-
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్యాక్టివ్గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్్రస్కిప్షన్ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
200 కోట్ల భారీ స్కాంలో దొరికిపోయిన నిమ్మగడ్డ ఫ్యామిలీ
-
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రైండ్లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
మహీంద్రా ఫైనాన్స్లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబు భారీగా ఫైనాన్స్ చేశారని, సుమారు రూ. 60 కోట్లు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో 10 మంది టీడీపీ అభ్యర్థులకు మొండిచేయి చూపి షర్మిలకు డబ్బులిచ్చి కడప పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారని చెప్పారు. డా. చైతన్యరెడ్డితో కలిసి బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే షర్మిలకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు వైఎస్ కుటుంబంలో షర్మిల, సునీతను చంద్రబాబు పావులుగా మార్చారని చెప్పారు. ఇందులో భాగంగానే షర్మిల పీసీసీ అద్యక్షురాలయ్యారని తెలిపారు. అరుంధతి సినిమాలోలాగా వారిని పశుపతి ఆవహించారని ఎద్దేవా చేశారు. కుటుంబాలను విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని, తల్లీబిడ్డలకు కూడా తగవు పెట్టే సమర్థుడని చెప్పారు. సునీత లక్ష్యం వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నేరస్తులను వెలికితీయడమా లేక తప్పు చేయని వారిని శిక్షించడమా అని ప్రశ్నించారు. ఆమె సైకో ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. ఒక పథకం ప్రకారం కథ అల్లుతూ వారు అనుకున్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకొని ఉంటే అసలు నేరస్తులు దొరికేవారని చెప్పారు. బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంతో, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాశ్రెడ్డిపై ఉన్న కోపంతో షర్మిల, సునీత ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేసు ట్రయల్కు వచ్చాక నిజాలు బయటికి వస్తాయని, ఆ లోపే ఒకరిని లక్ష్యం చేసుకొని దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. వేరే సంబంధాలతోనే వివేకా హత్య వేరే సంబంధాలతోనే వివేకా హత్య జరిగిందని, రాజకీయ కోణం లేదని తెలిపారు. హత్యకు ఒక రోజు ముందు ఇంట్లో పని చేసే పందింటి రాజశేఖర్ను సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి కాణిపాకం పంపించారని, చెవులు వినపడని వాచ్మేన్ రంగయ్య ఇంటి బయట ఉన్నారని చెప్పారు. అదే సమయంలో దుండగులు వివేకా ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐని ఎవరో మేనేజ్ చేశారని, అందువల్లే వీటిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. వైఎస్ వివేకాతో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరికి సాన్నిహిత్యం ఉందని, తరచూ కలిసి భోజనం చేస్తారని సీబీఐకి సాక్షులు చెప్పారని గుర్తుచేశారు. అవినాశ్రెడ్డిని ఎంపీగా చేసేందుకు వివేకా కష్టపడ్డారని తొలుత చెప్పిన సునీత.. ఆ తర్వాత మాటమార్చిందన్నారు. హార్ట్ ఎటాక్ డ్రామా ఆడింది కూడా సునీతేనని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకే వివేకా రాసిన లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చెబితేనే లేఖను దాచిపెట్టినట్లు పీఏ కృష్ణారెడ్డి చెప్పారన్నారు. వారికి నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రక్తపు మరకలను ఎవరూ తుడవలేదని, బెడ్ వద్ద మాత్రమే తుడిచారని, ఆ వస్త్రం కూడా అక్కడే ఉందని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ వివేకా బలవంతపెట్టారని షర్మిల చెప్పడంలో అర్థం లేదన్నారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్రెడ్డిని నిర్ణయించారని, 2019లోనూ ఆయన్నే కొనసాగించారని చెప్పారు. పబ్లిక్ ఫోరం, మీడియాలో ట్రయల్స్ ఆపండి : డా. చైతన్యరెడ్డి వివేకా హత్య కేసులో పబ్లిక్ ఫోరం, మీడియా ట్రయల్స్ ఆపాలని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డా. చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ భాస్కర్రెడ్డికి హార్ట్ చెకప్ చేసి, సర్జరీ చేయాలని, బెయిలివ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, సీబీఐ వ్యతిరేకించకపోయినా సునీత మాత్రం వ్యతిరేకించిందన్నారు. ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ల బెయిల్ను వ్యతిరేకించకుండా, తన తండ్రి శంకర్రెడ్డి బెయిల్ను మాత్రం వ్యతిరేకించారన్నారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్కు ఎలాంటి శాస్త్రీయత లేదని, ఖచ్చితత్వం అంతకంటే లేదన్నారు. సీబీఐ పేర్కొన్నది వాట్సాప్ చాట్స్ అని, వాట్సాప్ కాల్స్ కానేకాదన్నారు. అందులో ఔట్గోయింగ్ చాట్స్ అసలే లేవన్నారు. -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ
ఆర్బీఐ ఇప్పటికే పసిడి రుణాల మంజూరు, పంపిణీకి సంబంధించి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా షేర్లు, డిబెంచర్లపై ఎలాంటి రుణాలనూ అందించకుండా జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధం విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. ఐపీఓ రుణాల మంజూరు, పంపిణీకీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఐపీఓ, ఎన్సీడీల కోసం రుణాలను ఇవ్వడంలో కొన్ని తీవ్ర లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి జేఎం ఫైనాన్షియల్ సమర్పించిన కొన్ని నివేదికలను పరిశీలించాక, ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా..
