-
రెండ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్ప అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మండల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, తదితర సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగంతో సహకరించి వారు జారీ చేసిన సూచనలు పాటించాలని కోరారు. (ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు) కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు : బందరు కలెక్టరేట్ : 08672-252572 విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805 సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454 సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు : 08656- 232717 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697 -
ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు
-
ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు
సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. నేడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు(శుక్రవారం) విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఆగష్టు 15న విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆగష్టు 16న విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. -
మూడు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికితోడు కోస్తాపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయి.రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్ష సూచన. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 –50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
నేడు కూడా మోస్తరు వర్షాలు..
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆదివారం వర్షాలు పడ్డాయి. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ఆగ్నేయ, తూర్పుదిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండటంతో కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రెండు మూడు రోజుల పాటు చలిగాలులు ప్రభావం కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెర్లాం, మెరకముడిదాంలో 6 సెంమీ, వీరఘట్టం, గజపతినగరంలో 5, సీతానగరంలో 4, శృంగవరపుకోట, బొండపల్లిలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో శీతలగాలులు ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆదివారం హైదరాబాద్లో పలు చోట్ల శీతలగాలులతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆదివారం నగరంలో సాధారణం కంటే 8.2 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో అత్యధికంగా రాజేంద్రనగర్లో 27 మి.మీ, ఉప్పల్లో 26, అల్వాల్లో 19.8, సికింద్రాబాద్లో 16 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. (చదవండి: హైదరాబాద్లో మసక మసక) -
ధరల మంట : చుక్కల్లో ద్రవ్యోల్బణం !
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనానికి తోడు ధరల మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బంగారం నుంచి ఉల్లిగడ్డ వరకూ ఏ వస్తువును కదిలించినా ధరలు ఆకాశం అంటుతున్నాయి. ధరల మంటతో డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలను మించి ఏకంగా 6.2 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని రాయటర్స్ పోల్లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈనెల 13న వెల్లడికానున్న డిసెంబర్ ద్రవ్యోల్బణ గణాంకాల్లో రిటైల్ ద్రవ్బోల్బణంపై ఆర్బీఐ అంచనా రెండు నుంచి 6 శాతాన్ని అధిగమించి ఏడు శాతం వరకూ ఇది ఎగబాకుతుందని రాయ్టర్స్ పోల్లో పాల్గొన్న వారిలో 60 శాతం మందికిపైగా అభిప్రాయపడ్డారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరగుతుండటంతోనే రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూడటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర ఆహారోత్పత్తుల ధరలు పెరిగినా ప్రధానంగా ఉల్లి ధరలు ఇటీవల నాలుగింతలకు పైగా పెరగడమే ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆస్ధా గిద్వాణీ పేర్కొన్నారు. -
