Flat
-
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి.. ఎన్ని కోట్లంటే!
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో విశాలమైన ఫోర్ బీహెచ్కే అపార్ట్మెంట్ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించారు. కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
ఇదెక్కడి డిమాండ్ మహాప్రభో.. డబుల్ బెడ్ రూం అద్దె రూ.50వేలు!
దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా మారింది. అమాంతం పెరిగిన అద్దె ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్ మార్కెట్’కు మంచి డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. -
విలాసవంతమైన ఫ్లాట్ కొన్న సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. తన సినిమాలతో టాలీవుడ్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా సూర్య ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారట. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అపార్ట్మెంట్ ప్రత్యేకతలు సూర్య కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లో భారీ గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్ ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకటించిన 'సూర్య 42' విడుదలకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ తెరకెక్కించారు.ఈ చిత్రం దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా సూర్య మూవీ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్లో ప్రధాన పాత్రలో నటించాడు. -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్పనష్టాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ కీలక సూచీలు ఒడిదుడుకుల మధ్య ఉన్నాయి. ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. రియల్టీ, ఆటో స్టాక్లు లాభాలు మార్కెట్కు సపోర్ట్నిస్తున్నాయి. ఫలితంగా ఆరంభంలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో 60977వద్ద ఉంది. , నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 17917 వద్ద ట్రేడ్ అవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ ఈక్విటీల ఆందోళన నేపథ్యంలో అనిశ్చితి కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐషర్ మెటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మారుతి, రిలయన్స్ లాభపడుతుండగా, ఐటీసీ, హెచ్యూఎల్, లార్సెన్, ఓఎన్జీసీ బ్రిటానియా నష్ట పోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా నష్టాల్లోనే ఉన్నంది. 12పైసల నష్టంతో 82.85 వద్ద ఉంది. -
హైదరాబాద్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. ఎందుకు తగ్గాయంటే.. ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని వివరించారు. -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు, అదానీ షేర్ల అమ్మకాల సెగ
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39.34 పాయింట్లు లేదా 0.06 క్షీణించి 60,624.45 వద్ద , నిఫ్టీ 50 34.30 పాయింట్లు లేదా 0.19శాతం పడిపోయి 17,837.40 వద్దకు చేరుకుంది. రెండు రోజుల రికవరీ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు( ఫిబ్రవరి 9) నష్టాల్లోకి జారుకున్నాయి. పబ్లిక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి తక్షణమే అందుబాటులో ఉన్న అదానీ గ్రూప్-లింక్డ్ షేర్ల సంఖ్యకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ సమీక్ష ప్రకటించనున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరిలో సాధారణ సమీక్షలో భాగంగా. గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ (GIMI)తో అనుసంధానమైన అదానీ స్టాక్ల మార్పులు ఈరోజు తర్వాత ప్రకటించనుంది. దీంతో అదానీ గ్రూప్లోని మొత్తం 10 స్టాక్లు ముఖ్యంగా ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 15 శాతం కుప్పకూలింది. అంతకుముందు రెండు రోజుల్లో 35 శాతం ఎగిసింది. క్షీణించిన ఇతర గ్రూప్ స్టాక్లలో అదానీ పోర్ట్స్ 7 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం, ఏసీసీ 3.7 శాతం, అంబుజా సిమెంట్ 6.3 శాతం, ఎన్డిటివి. 3.7 శాతం ఉన్నాయి. వీటితోపాటు, హీరోమోటో, యూపీఎల్ టాప్ లూజర్స్గా కొనాసగుతున్నాయి సెన్సెక్స్లో దివీస్ ల్యాబ్స్; బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిలాభాల్లో ఉంది. 82.60 వద్ద కొనసాగుతోంది. -
హైదరాబాద్కు గుడ్ బై.. సమంత షాకింగ్ నిర్ణయం..!
