FPIs
-
రికార్డులే హద్దుగా.. మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. జోరుగా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. పీఎస్యూ షేర్లు అప్ డెరివేటివ్స్లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్సీ, గ్లెన్మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు రామ్కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
మార్కెట్లు భల్లేభల్లే- మీడియా, బ్యాంక్స్ ఖుషీ
ముంబై, సాక్షి: జీడీపీ వృద్ధి అంచనాలు, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్చేసి 45,427 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 97 పాయింట్లు జమ చేసుకుని 13,356 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో చివర్లో సెన్సెక్స్ 45,459 వద్ద, నిఫ్టీ 13,366 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! అయితే తొలుత సెన్సెక్స్ 45,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,242 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో రియల్టీ(0.35 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 2.8-1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎస్బీఐ లైఫ్, నెస్లే, కొటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్, టైటన్ 1.5-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో శ్రీరామ్ ట్రాన్స్, కెనరా, గ్లెన్మార్క్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, సన్ టీవీ, బంధన్ బ్యాంక్, జీ, టాటా కెమికల్స్, లుపిన్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 6-3.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్, చోళమండలం, ఐడియా, వోల్టాస్, జూబిలెంట్ ఫుడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 2.3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్1-1.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,038 లాభపడగా.. 934 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లకు జీడీపీ- వ్యాక్సిన్ల జోష్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ వేసిన అంచనాలు, జనవరికల్లా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 45,215కు చేరింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు ఎగసి 13,300 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 45,245 వద్ద, నిఫ్టీ 13,312 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ఫార్మా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్యూ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 1.4-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, గెయిల్, యూపీఎల్, ఐటీసీ, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, కోల్ ఇండియా 3.25-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, కొటక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, హిందాల్కో 1.3- 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో శ్రీరామ్ ట్రాన్స్, టాటా కెమికల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ లంబార్డ్, వేదాంతా, నాల్కో 7-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, టొరంట్ ఫార్మా, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడియా, బయోకాన్, బాలకృష్ణ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,576 లాభపడగా.. 538 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
వ్యాక్సిన్లవైపు మార్కెట్ల చూపు
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్- డిసెంబర్) నుంచీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నట్లు తాజాగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయడంతో సెంటిమెంటు బలపడినట్లు పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా రూపొందుతున్న వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షలకు చేరడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి వచ్చే వారం మార్కెట్లు కన్సాలిడేషన్ మధ్య సానుకూలంగా కదిలే అవకాశమున్న్లట్లు అంచనా వేశారు. గణాంకాలు రానున్న శుక్రవారం(11న) నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదే రోజు అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. కోవిడ్-19 సవాళ్ల నుంచి జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా క్యాడిలా వ్యాక్సిన్కు సైతం మూడో దశ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. యూకే బాటలో దేశీయంగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే మార్కెట్లు మరింత దూకుడు చూపవచ్చని తెలియజేశారు. సాంకేతికంగా.. గత వారం సెన్సెక్స్ 930 పాయింట్లు ఎగసి 45,080 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 290 పాయింట్లు జంప్చేసి 13,259 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టంకాగా.. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం నిఫ్టీ కీలక అవరోధమైన 13,250 పాయింట్లను అధిగమించి నిలిచింది. దీంతో నిఫ్టీకి 13,520 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. తొలుత 13,100 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఈ స్థాయిని కోల్పోతే.. 12,800 పాయింట్ల వద్ద మరోసారి మద్దతు దొరకవచ్చు. ఇతర అంశాలూ.. డాలరుతో రూపాయి మారకం, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు, 9 నెలల గరిష్టాలకు చేరిన చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్రెసిడెంట్గా ఎంపికైన జో బైడెన్ సహాయక ప్యాకేజీకి మద్దతివ్వడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక దేశీయంగా ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్ రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! -
రికవరీ బూస్ట్- మార్కెట్ల సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 447 పాయింట్లు జంప్చేసి 45,080 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 13,259 వద్ద నిలిచింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ 5.6 శాతం క్షీణించవచ్చంటూ తొలుత వేసిన అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. కాగా.. ఒక దశలో సెన్సెక్స్ 45,148 వద్ద, నిఫ్టీ 13,280 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! బ్యాంకింగ్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, మెటల్ 2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, హిందాల్కో, అల్ట్రాటెక్, సన్ ఫార్మా, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్యూఎల్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ 5-2.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు) టాటా కెమ్ జోష్ డెరివేటివ్స్లో టాటా కెమికల్స్, ఇండిగో, బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, పేజ్, టాటా పవర్, గ్లెన్మార్క్ 8-3.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు అంబుజా, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఐడియా, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, కోఫోర్జ్ 3.2-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,646 లాభపడగా.. 1,245 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మళ్లీ మార్కెట్లు ప్లస్- విదేశీ ఇన్వెస్టర్ల దన్ను
