుత్తులు ఆరిపోతుంటే డబ్బా రూపంలో ఉండే గ్రేటర్ను లాంతరుబుడ్డీలా ఉపయోగించాలి. బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం. ►చిన్న డబ్బాలా ఉండే చీజ్ గ్రేటర్లో రకరకాల పువ్వులను అమర్చి టేబుల్ మీద పెడితే అందమైన వేజ్ సిద్ధం. ►గ్రేటర్ డబ్బాను పెయింటింగ్తో అందంగా అలంకరించి.. దానికి చెవి రింగులు, హ్యాంగింగ్స్ సెట్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ►ఉడెన్ స్పూన్లు వేయడానికి సరైన హోల్డర్ లేకపోతేనేం.. తురుము డబ్బాను ఉపయోగించుకోవచ్చు. ►బోసిపోయిన వాల్ను ముచ్చటైన ఫ్రేమ్తో అలంకరించాలంటే.. నలు చదరంగా ఉండే ప్లేట్ లాంటి గ్రేటర్పైన చిన్న పెయింట్ వేసి అమర్చాలి. -
ఫర్నీచర్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
‘అందరికీ ఇచి్చనట్లే క్యాంపు కార్యాలయం కోసం అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫర్నీచర్ ఇచ్చారు. వాటిని ఆయన తన కార్యాలయంలో వాడుకున్నారు. తన పదవి ముగిసిన తర్వాత ఆ ఫర్నీచర్ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి రెండు లేఖలు రాశారు. వాటిని పక్కనపడేసి ఫర్నీచర్ దొంగతనం చేశారని కేసు పెట్టడం ఏమిటి? రెండు లక్షలు విలువచేసే ఫర్నీచర్ కోసం అంత సీనియర్ నేతపై కేసు పెడతారా?’.. – రెండ్రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల్లో వల్లెవేస్తున్న మాటలివి. హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపీ అసెంబ్లీని తరలించేటప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫర్నీచర్ను భద్రత కోసం మా ఇంటికి తీసుకెళ్లాం. అమరావతిలో నిరి్మంచిన అసెంబ్లీలో కొత్త ఫరి్నచర్ ఏర్పాటుచేశామని సీఆర్డీఏ అధికారులు చెప్పడంతో అక్కడ ఆ ఫర్నిచర్కు భద్రత ఉండదని మా ఇంటికి తీసుకెళ్లాం. నా టర్మ్ పూర్తయ్యాక దాన్ని తీసుకెళ్లాలని లేకపోతే దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. – ఆగస్టు 20న నరసరావుపేటలో మీడియాతో కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫరి్నచర్ను తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన విషయాన్ని చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు చెబుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి కోడెల తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన ఫరి్నచర్ అసెంబ్లీకి సంబంధించినది కాగా.. చంద్రబాబు దాన్ని కోడెల క్యాంపు కార్యాలయం ఫర్నీచర్గా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వినియోగించే ఫర్నీచర్, స్పీకర్ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించే ఫర్నీచర్కు మధ్య తేడాను ప్రజలు గమనించలేరనే భావనతో ఆయన పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడుతుండడంపై టీడీపీ నాయకుల్లోనే అసహనం కనిపిస్తోంది. గత నెలలో ఈ ఫర్నిచర్ గురించి కోడెల స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెలగపూడి అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేసినప్పటికీ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ ఫరి్నచర్ను తరలించిన కోడెల దాన్ని గుంటూరులోని తన కుమారుడి హీరో షోరూంలో వినియోగించారు. స్పీకర్గా కోడెల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ కార్యదర్శి ఫర్నీచర్ గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ మాయమైన విషయం బయటపడింది. దీనిపై అసెంబ్లీలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసి కోడెల హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అది తన వద్ద ఉందని తెలిపారు. ఆగస్టు 27న అసెంబ్లీకి కార్యదర్శికి ఒక లేఖ పాత తేదీతో పంపించి ముందే తాను ఇచి్చనట్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు, అసెంబ్లీ యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీని అమరావతికి మార్చిన సమయంలో అక్కడి ఫర్నీచర్ను కోడెల సత్తెనపల్లి, నర్సరావుపేటలోని తన ఇళ్లు, వ్యాపార సంస్థలకు తరలించారు. ఇందుకు అప్పటి అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ సహకరించినట్టు తేలడంతో ఇటీవలే ఆయన్ని ఆ పోస్టు నుంచి తప్పించారు. మాయమైన ఫర్నీచర్ ఇదే.. బర్మా టేకుతో చేయించిన నిజాం కాలం నాటి టేబుళ్లు, డిజైనర్ కురీ్చలు, సోఫాలు తరలించారు. నెమలి ఆకారంలోని 14 సందర్శకుల కురీ్చలు, ఒక సెంటర్ టేబుల్, ఐదు కురీ్చలు, 27 ప్లాస్టిక్ కురీ్చలు, సభ్యుల లాంజిలోని 80 తెల్ల కురీ్చలు, స్పీకర్ యాంటి రూమ్లోని మూడు కుర్చీలు, మూడు సింగిల్ సీటర్ సోఫాలు, ఒక త్రీ సీటర్ సోఫా, పది చెక్క కుర్చీలు, రెండు స్లి్పట్ ఏసీలు, ఎగ్జిక్యూటివ్ కురీ్చలు, సందర్శకుల కురీ్చలు, బీఏసీ మీటింగ్ హాలులోని టేబుల్, ఎగ్జిక్యూటివ్, సాధారణ కురీ్చలు, డైనింగ్ హాలులోని టేబుల్, కురీ్చలు, కప్బోర్డు తదితర వస్తువులు తరలించారు. ఇవికాక.. స్పీకర్ ఛాంబర్, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఫరి్నచర్, టవర్ ఏసీలు, కంప్యూటరు సైతం మాయమయ్యాయి. ఇవన్నీ కోడెల క్యాంపు కార్యాలయం కోసం వాడినవని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. వీటి విలువ కూడా తక్కువ చేసి చూపిస్తుండడం గమనార్హం. -
ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు..