వణుకుతున్న ఉద్దానం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం జారీ చేసిన హెచ్చరికలు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం వాసులను వణికిస్తున్నాయి. ఇప్పటికే తిత్లీ తుపాను ధాటికి తోటలు, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన తాము వర్షం వస్తే ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. ‘వేలాది ఇళ్లు కూలిపోయి కుటుంబాలకు కుటుంబాలే కట్టుదుస్తులతో చెట్ల కింద పరాయి పంచన ఉంటున్నారు. ఇంకా వర్షం కురిస్తే మా పరిస్థితి ఏమిటి’ అని వారు బెంబేలెత్తిపోతున్నారు. ‘బంగాళాఖాతంలో ఒడిశా తీరంలోనూ, కర్ణాటక ప్రాంతంలోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. కాగా, తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం కకావికలైంది. జీడి, కొబ్బరి చెట్లు నేలమట్టయ్యాయి. తుపాను ధాటికి ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. తిత్లీ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వర్షాలు ఉద్దానం వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. -
‘టిట్లీ’ ముప్పు.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తుపాను, బలమైన గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారని సమాచారం. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. (చదవండి : ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్! ) రేపు, ఎల్లుండి విస్తారమైన వర్షాలు కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ’ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి ఈరోజు రాత్రి (మంగళవారం) లేదా రేపు ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిషా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ రోజు తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. ఈమేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది. సోమవారం రాత్రికి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి 620, ఒడిశాలోని గోపాల్పూర్కు 650 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో పయనిస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని తీవ్రత పెరిగి బుధవారం నాటికి తుపానుగా మారి, ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుందని ఐఎండీ వివరించింది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్లు, తుపానుగా మారాక బుధ, గురు వారాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకోస్తా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తుపాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. -
పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలయ్యాక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి తేలికపాటి వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయి. నైరుతి నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ద్రోణుల వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో చింతలపూడిలో 7 సెం.మీ, సంతమగుళూరులో 5, అచ్చంపేటలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఈ రోజు అప్రమత్తంగా ఉండండి!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) శుక్రవారం హెచ్చరించింది. వానలతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా, ఛండీగఢ్, ఢిల్లీ, హిమాచల్, రాజస్థాన్, తెలంగాణ, గోవా రాష్ట్రాలతోపాటు కొంకణ్, విదర్భ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ను ఎన్డీఎంఏ ఉటంకించింది. ప్రాథమిక చికిత్స కిట్లు, టార్చిలైట్, మంచినీళ్ల సీసాలు, నిల్వవుండే ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలను ఎన్డీఎంఏ కోరింది. వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను చెరువులు, కాల్వల్లోకి వెళ్లనీయకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేరళ సహా పది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు 1400 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. -
తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జంషెడ్పూర్కు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో, కియాంజిర్గఢ్కు 130 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. గడచిన 24 గంటల్లో సోంపేట, కళింగపట్నంలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. -
తీర ప్రాంత వాసులకు హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు దక్షిణ మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు మరట్వాడా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిచోట్ల పెనుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని అనంతపురం మినహా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీలు (+2.4) అధికంగా రికార్డయింది. -
రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడుల మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో దాని ప్రభావంవల్ల రానున్న రెండు రోజులపాటు రాయలసీమ, ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం నుంచి అకాల వర్షాల ప్రభావం తగ్గుతుందని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉదయగిరిలో 5, వెలిగండ్లలో 4, మార్కాపూర్, కడప, ప్రొద్దుటూరుల్లో 3, రాజంపేట, పుల్లంపేట, నంబూరి పులికుంట్ల, కుప్పం, కమలాపురంలలో 2 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
రేట్లలో మార్పుల్లేవు
ముంబై: పెరుగుతున్న చమురు ధరలు, ఇతర అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ సంచలనాలకు పోకుండా సాదాసీదాగా ద్రవ్యపరపతి విధాన సమీక్షను ముగించేసింది. వడ్డీ రేట్లు తగ్గించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ డిమాండ్లను ప్రస్తుతానికి పక్కనపెట్టేసి కఠిన విధానానికే కట్టుబడింది. కీలకమైన రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ తాజా నిర్ణయాలను ప్రకటించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశాలకు దాదాపుగా తలుపులు మూసుకున్నట్టే అయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగానే నమోదు కాగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలకే ఆర్బీఐ కట్టుబడి ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో మంగళ, బుధవారాల్లో జరిగిన ఎంపీసీ సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆరుగురు సభ్యుల్లో రవీంద్ర హెచ్ డోలాకియా మాత్రం రెపో రేటును పావుశాతం తగ్గింపునకు ఓటేశారు. వృద్ధికి మద్దతుగా ఉండేందుకు గాను మధ్య కాలానికి వినియోగ ధరల ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (ప్లస్ లేదా మైనస్ 2) పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడమే తాజా నిర్ణయాల వెనుకనున్న ఉద్దేశంగా ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణానికే ప్రథమ ప్రాధాన్యం ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికే ఆర్బీఐ కట్టుబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ద్రవ్యోల్బణం 4.3–4.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ద్రవ్యోల్బణం అక్టోబర్–మార్చి కాలానికి 4.2–4.6 శాతంగానే ఉండొచ్చన్న అంచనాలను అక్టోబర్లో జరిగిన పాలసీ సమావేశంలో ఆర్బీఐ వ్యక్తం చేసింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఏడో వేతన కమిషన్ సిఫారసులతో ద్రవ్యోల్బణంపై పడే ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని తాజాగా సవరణలు చేసింది. జీడీపీ వృద్ధి 6.7 శాతం జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగానే ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో వృద్ధి 5.7 శాతంతో మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, రెండో క్వార్టర్లో 6.3 శాతంగా ఉంది. రెండో క్వార్టర్లో వృద్ధి రేటు గత అక్టోబర్ సమావేశంలో వేసిన అంచనాల కంటే తక్కువగా ఉండడానికి ఇటీవలే పెరిగిన చమురు ధరల ప్రభావం కంపెనీల మార్జిన్లపై, గ్రాస్ వ్యాల్యూ యాడెడ్(జీవీఏ)పై ప్రభావం చూపి ఉండొచ్చని ఆర్బీఐ పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ, సేవలు, ఇన్ఫ్రా రంగాల్లో డిమాండ్ పుంజుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డు లావాదేవీలకు బూస్ట్! డిజిటల్ చెల్లింపులను మరింతగా పెంచే దిశగా ఆర్బీఐ డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)లో మార్పులు చేసింది. చిన్న, పెద్ద వర్తకులకు వేర్వేరుగా రేట్లను నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్ కార్డు సేవలకు గాను వర్తకుల నుంచి బ్యాంకులు వసూలు చేసే చార్జీనే ఎండీఆర్గా వ్యవహరిస్తారు. వార్షిక టర్నోవర్ రూ.20లక్షల్లోపు ఉన్న వర్తకులకు ఎండీఆర్ చార్జీని 0.40 శాతంగా ఖరారు చేసింది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలకు మించి ఉన్న వ్యాపారులకు ఎండీఆర్ చార్జీలు లావాదేవీ విలువలో 0.90 శాతంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం... మోడీ ప్రభుత్వానికి ఇప్పుడిదే పరీక్ష! 2014 మే నెలలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగానే 8.33 శాతంగా ఉండేది. 2017 జూన్ నాటికి ఏకంగా 1.54 శాతం స్థాయికి పడిపోయింది. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 8.89 స్థాయి నుంచి 0.61 శాతానికి చేరువయ్యింది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ ఏడాది భారీగా పడిపోవడం దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఒక దశలో బ్రెంట్ క్రూడ్ బేరల్ ధర 44.50 డాలర్ల దిగువ స్థాయిని సైతం చూసింది. ఈ దన్నుతో ప్రభుత్వం ధరల కట్టడికి తీసుకుంటున్న చర్యలూ ఫలించాయి. 2 ప్లస్ లేదా మైనస్తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశించుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో... ఆర్బీఐ రెపో రేటును 2017 ఆగస్టు నాటికి ఏడేళ్ల కనిష్ట స్థాయి 6 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారిపోయింది. క్రూడ్ ధర మూడేళ్ల గరిష్ట స్థాయిలను (64.65 డాలర్లు) చూస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, ఇకపై మోదీ సర్కారుకు ఇది పెద్ద పరీక్షే. ద్రవ్యోల్బణం భయాలతో ఇప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపుకు నో అంటోంది. ఈ విషయంలో ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల ఒత్తిడికీ తలొగ్గడం లేదు. అక్టోబర్లో ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ట స్థాయి 3.58 శాతంగా నమోదయ్యింది. వచ్చే ఆరు నెలల్లో 4.7 శాతం వరకూ పెరుగుతుందన్నది ఆర్బీఐ తాజా అంచనా. వృద్ధికి మెరుగైన అవకాశాలు: పటేల్ సాధారణంగా సీజన్ వారీ ఆహార ధరలు మోస్తరు స్థాయిలో ఉండొచ్చని, ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లు ఒత్తిళ్లను కొంత మేర తగ్గించొచ్చని ఎంపీసీ భావిస్తోంది. తన తటస్థ విధానాన్ని కొనసాగిస్తూనే ద్రవ్యోల్బణం, వృద్ధిపై వచ్చే గణాంకాలను జాగ్రత్తగా గమనిస్తుంది. ఇటీవలి పరిణామాల (ప్రభుత్వ చర్యలు)తో వృద్ధికి మంచి అవకాశాలున్నాయి’’ – ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ అంచనాలకు అనుగుణంగానే... దేశీయ బ్యాంకుల విదేశీ సబ్సిడరీలు ఏఏఏ– రేటింగ్ కలిగిన కార్పొరేట్ సంస్థలకు రీఫైనాన్స్ చేసేందుకు అనుమతించడం వల్ల బ్యాంకులు నాణ్యమైన అసెట్స్ (ఖాతాలు)ను నిలబెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది. పాలసీ రేట్లలో మార్పుల్లేకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉంది. – రజనీష్కుమార్, ఎస్బీఐ ఎండీ తగిన నిర్ణయం... సంస్కరణలు, బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ వంటి చర్యల కారణంగా వృద్ధి మరింత మెరుగయ్యే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంది. లిక్విడిటీ కార్యాచరణపై ఆర్బీఐ స్పష్టత స్వాగతించతగ్గది. అవసరమైతే లిక్విడిటీనీ సర్దుబాటు చేసేందుకు, పెంచేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంది’’ – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో ముఖ్యాంశాలు ►రెపో రేటు 6 శాతం. ►రివర్స్ రెపో రేటు 5.75 శాతం. ► ద్రవ్యలోటుపై తస్మాత్ జాగ్రత్త... ►2017–18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం. ►ఎంపీసీ నిర్ణయాలకు ఐదుగురు సభ్యులు ఆమోదం తెలుపగా ఒకరు వ్యతిరేకించారు. ► తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7 తేదీల్లో జరగనుంది. -
అలర్ట్: కోస్తాకు వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో కోస్తాకు వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు అల్పపీడనం పయనిస్తోందని.. అల్పపీడనం మరింత బలపడినట్టు వాతావరణం కేంద్రం తెలిపింది. అది వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 230 కి.మీ.. విశాఖకు దక్షిణంగా 300 కి.మీ, గోపాల్ పూర్కు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం ఈశాన్య దిశగా పయనించనుంది. దీంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. -
ప్రకృతి తప్పా, ప్రభుత్వాల తప్పా?
న్యూఢిల్లీ: కేరళకు ముందుగానే తాకిన నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా విస్తరిస్తాయి. ఈసారి సాధారణ వర్షపాతం పడుతుందని కేంద్ర వాతావరణ శాఖ చల్లటి కబురును మోసుకొచ్చింది. గత మూడేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా పడని కారణంగా కరువుతో అల్లాడిపోతున్న దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు ఇది చల్లటి కబురే. దేశంలో వ్యవసాయం 80 శాతం ఈ నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ప్రధాన వృత్తయిన వ్యవసాయంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయోత్పత్తులు 18 శాతం ఆక్రమిస్తుందన్న విషయం తెల్సిందే. తాగునీటి అవసరాల రీత్యా దక్షణ భారత దేశానికి వేసవిలో వర్షాలు పడడం కూడా అవసరమే. ఈసారి వేసవిలో పెద్దగా వర్షాలు పడలేదు. దక్షిణాదిలో నదులు, కాల్వలు, చెరువులు ఎక్కువగా ఎండిపోయాయి. దేశంలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ నీటి వనరులను సంరక్షించుకునేందుకు చాలినన్ని ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఆ నీరంతా వధాగా సముద్రాల్లో కలుస్తూ వచ్చాయి. నేడు తమిళనాడు 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2015, డిసెంబర్ నెలలోనే చెన్నైలో అసాధారణ వర్షాలు పడి వరదలొచ్చాయి. క్యాచ్మెంట్ ఏరియా కూడా నీట మునిగింది. ఆ నీటిని సంరక్షించుకునే అవకాశం లేకపోవడంతో 60 శాతం నీరు వధాగా సముద్రంలో కలిసింది. అంత వర్షంపాతం పడిన ఏడాదిలోనే మంచినీటి కోసం తమిళనాడు అల్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాల తప్పా? ప్రకతి తప్పా? తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా నేడు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లులేక అల్లాడు తున్నాయంటే ఎవరి తప్పు?భారత దేశంలో రుతుపవనాలు విఫలం అవడానికి పర్యావరణ పరిస్థితులు క్షీణించడమే ఏకైక కారణమని ప్రధాని నరేంద్ర మోదీ 2016లో చెప్పారు. అది నిజమే, రుతుపవనాలు సవ్యంగా వచ్చి వర్షాలు వస్తే వాటిని ఒడిసి పట్టుకునేందుకు సరిపడా ప్రాజెక్టులు దేశంలో లేవన్న విషయం ఆయన ప్రభుత్వానికి తెలియదా? నీటి ప్రాజెక్టుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదు కావచ్చు, జాతీయ నదులపై జాతీయ ప్రాజెక్టులను చేపట్టవచ్చుగదా! వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రూపుదిద్దుకున్న నదుల అనుసంధానం ప్రణాళిక నేడేమయింది, గంగలో కలిసిందా? -
నాస్కామ్ అంచనాలపై ట్రంప్ ఎఫెక్ట్
ఐటి పరిశ్రమ యొక్క అత్యున్నత కమిటీ నాస్కామ్ తొలిసారి వెనకడుగు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమపై అంచనాలపై దూరంగా జరిగింది. నాస్కామ్ ఏర్పాటైన 25 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2018 ఆర్థిక సంవత్సర అంచనాలపై ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఆధారపడే ఐటీ పరిశ్రమ మందగింపు ప్రభావంతో ఈ వైఖరి తీసుకుంది. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాస్కామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో తాత్కాలికంగా పరిస్థితి అనిశ్చితంగా ఉందని పేర్కొంది. తమ నిపుణుల గణాంకాలు ఆధారంగా 6-10 శాతం వృద్ధి సలహా ఇచ్చినప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు చెప్పారు. మరో క్వార్టర్ వరకు తమ గైడెన్స్ అంచనాలను వాయిదా వేసుకున్నట్టు నాస్కాం ఛైర్మన్ సీపీ గుర్నాని తెలిపారు. అనేక అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రభావితమైనట్టు తెలిపారు. ఈ క్రమంలో తరువాతి త్రైమాసికంలో మాత్రమే అంచనాలను అందివ్వగలమని చెప్పారు. వినియోగదారులు, ఇతర వాటాదరారులతో లోతుగా చర్చించిన అనంతరం అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ, బిజనెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ సెక్టార్ల తరువాతి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను బహుశా మే నెలలో అందిస్తామన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న డిజిటల్ వార్ కారణంగా ఐటీ సెక్టార్ నైపుణ్యతలను పెంచుకోవాలని చెప్పారు. సుమారు 1.5 కోట్ల ఉద్యోగులకి తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో నైపుణ్యత శిక్షణ కావాలన్నారు. మరోవైపు 2017 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ వృద్ధి8.6 శాతం ఉండనుందని అంచనా. దీనిలో 12-15 శాతం ఐటి రంగంలో చోటుచేసుకోనున్న డిజిటల్ రంగానిదేనని విశ్లేషించారు. కాగా ఐటీ పరిశ్రమ గైడెన్స్పై 10-12 శాతంగా నిర్ణయించిన నాస్కామ్ తన అంచనాలను గత డిసెంబర్లో సవరించిన సంగతి తెలిసిందే. -
ఎన్పీఏల వసూలుకు గట్టి చర్యలు చేపట్టండి
