-
ఫ్యాషన్ ప్రపంచంలో.. తనదొక సైలెంట్ నేమ్!
రాహుల్ విజయ్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సైలెంట్ నేమ్! అతని స్టయిలింగే కనిపిస్తుంటుంది గొప్ప గొప్ప ఈవెంట్లలో.. పెద్ద పెద్ద పార్టీల్లో! కంప్లీట్ డీటేయిలింగ్తో స్టయిల్ని క్రియేట్ చేస్తాడు క్లాసిక్గా! అందుకే ఏ రంగంలోని సెలబ్రిటీలకైనా అతను మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్!రాహుల్ విజయ్ పుట్టి, పెరిగింది ఢిల్లీలో. ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గ్రాడ్యుయేట్స్లాగే అతనూ హార్పర్స్ బజార్లో ఫ్యాషన్ ఇంటర్న్గా చేరాడు. అయితే ఆరేళ్లలో ఫ్యాషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. ఫ్యాషన్ రంగంలో ఎదగడానికి ఢిల్లీ కన్నా ఆర్థిక రాజధాని, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ముంబై అయితే బెస్ట్ అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముంబైలో ల్యాండ్ అయ్యాడు.హార్పర్స్ బజార్ ఎక్స్పీరియెన్స్తో వెంటనే అతనికి అక్కడ ‘ఎల్’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కొలువు దొరికింది. ముగ్గురు స్టయిలిస్ట్లున్న టీమ్ని లీడ్ చేశాడు. అతనిలోని క్రియేటివిటీ, పనిపట్ల అతనికున్న కమిట్మెంట్.. రెండేళ్లకే ‘జీక్యూ ఇండియా’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టాయి.. స్టయిలింగ్ కవర్స్, ఫ్యాషన్ ఎడిటోరియల్స్ బాధ్యతలతో. దీంతోపాటు ఈ దేశపు ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’కి డైరెక్టర్గానూ ఉన్నాడు రాహుల్ .. ముగ్గురు క్రియేటివ్ డైరెక్టర్స్లో ఒకడిగా!ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. సెలబ్రిటీ స్టయిలింగ్లోకీ అడుగుపెట్టాడు రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టికి పర్సనల్ స్టయిలిస్ట్గా! పర్సనల్ స్టయిలింగ్లో.. ముందుగా క్లయింట్ నేపథ్యం, పర్సనాలిటీ, అభిరుచులు, పాత ఫొటోలు.. వంటివన్నీ స్టడీచేసి ఒక అవగాహన కుదిరాకే స్టయిలింగ్ పట్ల దృష్టిపెడ్తాడు రాహుల్. తను చేసిన ఆ రీసెర్చ్ ప్రకారమే క్లయింట్ డ్రెస్ డిజైనింగ్ని డిసైడ్ చేస్తాడు.ఎందుకంత డీటేయిలింగ్ అంటే ‘మన స్టయిల్ని రిఫ్లెక్ట్ చేసేది మన లైఫ్స్టయిలే కాబట్టి’అంటాడు. అయితే అతని డిజైనర్స్ లిస్ట్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న డిజైనర్సే కాదు అసలు బయటి ప్రపంచానికి తెలియని డిజైనర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువగా కొత్త కొత్త దేశీ డిజైనర్స్నే తన క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఆ తీరే సెలబ్రిటీ స్టయిలింగ్లో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అతని స్టయిల్ క్లాసిక్గా ఉంటుందనే కాంప్లిమెంట్నీ ఇస్తోంది. అందుకే మృణాల్ ఠాకుర్, అర్జున్ కపూర్, రాజ్కుమార్ రావు, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి సెలబ్రిటీలూ రాహుల్ విజయ్ని తమ పర్సనల్ స్టయిలిస్ట్గా ఎంచుకున్నారు. జగమెరిగిన డిజైనింగ్ హౌసెస్ అండ్ బ్రాండ్స్కీ ఫ్రీలాన్స్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా తన సృజనాత్మక సేవలను అందిస్తున్నాడు రాహుల్ విజయ్.ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు సొంత ఈస్తెటిక్ సెన్స్ని డెవలప్ చేసుకోవాలి. 12 ఏళ్ల నా ఫ్యాషన్ ఎడిటోరియల్స్ ఎక్స్పీరియెన్స్ ఫ్యాషన్కి సంబంధించి భిన్న దృక్ఫథాన్ని అందించింది. ట్రెండ్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాటిలోంచి మనదైన స్టయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను నేర్పింది. ఇది నా కెరీర్కి ముఖ్యంగా పర్సనల్ స్టయిలింగ్లోకి వచ్చాక ఎంతో ఉపయోగపడింది. స్టయిలింగ్ అనేది ఇప్పుడు ఇమేజ్ మేకింగ్లా మారింది. అందుకే స్టయిలిస్ట్ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది! – రాహుల్ విజయ్ -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్లో, న్యూయార్క్లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లు, బెల్ట్లు... అన్నీ హ్యాండ్మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్లో ఒక ఫ్యాబ్రిక్కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
Tanya Ghavri: స్టయిలింగ్లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్ని రొటీన్గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్తో కానీ జాకెట్తో కానీ నా హైట్ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్వేర్లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
Eka Lakhani: ఇటు ఫ్యాషన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్లో మోస్ట్ వాంటెడ్ తాను!