ఉద్యోగాల్లో మహిళలకు సరైన ప్రాతినథ్యం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతో కంపెనీల్లో అవగాహన మొదలై కొన్నేళ్లుగా వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రావడంలేదు. దాంతో కంపెనీలు కొత్త పంథా ఎంచుకుంటున్నాయి. తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హైదరాబాద్లో పూర్తి మహిళా సిబ్బందితో మైత్రేయి పేరిట బ్రాంచీని ఏర్పాటు చేసింది. ఇందులో గృహ, ఎస్ఎంఈ రుణాలు మొదలైనవి అందిస్తామని సంస్థ హెచ్ఆర్ హెడ్ ప్రనిత్ సోనీ తెలిపారు. ఇదీ చదవండి: సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే.. ఉద్యోగాల్లో మహిళలకు కూడా సమానమైన అవకాశాలను కల్పించాలన్న తమ లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని ఎండీ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. ప్రతి మైత్రేయి శాఖలో 7–15 మంది ఉద్యోగినులు ఉంటారని వివరించారు. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
చైనాలో ఆర్థిక మాంద్యం?.. నిజాలు వెళ్లగక్కిన జిన్పింగ్!
నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. చైనాలో గడచిన డిసెంబర్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది. -
ముత్తూట్ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లుల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్పొరేట్ సేవా బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు ర.50 వేల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు డిసెంబర్ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్ సీఆర్ఎస్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వితంతు తల్లులకు ఆర్థిక సాయం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్ఆర్ హెడ్ బాబు జాన్ మలయల్ తెలిపారు. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
ఆన్లైన్లో ఆర్థిక మోసాలే ఎక్కువ..!
సాక్షి, హైదరాబాద్: అత్యాశ, అవగాహన లేమి కారణం ఏదైతే ఏంటి.. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో ఆర్థిక మోసాలు గణనీయంగా పెరిగాయి. ఏసీ గదుల్లో కూర్చుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు. జనవరి 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలపై ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సైబర్ నేరాల్లో ఆన్లైన్ ఆర్థిక మోసాలే 77.41 శాతం ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ ఆర్థిక మోసాల్లో ప్రత్యేకించి యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సంబంధిత మోసాలు 47.25 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నమోదైన సైబర్ నేరాలు కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
ఫైనాన్స్, చిట్ఫండ్ సంస్థలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పలు ఫైనాన్స్, చిట్ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా.. ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్ఫండ్స్లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్పేట్లోని సన్షైన్ అపార్ట్మెంట్లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు. చిట్ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్డిస్్కలు, పలు ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్ఫండ్, ఈ–కామ్ చిట్ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
చైనా గుప్పిట్లో పాక్ మీడియా? అమెరికా రిపోర్టులో ఏముంది?
అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్వర్క్ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది. ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే? -
చైనా ముంగిట మాంద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై?
చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తేనుందా? చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? ఇటువంటి ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా తన ఉనికిని నేపాల్ నుండి శ్రీలంక వరకు విస్తరించడం, ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహ హస్తాన్ని కూడా చాచుతోంది. ఆర్థికవృద్ధికి ఇంతలా తాపత్రయ పడుతున్న చైనా విజయం సాధిస్తుందా? చైనా ప్రాపర్టీ రంగంలో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా మాజీ సీనియర్ ఎన్బిఎస్ అధికారి హె కెంగ్ తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో మూడు వందల కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అన్నారు. డాంగ్-గ్వాన్ చైనాలోని ఒక నగరం. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య చైనా జనాభా కంటే రెట్టింపులో ఉందని కెంగ్ తెలిపారు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్థితిలో ఉన్నాయి. అంటే 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ డేటా ఆగస్టు 2023 నాటిది. ఈ ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదని అన్నారు. ఇలాంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదకలు చెబుతున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 21.3 శాతం మంది యువత ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చైనాకు చాలా నష్టం వాటిల్లింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పు కూడా భారీగానే ఉంది. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నది. మరోవైపు దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీలపై నిబంధనల కఠినతరం మొదలైనవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. తాజాగా చైనా తన విధానాలలో మార్పు కోరుకుంటుంది నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఏడు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు అర్థమైవుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. అయితే చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
వృద్ధాప్యంలో సంక్షోభానికి దూరంగా.. తల్లిదండ్రుల కోసం ఏం చేయాలంటే?
ప్రతి కుటుంబానికి సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కుటుంబ లక్ష్యాలు అన్నింటికీ ఇందులో చోటు కల్పించుకోవడం ఎంతో అవసరం. స్కూల్, కాలేజీ ఫీజులు, విదేశీ విద్య, జీవిత, ఆరోగ్య బీమా పథకాలు, అత్యవసర నిధి, విహార, పర్యాటక యాత్రలు ఇలా అన్నింటికీ చోటు కల్పించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ లక్ష్యాలు అన్నింటికీ కావాల్సిన మేర సమకూర్చుకునేందుకు వీలుగా తగిన పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అందరూ కాకపోయినా కొందరు అయినా దీన్ని అనుసరిస్తుంటారు. కాకపోతే ఎక్కువ మంది ఇక్కడ విస్మరించే విషయం ఒకటి ఉంది. తమపై ఆధారపడిన వృద్ధాప్య తల్లిదండ్రుల సంరక్షణను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోరు. దీన్ని ఒక లక్ష్యంగా చూడరు. గతంతో పోలిస్తే వృద్ధాప్యంలో సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. కనుక ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో దీనికి తప్పకుండా చోటు ఉండాల్సిందే. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది.. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు అతిపెద్ద ఆర్థిక వ్యయంతో కూడుకున్న లక్ష్యాల్లో వృద్ధాప్య సంరక్షణ (జెరియాట్రిక్ కేర్) ఒకటి. అయినా, అధిక శాతం మంది ఆర్థిక ప్రణాళికల్లో దీనికి చోటు ఉండదు. వృద్ధుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు అవుతుందన్న అవగాహన కూడా ఉండడం లేదు. ఇది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమతోనే ఉంటున్నారా? లేక మరో చోట నివసిస్తున్నారా? లేక వృద్ధాశ్రమంలో చేరారా? వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదంటే వారికి సంరక్షకులను ఏర్పాటు చేయాలా? వారికి పింఛను సదుపాయం ఉందా లేక ఇతరత్రా వేరే రూపంలో ప్రతి నెలా ఆదాయం వచ్చే ఏర్పాటు ఉందా? ఇలాంటి అంశాలన్నింటి