బ్యాంకులకు జైట్లీ సూచన న్యూఢిల్లీ: దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకులు మొండి బకాయిల వసూలుకు తమ అధికారాలను వినియోగించుకుని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోవడాన్ని దేశ ఆర్థిక రంగం ముందున్న అతిపెద్ద సవాలుగా ఆయన అభివర్ణించారు. అవినీతి నిరోధక చట్టంలో మార్పులతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్పీఏల వసూలులో వెసులుబాటు లభిస్తుందన్నారు. ఢిల్లీలో కాగ్ నిర్వహించిన ఓ సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఎన్పీఏల విషయంలో చట్టపరంగా, నిబంధనల పరంగా ఎన్నో పటిష్ట చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ‘‘ఎన్పీఏల వసూలుకు బ్యాంకులు తమ అధికారులను వినియోగించుకోవాలి. భారీ మొత్తంలో నగదు ఒకే వర్గం వద్ద నిలిచిపోతే, ఇతరులకు రుణాలిచ్చే అవకాశాలు దెబ్బతింటాయి. కొన్ని కేసుల విషయంలో బ్యాంకులు గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుగా తగిన వీలు కల్పించాం. దీని ద్వారా ప్రజా ధనాన్ని నిరవధికంగా కలిగి ఉండరాదనే విషయాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బ్యాంకుల ధనం ప్రజాధనమే’’ అని స్పష్టం చేశారాయన. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణాల్లో 9.32 శాతానికి పెరిగిపోయి రూ.4.76 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. -
ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖ: ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
అభిమానులకు రామ్ సూచన
ఈ జనరేషన్ హీరోలు అభిమానుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సినిమా వేడుకలను ఎంత గొప్పగా నిర్వహించాం అన్నదానికన్నా, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో రామ్ కూడా తన అభిమానులకు ఈ మేరకు పిలుపునిచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న హైపర్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఇబ్బంది కరంగా తయారవ్వటంతో.. 'హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అంత సురక్షితం అనిపించటం లేదు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా ఫంక్షన్ కు రాకండి. టివిలో లైప్ ద్వారా చూడొచ్చు' అంటూ ట్వీట్ చేశాడు. నేను శైలజ సక్సెస్ తరువాత రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హైపర్. గతంలో రామ్ కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.My dearest fans,the roads dont seem safe.Yemaatram risk anipinchina pls Refrain from coming to the event. You can watch it Live on TV.#love pic.twitter.com/7IxgBQwcd7— Ram Pothineni (@ramsayz) 23 September 2016 -
ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు
విశాఖపట్నం: ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. దక్షిణ కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కరుణించని మేఘాలు.. కురవని వానలు
అడుగంటిన భూగర్భజలాలు ముదురుతున్న వరినారు ఆందోళనలో అన్నదాతలు నిరాశగా ఖరీఫ్ సాగు ముస్తాబాద్ కమ్ముకొచ్చే నల్లని మేఘాలు.. ఆహ్లాదం పంచే చల్లని వాతావరణం.. చినుకులు కురవని రోజు లేదు.. చెరువులు, కుంటలు నిండేదిలేదు.. ఇది ప్రస్తుత ఖరీఫ్ పరిస్థితి. ఇది వానకాలపు పంటల సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అన్నదాతలు సాధారణ స్థాయిలోనూ సాగుకు ఉపక్రమించలేదు. ఎత్తిపోయిన ఎగువ మానేరు ప్రాజెక్టు.. ఎగువ మానేరు ప్రాజెక్టు దాదాపు డెడ్ స్టోరెజీకి చేరింది. 32 అడుగుల నీటి మట్టం గల ప్రాజెక్టులో ప్రస్తుతం రెండు అడుగుల నీరు కూడా లేదు. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవక కూడవెల్లి, పలాంచవాగుల్లోకి చుక్కనీరు చేరలేదు. ఫలితంగా ప్రాజెక్టు ఆయకట్టు 16 వేల ఎకరాలు బీడుగానే ఉంది. ఒక్క ముస్తాబాద్లోనే పదివేల ఎకరాల ఆయకట్టు ప్రాజెక్టుకింద ఉంది. భూగర్బజలాలు లేక ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది. ప్రధాన చెరువులైన ఆవునూర్, నామాపూర్, బందనకల్, ముస్తాబాద్, గూడెం, కొండాపూర్, చీకోడు, చిప్పలపల్లి, తెర్లుమద్ది గ్రామాల్లో ఒక్కచెరువు కూడా నీటితో నిండలేదు. మరోరెండు నెలలే వర్షాకాలం ఉంది. ఇప్పటికే సాగు అదను దాటిపోయింది. దీంతో ఖరీఫ్పై అన్నదాతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయం వైపు చూపు.. ఆశించిన మేరకు వర్షాలు కురవక రైతులు ఈసారి వరి, పత్తి సాగుకు దూరంగా ఉన్నారు. అయితే ఆరుతడి పంటలు వేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కూరగాయలు, మినుము, పెసర, కంది, సోయా, మొక్కజొన్న వంటి పంటలు సాగుతో వర్షాభావాన్ని అధిగమించవచ్చని చెబుతున్నారు. ముస్తాబాద్లో వర్షపాతం వివరాలు(మి.మీ.లలో..) నెల సాధారణం నమోదైనది జూన్ 126.2 130.4 జూలై 177.9 206.8 మండలంలో సాగు విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో..) పంట సాధారణం సాగైంది వరి 2770 2285 పత్తి 2722 2120 మొక్కజొన్న 457 510 కంది 121 485 పెసర 140 157 -
సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
హైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 29న కేరళ తీరాన్ని తాకుతాయని, దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం ఎక్కువ మోతాదులో వర్షాలు పడతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సగటు కంటే అయిదు శాతం ఎక్కువగా వానలు కురుస్తాయని, మరో ఐదు శాతం ఎక్కువ వర్షాలకు 20 శాతం వరకూ అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. మే నెల 17వ తేదీకల్లా అండమాన్ సముద్రాన్ని చేరుకునే రుతుపవన మేఘాలు ఆ తరువాత 12 రోజులకు కేరళ తీరాన్ని తాకుతాయని స్కైమెట్ వాతావరణ నిపుణులు పల్వట్ మహేశ్ 'సాక్షి'కి తెలిపారు. రెండేళ్ల వర్షాభావానికి కారణమైన ఎల్ నినో ప్రభావం ఇప్పటికే తగ్గుముఖం పట్టగా, వచ్చే నెలకు సున్నా స్థాయికి చేరుకోనుంది. దీంతో ఈ ఏడాది రుతుపవనాలకు మార్గం సుగమమైనట్లు ఆయన తెలిపారు. జూన్ 6వ తేదీకల్లా తెలంగాణ, 12వ తేదీకి ముంబైలను తాకుతాయని, జూలై పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని ఆయన వివరించారు. మరోవైపు తూర్పువైపున కూడా రుతుపవనాలు చురుకుగా కదులుతాయని, జూన్ పదవ తేదీకల్లా కోల్కతాను తాకే అవకాశముందని చెప్పారు. రుతుపవనాలు దేశానికి ఇరువైపుల నుంచి నెమ్మదిగా ఎగబాకుతూ జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే కొంచెం తక్కువ వర్షాలు కురిసినప్పటికీ జూలై, ఆగస్టుల్లో 110 శాతం మేరకు వానలు పడతాయని తెలిపారు. ఈ సీజన్లో తమిళనాడు, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఆయన చెప్పారు. -
బాధ్యతతో మెలగండి
కొత్త కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ సూచన తమ బాధలు, కష్టాలు తొలగిపోతాయనే టీఆర్ఎస్కు ప్రజల పట్టం వాటిని తీర్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉంది ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ను కలసిన కార్పొరేటర్ల బృందం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్కు ప్రజలు కట్టబెట్టిన విజయం ఆషామాషీ విషయం కాదని... తమ బాధలు, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతో ఈ మహత్తర విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రజలు తమ దుఃఖాన్ని, కష్టాలను, సమస్యలను మన చేతుల్లో పెట్టారని, వాటిని తీర్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో కోటి మంది జనాభా ఉంటే కేవలం 150 మందికి మాత్రమే కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారన్నదే ముఖ్యమని కొత్త కార్పొరేటర్లకు సూచించారు. జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. గ్రేటర్ ప్రజలు అతిపెద్ద, గొప్ప విజయాన్ని కట్టబెట్టారని.. వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. జీవితంలో చాలా మందికి ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం వస్తుందని, పదవులు రావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని చెప్పారు. ‘‘జీహెచ్ఎంసీ నుంచి ఖర్చు పెట్టే ప్రతీ పైసా పేదల సంక్షేమానికి ఉపయోగపడాలి. మంచినీరు, విద్యుత్, రహదారులు, మురికి కాలువలు తదితర మౌలిక సదుపాయాల విషయంలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. హైదరాబాద్లోని పేదలకు ఈ ఏడాది లక్ష ఇళ్లు కట్టిద్దామనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు బాగా జరిగేలా చూడాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. బాబు 15 సభలు పెడితే ఒకే సీటు వచ్చింది.. ఎన్నికల సందర్భంగా కొంత మంది ఆంధ్ర, తెలంగాణ అని విభజన తెచ్చే ప్రయత్నం చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు 15 చోట్ల సభలు పెట్టిండు. వారికి జనం ఒక్క సీటు ఇచ్చిండ్రు. నేను కేవలం ఒకే సభ పెట్టిన. మనకు 99 సీట్లు ఇచ్చిం డ్రు. ప్రజలు మనపై నమ్మకం పెట్టిండ్రు. హైదరాబాద్ ప్రజలంతా మనల్ని నమ్మిండ్రు. వారి ఆకాంక్షలకు తగ్గట్లు పనిచేయాలె. నగరాభివృద్ధి కోసం, పేదల సంక్షే మం కోసం మంచి ప్రణాళిక తయారు చేసుకుందాం. త్వరలోనే కార్పొరేటర్లకు రెండు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తం. నగరానికి ఏం చేద్దాం, నిధులు ఎలా ఖర్చు పెడదాం, ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకు పోదాం.. అనే విషయంపై చర్చిద్దాం. ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి భూమ్మీదికి రాలేదు. ఉన్నకాలంలో ఎంత బాగా పనిచేశామన్నదే ముఖ్యం. మీరంతా కూడా మంచిగా పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.