ముంబై, సాక్షి: ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ స్పీడందుకోనుందన్న అంచనాలతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 172 పాయింట్లు ఎగసి 44,805కు చేరగా.. నిఫ్టీ 59 పాయింట్లు జమ చేసుకుని 13,193 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,845వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం గరిష్టంగా 13,204ను తాకింది. గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో నిరవధికంగా ఇన్వెస్ట్ చేస్తుండటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. మీడియా అప్ ఎన్ఎస్ఈలో ఐటీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. మీడియా, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్ 1.2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గెయిల్, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, హిందాల్కో, యూపీఎల్, హీరో మోటో 3.5-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్లో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఎస్బీఐ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.2-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. టాటా.. పవర్ డెరివేటివ్స్లో టాటా పవర్ 5.6 శాతం జంప్చేయగా.. పెట్రోనెట్, ఎస్కార్ట్స్, ఇండిగో, యూబీఎల్, టాటా కన్జూమర్, అపోలో టైర్ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు బీవోబీ, క్యాడిలా హెల్త్కేర్, ఇన్ఫ్రాటెల్, పిరమల్, ఐడియా, ఆర్ఈసీ, కోఫోర్జ్, ఐసీఐసీఐ లంబార్డ్ 1.3-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,420 లాభపడగా.. 444 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
కొత్త రికార్డులతో మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి ఫైజర్ వ్యాక్సిన్ను యూకే ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 44,755కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్లు జమ చేసుకుని 13,163 వద్ద ట్రేడవుతోంది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,953వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తద్వారా 45,000 పాయింట్ల మార్క్కు చేరువైంది. ఇక నిఫ్టీ 13,216ను అధిగమించడం ఇంట్రాడే గరిష్టం రికార్డును సాధించింది. ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ రికవర్కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా, మెటల్స్ అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, గెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో 1.3-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్స్లో టాటా కెమ్, జీ, ఐబీ హౌసింగ్, భారత్ ఫోర్జ్, కోఫోర్జ్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, మదర్సన్ 4-2.6 శాతం మధ్య జంప్చేశాయి. అయితే అదానీ ఎంటర్, గోద్రెజ్ సీపీ, బాష్ 1 స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
బ్యాంక్స్ వీక్- మెటల్, రియల్టీ జోరు
ముంబై, సాక్షి: జీడీపీ జోష్తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 13,114 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,170 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,129-12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గెయిల్ లాభాల్లో ఎన్ఎస్ఈలో రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాలు 3-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5-1.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టైటన్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఐవోసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ 5-2.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ 3.4-0.6 శాతం మధ్య నష్టపోయాయి. అదానీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, టాటా కెమ్, నాల్కో, ఇన్ఫ్రాటెల్, ఎన్ఎండీసీ, పిడిలైట్, ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్ 7.2-3.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్, సన్ టీవీ, టీవీఎస్ మోటార్, మదర్సన్, అపోలో హాస్పిటల్స్, యూబీఎల్, ఎంజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,728 లాభపడగా.. 1,196 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేలచూపులతో- మెటల్, రియల్టీ ప్లస్
ముంబై, సాక్షి: జీడీపీ జోష్తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621కు చేరింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలహీనపడి 13,103 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,561 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,128-13,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మీడియా లాభాల్లో ఎన్ఎస్ఈలో మెటల్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, టాటా మోటార్స్, హిందాల్కో, యూపీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా 3.2-1.1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే 1.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి. నాల్కో అప్ డెరివేటివ్ కౌంటర్లలో నాల్కో, హెచ్పీసీఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎన్ఎండీసీ, వేదాంతా, టాటా కెమ్, ఎక్సైడ్ 4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క నౌకరీ, మదర్సన్, ఐజీఎల్, ముత్తూట్, బాలకృష్ణ, సన్ టీవీ, సీమెన్స్, అరబిందో, మెక్డోవెల్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,340 లాభపడగా.. 646 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
జీడీపీ జోష్- మార్కెట్లు గెలాప్
ముంబై, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలోనూ జులై- సెప్టెంబర్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 506 పాయింట్లు జంప్చేసి 44,655 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140 పాయింట్లు ఎగసి 13,109 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730ను అధిగమించగా, నిఫ్టీ 13,128 పాయింట్లను దాటింది. చదవండి: (సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఫార్మా, మెటల్ 3.3-1.7 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ యథాతథంగా నిలిచింది. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యూపీఎల్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, జేస్డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్ 8-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. నెస్లే, కొటక్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 2.6-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, టాటా పవర్, అదానీ ఎంటర్, కెనరా బ్యాంక్, మదర్సన్, యూబీఎల్, భెల్, బీవోబీ, ఫెడరల్ బ్యాంక్, డీఎల్ఎఫ్ 6.7-4.3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, మణప్పురం, ఐజీఎల్, అమరరాజా, నౌకరీ, ఎస్కార్ట్స్, జీఎంఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్ 4.3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 973 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
లాభాలతో షురూ- రియల్టీ, ఫార్మా జోరు