ఏకా లఖానీ.. డైరెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్ బాడీలాంగ్వేజ్ని కాదు.. పర్సనాలిటీని బట్టి స్టయిల్ని క్రియేట్ చేసే స్టయిలిస్ట్! అందుకే ఆమె ఇటు ఫ్యాషన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్లో మోస్ట్ వాంటెడ్!ఫ్యాషన్ డిజైనర్ కావాలని, సినిమాల్లో పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏకా లఖానీ. ఇంటర్లో సైన్స్ స్టూడెంట్. మంచి మార్కులతోనే ఇంటర్ పాస్ అయింది. తర్వాత ఏం చేయాలో తెలీలేదు. తనేం చేయగలదో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఆ తండ్రికి తెలుసు.. తన కూతురికి మంచి ఈస్తెటిక్ సెన్స్ ఉందని, ఆర్ట్లో కానీ.. ఫ్యాషన్ రంగంలో కానీ చక్కగా రాణించగలదని! అందుకే ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు.ఆ ప్రోత్సాహం ఏకాను తన టాలెంట్ని గ్రహించేలా చేసింది. ముంబైలోని ఎస్ఎన్డీటీ (Sreemati Nethabai Damodar Thackersey) విమెన్స్ (women's) యూనివర్సిటీలో చేరింది. అక్కడ డిగ్రీ పూర్తయ్యాక న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా చేసింది. ఆ టైమ్లోనే పిలుపు వచ్చింది ప్రముఖ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ మణిరత్నం సినిమాకు పని చేస్తున్నాడని.. అతను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాడు.. రమ్మని! వచ్చేసింది.. వర్క్ చేసి మణిరత్నంని ఇంప్రెస్ కూడా చేసింది.అది ‘రావణ్’ సినిమా. అక్కడి నుంచి మణిరత్నంతో అసోసియేట్ అవుతూ వస్తోంది మొన్నటి పొన్నియన్ సెల్వన్ వరకు! ‘రావణ్’ చేస్తున్నప్పుడే ఆమె పనితీరు నచ్చి, మెచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఆమెకు తను తీసిన ‘ఊర్మి’కి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసే చాన్స్ ఇచ్చి ఏకాను మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.మరి బాలీవుడ్కి? ‘నేను చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ వర్క్తోనే బాలీవుడ్ నన్ను గుర్తించి అక్కడ చాన్సెస్ ఇచ్చింది. అందుకే మణిరత్నం సర్కి సదా కృతజ్ఞురాలిని’ అంటుంది ఏకా లఖానీ. బాలీవుడ్లో ఆమె.. రాజ్కుమార్ హిరానీ, కరణ్ జోహర్ లాంటి దర్శకులకు ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్గా మారింది. ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే ఈస్తెటిక్స్, ట్రెండ్స్ మాత్రమే కాదు.. కల్చర్, క్లయిమేట్ అండ్ పర్సనాలిటీల పరిశీలన, అవగాహన అండ్ విశ్లేషణ అని ఆమె అభిప్రాయం.అది ఆమె ఆచరణలోనూ కనిపిస్తుంటుంది తన వస్త్రధారణలో అయినా.. సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా.. సెలబ్రిటీలకు స్టయిల్ని సెట్ చేసినా! ఈ లక్షణమే ‘సంజు’ లాంటి బయోపిక్స్, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ డ్రామాస్, ‘షేర్షా’ లాంటి వార్ డ్రామాస్, ‘జుగ్ జుగ్ జియో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ‘క్వీన్’ లాంటి వెబ్సిరీస్కి పనిచేసి ఈరోజు ఆమెను వర్సటైల్ కాస్ట్యూమ్ డిజైనర్గా నిలబెట్టింది. ఆ నైజమే రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, రణ్బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలకు స్టయిలిస్ట్గా ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ‘ఈ డీటేయిలింగ్ నేర్పింది కూడా మణి సరే’ అంటూ మళ్లీ మణిరత్నంకే క్రెడిట్ ఇస్తుంది ఏకా!డ్రైవింగ్ ఫోర్స్..భిన్న భాషల్లో.. విభిన్నమైన పాత్రలను ఆకళింపు చేసుకుంటూ డిజైన్ చేసే ఆమె కాస్ట్యూమ్స్ యాక్టర్స్కి ప్రత్యేక గుర్తింపునే కాదు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడినీ సృష్టిస్తున్నాయి. ఆమెనో డ్రైవింగ్ ఫోర్స్గా మలస్తున్నాయి. ఏకా లఖానీ అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి. ట్రెండ్స్తో ఇన్ప్లుయెన్స్ కాక చేస్తున్న సినిమా స్పిరిట్ని గ్రహించి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ని తయారుచేయాలని మణి సర్ దగ్గర, ఫస్ట్ షాట్తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉండాలని రాజు (రాజ్కుమార్ హిరానీ) సర్ దగ్గర, కొత్తగా.. వావ్ అంటూ ఆడియెన్స్ అబ్బురపడే ఫ్యాషన్ని చూపించాలని కరణ్ దగ్గర నేర్చుకున్నాను. ఇలా నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్, నేను స్టయిల్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ దగ్గర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నా పనికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పాఠాలకన్నా వర్క్ ద్వారా నేర్చుకుంటున్నదే ఎక్కువ! – ఏకా లఖానీఇవి చదవండి: Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!! -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్కు సరిౖయెన అడ్రస్గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