ఆధారంగా వృద్ధుల సంక్షేమం కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలనేది తేల్చుకోవచ్చు. వృద్ధాప్య సంరక్షణ ఇంత కాలం పాటు, నిర్ధిష్ట సమయం అని నిర్ణయించుకోవడం కష్టం. వృద్ధులైన తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రత్యేక సంరక్షణ అవసరం పడకపోవచ్చు. అలా అని ముందు ముందు వయసు మీద పడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. అప్పుడు ప్రత్యేక సంరక్షకుల అవసరం ఏర్పడొచ్చు. దీనికి ఎంత వ్యయం అవుతుందన్నది ముందుగా అంచనా వేయలేం. ఎన్నో నిదర్శనాలు.. నేడు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సామాజిక భద్రత ఉండడం లేదు. నేటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చూస్తే వృద్ధుల సంక్షేమం అతిపెద్ద ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన దత్తాత్రేయ తల్లికి కిడ్నీల సమస్య ఉంది. కిడ్నీల డయాలసిస్, ఇతర చికిత్సా వ్యయాల కోసం రూ.80,000 వరకు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతేడాది వరకు కేవలం ఔషధాల వరకే ఖర్చు అయ్యేది. కానీ, కిడ్నీల సమస్య మరింత తీవ్రతరం కావడంతో వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్క సెషన్కు రూ.3,000 ఖర్చు అవుతోంది. ఇక దత్తాత్రేయ తల్లి మృణాళిని టెస్ట్లు, వైద్యుల కన్సల్టేషన్ కోసం ఏటా మరో రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు. నిజానికి దత్తాత్రేయకు పనిచేసే సంస్థ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పటి వరకు బీమా కంపెనీ మృణాళిని వైద్య ఖర్చుల భారం మోస్తోంది. కాకపోతే ఇటీవల డయాలసిస్, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కవరేజీ చాలడం లేదు. సొంతంగా తమ వంతు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక పట్టణాల్లో తల్లిదండ్రుల సంక్షేమ వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరో చోట నివసిస్తుంటే, వారికి అదనపు వ్యయాలతోపాటు ఇతరత్రా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇందుకు ముంబైకి చెందిన భట్టాచార్యే నిదర్శనం. ఆయన తల్లిదండ్రులు కోల్కతాలో నివసిస్తున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు ఏకైక కుమారుడైన దత్తాత్రేయపైనే ఉన్నాయి. వాటిని ఆయన నెరవేరుస్తున్నారు కూడా. కాకపోతే తాను నివస్తున్న పట్టణానికి దూరంగా తల్లిదండ్రులు ఉంటుండడం, పైగా తల్లి కేన్సర్తో బాధపడుతూ పూర్తి స్థాయిలో సొంతంగా నడవలేకపోతుండడం సవాలుగా మారింది. దీంతో ఆమెకు తన కుమారుడి నుండి భౌతిక సాయం కూడా అవసరమవుతోంది. దీంతో భట్టాచార్య ముంబై నుంచి కోల్కతాకు తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. తనతో పాటు ఆస్పత్రికి వెళ్లి రావడానికి అమ్మ సౌకర్యంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తన తల్లిదండ్రులను ముంబైకి మార్చుదామంటే ఆర్థికంగా అది సులువైన నిర్ణయం కాదని అతడికి తెలుసు. కోల్కతాలో అయితే వారి సంరక్షణకు నెలకు రూ.60,000–65,000 ఖర్చు అవుతోంది. ముంబైకి మారిస్తే రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తుంది. ముంబైలో జీవన వ్యయాలు ఎక్కువ. ఇప్పుడు కాకపోతే మరికొంత కాలం తర్వాత అయినా తన తల్లిదండ్రులను ముంబైకి తీసుకురావడం ఒక్కటే ఆయన ముందున్న ఆప్షన్. ఏడాది క్రితం వరకు తల్లిదండ్రుల ఔషధాలకు నెలకు రూ.30,000 ఖర్చు అయితే, ఇప్పుడు రూ.45,000కు పెరిగింది. తమపై ఆధారపడిన లేదంటే భవిష్యత్తులో తమ సంరక్షణ అవసరం పడే తల్లిదండ్రులు ఉంటే, వారి కోసం ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. అస్పష్ట సవాళ్లు ఆర్థికంగా పడే భారాన్ని అధిగమించడం ఒక్కటే కాదు, ఇతర సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. ఢిల్లీకి చెందిన మంజీత్ తండ్రికి శస్త్రచికిత్స తర్వాత ఆస్పత్రిలోనే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రాత్రి సమయాల్లో సంరక్షణ చూసేందుకు ఒక వార్డ్ బోయ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో ప్రతి రోగికి విడిగా ఒక్కో వార్డ్ బోయ్ లేదా కేర్టేకర్ ఏర్పాటు సదుపాయం ఉండదు. దీంతో ప్రైవేటుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం మినహా వేరే మార్గం కనిపించలేదు. అందుకు అర్హత కలిగిన వ్యక్తిని గుర్తించడం, వారి చార్జీలు చెల్లించడం కష్టమైన టాస్క్గా మారింది. కొన్ని పేరొందిన ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యయాలు 40–50 శాతం అధికంగా ఉంటాయి. వృద్ధాప్య సంరక్షణ కేంద్రాల్లో ఈ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్నప్పుడే వేరే కొత్త ప్రాంతానికి మారిస్తే.. వారు ఒంటరితనంతో వేదనకు గురవుతారు. పైగా తమ పిల్లలు అలక్ష్యం చేస్తున్నారనే బాధ కూడా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఈ విషయంలో అవహేళనలు కూడా ఎదురుకావచ్చు. కొన్ని ప్రముఖ పట్టణాల్లో సర్జరీల తర్వాత వృద్ధుల కోసం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ సర్జరీ అనంతరం కావాల్సిన సేవలను 3–8 వారాల పాటు అందిస్తారు. ప్రత్యేక రూమ్, నర్స్, అటెండెంట్ తదితర సేవలు పొందొచ్చు. వైద్యులు కూడా వచ్చి చూసి వెళుతుంటారు. కైట్స్ సీనియర్ కేర్తోపాటు కేర్ హాస్పిటల్ తదితర కొన్ని సంస్థలు ఈ తరహా సేవలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే రోజువారీ రూ.3,000–4,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వృద్ధులకు ఉన్న సమస్యల ఆధారంగా ఈ వ్యయం మారుతుంది. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారిపై ఆధారపడిన పెద్దలకు తాత్కాలికంగా ఇలాంటి కేంద్రాల్లో సేవలు అందించొచ్చు. ఒకవైపు భవిష్యత్తులో పెద్దల సంక్షేమం కోసం అయ్యే వ్యయాలకు ప్రణాళిక రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో.. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం కావడం కూడా అంతే అవసరం. ప్రణాళిక ఎలా..? తమపై తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారి కంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి. వీలైతే 45 ఏళ్లలోపు, అది వీలు పడకపోతే 60 ఏళ్లలోపు తప్పకుండా తీసుకోవాలి. దీంతో ఏదైనా ఆరోగ్య సమస్యతో వారు హాస్పిటల్లో చేరితే, అయ్యే వ్యయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక చరిత్ర గురించి ఒక్కసారి విశ్లేషించుకోవాలి. తల్లిదండ్రులను అడిగి, వారి తల్లిదండ్రులు, సోదరుల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం, ఆర్థరైటిస్, డిమెన్షియా, గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ తదితర సమస్యలు ఉన్నాయేమో విచారించాలి. క్రిటికల్ ఇల్నెస్ కవర్ను కూడా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాలసిస్, ఓరల్ కీమోథెరపీ తదితర చికిత్సలకు డేకేర్ కింద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అలాగే, హోమ్కేర్ కవర్ కూడా ఉండాలి. దీనివల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ పొందొచ్చు. అయినప్పటికీ ఇంట్లో అటెండెంట్, హోమ్ నర్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకే అయ్యే చార్జీలను కంపెనీలు చెల్లించవు. నెలకు ఒక అటెండెంట్ సేవలు పొందేందుకు మెట్రోల్లో అయితే రూ.25,000–30,000, చిన్న పట్టణాల్లో అయితే రూ.15,000–20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంటి వద్దే నర్స్ సేవల కోసం నెలవారీ వ్యయాలు 25–40 శాతం అధికంగా అవుతాయి. అందుకే ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల తర్వాత ఆర్థికంగా సతమతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం రూపంలో ఖర్చులు ఎదురైన సమయంలోనే పిల్లల ఉన్నత విద్య, ఇతర కీలక లక్ష్యాలు తారసపడతాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అత్యవసర నిధిని కూడా సమకూర్చుకోవడం అంతే అవసరమనేది ఆర్థిక నిపుణుల సూచన. నిజానికి తల్లిదండ్రుల కోసం కొంత ఫండ్ను సిద్ధంగా ఉంచుకునే వారు అరుదుగా కనిపిస్తారు. అవసరం అయితే జీవన వ్యయాలను కొంత తగ్గించుకుని అయినా, తమపై ఆధారపడి వారి కోసం అత్యవసర నిధిని సమకూర్చుకోవాలే కానీ, వాయిదా వేయరాదని నిపుణుల సూచన. కనుక తల్లిదండ్రులు లేదా తమపై ఆధారపడిన అత్త మామల వృద్ధాప్య సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. -
మహిళలూ.. డబ్బులు సంపాదిస్తుంటే.. పెట్టుబడులు ఎలా పెట్టాలో ఇలా తెలుసుకోండి!
పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా.. నేడు మహిళలకు సముచిత స్థానం ఏర్పడింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పురుషులతో సమానంగా మహిళలూ సొంతం చేసుకుంటున్నారు. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవడం లేదు. కెరీర్ కొనసాగిస్తూ, ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారు. ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడుతూ, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో, తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల విధానాలు, ప్రణాళికలు అవసరం అవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు, ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు, మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడక్కర్లేకుండా తమ సంపదను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం. ఈ దిశగా ఏం చేయాలన్నది చర్చించే కథనమే ఇది. మహిళలే ఎందుకు? మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలను భర్త లేదా తండ్రికే విడిచిపెడుతుంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది. కానీ, ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు, నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు..? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. కారు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి ట్రిప్లెక్స్ విల్లా సమకూర్చుకోవాలని, సెలవుల్లో ఎక్కడికైనా పర్యటించి రావాలనే కోరికలు, లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన అడుగులు పెట్టుబడుల రూపంలో వేయాలి. ఆర్థిక, పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జనా పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే ఈ విషయాలు తెలిసి ఉండడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ బాధ్యతల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం కెరీర్ మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటుంటారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కనుక మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి. నైపుణ్యాలు అవసరం.. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి? అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తేల్చుకోవాలి. పెట్టుబడుల్లో దేనికీ గ్యారంటీ ఉండదు. వివిధ సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందించే పోర్టళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడుల ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దె ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి, తప్పనిసరి కాదు అని రెండు భాగాలు చేసుకోవాలి. విచక్షణారహితం కానివి అంటే.. ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు తదితరాలు. విచక్షణారహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీ ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్ను రూపొందించుకోవచ్చు. లక్ష్యాలపై స్పష్టత.. పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి. అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, ఐదేళ్లు, పదేళ్లు? ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. లేదంటే 5–10 ఏళ్లలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. లేదంటే 20–30 ఏళ్లకు వచ్చే రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి నిధిని సమకూర్చుకోవడం కావచ్చు. ఇలా లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో దానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు నెలవారీగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అత్యవసర నిధి అన్నింటికంటే ముందు అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఏ కారణం వల్ల అయినా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్ట కాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సాయంతో గట్టెక్కవచ్చు. సాధారణంగా అత్యవసర నిధి మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంక్ ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్లో ఈ మొత్తాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే, ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేయాలి. బీమా రక్షణ మహిళలకు జీవిత బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా, కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, వారిపై ఆధారపడిన వారు ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. జీవిత బీమా అంటే జీవితంపై పెట్టుబడి పెట్టేది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేది. చాలా మంది వివాహం అయి, తమకంటూ కుటుంబం ఏర్పాటైన తర్వాతే జీవిత బీమా గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదు. యుక్త వయసులోనే జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. జీవితంలో వివిధ దశల్లో, పెరిగే తమ బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ మొత్తాన్ని సవరించుకుంటూ వెళ్లాలి. ఇది భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మహిళలకు ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యల రిస్క్ ఎక్కువ. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. పోర్ట్ఫోలియో నిర్వహణ మహిళలు పెట్టుబడుల నిర్వహణలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇదంతా గతం నుంచి ఉన్న ధోరణి వల్లేనని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల నిర్వహణ ఎలా? అన్న సందేహం ఎదురైతే.. ముందు తమ బలాల గురించి తెలుసుకోవాలి. రిస్క్కు దూరంగా సంప్రదాయ ధోరణితో ఉంటే డివిడెండ్ చెల్లించే కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు, యుటిలిటీ సంస్థలను పరిశీలించొచ్చు. రిస్క్ తీసుకునే వారు లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్కు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. అయితే మొత్తం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట కాకుండా, వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం తప్పనిసరి. తమ జీవిత లక్ష్యాల సాకారానికి, మెరుగైన విశ్రాంత జీవనానికి.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు మహిళల ముందు ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం వెంటనే పెట్టుబడులు ప్రారంభించాలి. చాలా ముందుగా ఆరంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద వేగంగా వృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించి జీవిత లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతోపాటు డెట్, బంగారం తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిపుణుల నిర్వహణలో, తగినంత వైవిధ్యం, రిస్క్ బ్యాలన్స్తో నడిచే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. స్టాక్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేసేంత విషయ పరిజ్ఞానం, సమయం లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం. పరిమిత పెట్టుబడితోనే ఎన్నో రకాల కంపెనీలు, రంగాల్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు కొనుగోలు వ్యయం తగ్గి, అధిక రాబడి లభిస్తుంది.