-
కోడెల.. ఇంత కక్కుర్తా?
శాసన సభ మాజీ స్పీకర్ కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడుబండిపై ఆధారపడిన చిరువ్యాపారి నుంచి బడా కాంట్రాక్టర్ వరకు కే–ట్యాక్స్ వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. పేదల ఆకలి తీర్చాల్సిన అన్న క్యాంటీన్ భోజనాలను కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీ కార్మికులకు విక్రయించి సొమ్ముచేసుకుంది. చివరికి మూగజీవాల ఆకలి తీర్చాల్సిన గడ్డినీ వదల్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్ను అక్రమంగా తరలించి కుమారుడి షోరూమ్లో వాడుకున్నారు. రూ.లక్షల విలువచేసే డైనింగ్ టేబుల్ నుంచి నాలుగైదు వందల రూపాయల విలువ కూడా చేయని ప్లాస్టిక్ కుర్చీ వరకూ వదలకుండా అక్రమంగా తరలించుకున్నారు. అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాక, ఫర్నిచర్ అప్పగిస్తానంటూ కోర్టును ఆశ్రయించిన కోడెల శివప్రసాద్ తీరును చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. సాక్షి, గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యుల కక్కుర్తిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజవకర్గాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ను అక్రమంగా తన కుమారుడి షోరూమ్కు తరలించిన విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కోడెల శివప్రసారావుపై సెక్షన్ ఐపీసీ సెక్షన్ 409, ఆయన కుమారుడు శివరామకృష్ణ (శివరామ్)పై 414 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుంటూరు నగరంలోని శివరామ్కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్లోని అసెంబ్లీ ఫర్నిచర్ను సీజ్ చేశారు. అసెంబ్లీ అధికారుల అనుమతి మేరకే పాత అసెంబ్లీలో ఫర్నిచర్కు భద్రత దృష్ట్యా తన కార్యాలయాలకు తరలించానని కోడెల బుకాయిస్తూ వచ్చారు. అయితే కోడెల కుమారుడి షోరూమ్లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ అనధికారికంగా తరలించారని అధికారులు నిగ్గు తేల్చారు. ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు.. అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్ టేబుల్ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్ను కోడెల శివరామ్ దర్జాగా షోరూమ్లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్ షోరూమ్లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్ కుర్చీలను వదలకుండా షోరూమ్లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు. గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్ను సీజ్ చేయలేదు. కొంత ఫర్నిచర్ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
కోడెల అడ్డంగా దొరికిపోయిన దొంగ..
సాక్షి, తాడేపల్లి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపణలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తానేదో కుట్ర చేసినట్లు అవాస్తవాలు మాట్లాడటం సరికాదని, కోడెలే పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని... పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. కోడెల చెబుతున్న అర్జున్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆరా తీస్తే అతడు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తేలిందన్నారు. చోరీ చేసిన సొత్తును తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం కాకుండా పోదని, కోడెల శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్ను ఆ కంపెనీ సీజ్ చేసిందని, అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్ తన క్యాంపు ఆఫీస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫర్నిచర్ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, అసెంబ్లీకి సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్ కొత్త కుంభకోణమని అభివర్ణించారు. కోడెల సరికొత్త డ్రామా... కాగా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో డ్రామా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. శుక్రవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పగా.... ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు కంపూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని పక్కాగా తేలిపోయింది. -
కోడెల కక్కుర్తి కేసు; మరో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసంలోని ఫర్నీచర్ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తికి చీఫ్ మార్షల్పై వేటు
సాక్షి, అమరావతి : శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కక్కుర్తి అసెంబ్లీ చీఫ్ మార్షల్పై వేటుకు దారి తీసింది. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా ఈ విషయం గుప్పుమనడంతో పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో తాను ఆ ఫర్నీచర్ ఇచ్చేస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్టు కోడెల తప్పించుకునే మార్గాలు వెతికారు. అత్యంత భద్రత కలిగిన గౌరవప్రదమైన అసెంబ్లీ నుంచి ఫర్నీచర్ను కోడెల ఎలా తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ చీఫ్ మార్షల్ వేలూరు గణేష్బాబు విధి నిర్వహణలో వైఫల్యం వెలుగు చూసింది. పోలీసులు ఆయన్ను గురువారం విచారించారు. కోడెల, అసెంబ్లీ అధికారుల ఆదేశాల మేరకు తాను సహకరించానని గణేష్బాబు అంగీకరించినట్టు సమాచారం. తానే దగ్గరుండి కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ను తరలించేలా వాహనాల్లోకి ఎక్కించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై చీఫ్ మార్షల్ నుంచి అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా తీసుకున్న పోలీసు అధికారులు క్రమశిక్షణ వేటు వేశారు. ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్న గణేష్బాబు డిప్యుటేషన్పై అసెంబ్లీ చీఫ్ మార్షల్గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన్ను చీఫ్ మార్షల్ విధుల నుంచి తప్పించి పాత పోస్టింగ్కు వెళ్లాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి కోడెల ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో పోలీసు అధికారిపై వేటు పడటంతో అందుకు సహకరించిన మిగిలిన అధికారుల్లోనూ కలవరపాటు మొదలైంది. -
‘కే’ మాయ
సాక్షి, అమరావతి : కంచే చేను మేస్తే.. అన్న సామెత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అతికినట్లు సరిపోతుంది. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా ఈ చిలక్కొట్టుడు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఏపీ అసెంబ్లీని 2017 మార్చిలో హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. ఆ సమయంలో స్పీకర్ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నీచర్ను మాత్రం సత్తెనపల్లి, నర్సరావుపేటలోని కోడెల ఇంటికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న సమయంలో తన చాంబర్, పేషీ కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా ఫర్నీచర్ను కొనుగోలు చేయించారు. వీటిని 2017లో అమరావతికి తరలించాల్సి ఉండగా కోడెల మాత్రం తన ఇంటికి చేరవేశారు. ఫర్నీచర్తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సైతం తన నివాసానికి చేర్చడం గమనార్హం. ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఎన్ని తరలించాలనే లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి కొన్నింటిని స్క్రాప్ కింద విక్రయించేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయి. సీసీ కెమేరాలు ఆపివేసి.. హైదరాబాద్ నుంచి అమరావతి అసెంబ్లీకి తెచ్చిన ఫర్నీచర్ను గదుల్లో ఉంచగా అనంతరం వాటిని సైతం కోడెల తన ఇంటికి లారీల్లో తరలించారు. ఈ వ్యవహారానికి అసెంబ్లీ చీఫ్ మార్షల్ సహకరించి సీసీ కెమెరాలను ఆపి వేసినట్లు సమాచారం. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కూడా కంప్యూటర్లు, కొంత ఫర్నీచర్ను కోడెల మనుషులు భారీగా తరలించారు. కోడెల వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఉద్యోగి ఇందులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బాగున్న వాటిని తన ఇంటికి పంపాలని కోడెల ఆదేశించడం, ఆ ఉద్యోగి లారీలు తెప్పించి లోడ్ చేయించడం, చీఫ్ మార్షల్ అందుకు సహకరించడం అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అధికారులు, సిబ్బంది ఇదంతా చూసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కొనసాగుతున్న విచారణ.. అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తరువాత నూతన స్పీకర్ కార్యాలయానికి ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అధికారులు సరిచూసుకుని నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిన తర్వాతే సిబ్బందిని రిలీవ్ చేస్తారు. కానీ లెక్కలు తేలకుండానే కోడెల సిబ్బందికి ఎన్ఓసీలిచ్చి రిలీవ్ చేయడంతోపాటు భారీ ఎత్తున ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయమైనట్లు స్పష్టమైంది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తీసుకెళ్లడం నిజమే: కోడెల నరసరావుపేట: పాత అసెంబ్లీ హాలు స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్కు భద్రత లేనందున తన దగ్గర ఉంచుకున్న మాట నిజమేనని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. వాటిని తీసుకెళ్లాలని లేదా విలువ కడితే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే లేఖలు రాశానని చెప్పారు. నరసరావుపేటలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్ను ఉంచామన్నారు. ఎన్నికల అనంతరం తనపై కేసులు నమోదు కావటంతో ఆలస్యమైందన్నారు. తాను వినియోగించుకున్న కంప్యూటర్లు, ఫర్నిచర్కు లెక్క చెప్పాలని కోరడంతో అసెంబ్లీ కార్యదర్శికి రెండు ఉత్తరాలు రాసినట్లు చెప్పారు. తాను వాడుకున్న ఫర్నిచర్కు విలువ కడితే డబ్బులు చెల్లిస్తానని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి మరోసారి లేఖ రాస్తానని తెలిపారు. ఇందులో తాను దుర్వినియోగం చేసిందేమీ లేదన్నారు. భద్రత లేని కారణంగా వాటిని తన వద్ద ఉంచుకున్న మాట నిజం అని స్పష్టంగా చెబుతున్నానన్నారు.