ముంబై, సాక్షి: ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన అంచనాలతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు పుంజుకుని 44,321కు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 13,007 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,470, నిఫ్టీ 13,064 పాయింట్ల వరకూ ఎగశాయి. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, మెటల్, ఐటీ రంగాలు 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఆటో, మీడియా 0.25 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, శ్రీసిమెంట్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, బజాజ్ ఆటో, పవర్గ్రిడ్, సన్ ఫార్మా, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, విప్రో, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్ 2.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఏసీసీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఏసీసీ, డీఎల్ఎఫ్, హావెల్స్, ఐసీఐసీఐ లంబార్డ్, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క చోళమండలం, మణప్పురం, ఎస్కార్ట్స్, మైండ్ట్రీ, బాటా, అమరరాజా, ఐడియా, కమిన్స్, క్యాడిలా హెల్త్ 2.3-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,355 లాభపడగా.. 641 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
నష్టాల ముగింపు- చిన్న షేర్లు జూమ్
ముంబై, సాక్షి: రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు క్షీణించి 44,150 వద్ద నిలివగా.. నిఫ్టీ 18 పాయింట్లు తక్కువగా 12,969 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,995 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,914 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య నీరసంగా ముగిశాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొనడం గమనార్హం! ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, మీడియా, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్ 2.7-1.25 శాతం మధ్య బలపడగా.. ఐటీ 0.45 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, దివీస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, పవర్గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ 4.3-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంజీఎల్ 14 శాతం దూసుకెళ్లగా.. కమిన్స్, ఐజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, చోళమండలం, కేడిలా హెల్త్కేర్, ఎక్సైడ్, అపోలో టైర్, టీవీఎస్ మోటార్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 10.4- 5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పెట్రోనెట్, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఆర్ఈసీ, జిందాల్ స్టీల్, మారికో, ఇండిగో, కోఫోర్జ్, మెక్డోవెల్ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1032 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
కన్సాలిడేషన్లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు జంప్చేసి 44,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 12,987 వద్ద స్థిరపడింది. అయితే మిడ్సెషన్ వరకూ ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,582 వద్ద కనిష్టాన్ని తాకింది. తదుపరి మిడ్సెషన్ నుంచీ జోరందుకుని 44,362 వరకూ ఎగసింది. ఇదేవిధంగా నిఫ్టీ సైతం 13,108 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,790 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు ఆటుపోట్లకు లోనైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్స్ 4 శాతం, పీఎస్యూ బ్యాంక్స్ 2 శాతం, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7-2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ఐషర్, మారుఈ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు ఓకే డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 12.4 శాతం జంప్చేయగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, బీవోబీ, టాటా కెమికల్స్ 8.3-4.6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, హావెల్స్, ఎస్ఆర్ఎఫ్, ఎస్కార్ట్స్ 2.6-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,765 లాభపడగా.. 994 మాత్రమే నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ల ర్యాలీ బాట- ఐటీ, ఫార్మా జూమ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,271ను తాకడం ద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 195 పాయింట్లు బలపడి 44,077 వద్ద నిలిచింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 12,926 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,969కు చేరింది. కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ ప్యానల్ సూచనల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ, స్మాల్ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్, రియల్టీ, ఆటో 2.8-0.6 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఆర్ఐఎల్, బీపీసీఎల్, టీసీఎస్ 6.7-2.5 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్, టైటన్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, జీఎంఆర్, అదానీ ఎంటర్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, బాలకృష్ణ, మదర్సన్, పీవీఆర్, ఐడియా 9.5-3.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, ముత్తూట్, గ్లెన్మార్క్, బీఈఎల్, సీమెన్స్, వోల్టాస్, బీవోబీ, ఎస్కార్ట్స్, పేజ్, మెక్డోవెల్, బాష్, అపోలో టైర్ 2.4-0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.3 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడగా.. 1,148 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్ కొత్త రికార్డ్- ఫైనాన్స్ షేర్లు జూమ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,271ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 243 పాయింట్లు ఎగసి 44,125 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 12,929 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 12,962కు చేరింది. కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ ప్యానల్ సూచనల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ, స్మాల్ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. రియల్టీసహా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్, ఆర్ఐఎల్, హిందాల్కో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, యూపీఎల్ 3.4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్లో ఎయిర్టెల్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, అదానీ పోర్ట్స్ 1.2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్, శ్రీరామ్ ట్రాన్స్, పెట్రోనెట్, బాలకృష్ణ, జిందాల్ స్టీల్, చోళమండలం, ఆర్బీఎల్ బ్యాంక్, మదర్సన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.2-2.2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, ముత్తూట్, గ్లెన్మార్క్, టొరంట్ ఫార్మా, జూబిలెంట్ ఫుడ్, ఇన్ఫ్రాటెల్, టీవీఎస్ మోటార్ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,253 లాభపడగా.. 635 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
వచ్చే వారం మార్కెట్లు మరింత స్పీడ్!?
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న వ్యాక్సిన్ల ఫలితాలు సహకరించనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని తెలియజేశారు. ట్రేడర్లు డిసెంబర్ సిరీస్ కు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొనే వీలున్నట్లు వివరించారు. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 42,300 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. యూఎస్, యూరోపియన్ కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీల కారణంగా పెరిగిన లిక్విడిటీ దేశీయంగా విదేశీ పెట్టుబడులకు దోహదపడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 12,850 పాయింట్లకు పైనే నిలిచింది. దీంతో వచ్చే వారం నిఫ్టీకి సాంకేతికంగా 12,970 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే.. 13,100- 13,200 పాయింట్ల వరకూ పుంజుకోగలదని పేర్కొన్నారు. అయితే 12,730 స్థాయిని నిలుపుకోవలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,630- 12,530 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలూ.. ప్రపంచ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, డాలరుతో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే తాజాగా ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ తమ వ్యాక్సిన్ పై యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయడం, మోడర్నా వ్యాక్సిన్ 94 శాతానికిపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు వెలువడిన వార్తలు వంటి అంశాలు అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నివ్వగలదని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం ఇలా శుక్రవారం(20)తో ముగిసిన గత వారంలో ఎఫ్ఐఐలు రూ. 13,019 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 12,343 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సెన్సెక్స్ 244 పాయింట్లు(0.6 శాతం) బలపడి 43,882 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో 44,000 పాయింట్ల మైలురాయిని తొలిసారి అధిగమించింది. నిఫ్టీ 79 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 12,859 వద్ద ముగిసింది. కాగా.. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3 శాతం స్థాయిలో జంప్చేయడం గమనార్హం! -
మార్కెట్లు బౌన్స్బ్యాక్- ఐటీ, బ్యాంక్స్ భేష్
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. అయితే పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లు బలపడి 12,859 వద్ద నిలిచింది. సహాయక ప్యాకేజీపై అంచనాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,013 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,454 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,892- 12,730 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఐటీ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. అయితే మీడియా 0.9 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫిన్సర్వ్ 9.3 శాతం దూసుకెళ్లగా.. టైటన్, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ 5.4-2.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆర్ఐఎల్ 3.7 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, యాక్సిస్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, ఎల్అండ్టీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఇన్ఫ్రాటెల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇన్ఫ్రాటెల్ 20 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, బీఈఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, జూబిలెంట్ ఫుడ్, నౌకరీ, సెయిల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎంఆర్ఎఫ్ 7.5-3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, అశోక్ లేలాండ్, ఎన్ఎండీసీ, భారత్ ఫోర్జ్, డీఎల్ఎఫ్, టాటా పవర్, ఐబీ హౌసింగ్ 5-1.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,548 లాభపడగా.. 1240 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
పతనానికి చెక్- లాభాలతో షురూ
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పెరిగి 43,764కు చేరింది. నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 12,822 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్లో తిరిగి చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,889 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,649 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,855- 12,784 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మెటల్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో 3.6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎయిర్టెల్ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడియా, బీఈఎల్, ఇన్ఫ్రాటెల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, అపోలో హాస్పిటల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5-2.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క బాటా, బయోకాన్, టొరంట్ ఫార్మా, అశోక్ లేలాండ్, ఫెడరల్ బ్యాంక్ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,347 లాభపడగా.. 639 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రికార్డుల ర్యాలీకి బ్రేక్.. నష్టాలతో షురూ
ముంబై, సాక్షి: రికార్డుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 274 పాయింట్ల వెనకడుగుతో 43,906కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 12,864 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,016- 43,821 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,908- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్వేవ్లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో బుధవారం మరోసారి యూఎస్ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. వ్యాక్సిన్లు ఆశలు కలిగిస్తున్నప్పటికీ మరోసారి లాక్డవున్లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో 5 శాతం జంప్చేయగా. బీపీసీఎల్, టీసీఎస్, బజాజ్ ఫిన్, మారుతీ, బ్రిటానియా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, సిప్లా 2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే పవర్గ్రిడ్, ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, యూపీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. డెరివేటివ్స్లో ఎఫ్అండ్వో కౌంటర్లలో వేదాంతా, అపోలో హాస్పిటల్స్, బాటా, ఎల్ఐసీ హౌసింగ్, అరబిందో, ఎంజీఎల్, టీవీఎస్ మోటార్ 5-1.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఆర్ఈసీ, బీవోబీ, ఆర్బీఎల్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అంబుజా, ఇన్ఫ్రాటెల్, అపోలో టైర్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 987 లాభపడగా.. 687 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నష్టాలతో ప్రారంభమై.. లాభాల్లోకి
ముంబై: రికార్డుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి నష్టాల నుంచి బయటపడి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53 పాయింట్లు పుంజుకుని 44,006కు చేరగా.. నిఫ్టీ 17 పాయింట్లు బలపడి 12,891 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,030- 43,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,897- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్వేవ్లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. మళ్లీ లాక్డవున్లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, సిప్లా 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే బీపీసీఎల్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, టైటన్, సన్ ఫార్మా, ఐషర్, ఎయిర్టెల్, నెస్లే, హెచ్డీఎఫ్సీ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. చదవండి: (జుకర్బర్గ్ను దాటేసిన ఎలన్ మస్క్?) డెరివేటివ్స్లో ఎఫ్అండ్వో కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎంజీఎల్, మదర్సన్, సీమెన్స్, బాలకృష్ణ 3-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. ఐసీఐసీఐ లంబార్డ్, పీవీఆర్, ఐబీ హౌసింగ్, ఐడియా, హెచ్పీసీఎల్, టొరంట్ ఫార్మా 2-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1023 లాభపడగా.. 615 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శనివారం ఎఫ్పీఐలు రూ. 78.5 కోట్లు, డీఐఐలు రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. కాగా.. ఈ నెల 2-13 మధ్య కాలంలో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!
ముంబై: దీపావళి జోష్ను చూపిస్తూ నేడు (17న) మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 98 పాయింట్లు ఎగసి 12,880 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,782 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాక్సిన్పై ఆశలతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య ఎగశాయి. సరికొత్త గరిష్టాలవద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ముహూరత్ అదుర్స్ సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. శనివారం సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,744 పాయింట్ల వద్ద, తదుపరి 12,707 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,823 పాయింట్ల వద్ద, ఆపై 12,865 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,433 పాయింట్ల వద్ద, తదుపరి 28,272 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,754 పాయింట్ల వద్ద, తదుపరి 28,913 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. అమ్మకాలవైపు నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
ముహూరత్ అదుర్స్- మార్కెట్ల రికార్డ్స్
గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్ నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్ డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్ ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) బీపీసీల్ భళా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు) ఐడియా జోరు డెరివేటివ్స్లో ఐడియా 6.3 శాతం జంప్చేయగా.. కంకార్, హెచ్పీసీఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్ఈసీ, అరబిందో, డీఎల్ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేడు మళ్లీ మార్కెట్ల వీక్ ఓపెనింగ్?!
ముంబై: నేడు (13న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 12,667 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,704 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. రోజుకి లక్ష దాటుతున్న కరోనా కేసులు, ప్యాకేజీపై అనిశ్చితి నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు 1 శాతం నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు మరోసారి మార్కెట్లు బలహీనంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి:(సూపర్ ర్యాలీకి బ్రేక్- బ్యాంక్స్ బోర్లా) సూపర్ ర్యాలీకి బ్రేక్ చిట్టచివరికి గురువారం 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్ల సూపర్ ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 43,357 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 12,691 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరగా.. 43,128 దిగువన కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 12,741- 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,630 పాయింట్ల వద్ద, తదుపరి 12,569 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,746 పాయింట్ల వద్ద, ఆపై 12,802 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,006 పాయింట్ల వద్ద, తదుపరి 27,732 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,612 పాయింట్ల వద్ద, తదుపరి 28,946 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.