సమంత ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమాలపై దృష్టి సారించింది. కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ తర్వాత కోలుకుంది. యశోద మూవీ సక్సెస్ తర్వాత మరే ప్రాజెక్ట్లోనూ నటించలేదు. ప్రస్తుతం సమతం శాకుంతలం, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నా సిటాడెల్ సినిమా కోసం ముంబయిలోనే ఉండనున్నట్లు సమాచారం. గతేడాది యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది సామ్. తాజాగా సమంత ముంబయిలో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వర్క్ కమిట్ మెంట్స్ కోసం ముంబైలో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అందువల్లనే సామ్ ఫ్లాట్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై సమంత నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే గతంలోనూ సమంత ముంబయికి మారుతున్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హైదరాబాద్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సామ్ వెల్లడించింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శాకుంతలం, సిటాడెల్తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలోనూ కనిపించనుంది. -
TodayStockMarketUpdate నష్టాల్లో స్టాక్మార్కెట్: అదానీషేర్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా మొదలయ్యాయి. ఆ తరువాత అమ్మకాల ఒత్తిడితో ప్రస్తుతం సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 60,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 17,758 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసిజి షేర్లు నష్ట పోతున్నాయి. అటు అదానీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. మరోవైపు అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు,హెచ్డీఎఫ్స టాప్ గెయినర్స్గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్గా కొనసాగు తున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.75 వద్ద ఫ్లాట్గా ఉంది. -
మార్కెట్లో కొనసాగుతున్న అదానీ సెగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బడ్జెట్ రోజు నిన్న (బుధవారం) ఒడిదుడుకులకు లోనైన సూచీలు గురువారం ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 475 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్లో పుంజుకున్నాయి. అయితే అదానీ గ్రూపు వరుస నష్టాల మార్కెట్ను వెనక్కి లాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగిసి 59932 వద్ద, 6 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 16600 స్థాయిని నిలబెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్పీవో ఉపసంహరణ ప్రకటన తర్వాత గ్రూపు షేర్లు మరింత పతనమైనాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 27 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతం కుప్పకూలింది. ఐటీసీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గానూ అదానీ గ్రూపు షేర్లతో పాటు,యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో ఆరంభ లాభాలను కోల్పోయి తిరిగి 82 స్థాయికి పడి పోయింది. -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
ఫ్లాట్ ముగింపు, ఆటో జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సానుకూల సంకేతాలు, దిగ్గజాల క్యూ3 ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ మంగళవారం నష్టాలనెదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకుని ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 60978 వద్ద , నిఫ్టీ ఫ్లాట్గా 18118 వద్ద ముగిసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.2 శాతం ఎగియగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ నష్టపోయాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్ , బ్రిటానియా టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, డా.రెడ్డీస్, హిందాల్కో, పవర్ గ్రిడ్, గ్రాసిం టాప్ లూజర్స్గా నిలిచాయి. ఫలితాల నేపథ్యంలో ఆటోమేజర్ మారుతి సుజుకి లాభపడింది. టాటా మోటార్స్ గురువారం ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ జోష్తో పీవీఆర్ షేరు భారీగా లాభపడింది. అటు డాలరు మారకంలో రూపాయి మరింత పతనమైంది. 28 పైసలు కుప్పకూలి 81.71 వద్ద ముగిసింది. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