కర్ణికా బుద్ధిరాజా - జషన్ ఘుమాన్ వివాహ వేడుక (ఫోటోలు)
-
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్కుమార్ డూప్లికేట్ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్వర్క్తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతమైన కెరీర్కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
టీడీపీ బండారు వ్యాఖ్యలపై శిల్ప రెడ్డి ఫైర్..!
-
అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్లోని ఫ్యాషన్ బ్రాండ్స్లో ఒకట్రెండు ఇక్కడ.. నితికా గుజ్రాల్.. చాలామంది సెలబ్రిటీస్కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/- మంగత్రాయ్ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. --దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
FDCI ICW 2023 Photos: ర్యాంప్వాక్లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా..
ఫ్యాషన్ డిజైనర్కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్షిప్ న్యూయార్క్లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్వేర్ లేబుల్కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్చార్జ్లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్గా అనిపించాయి. డిజైనింగ్లో హర్ష్కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. సూసైడ్కి ముందు వీడియో రిలీజ్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలె ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తల్లి వెళ్లి చూడగా ఆమె గదిలో లేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటి పైనున్న స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా ముస్కాన్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. చదవండి: నాని30లో హీరోయిన్ శ్రుతి హాసన్.. మరి మృణాల్ సంగతి? దీంతో ఆమెకు కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ముస్కాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సూసైడ్కు కొన్ని గంటల ముందు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసిన ముస్కాన్.. ఇదే తన చివరి వీడియో అని చెప్పడం గమనార్హం. 'ఇదే నా లాస్ట్ వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ రివర్స్లో వాళ్లే నన్ను కన్విన్స్ చేసేందుకు చూశారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి అంటూ చివర్లో కామెడీతో వీడియోను ముగించింది. చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. View this post on Instagram A post shared by Muskan Narang (@muskan_narang99) -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రేకప్కు సంబంధించిన కొటేషన్స్ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్కు షాకిచ్చినట్లయ్యింది. -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
వాటిని ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే ఏదైనా: అమిత్ అగర్వాల్
జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ఆయనో స్టార్.. దేశవ్యాప్తంగా మోడ్రన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ట్రెండీ డిజైనర్ అమిత్ అగర్వాల్. నగరం వేదికగా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడానికి ఇటీవల వచ్చిన ఆయన.. గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సిటీ అంటే తనకెంతో ఇష్టమని, క్రియేటివిటీ ఉండాలే గాని ఫ్యాషన్ రంగంలో అవకాశాలకు కొదవ లేదని, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఫ్యాషన్ ఔత్సాహికులకు విభిన్నమైన అవకాశాలున్నాయంటున్న అమిత్ ఆలోచనలు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే.. ►ఫ్యాషన్ అనేది ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమయ్యేది కాదు. సంస్కృతిలో భాగంగా అధునాతన హంగులను ప్రతిబింబిచేది. హైదరాబాద్ వంటి నగరంలో ఫ్యాషన్ ఈ మధ్య వచ్చింది కాదు. ఇక్కడ మొదటి నుంచే అధునాతన జీవన విధానం, ఫ్యాషన్ హంగులకు కేంద్రం. అంతర్జాతీయంగా మారుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటోంది. కరోనాకు ముందు ఇక్కడ అతిపెద్ద ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నాను. మళ్లీ ఈ మధ్యనే నిర్వహించిన ఫ్యాషన్ షోలో నా డిజైన్స్ను ప్రదర్శించాను. ►సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నిర్మాణమవుతున్న సినిమాలు బాలీవుడ్కు దీటుగా ఫ్యాషన్ ట్రెండ్లను వాడుకుంటున్నాయి. కొత్త ఐడియాలను ఎప్పటికప్పుడు ఆస్వాదించడంలో నగరం తర్వాతే ఏదైనా. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిన డబ్ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, త్రీడీ సినిమాలు అవలీలగా తీసేయడం అభినందనీయం. దక్షిణాదిలో స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానం బాగుంటుంది. సౌత్లో నిర్మించిన సూపర్ డీలక్స్ చిత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది. చదవండి: (హైదరాబాద్లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ) సంస్కృతుల సమ్మేళనమే ‘వైవిధ్యం’.. ►నా జీవితంతో ఫ్యాషన్ విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫ్యాషన్ నా కెరీర్గా నిర్ణయించుకున్నాను. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జీవితం సంతృప్తినిచ్చేది ఫ్యాషన్ అనే నమ్ముతాను. డిజైనింగ్లో మల్టిఫుల్ కలర్స్ వాడటం ఎంతో ఇష్టం. నా ప్రత్యేకత కూడా. మోల్డింగ్, గ్రిప్పింగ్లో జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యాషన్ డిజైనింగ్లో ఎవరి ప్రత్యేకత వారిదే. విభిన్నంగా, వినూత్నంగా, సరికొత్తగా డిజైన్లను రూపొందిస్తున్న వారికి అవకాశాలకు కొదవ లేదు. ►కరోనా అనంతరం ఫ్యాషన్ రంగం మరింత అభివృద్ధి చెందింది, అవకాశాలు పెరిగాయి. అధునాతన స్టైల్స్, కలర్ కాంబినేషన్, ఆకట్టుకునే కలర్ మిక్సింగ్ డిజైనర్ భవిష్యత్ను నిర్దేషిస్తాయి. ఈ రంగంలో రాణించాలంటే వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో నైపుణ్యం సాధించాలి. అందుకే విభిన్న ప్రాంతాల వేదికలపై అనుభవాన్ని సాధించాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్తో పాటు అమితమైన ప్రేమ, ఆదరణ లభిస్తుంది. దాని విలువ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. -
చిత్రవిచిత్ర డ్రెస్సులు, ఉర్ఫీ వెనకాల ఉన్నది ఎవరంటే?
అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ.... ఈ పాట ఇప్పుడున్న సెలబ్రిటీలలో ఉర్ఫీ జావెద్కు కరెక్ట్గా సరిపోతుంది. అవును, ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి మరి! ఆమె ఫ్యాషన్ను మరెవ్వరూ ఫాలో కాలేరు. కొందరు ఆమె డ్రెస్సింగ్ చూసి వారెవ్వా అనుకుంటే మరికొందరికేమో ఇదేం ఫ్యాషన్ అని దడ పుడుతుంది. అది అందమో, అరాచకమో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు. వేస్ట్లో నుంచి కూడా బెస్ట్ బయటకు తీస్తూ రకరకాల డ్రెస్సులు ట్రై చేసింది ఉర్ఫీ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు. మరి ఇలా ఆమెకు చిత్రవిచిత్ర డ్రెస్సులు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? ముంబైకి చెందిన శ్వేత శ్రీవాస్తవ. ఉర్ఫీ బోల్డ్గా కనిపిస్తే ఆమె బోల్డ్గా మాట్లాడుతుంది. తమ ఆలోచనలను వేసుకునే దుస్తుల ద్వారా వ్యక్తపరుస్తున్నామంటున్నారు. ఏదైనా గాజువస్తువుతో డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఉర్ఫీ అడిగితే.. పగిలిన గాజు అద్దంతోనే తయారు చేసేస్తే పోలా అని వత్తాసు పలుకుతుంది శ్వేత. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ చనువుతోనే ఒకరికొకరు కొత్త కొత్త ఐడియాలు చెప్పుకుంటారు. వెంటనే దాన్ని శ్వేత అమల్లోకి తీసుకువస్తే ఆ డ్రెస్ వేసుకుని కెమెరాల ముందుకు వచ్చేస్తుంది ఉర్ఫీ. అలా శ్వేత డిజైన్ చేసిన ఎన్నో డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే! వీరి ఫ్యాషన్ను మెచ్చుకున్నా, బాలేదని తిట్టిపోసినా అన్నింటినీ ఒకేలా తీసుకున్నారిద్దరూ. ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు