-
కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద
ముంబై : భారత్లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్ ఇండియా జాబితాలో ముఖేష్ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్ వ్యాఖ్యానించింది. ముఖేష్ అంబానీ వరుసగా 13వ సారి భారత్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా ఆరో ర్యాంక్ను సాధించి టాప్ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా సంపద శాతాల ప్రాతిపదికన అత్యధికంగా ఎగిసిందని, కొద్దిమంది బిలియనీర్ల సంపద మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2020లో తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. చదవండి : ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు -
కోహ్లికి ‘టాప్’ ర్యాంక్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీల జాబితాలోనూ ‘టాప్’ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఈ ‘రన్ మెషిన్’ తాజాగా భారత టాప్–100 సెలబ్రిటీల్లోనూ నంబర్వన్గా నిలిచాడు. మొత్తం రూ. 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫోర్బ్స్ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయంతోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్ ‘టాప్’లేపేవాడు. కానీ ఫోర్బ్స్ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి. ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య (ఫాలోవర్స్)లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్ మేగజైన్ తాజా సంపన్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి అగ్రతాంబూలమిచి్చంది. టాప్–100లో క్రీడాకారుల సంఖ్య పెరిగింది. 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా, సునీల్ ఛెత్రి (ఫుట్బాల్), మేరీకోమ్ (బాక్సింగ్), బజరంగ్ (రెజ్లింగ్), అనిర్బన్ (గోల్ఫ్), బోపన్న (టెన్నిస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. -
ఫోర్బ్స్‘కలెక్టర్స్ ఎడిషన్’లో... ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజీన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మేఘా బిల్డర్’ పేరుతో ఫోర్బ్స్ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రచురించిన ఈ వ్యాసంలో, 1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది. 14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు– కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని పలు ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది. భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
‘ఫోర్బ్స్ ఇండియా’లో మనోడు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియజేసేందుకు ’ఫోర్బ్స్’ పత్రిక రూపొందించిన తాజా ప్రత్యేక సంచికలో నగరవాసికి చోటు లభించింది. నగరానికి చెందిన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ ‘క్రియేటివ్ మెంటర్స్’ వ్యవస్థాపకుడు కొవ్వూరి సురేశ్రెడ్డికి జాబితాలో చోటు లభించడంపై ‘క్రియేటివ్’ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్న వయసులోనే యానిమేషన్ సంస్థని స్థాపించి, 13 ఏళ్ల వ్యవధిలోనే ’ఫోర్బ్స్’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేశ్రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ నెలాఖరులో విశ్వవ్యాప్తంగా విడుదల కానున్న ఫోర్బ్స్ ఇండియా పత్రికలో డాక్టర్ పి.శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, హెచ్సీఎల్ శివ నాడార్, యదుపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, హావెల్స్ అనిల్రాయ్ గుప్తా, మహేంద్ర గ్రూప్స్ ఆనంద్ జి.మహేంద్ర... ఇలా 51 మంది అగ్రగామి వ్యాపారవేత్తల సరసన నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 30 ఏళ్ల వయసులోనే అనూహ్య విజయాలు సాధిస్తున్న 30 మంది జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించింది. అందులో మన తెలుగు నటుడు విజయ్ దేవరకొండకు స్థానం లభించగా... తాజా సంచికలో సురేశ్రెడ్డికి చోటు దక్కడం విశేషం. ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుకు అర్హత... ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ కాప్చర్ యానిమేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టడం, వేలాది మంది విద్యార్థులను యానిమేషన్ సంబంధిత రంగాల్లో తీర్చిదిద్దడం, ఇటీవల ప్రసాద్స్ ల్యాబ్స్తో కలసి సినీరంగంలో విభిన్న శాఖల్లో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణనివ్వడం... ద్వారా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ నగరంలో యువతకు కెరీర్ పరంగా విభిన్న సేవలు అందిస్తోంది. మే 30న లండన్లో బీబీసీ సౌజన్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ కాన్క్లేవ్–2019’ కార్యక్రమంలో భాగంగా ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సంచికలో చోటు సంపాదించిన 51 మందిని నామినేటెడ్ పర్సన్స్గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్రెడ్డికి ఆ పురస్కారం కూడా దక్కితే అది మన నగరానికి మరింత గర్వకారణం అవుతుందని క్రియేటివ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేశ్రెడ్డి మాట్లాడుతూ... ఇది తన జీవితంలో ఊహించని, మరిచిపోలేని పరిణామం అన్నారు. చిన్న వయసులోనే సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఎల్వీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ‘అర్జున్రెడ్డి’
2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్లో చూడొచ్చని తెలిపింది. 16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్, పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్ కాంత్, అనురాగ్ శ్రీవాస్తవ, రోహన్గుప్త, ఇంకా నింజా కార్ట్ ద్వారా రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్, శరత్ లోగనాథన్, అశుతోష్ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
‘భారత కుబేరుడు’.. టీ కొట్టు యజమాని
కొచ్చి : కలలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించేది కొందరే. కేరళకు చెందిన విజయన్ దంపతులు ఈ కోవకు చెందినవారే. తమ చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి వీరు చేస్తున్న కృషిని మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కొనియాడారు. ప్రపంచ పర్యటనే లక్ష్యంగా గత 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధ దంపతులు నిజమైన ‘భారత కుబేరులు’ అంటూ కితాబిచ్చారు. ఈ ఆదర్శ దంపతుల విదేశీ యాత్రలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ వారిపై ప్రశంసలు కురిపించారు. రోజూ రూ.300 పొదుపుతో.. కొచ్చిలో ఉన్న విజయన్ దంపతుల టీ స్టాల్ ఫేమస్. రోజూ 350 మందికి క్యాటరింగ్ చేస్తారు. తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో వీరు రోజూ రూ.300 పొదుపు చేస్తారు. తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే సింగపూర్, అర్జెంటీనా, పెరు, స్విట్జర్లాండ్, బ్రెజిల్ లాంటి 23 దేశాలను చుట్టివచ్చిన విజయన్ దంపతులు మరిన్ని దేశాల్లో పర్యటించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ‘దేశదేశాలు చుట్టి రావాలన్నది నా చిన్ననాటి కల. అందుకోసం సొమ్ము కావాలి. దానికోసమే నిలకడగా ఆదాయాన్నిచ్చే టీ వ్యాపారాన్ని ఎంచుకున్నాను’ అని చెప్పుకొచ్చారు విజయన్. 1963 లో ప్రారంభమైన విజయన్ టీ స్టాల్కు విదేశీ యాత్రికుల తాకిడీ ఎక్కువే. ఇతర దేశాలు తిరిగిన అనుభవాల్లోంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు ‘మన దృక్పథం, మైండ్, మన సంస్కృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి’ అని బదులిచ్చాడు. జీవితంలో జీవించేందుకు డబ్బు ఒక్కటే కాదు.. గొప్ప సంకల్పం కూడా ఉండాలని చాటిచెప్తున్న ఈ వృద్ధ దంపతులు నిజంగా గ్రేట్ కదా.. ఏమంటారు..!! ఈసారి తప్పకుండా వెళ్తా.. సంపద విషయంలో ఈ దంపతులు ఫోర్బ్స్ లిస్టులో లేకపోవచ్చు. కానీ, నా ఉద్దేశంలో విజయన్ దంపతులు భారతదేశంలోనే అత్యంత సంపన్నులు అని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. ఈసారి కొచ్చి వెళ్లినప్పుడు అక్కడ టీ తీసుకుని, వారి పర్యటనల విశేషాలు తెలుసుకుంటానని ట్వీట్ చేశారు. They may not figure in the Forbes Rich list but in my view, they are amongst the richest people in our country.Their wealth is their attitude to life. The next time I’m in their town I am definitely dropping by for tea & a tour of their exhibits.. pic.twitter.com/PPePvwtRQs — anand mahindra (@anandmahindra) January 9, 2019 -
ఎవరి సంపాదన ఎక్కువ?
‘షారుక్ఖాన్ సినిమాకు ఇన్ని కోట్లు తీసుకుంటారట, సల్మాన్ అయితే ‘బిగ్ బాస్’ ఒక్క ఎపిసోడ్కే అన్ని కోట్లు పుచ్చుకుంటారట!’ అని మాట్లాడుకుంటూనే ఉంటాం. సామాన్యుల్లో స్టార్స్ సంపాదన ఎప్పుడూ ఓ హాట్ టాపిక్కే. ఇదే సంభాషణలకు సర్వే రూపం ఇచ్చి ఓ జాబితాను ప్రతి ఏడాదీ రిలీజ్ చేస్తుంటుంది ఫోర్బ్స్ మేగజైన్. సినిమా తారలు, క్రికెటర్స్ ఆ ఏడాది (సర్వే నిర్వహించే కాలం)లో ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి సెప్టెబర్ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్లు, చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్ ఖాన్ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్లో టాప్లో నిలిచారు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్ హీరోల్లో రజనీకాంత్ టాప్లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్ కల్యాణ్ 24వ పొజిషన్లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు. బ్లాక్బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ (15.67 కోట్లు), రామ్చరణ్ (14 కోట్లు), లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్ కూడా లేకపోవడమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు. దీపికా రికార్డ్.. నయన కూడా! 112.8 కోట్లతో దీపికా పదుకోన్ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్ రికార్డ్ సృష్టించారు. ‘పద్మావత్’ లో హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం, అలాగే తను చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఆమెను టాప్ 5లో నిలిచేలా చేశాయని ఊహించవచ్చు. సౌత్ నుంచి హీరోయిన్స్లో నయనతార మాత్రమే ఈ లిస్ట్లో నిలవడం విశేషం. 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్. -
అభివృద్ధి ఆర్థిక అసమానతలు
ఫోర్బ్స్ పత్రిక వారు ప్రతి ఏటా భారతదేశంలో అత్య ధిక సంపన్న వంతుల జాబితాను ఒక దానిని ప్రక టిస్తూ ఉంటారు. అందులో ప్రథమ స్థానంలో చాలా ఏళ్లుగా ముఖేష్ అంబానీ పేరు ఉంటున్నది. మొదటి వందమంది ప్రపంచ స్థాయి సంపన్నులలో ముఖేష్ అంబానీతోపాటు అజిత్ ప్రేమ్ జీ, శివ నాడార్ వంటి కొందరి పేర్లుఉంటాయి. భారతీయులుగా మనమంతా వారు సాధించిన విజయాలకు ప్రపంచస్థాయిలో వారి సంపద స్థాయికి గర్వపడుతుంటాము. అంత గర్వ పడవలసిన అంశం దీనిలో ఏమైనా ఉన్నదా? 2000–2014 మధ్య భారతదేశంలో పెరిగిన ఆదాయం ఎక్కువ భాగం అత్యున్నతంగా 10 శాతా నికి వెళ్లిందని మధ్యతరగతిగా పరిగణించబడే తరు వాతి 40 శాతం ఆదాయం 2000–2014 మధ్య గణ నీయంగా తగ్గిందని కాబట్టి మధ్యతరగతి వారి నుంచి బహుళజాతి సంస్థల వస్తువులకు భారతదే శంలో చైనాలోలాగా డిమాండ్ ఉండే అవకాశం లేదని అందువలన బహుళజాతి సంస్థలు వాటి కార్యక్రమాలు దేశంలో విస్తరించుకోవడం లాభదా యకం కాకపోవచ్చునని ఎకానమిస్ట్ పత్రికలోని వ్యాసం సారాంశం. ఆ విషయ వివరణకు వారు ఆధారపడిన గణాంకాలను చూస్తే మనకు ఇంకొక కోణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది దేశంలో 2000–2014 మధ్య వివిధ తరగతుల మధ్య ఆర్థిక అసమానతలు విస్తృతంగా పెరిగాయన్న విషయం. 2000 సంవత్సరంలో అత్యధిక సంపద కలిగిన 10 శాతం జనాభా చేతుల్లో దేశ ఆదాయం 40 శాతం ఉంది. వారి తరువాత ఉన్న 40 శాతం జనాభాకు కూడా దేశ ఆదాయంలో 40 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక మిగిలిన 50 శాతం జనాభాకు దేశ ఆదాయంలో 20 శాతం వాటా ఉంది. 2014 సంవత్సరానికి అత్యధిక 10 శాతం జనాభా వాటా దేశ ఆదాయంలో 40 శాతం నుంచి దాదాపు 60 శాతం దాకా పెరిగింది. మిగిలిన 40 శాతం మధ్య తరగతి వాట 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమిస్ట్ పత్రిక లోని వ్యాసంలో మధ్యతరగతి వారి జాతీయ ఆదా యంలో వాటా పెరుగుదల బదులు తరుగుదల ఉన్నది కాబట్టి భారత్లో భవిష్యత్తులో బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు తగిన గిరాకీ ఉండకపోవచ్చు ననే నిర్ధారణకు ఆ వ్యాసకర్త వచ్చాడు. కేవలం భారత్ను అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ఒక మార్కెట్ దృష్టితో చూశారు కాబట్టి ఆ వ్యాసకర్త దృష్టంతా మధ్యతరగతి వారి జాతీయ ఆదాయంలో వాటా తరుగుదల మీదనే ఉంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ ఆదాయ అభివృద్ధి పంపిణీలో మనదేశంలో ఉన్నంత అసమతౌల్యం కనిపించటం లేదని ఆ పత్రిక వారి అభిప్రాయం. కానీ ఆపై గణాంకాలు ఇంకొక ప్రమాదకరమైన ఆర్థిక అసమానతలను సూచిస్తున్నాయి. దేశ భవి ష్యత్తు దృష్ట్యా ఆ అంశంపై మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే 50 శాతం జనాభాకు జాతీయ ఆదాయంలో భాగం 2000 సంవత్సరంలో 20 శాతం ఉంటే 2014 సంవత్సరా నికి అది 15 శాతానికన్నా తగ్గింది. అంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంది. జాతీయాదాయంలో మధ్యతరగతి, చివరి తరగతి ప్రజల వాటా తగ్గి 10% సంపన్న వర్గం వాటా గణనీయంగా పెరిగింది. దీని ప్రభా వమే భారతదేశం అతి విలాసవంతమైన వస్తువుల డిమాండ్ కొనుగోలు కేంద్రంగా ఏర్పడింది. మధ్య తరగతి ఆదాయం గణనీయంగా పెరిగితే బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశ ముంది. కానీ క్రింది 50 శాతం జనాభా ఆదాయం గణనీయంగా పెరిగితే దేశీయ సంస్థల ఉత్పత్తులకు గణనీయంగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. పైగా, 10 శాతం అత్యున్నత జనాభా సంపద పెరిగితే వారు విహారయాత్రకు స్కాట్లాండ్ దేశానికి పోయే అవకాశం ఉంది. మధ్యతరగతి వారి ఆదాయాలు పెరిగితే శ్రీలంక లాంటి దేశాలకు వెళతారు. కానీ చివరి 50 శాతం వారి ఆదాయాలు పెరిగితే వారు సందర్శించే స్థలాలు భారతదేశంలోనే ఉంటాయి. వారు చేసే ఖర్చు దేశ సంపదను పెంచుతుంది. భారత్ వస్తువుల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ వస్తువులకు తగిన గిరాకీ ఏర్పడాలంటే 50 శాతం చివరి తరగతి జనాభా ఆదా యాలు గణనీయంగా పెరిగే విధానాలపై దృష్టి సారించాలి. అలా చేయనప్పుడు జాతీయ ఉత్పత్తి పెరుగుదల పేదరిక నిర్మూలనకు తోడ్పడకపోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక అసమానతలు సామాజిక ఉద్రి క్తతలకు దారి తీయవచ్చు. పై పది శాతం ఆదాయా భివృద్ధి విదేశీ వస్తువుల గిరాకీ పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియా విధానానికి తోడు పడకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
పెళ్లి చేసుకోవాలని ఉంది: టాప్ హీరోయిన్
ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నటీమణుల్లో ఎక్కువగా విజయం సాధించిన వారిలో ఈమె ఒకరు. ఇటీవల ఆమె బాలీవుడ్ హీరోలకు దీటుగా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క నటి ప్రియాంక మాత్రమే. అంతేకాక భారత్లో మాత్రమే కాక, అమెరికాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో మూడో పార్ట్లో నటిస్తోంది. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్ట్లోనూ ప్రియాంక షూటింగ్ను ప్రారంభించబోతుంది. ఇటు బాలీవుడ్లోనూ.. అటు హాలీవుడ్లోనూ దూసుకుపోతున్న ఈ భామ పెళ్లెప్పుడు చేసుకుంటుందా? అని ఆలోచించని వారుండరు. ఇంతకీ ఈ భామకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉందా? లేదా? అంటూ ఇటీవల ఢిల్లీ ఈవెంట్కు వచ్చిన ప్రియాంకకు పెళ్లి ముచ్చట్లు ఎదురయ్యాయి. ''కచ్చితంగా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇప్పటివరకు నేను చేసిన హార్డ్ వర్క్ను అభినందించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అమ్మ చెప్పింద’ని ప్రియాంక పేర్కొంది. కానీ తగిన అబ్బాయి దొరకడమే కష్టమైన పని అనిపిస్తుందంటూ నవ్వేసింది. -
ఫోర్బ్స్ జాబితాలో బ్యాడ్మింటన్ స్టార్లు
న్యూఢిల్లీ: ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో హైదరాబాద్ షట్లర్లు ముగ్గురికి చోటు దక్కింది. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు (13వ ర్యాంక్), కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ (29వ ర్యాంక్) ఈ జాబితాలో ఉన్నారు. 2017లో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరిన మరో షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (83)కు కూడా టాప్–100లో స్థానం లభించింది. -
అగాథంలో భారత ఆర్థిక వ్యవస్థ
సాక్షి, ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తీవ్రంగా మందగించినా... దేశంలోని 100 మంది ధనికులు ఆస్తులలో మాత్రం నాలుగో వంతు అభివృద్ధి కనిపించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. దేశంలోని 100 మంది ధనికుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ‘మందగించిన ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత సంపన్నులవుతున్న భారత సంపన్న దిగ్గజాలు’ అంటూ ఓ పరిశోధనాత్మక కథనాన్ని కూడా ఫోర్బ్స్ ప్రచురించింది. నోట్ల రద్దు, జీఎస్టీలే కారణం పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణమని తెలిపింది. ఈ రెండింటి వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగానే గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయి(5.7 శాతానికి) వృద్ధి రేటు దిగజారింది. దీంతో సంబంధం లేకుండా దేశంలోని సంపన్నుల ఆస్తులు 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని చూశాయి. ఒక్క ఏడాది.. రూ. లక్ష కోట్లు.. దేశ ధనవంతుల్లో ముకేశ్ అంబానీ కొద్ది సంవత్సరాలుగా తొలిస్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్నారు. 2017లోనూ ఆయన కుబేరుడిగానే నిలిచారు. చమురు, గ్యాస్ వ్యాపారాల్లో ఈ ఏడాది ముకేశ్ లాభపడినట్లు ఏ ఇతర భారతీయ కంపెనీ లాభాలను ఆర్జించలేదు. దాదాపు రూ. లక్ష కోట్లకు పడగలెత్తి భారతీయుల్లో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు ముకేశ్. లాభాలతో కలిపి ముకేశ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 2.47 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. అంతా జియో మహిమ..! ముకేశ్ ఆస్తులు ఒక్కసారిగా లక్ష కోట్లు పెరగడానికి 'రిలయన్స్ జియో' ఓ కారణమని కూడా తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది ఫోర్బ్స్. రిలయన్స్ షేర్లు భారీగా పెరగడానికి జియోను కారణమని తేల్చిచెప్పింది. -
ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫోసిస్
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎంఆర్ఎఫ్, గ్లాక్సోస్మిత్క్లిన్ న్సూమర్ హెల్త్కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి. ఇక ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, భారత్ ఫోర్జ్, అలెంబిక్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి తదితర 14 కంపెనీలు కొత్తగా స్థానం దక్కించుకున్నాయి. అమ్మకాల వృద్ధి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల వంటి తదితర అంశాల ప్రాతిపదికన పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యంతో జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ వివరించింది. -
ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్కు చెందిన సాఫ్ట్వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99).