నష్టాలనుంచి కోలుకుని ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఎప్ఐఐల అమ్మకాలు, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో బలహీనమైన ధోరణి మధ్య బుధవారం ప్రారంభ ట్రేడ్లో ఈక్విటీ బెంచ్మార్క్లు ప్రతికూలంగా ఆరంభమైనాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు కక్షీణించి 60 వేల స్థాయినికోల్పోయగా, నిఫ్టీ 89పాయింట్లు క్షీణించి 17,824 వద్దకు చేరుకుంది. ఆ తరువాత నష్టాలను తగ్గించుకుని సెన్సెక్స్ కేవలం 10 పాయింట్ల నష్టంతో 60105 వద్ద,నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17895 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీపీసీఎల్ లాభపడగా, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్యూఎల్ నష్టపోయాయి. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఆటో ఎక్స్పో ప్రారంభం నేపథ్యంలో ఆటో స్టాక్స్ పై ఇన్వెస్టర్ల దృష్టి పెట్టారు. వరుసగా మూడో రోజు కూడా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సానుకూలత కొనసాగుతోంది. 25పైసలు ఎగిసి 81.56 వద్ద ఉంది. -
సినీ ఇండస్ట్రీకి పెద్ద నేను కాదు: మెగాస్టార్ చిరంజీవి
-
షార్ప్ రికవరీ, ఆయిల్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ఫ్లాట్గానే ముగిసాయి. ఆరంభంలోనే 450 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ మిడ్సెషన్ తరువాత లాభాల్లోకి మళ్ళింది. సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62131 వద్ద, నిఫ్టీ ఫ్లాట్గా 18497 వద్ద స్థిరపడింది. ఆయిల్ రంగ, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీపీసీఎల్, దివీస్ లాబ్స్, కోల్ ఇండియా నెస్లే, యూపీఎల్లాభపడగా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, టైటన్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 34 పాయింట్లు క్షీణించి 82.54 వద్ద ముగిసింది. -
కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకోవడం గమనార్హం. 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 62835 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 18701 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, యూపీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ భారీ లాభపడగా, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్ర, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 58 పైసలు కుప్పకూలి 81.79 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 81.32 తో పోలిస్తే సోమవారం స్వల్పంగ నష్టపోయిన రూపాయి ఆతరువాత మరింత పతనమైంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. డాలరు బలహీనంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలలో 1.4 శాతం పెరుగుదల కారణంగా రూపాయి సోమవారం కుప్పకూలింది. -
ఆటో షాక్, వరుసగా రెండో రోజూ నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్లు వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిసాయి. శుక్రవారం మిడ్సెషన్లో బాగా నష్టపోయిన సూచీలు చివరికి స్పల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 87పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 61,663, నిఫ్టీ 36 లేదా 0.2 శాతం క్షీణించి 18,308 వద్ద ముగిసింది. దాదాపు అన్నిరంగాల షేర్లు ఫ్లాట్గా ముగిసాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభ పడ్డాయి. హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర టాప్ విన్నర్స్గా నిలవగా ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, సిప్లా టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 6పైసల నష్టపోయి 81.70వద్ద ముగిసింది. -
రెండో రోజు అదో ధోరణి, అసలు ఏమైంది?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగి రావడంతో ఆరంభంలో100 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ వెంటనే సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సోమవారం నాటి ధోరణిని కొటిన్యూ చేస్తున్నాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 61610 వద్ద,నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 18332 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో ఇండెక్స్ లాభాల్లో ఎఫ్ఎంసిజి, రియాల్టీ సూచీలు నష్టాల్లోనూ ఉన్నాయి. బ ఓఎన్జీసీ, హీరో మోటో, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో భారీ లాభాల్లో, కోల్ ఇండియా, ఐటీసీ, టీసీఎస్, సన్ఫార్మ, హెచ్డీఎఫ్సీ టాప్ లూజర్స్గానూ కొనసాగుతున్నాయి. ఎల్టీఐ-మైండ్ట్రీ విలీనం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మైండ్ట్రీ 1 శాతం పెరిగింది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.28 వద్ద ఫ్లాట్గా కొనసాగుతోంది. ఆరంభంలోనే 12 పైసలు ఎగిసింది. కాగా మార్కెట్ ముగింపు తర్వాత విడుదలైన డేటాలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి తగ్గిందని, సెప్టెంబర్లో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.41 శాతానికి తగ్గింది. -
లాభాలు పాయే: ఫార్మా డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం నాటి భారీ ర్యాలీకి చెక్ పెట్టిన సూచీలు సోమవారం ఆరంభంలో నష్టాలను చూశాయి. 76 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ ఆ తరువాత 150 పాయింట్లకు పైగా ఎగిసింది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఫార్మరంగ షేర్ల నష్టాలుమార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 65 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. టాటా స్టీల్, పవర్గ్రిడ్,ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. అలాగే హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్డబ్య్లూ స్టీల్, బజాజ్ ఆటో లాభపడుతుండగా డా.రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. ఎగిసిన రూపాయి అటు మారకంలో రూపాయి ఆరంభంలోనే 25పైసలు ఎగిసిన రూపాయి 80.53 స్థాయికి చేరింది. -
ఆటో షాక్: నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నాలుగు రోజుల లాభాలకు సూచీలు చెక్ చెప్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 101 పాయింట్లు క్షీణించి 61019 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 18120 వద్ద కొనసాగుతున్నాయి. షేర్లు నష్టపోతుండగా, మీడియా, ఫార్మా షేర్ల లాభాలకు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 18 వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ స్టేట్మెంట్ను ప్రకటించనుంది.దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది. సన్ఫార్మా, డా.రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో ఉంది. 1 పైసా నష్టంతో 82.70 వద్ద ఉంది. -
ఫ్లాట్ ముగింపు, రూపాయి రికార్డ్ కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పెట్టాయి. ఆరంభ లాభాలను కోల్పోయి వారాంతంలో ఫ్లాట్గా ముగిసాయి. అయితే సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 58014 స్థాయిని తాకింది. చివర్లో బాగా పుంజుకుని సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 58191 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 17314 వద్ద స్థిరపడ్డాయి. టాటా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎంఅండ్ఎం టాప్ లూజర్స్గా ఉన్నాయి. టైటన్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. ఏకంగా 54 పైసల నష్టంతో 82.32 ఆల్ టైం కనిష్టం వద్ద ముగిసింది. గత సెషన్లో 81.88 వద్ద క్లోజ్ అయింది. -
వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలే
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులమధ్య కొనసాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి.వరుసగా ఐదో రోజు నష్టాలనెదుర్కొన్నాయి. నవంబర్ 2020 నుండి కనిష్ట స్థాయికి కోలుకుని, సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసాయి.చివరికి సెన్సెక్స్ ఇండెక్స్ 38 పాయింట్ల నష్టంతో 57,108 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 9 పాయింట్లు నష్టంతో 17,007వద్ద ముగిసింది. టాటా స్టీల్, టైటాన్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డిఎఫ్సి ట్విన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సిఎల్ టెక్,నెస్లే ఇండియా లాభపడ్డాయి. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్.. ధరెంతంటే?
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతంలోని పార్థినాన్ సోసైటీలో ఈ స్థిరాస్తిని కోనుగోలు చేశారని సమాచారం. బహుళ అంతస్తుల భవనంలోని 31వ ఫ్లోర్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాట్ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఖరీదెంత అనేది విషయం బయటికి రాలేదు. అయితే ఫ్లాట్లో బాలీవుడ్ సూపర్స్టార్ నివాసం ఉండేందుకు కాదట. ఈ ఫ్లాట్ను కేవలం పెట్టుబడి ప్రయోజనాల కోసమే కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్బీ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. (చదవండి: వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్) ఇటీవల రిలీజైన బ్రహ్మాస్త్రలో అమితాబ్ ప్రధానపాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అలియా భట్, రణ్బీర్ కపూర్, నాగార్జున, మోనీరాయ్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో బిగ్ బీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుడ్బై'లోనూ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమితాబ్కు కూతురిగా నటిస్తోంది. వీటితో పాటు అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి-14 సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతోంది. -
దూసుకుపోతున్న వైజాగ్.. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టులో వెల్లడైన వాస్తవాలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్, ఇతర నగరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయంటూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నైలను మించి ఇళ్ల ధరలు విశాఖలో పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత అమ్మకాలు పెరగడం విశేషం. సాక్షి, విశాఖపట్నం : అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందనే అభిప్రాయం ఉంది. అవకాశం వస్తే.. విశాఖలోనే నివసించాలని కోరుకునేవారు లక్షల్లో ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. తాజాగా ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో నివాసానికి అనువైన నగరాల్లో టైర్–2 సిటీలు మెట్రో సిటీలకంటే ముందు వరుసలో ఉన్నాయని తేల్చి చెప్పింది. ద్వితీయ శ్రేణి నగరాలపైనే ఆసక్తి మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్గా భావించేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు మెట్రో నగరాలంటే వెగటు పుట్టే స్థాయికి చేరుకుంటోంది. ఎందుకంటే.. పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్నవయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్–2, టైర్–3 సిటీస్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలవైపు ఆసక్తి చూపుతున్నారు. మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనంగా మారింది. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ.. విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత జోరు కోవిడ్ కారణంగా పని విధానంలో మార్పులు రావడం.. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా పనిచేయడంతో ఈ మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్కు షిఫ్ట్ అవుతున్నాయని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా క్రమంగా పెరగడం.. లివింగ్ కాస్ట్ ఈ నగరాల్లో తక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో సిటీల నుంచి ఇతర సిటీలకు మారుతున్నారని పేర్కొంది. కొత్త ఇల్లు కొనేందుకు పెద్ద నగరాలతో పోలిస్తే.. టైర్–2 నగరాల్లో ధరలు కాస్తా తక్కువ ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. డిమాండ్ క్రమంగా పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫ్రీలాన్స్ జాబ్స్ ట్రెండ్ కూడా విస్తరించడం.. ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: స్టార్టప్లకు ‘కల్పతరువు’) బెంగళూరును మించి ఆసక్తి... దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే టైర్ 2, 3 సిటీల్లో ఇళ్ల రేట్లు వేగంగా పెరుగుతున్నాయని ఎస్బీఐ సర్వే తెలిపింది. బెంగళూరు, కోల్కతా, పూణే వంటి మెట్రోలతో పోలిస్తే విశాఖపట్నం, లక్నో, రాయ్పూర్, సూరత్, వడోదరా, జైపూర్, గౌహతి, డెహ్రాడూన్ వంటి ద్వితీయ శ్రేణి, కోయంబత్తూర్, నోయిడా వంటి టైర్–3 నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. బెంగళూరు, ముంబై, పూణె, కోల్కతా కంటే ఎక్కువగా విశాఖపట్నంలో నివసించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటం విశేషం. బెంగళూరులో 2018–19లో ఇళ్ల ధరలు 8.7 % పెరగగా, 2019–20 లో పెద్దగా మార్పు కనిపించలేదు. అదే 2020–21లో 6.2 శాతం, 2021–22 లో కేవలం 3.3 % మాత్రమే పెరిగాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం 2018–19 లో 4.9 %, 2019–20 లో 10.3 % పెరిగాయి. 2020–21 కోవిడ్ కారణంగా 2.5 % తగ్గినా, 2021–22 లో మాత్రం 11.3 % పెరగడం చూస్తే.. విశాఖపట్నంలో నివసించేందుకు ఎందరు ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. (క్లిక్: విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్కు ఫుల్ డిమాండ్) ఆహ్లాదకరమైన వాతావరణానికే ఓటు.. టైర్–2 నగరాల్లో నివసించేందుకు ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసమే కాకుండా.. సరికొత్త జీవన సరళికీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన వ్యయం కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్వాలిటీలన్నీ ఉన్న నగరాల్లో విశాఖ ముందు వరసలో ఉంటోంది. అందుకే విశాఖ వంటి నగరాలకు డిమాండ్ పెరిగింది. పరిపాలన రాజధానిగా భాసిల్లుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరమే అయినా.. మహా నగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకోవడం వల్లనే డిమాండ్ ఉంది. – కె.ఎస్.ఆర్.కె.సాయిరాజు, క్రెడాయ్ అధ్యక్షుడు